Category: Cinema

  • పెళ్ళైనా దూరం దూరంగానే.. ‘LAT’పై పూరి జగన్నాథ్ వివరణ

    పెళ్ళైనా దూరం దూరంగానే.. ‘LAT’పై పూరి జగన్నాథ్ వివరణ

    Puri Jagannadh LAT Relationship: లెజెండరీ డైరెక్టర్‌గా కీర్తించబడిన ‘రామ్ గోపాల్ వర్మ’ సినిమా రంగంలోనే కాదు.. జీవన విధానంలో కూడా ఓ ప్రత్యేకమైన బాణీ. డిఫరెంట్ ఆలోచనలు, డిఫరెంట్ విధానాల వల్ల ఆయన్ను అభిమానించేవారికంటే.. దూషించేవాళ్లు, విమర్శించే వాళ్లే ఎక్కువ. అలాంటి వ్యక్తికి శిష్యుడైన ‘పూరి జగన్నాథ్’ గురువు మాదిరిగానే ఆలోచిస్తూ.. గొప్ప సినిమాలతో సక్సెస్ సాధించారు. ఎప్పటికప్పుడు తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు.

    పూరీ జగన్నాథ్ ‘ల్యాట్’ (లివింగ్ అపార్ట్ టుగెదర్) పై ఆసక్తికర వ్యాఖ్యలు

    ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తన యూట్యూబ్ ఛానల్ వేదికగా.. పూరీ మ్యూజింగ్స్ అనే లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఈ ల్యాట్ (లివింగ్ అపార్ట్ టుగెదర్) గురించి ప్రస్తావించారు. ఆధునిక సంబంధాలలో వస్తున్న మార్పులు, విడాకుల సమస్యకు ఇదొక పరిష్కార మార్గంగా ఆయన అభిప్రాయపడ్డారు.

    ‘ల్యాట్’ ఆవశ్యకత

    ఒకప్పుడు పెళ్లి అంటే.. ఓ పవిత్రమైన బంధం అని చెప్పుకునేవాళ్ళు. అయితే నేడు కాలం మారింది. పద్ధతులు కూడా మారిపోతున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉంటే.. గొడవలు వచ్చేస్తున్నాయి. ఈ కారణాల వల్లనే తొందరగా విడాకులు తీసుకుంటున్నారు. దీనికి చరమగీతం పాడాలంటే.. ఈ ల్యాట్ పద్ధతినే అనుసరించాలంటాడు మన పూరీ జగన్నాథ్.

    ఇద్దరు కలిసి బతకడం కష్టమైన రోజుల్లో.. విడివిడిగా ఉంటూ ఎప్పుడో ఒకసారి కలుసుకుంటే, వారి మధ్య ప్రేమ బలంగా ఉంటుంది. అంతే కాకుండా విడిపోకుండా కూడా ఉంటారనియు పూరీ జగన్నాథ్ చెబుతున్నారు. ఎలా అంటే.. చాలామంది పర్సనల్ స్పేస్ కోరుకుంటారు. అలాంటి సమయంలోనే వేరువేరు ఇళ్లలో ఉంటారు. ఇలా దూరంగా ఉండటం వల్లనే ప్రేమ, అనుబంధం పెరుగుతుంది. కొంతమంది ఇప్పటికి కూడా పెళ్ళైన తరువాత ఒక్కో దేశంలో నివసిస్తున్నారు. వేర్వేరు ఉద్యోగాలు చేస్తున్నారు.

    ‘ల్యాట్’ – బంధాలు బలపడటానికి ఒక మార్గం

    జీవితంలో బ్రేకప్స్, విడాకులు వంటివి చూసిన తరువాత చాలామంది.. దూరంగా ఉంటేనే బంధంబలపడుతుందని పూరీ జగన్నాథ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. విడాకులు తీసుకోకుండా.. పిల్లల భవిష్యత్తు కోసం తల్లితండ్రులు దూరంగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి ఎంత దూరం వెళ్తుంతో అంచనా వేయడం కూడా కొంత కష్టమే.

    ప్రపంచవ్యాప్తంగా ‘ల్యాట్’ ధోరణి

    ప్రస్తుతం యూరప్, జపాన్ వంటి దేశాల్లో ల్యాట్ రిలేషన్‌షిప్స్ ఎక్కువవుతున్నాయి. ఈ విధానంలో భారతదేశంలో కూడా అవలంబించే రోజులు దగ్గరలోనే ఉన్నట్లు కొన్ని సంఘటనలు, సన్నివేశాలు చూస్తుంటే అర్థమవుతోంది.

    ‘ల్యాట్’ విజయానికి కావలసినవి

    పెళ్ళైన తరువాత ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండాలని సమాజం చెబుతుంది. కానీ నేటి తరం మాత్రం స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ.. దూరంగా ఉంటేనే ప్రేమ, అనుబంధం పెరుగుతుందని దూరంగా ఉంటున్నారు. ల్యాట్ రిలేషన్‌లో ఉండాలంటే మానసిక పరిణతి అవసరం, ఒకరిపై ఒకరికి నమ్మకం మరియు గౌరవం వంటివి ఉండాలి. అంతే కాకుండా ఎవరి కాళ్లమీద వారు నిలబడి ఉండాలి. కలిసి ఉండకపోయినా.. కలిసి ఎదుగుతామనేది వాళ్ళ ఫిలాసఫీ.

    పూరీ జగన్నాథ్ వ్యక్తిగత అనుభవం

    కొన్నేళ్ల క్రితం నేను విమానంలో ప్రయాణిస్తూ.. ఒక వివాహితతో మాట్లాడాను. ఆమె భర్త గోవాలో ఒక రెస్టారెంట్‌లో గిటారిస్ట్. అతను అక్కడే పనిచేస్తూ ఉంటాడు. ఆమె ప్రపంచ దేశాలు తిరుగుతూ ఉంటుంది. అయితే వారిద్దరూ ఏడాదిలో ఒక నెల రోజులు మాత్రం కలిసి ఉంటారు. తరువాత ఎవరిదారి వారిదే అని ఆమె చెప్పింది. ఆమె తన భర్తను కలిసే క్రమంలోనే నాతో మాట్లాడింది. ఆ మాటల్లో తన భర్త గురించి చాలా గొప్పగా చెప్పింది. అపరిమితమైన గౌరవం మరియు నమ్మకం ఉన్నవారు మాత్రమే ఆలా ఉండగలుగుతారు.

    ముగింపు: ‘ల్యాట్’ అందరికీ సరిపోతుందా?

    అందరూ ల్యాట్ పద్ధతినే అవలంభించాలని లేదు. అన్యోన్యంగా ఉండి.. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగిపోతే ఎలాంటి ఇబ్బందులు లేదు. అయితే చిన్న చిన్న సమస్యల వల్లనే విడిపోవాలనే సమయం వచ్చినప్పుడు ఈ ల్యాట్ విధానం ఓ మంచి మార్గం. ఇందులో ఎవరికీ వారు ప్రైవసీ పొందుతారు.

  • సినీతారలకు పోటీ ఇచ్చేందుకు సిద్దమవుతున్న సితార!.. సినిమా ఎంట్రీ ఎప్పుడంటే?

    సినీతారలకు పోటీ ఇచ్చేందుకు సిద్దమవుతున్న సితార!.. సినిమా ఎంట్రీ ఎప్పుడంటే?

    Sithara Ghattamaneni Film Debut: సినిమాల్లోకి వచ్చిన తరువాత ఫేమస్ అవ్వడం సర్వసాధారణమే. కానీ సినిమాల్లోకి రాకుండానే ఫేమస్ అయిపోయింది.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి ‘సితార‘. కేవలం సోషల్ మీడియా ద్వారానే ఎంతోమంది అభిమానుల సంపాదించుకున్న ఈ అమ్మడు.. తండ్రి బాటలోనే నడుస్తూ ఎంతోమందికి సేవచేయడంలో తనవంతు సాయం చేస్తోంది. ప్రస్తుతం సినీతారలకు పోటీ ఇవ్వడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.

    బహుముఖ ప్రజ్ఞతో దూసుకెళ్తున్న సితార

    శాస్త్రీయ నృత్యం మరియు సోషల్ మీడియా క్రేజ్

    శాస్త్రీయ నృత్యం నేర్చుకున్న సితార, తన డ్యాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. గతంలో ఎంతోమంది సెలబ్రిటీలను సైతం ఇంటర్వ్యూ చేసి తన ప్రతిభను చాటుకుంది.

    బ్రాండ్ అంబాసిడర్​గా సితార

    ఇది మాత్రమే కాకుండా.. అనేక ప్రముఖ కంపెనీలకు కూడా సితార బ్రాండ్ అంబాసిడర్​గా కూడా వ్యవహరిస్తోంది, చిన్న వయసులోనే వాణిజ్య ప్రకటనలలో తనదైన ముద్ర వేస్తోంది.

    చిన్నారి సితార సాధించిన విజయాలు

    “పెన్నీ” పాట నుండి “ఫ్రోజెన్ 2” వరకు

    2012 జులై 20న జన్మించిన సితార ఘట్టమనేని, ‘సర్కారు వారి పాట’ సినిమాలోని “పెన్నీ” పాటకు డ్యాన్స్ చేసి సంచలనం సృష్టించింది. ఆ తరువాత డిస్నీ యొక్క “ఫ్రోజెన్ 2” యొక్క తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లో బేబీ ఎల్సాగా తన గాత్రాన్ని అందించి మెప్పించింది.

    ఫ్యాషన్ సెన్స్ మరియు సేవా దృక్పథం

    12 ఏళ్ల వయసులోనే ఆమె ఫ్యాషన్ సెన్స్ మరియు దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొని ఎంతోమందిని ఆకట్టుకుంది. ఈ ఏడాది ప్రారభంలో ఓ ఛారిటీకి ఏకంగా రూ. 1 కోటి విరాళంగా ఇచ్చి తన పెద్ద మనసును చాటుకుంది.

    సితార సినీ అరంగేట్రంపై ఉత్కంఠ

    నమ్రత మాటలు, అభిమానుల ఆశలు

    సినిమా రంగంలోకి అడుగుపెట్టడానికి సితార చాలా ఆసక్తి చూపుతున్నట్లు తల్లి నమ్రత శిరోద్కర్ ఓ సందర్భంలో వెల్లడించారు. ఇప్పటికే పలు యాడ్లలో కనిపించిన ఈమె (సితార) ఎప్పుడు కథానాయకిగా సినిమాలో కనిపిస్తుందో అని చాలామంది సితార అభిమానులు ఆ రోజు కోసం ఆసక్తిగా వేచిచూస్తున్నారు.

    మహేష్ బాబు అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపు

    సితార సినిమా రంగ ప్రవేశానికి సంబంధించిన విషయాన్ని ప్రిన్స్ మహేష్ బాబు ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈమె మరికొన్ని రోజుల్లో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎప్పుడు, ఎలా.. సినిమాల్లో కనిపిస్తుందో తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే అని స్పష్టమవుతోంది.

    సేవా కార్యక్రమాలు మరియు భవిష్యత్ అంచనాలు

    సంపాదనతో సమాజ సేవ

    చిన్న వయసులోనే మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న సితార, ప్రస్తుతం కొన్ని బ్రాండ్లకు అంబాసిడర్​గా వ్యవహరించడం ద్వారా కొంత డబ్బు సంపాదిస్తోంది. విశేషం ఏమిటంటే, ఈ డబ్బును కూడా కొన్ని సేవా కార్యక్రమాల కోసం ఉపయోగిస్తోంది. చిన్న వయసులోనే సేవాదృక్పథాన్ని అలవాటు చేసుకోవడం చాలా గొప్ప విషయం అని ఎంతోమంది సితారను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

    గౌతమ్ సినీ ప్రవేశంపై కూడా చర్చ

    సితార మాత్రమే కాకుండా, ఆమె సోదరుడు గౌతమ్ ఘట్టమనేని కూడా సినీ రంగ అరంగేట్రం చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో ఘట్టమనేని కుటుంబం నుంచి మరో తరం నటీనటులు రాబోతున్నారని అభిమానులు ఆశిస్తున్నారు.

  • పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ పూర్తి: అభిమానులకు శుభవార్త!

    పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ పూర్తి: అభిమానులకు శుభవార్త!

    Pawan Kalyan Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాకు సంబంధించి చిత్ర బృందం ఒక శుభవార్తను అందించింది. సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తయినట్లు అధికారికంగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్, ఈ చిత్రంతో త్వరలోనే ప్రేక్షకులను పలకరించనున్నారు.

    హరిహర వీరమల్లు: షూటింగ్ ప్రస్థానం మరియు సవాళ్లు

    2020లో ప్రారంభమైన ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ ప్రయాణంలో అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆటంకాలతో పాటు, ఎన్నికల ప్రచారం వంటి ఇతర కారణాల వల్ల షూటింగ్ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. సుదీర్ఘకాలం తర్వాత, 2020లో మొదలైన ఈ సినిమా చిత్రీకరణ 2025 నాటికి పరిసమాప్తమైంది. ఈ విషయాన్ని నిర్మాత ఏ.ఎం. రత్నం అధికారికంగా ధృవీకరించారు. “థియేటర్లలోకి రావడమే ఇక ఆలస్యం. అద్భుతమైన పాటలు, ట్రైలర్ అన్నీ త్వరలోనే విడుదలవుతాయి,” అని ఆయన తెలిపారు.

    విడుదల తేదీపై ఉత్కంఠ: పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం

    నిజానికి ‘హరిహర వీరమల్లు’ మే 9న విడుదలవుతుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే, షూటింగ్ పూర్తి కాకపోవడంతో విడుదల వాయిదా పడింది. ఇప్పుడు షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో, సినిమా విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన రీ-రికార్డింగ్, డబ్బింగ్ మరియు వీఎఫ్ఎక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

    రెండు భాగాలుగా ‘హరిహర వీరమల్లు’: పార్ట్ 1 చిత్రీకరణ పూర్తి

    ‘హరిహర వీరమల్లు’ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మొదటి భాగం, ‘హరిహర వీరమల్లు: పార్ట్ 1 – స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా కొంత భాగం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో చిత్రీకరణ జరుపుకోగా, ఆ తర్వాత నిర్మాత ఏ.ఎం. రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. పార్ట్ 2 షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

    రిలీజ్ డేట్ పై రూమర్లు: విజయ్ దేవరకొండ సినిమాపై ప్రభావం?

    సినిమా షూటింగ్ పూర్తి కావడంతో, ఈ నెల 30న ‘హరిహర వీరమల్లు’ విడుదలవుతుందని సోషల్ మీడియాలో కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ ఈ తేదీన సినిమా విడుదలైతే, అదే రోజున విడుదల కావాల్సిన విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

    ‘హరిహర వీరమల్లు’ కథాంశం, నటీనటులు

    పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్య నేపథ్యంతో కూడిన చారిత్రక చిత్రంగా తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక యోధుని పాత్రలో, వీరమల్లుగా కనిపించనున్నారు. కథానాయికగా నిధి అగర్వాల్ నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, అలాగే అనుపమ్ ఖేర్, అనసూయ భరద్వాజ్, మరియు సత్యరాజ్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

    పవన్ కళ్యాణ్ ఇతర క్రేజీ ప్రాజెక్టులు

    పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’తో పాటు మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులలో కూడా నటిస్తున్నారు.

    ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్)

    ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమా షూటింగ్ 2023లో ప్రారంభమైంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, శ్రియ రెడ్డి, ప్రకాష్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

    ఉస్తాద్ భగత్‌సింగ్

    ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా కూడా 2023లోనే చిత్రీకరణ ప్రారంభించుకుంది. తమిళంలో విజయవంతమైన ‘తేరి’ సినిమాకు ఇది రీమేక్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్, చేకూరి మోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, సాక్షి వైద్య నటిస్తుండగా, అశుతోష్ రాణా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ కూడా విడుదలైంది.

  • కోట్లు విలువ చేసే కారు కొన్న సింహాద్రి విలన్

    కోట్లు విలువ చేసే కారు కొన్న సింహాద్రి విలన్

    Rahul Dev Land Rover: సినీ ప్రముఖులు తమకు నచ్చిన, లేటెస్ట్ మోడల్ కార్లను ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తుంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే.. ఇటీవల ప్రముఖ విలన్ నటుడు రాహుల్ దేవ్ ఖరీదైన ల్యాండ్ రోవర్ కారును కొనుగోలు చేశారు. దీనికి సంబందించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

    నటుడు రాహుల్ దేవ్ కొనుగోలు చేసిన కొత్త కారు ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 అని తెలుస్తోంది. భారతీయ మార్కెట్లో దీని ధర రూ. కోటి కంటే ఎక్కువే ఉంటుందని సమాచారం. తెలుపు రంగులో చూడచక్కగా ఉన్న ఈ లగ్జరీ SUV అద్భుతమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది.

    ల్యాండ్ రోవర్ డిఫెండర్: ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లు

    భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ కార్ బ్రాండ్లలో ల్యాండ్ రోవర్ ఒకటి. సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు మరియు ఇతర ప్రముఖులు ఈ కంపెనీకి చెందిన కార్లను ఎంతో ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు నటుడు రాహుల్ దేవ్ కొనుగోలు చేసిన తెల్లని డిఫెండర్ 110, గోధుమ రంగు మరియు నలుపు రంగుల కలయికతో కూడిన ప్రీమియం ఇంటీరియర్‌ను కలిగి ఉంది. అయితే ఇది ఏ ఇంజిన్ (డీజిల్, పెట్రోల్) ఆప్షన్ అనేది ఖచ్చితంగా వెల్లడి కాలేదు. ఏదేమైనా, ఇది ప్రీమియం అనుభూతిని అందిస్తూ.. అద్భుతమైన డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుందని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.

    ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఫీచర్లు:

      • టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం
      • ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
      • ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్
      • హెడ్స్ అప్ డిస్‌ప్లే (HUD)
      • వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్
      • కనెక్టెడ్ కార్ ఫీచర్స్
      • ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్
      • 360 డిగ్రీ కెమెరా
      • హీటెడ్ ఫ్రంట్ సీట్లు
      • బ్లైండ్ స్పాట్ అసిస్ట్
      • ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు
    • ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు
    • ABS విత్ EBD
    • లెదర్ అపోల్స్ట్రే

    వేరియంట్లు మరియు ఇంజిన్ ఆప్షన్లు

    నిజానికి ల్యాండ్ రోవర్ డిఫెండర్ భారతదేశంలో 90 (3-డోర్), 110 (5-డోర్) మరియు 130 (5-డోర్, 3 వరుసల సీట్లు) అనే మూడు ప్రధాన వేరియంట్లలో లభిస్తుంది.

    ల్యాండ్ రోవర్ డిఫెండర్ ప్రస్తుతం 2.0 లీటర్ పెట్రోల్, 3.0 లీటర్ పెట్రోల్ మరియు 3.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. అంతేకాకుండా, కంపెనీ గత ఏడాది డిఫెండర్ 110 మరియు 90 వెర్షన్లకు మరింత శక్తివంతమైన 5.0 లీటర్ సూపర్ఛార్జ్డ్ V8 పెట్రోల్ ఇంజిన్ ఎంపికను కూడా ప్రవేశపెట్టింది. ఈ ఇంజిన్ ఆప్షన్స్ అన్నీ కూడా స్టాండర్డ్‌గా ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ మరియు ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో (లాకింగ్ సెంటర్ డిఫరెన్షియల్ మరియు యాక్టివ్ రియర్ లాకింగ్ డిఫరెన్షియల్ వంటి ఫీచర్లతో) వస్తాయి. ఇండియన్ మార్కెట్లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ ధరలు సుమారు రూ. 1.05 కోట్ల నుంచి రూ. 2.79 కోట్ల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

    రాహుల్ దేవ్ గురించి

    నటుడు రాహుల్ దేవ్ కౌశల్ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషా చిత్రాలలో తన విలక్షణమైన నటనతో ప్రసిద్ధి చెందారు. ముఖ్యంగా తెలుగులో ‘టక్కరి దొంగ’, ‘సింహాద్రి’, ‘సీతయ్య’, ‘మాస్’, ‘నరసింహుడు’ మరియు ‘జై చిరంజీవ’ వంటి సినిమాల్లో పవర్ఫుల్ విలన్ పాత్రలు పోషించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. ఈయన హిందీ బిగ్‌బాస్ సీజన్ 10తో సహా అనేక రియాలిటీ షోలలో కూడా పాల్గొన్నారు.

  • బరిలోకి దిగిన వీరమల్లు: పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే..

    బరిలోకి దిగిన వీరమల్లు: పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే..

    Pawan Kalyan Joins Sets of Hari Hara Veera Mallu: ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన తరువాత సినిమాల్లో కనిపించడం దాదాపు తగ్గిపోయింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. అప్పటికే ఒప్పుకున్న సినిమాలకు కూడా దూరమయ్యారు. అయితే, తనవల్ల నిర్మాతలకు, దానిపై ఆధారపడిన ఇతరులకు ఎలాంటి నష్టం కలగకూడదనే ఉద్దేశ్యంతో, పెండింగ్‌లో ఉన్న ‘హరిహర వీరమల్లు’ మరియు ‘ఓజీ’ సినిమాలను పూర్తి చేయడానికి సంకల్పించారు. ఇందులో భాగంగానే ఇటీవల ‘హరిహర వీరమల్లు’ సెట్‌లోకి అడుగుపెట్టారు.

    హరిహర వీరమల్లు చివరి షెడ్యూల్ ప్రారంభం

    ఇప్పటికే దాదాపు పూర్తయిన ‘హరిహర వీరమల్లు’ సినిమా చివరి షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంది. దీనిని పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్‌లో రెండు రోజుల పాటు షూటింగ్ జరగనుంది. దర్శకుడు జ్యోతికృష్ణ నేతృత్వంలో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

    సినిమా విడుదల తేదీపై ఉత్కంఠ

    2025 మే 6వ తేదీ తరువాత ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదల ఎప్పుడు ఉంటుందనే విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించనుంది. గతంలో ఈ సినిమా విడుదల తేదీ మే 9 అని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

    సినిమా కథాంశం మరియు ఇతర వివరాలు

    17వ శతాబ్దం నాటి మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ ఒక గొప్ప యోధుని పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. మొదటి భాగం ‘స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ (Sword vs Spirit) పేరుతో విడుదల కానుంది. ఆ తరువాత పార్ట్ 2 విడుదలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

    ఇప్పటికే విడుదలైన ‘హరిహర వీరమల్లు’ సినిమా టీజర్లు, పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

    నటీనటులు మరియు సాంకేతిక బృందం

    • కథానాయకుడు: పవన్ కళ్యాణ్
    • కథానాయకి: నిధి అగర్వాల్
    • ప్రధాన పాత్రలు: బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్య రాజ్, అనసూయ భరద్వాజ్
    • దర్శకులు: క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ
    • సంగీతం: ఎంఎం కీరవాణి
    • నిర్మాత: ఏ దయాకర్ రావు

    పవన్ కళ్యాణ్ సినీ ప్రస్థానం

    1996లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో తెలుగు చిత్ర సీమలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్, అనేక ఆటుపోట్లను ఎదుర్కొని అగ్ర కథానాయకుడిగా, అత్యధిక సంఖ్యలో అభిమానులను కలిగిన ‘పవర్ స్టార్’‌గా నిలిచారు. వరుస విజయాలు, కొన్ని పరాజయాల తర్వాత కూడా పట్టుదలతో సినిమాల్లో నటిస్తూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ‘గబ్బర్ సింగ్’, ‘అత్తారింటికి దారేది’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో పాటు, ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’, ‘ఓజీ’, మరియు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘హరిహర వీరమల్లు’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుండగా, ‘ఓజీ’ మరియు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాల వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

  • సైడ్ క్యారెక్టర్ నుంచి.. స్టార్ హీరోయిన్ వరకు: త్రిష గురించి ఆసక్తికర విషయాలు

    సైడ్ క్యారెక్టర్ నుంచి.. స్టార్ హీరోయిన్ వరకు: త్రిష గురించి ఆసక్తికర విషయాలు

    Trisha Krishnan: సినీ ప్రపంచంలో పరిచయమే అవసరం లేని కొంతమంది సెలబ్రిటీల పేర్లలో త్రిష కృష్ణన్ ఒకటి. తెలుగులో మాత్రమే కాకుండా.. తమిళం, మలయాళం మరియు కన్నడ సినిమాల్లో నటిస్తూ.. తన హావభావాలతో ఎంతోమంది అభిమానుల మనసు కొల్లగొట్టిన ఈ అమ్మడు.. నాలుగు పదుల వయసు దాటినప్పటికీ, కుర్ర హీరోయిన్లకు సైతం పోటీ ఇస్తూ దూసుకెళ్తోంది. నేడు (మే 4) త్రిష పుట్టిన రోజు సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

    తొలి జీవితం మరియు మోడలింగ్ ప్రస్థానం

    1983 మే 4న తమిళనాడులోని మద్రాసులో (ప్రస్తుతం చెన్నై) కృష్ణన్ అయ్యర్ మరియు ఉమా అయ్యర్ దంపతులకు జన్మించిన త్రిష.. చెన్నైలోనే తన విద్యాభ్యాసం పూర్తి చేసుకుంది. తాను బీబీఏ చదువుకునే రోజుల్లోనే మోడలింగ్‌ రంగంలోకి అడుగుపెట్టింది.

    1999లో మిస్ చెన్నై పోటీలో గెలుపొందింది, ఆ తరువాత 2001లో మిస్ ఇండియా పోటీలో ‘బ్యూటిఫుల్ స్మైల్’ అవార్డును కూడా సొంతం చేసుకుంది. త్రిష ముద్దు పేర్లు హనీ, ది టెర్రర్.

    సినిమా కెరీర్: అరంగేట్రం నుంచి అగ్ర కథానాయకిగా

    తమిళ చిత్రం ‘జోడి’ (1999)లో సిమ్రాన్ స్నేహితురాలిగా చిన్న పాత్రతో సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన త్రిష.. ప్రభాస్ సరసన ‘వర్షం’ (2004) సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాతో త్రిషకు తెలుగులో మంచి గుర్తింపు లభించింది. ఆ తరువాత వెనుతిరిగి చూడకుండా అనేక విజయవంతమైన సినిమాల్లో నటించింది, వాటిలో కొన్ని:

    • నువ్వొస్తానంటే నేనొద్దంటానా
    • అతడు
    • పౌర్ణమి
    • స్టాలిన్
    • ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
    • బాడీగార్డ్

    ఈ చిత్రాలతో పాటు మరెన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి, మహేష్ బాబు, చిరంజీవి, వెంకటేష్ వంటి అగ్ర హీరోలతో కలిసి పనిచేసింది. ఈమెకు హాలీవుడ్‌లో నటించే అవకాశం వచ్చినప్పటికీ.. దానిని తిరస్కరించింది. ఇండియన్ సినిమాల్లోనే నటించాలనే ఉద్దేశ్యంతోనే ఆ ఆఫర్ వదులుకుంది. త్రిషకు ఇష్టమైన నటులలో వెంకటేష్, అమీర్ ఖాన్ మరియు కమల్ హాసన్ ఉన్నారు.

    వ్యక్తిగత జీవితం, సంపాదన మరియు ఆస్తులు

    సినిమా ప్రపంచంలో తన నటనతో ఎంతోమంది ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న త్రిష, ఎన్నో అవార్డులను కూడా అందుకుంది. ప్రస్తుతం ఈమె.. తన తల్లి మరియు అమ్మమ్మతో కలిసి చెన్నైలోని తన నివాసంలో ఉంటోంది. తరచుగా సినిమా షూటింగులకు తన తల్లితోపాటు వెళ్తుంది. ఈమె నివసించే ఇంటి విలువ సుమారు రూ. 6 కోట్లు ఉంటుందని అంచనా.

    త్రిష మొదటి సంపాదన రూ. 12,000 కాగా, ప్రస్తుతం ఈమె ఒక్కో సినిమాకు రూ. 10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. త్రిష మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ. 100 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.

    విలాసవంతమైన కార్ కలెక్షన్

    అగ్ర కథానాయకిగా రాణిస్తున్న త్రిష వద్ద ఖరీదైన కార్లు ఉన్నాయి. వాటిలో కొన్ని:

    • మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్
    • బీఎండబ్ల్యూ 5 సిరీస్
    • రేంజ్ రోవర్ ఎవోక్

    గమనిక: పైన పేర్కొన్న ధరలు మరియు ఆస్తుల విలువలు కొన్ని నివేదికల ఆధారంగా అంచనా వేయబడినవి.

  • కొత్త కారు కొన్న ఆనందం.. చిందేసిన బిగ్‌బాస్ ఫేమ్ ‘నైనిక’

    కొత్త కారు కొన్న ఆనందం.. చిందేసిన బిగ్‌బాస్ ఫేమ్ ‘నైనిక’

    Nainika Tata Car: వెహికల్ (కారు, బైక్) కొనుగోలు చేయడం అనేది చాలా మందికి ఒక ఎమోషన్. ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన వాహనం సొంతం చేసుకోవాలని కలలు కంటారు. కొందరికి ఇది సులభంగా సాధ్యమైతే, మరికొందరికి కలగానే మిగిలిపోతుంది. ఇటీవల, బిగ్‌బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ మరియు ఢీ డ్యాన్స్ షో ద్వారా ప్రసిద్ధి చెందిన ‘నైనిక’ (Nainika) తన కారు కలను నిజం చేసుకుంది. ఆమె కొత్త కారు కొనుగోలు చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ నైనిక ఏ కారు కొనుగోలు చేసింది? దాని ధర మరియు విశేషాలేంటి?

    నైనిక కొన్న కారు ఇదే..

    సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలను బట్టి, నైనిక టాటా మోటార్స్ (Tata Motors) కంపెనీకి చెందిన సరికొత్త ‘కర్వ్’ (Curvv) కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కారు డెలివరీ తీసుకుంటూ, ఫోటోలకు ఫోజులిస్తున్న నైనికను ఈ చిత్రాలలో చూడవచ్చు. ఆమె ముదురు ఎరుపు రంగు (Dark Red) కారును ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. అయితే, ఇది ఏ ఇంజిన్ వేరియంట్ అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

    టాటా కర్వ్: ధర మరియు వివరాలు

    భారత మార్కెట్లో టాటా కర్వ్ ధరలు రూ. 10 లక్షల నుంచి రూ. 19.52 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ కారు మల్టిపుల్ వేరియంట్లలో లభిస్తుంది. ఆధునిక డిజైన్, అధునాతన ఫీచర్లతో ఇది వినియోగదారులను ఆకట్టుకుంటోంది. టాటా బ్రాండ్ అంటే భద్రతకు పెట్టింది పేరు కాబట్టి, సేఫ్టీ పరంగా కూడా చాలామంది ఈ కారును ఇష్టపడుతున్నారు.

    ఇంజిన్ ఆప్షన్లు

    దేశీయ మార్కెట్లో టాటా కర్వ్ మూడు ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది:

    • 1.2 లీటర్ టర్బో పెట్రోల్: 120 PS పవర్ & 170 Nm టార్క్
    • 1.2 లీటర్ టీ-జీడీఐ టర్బో పెట్రోల్: 125 PS పవర్ & 225 Nm టార్క్
    • 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్: 118 PS పవర్ & 260 Nm టార్క్

    ఈ ఇంజిన్లు అన్నీ మంచి పనితీరును అందిస్తాయి.

    డిజైన్ మరియు ఫీచర్లు

    చూడటానికి కొంత టాటా నెక్సాన్ మాదిరిగా అనిపించినా, టాటా కర్వ్ తనదైన ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఇవి ప్రయాణికులకు సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

    భద్రతా ఫీచర్లు

    ప్రయాణికుల భద్రతకు టాటా కర్వ్ పెద్దపీట వేస్తుంది. ఇందులో:

    • ఆరు ఎయిర్‌బ్యాగులు
    • 360 డిగ్రీ కెమెరా
    • ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు
    • లెవెల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS)

    వంటి కీలకమైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

    నైనిక గురించి క్లుప్తంగా

    ఢీ డ్యాన్స్ షో ద్వారా నైనిక ఎంతో పేరు సంపాదించుకుంది. గతంలో తోటి డ్యాన్సర్ సాయితో రిలేషన్‌లో ఉండి, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోయారు. విడిపోయిన తర్వాత తాను సంతోషంగా ఉన్నానని పలు సందర్భాల్లో పేర్కొంది. ఇటీవల బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో పాల్గొని, మొదట్లో టాస్కుల్లో చురుకుగా పాల్గొన్నప్పటికీ, తర్వాత విష్ణుప్రియ, కిర్రాక్ సీతలతో కలిసి సరదాగా గడిపింది.

  • హిట్-4 హీరోగా అతడే ఫైనల్: ఏసీపీ వీరప్పన్‌గా ఎంట్రీ..

    హిట్-4 హీరోగా అతడే ఫైనల్: ఏసీపీ వీరప్పన్‌గా ఎంట్రీ..

    HIT 4 Karthi: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నేచురల్ స్టార్ ‘నాని’ నటించిన ‘హిట్ 3: ది థర్డ్ కేస్’ సినిమా వచ్చేసింది. సొంత నిర్మాణ సంస్థ ద్వారా తెరకెక్కించిన ఈ సినిమాకు ‘శైలేష్ కొలను’ దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే హిట్, హిట్ 2 సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ‘హిట్ 3: ది థర్డ్ కేస్’ కూడా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నారు.

    ‘హిట్ 4’ హీరోగా కార్తీ కన్ఫర్మ్!

    కాగా ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ అయిన హిట్ 4లో ఎవరు నటిస్తున్నారో కూడా ఇప్పుడే తెలిసిపోయింది. హిట్ సినిమాలో విశ్వక్ సేన్, హిట్ 2లో అడవి శేష్ నటించగా.. తాజాగా విడుదలైన హిట్ 3 సినిమాలో నాని ప్రధాన పాత్ర పోషించారు. ప్రతి సినిమా క్లైమాక్స్ లో సీక్వెల్ హీరోను దర్శకుడు పరిచయం చేస్తారు. ఇందులో భాగంగానే హిట్ 4లో కార్తీ నటించనున్నట్లు తెలిసిపోయింది.

    ఏసీపీ వీరప్పన్ పాత్రలో కార్తీ

    కార్తీ ఏసీపీ వీరప్పన్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులకు ముందే హిట్ 4 సినిమా కోసం కార్తీ ఫైనల్ అయినట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. అదే ఇప్పుడు నిజమైంది. ఇందులో పోలీస్ క్యారెక్టర్లో అలరించబోతున్నారు. ఇప్పటికే పలు సినిమాల్లో పోలీస్గా నటించి మంచి సక్సెస్ సాధించిన కార్తీ.. హిట్ 4లో కూడా విజయం సొంతం చేసుకుంటారని పలువురు చెబుతున్నారు.

    ‘హిట్ 4’ షూటింగ్ పుకార్లు

    రాబోయే హిట్ 4 కోసం.. కార్తీతో కొన్ని సన్నివేశాలను హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ కూడా జరిగినట్లు పుకార్లు వచ్చాయి. ఇది ఎంతవరకు నిజమో, కాదో సినిమా విడుదలైతే కానీ చెప్పలేము.

    ‘హిట్’ యూనివర్స్ భవిష్యత్ ప్రణాళికలు

    నిజానికి హిట్ సిరీస్ మొత్తం 8 సినిమాలుగా తెరకెక్కనుంది. ఇప్పటికి మూడు సినిమాలు విడుదలయ్యాయి. ఇంకా ఐదు సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. హిట్ 4, హిట్ 5, హిట్ 6, హిట్ 7 మరియు హిట్ 8 సినిమాలు త్వరలోనే తెరమీదకు రానున్నాయి.

    ‘హిట్ 8’ – హీరోలందరి కలయిక?

    రాబోయే హిట్ 8 సిరీస్ మాత్రం.. మిగిలిన అన్ని హిట్ సిరీస్లకంటే భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. ఎందుకంటే హిట్ 1 సిరీస్ నుంచి హిట్ 7 సిరీస్ వరకు నటించిన హీరోలందరూ.. హిట్ 8లో కనిపించనున్నట్లు, వారందరూ ఓ పెద్ద కేసును పరిష్కారిస్తారని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన తెలియాల్సి ఉంది.

    ‘హిట్ 3: ది థర్డ్ కేస్’ గురించి

    అర్జున్ సర్కార్ పాత్రలో నటించిన నాని తనదైన రీతిలో.. ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పెళ్లికోసం మాట్రిమొనీలో చూడటం, అర్జున్ (నాని) వేసే ప్రశ్నలకు అమ్మాయిలు పారిపోవడం వంటివి మంచి ఎంటర్‌టైన్‌గా సాగుతాయి. కొన్ని యాక్షన్ సీన్లు ఒళ్ళు గగుర్పుట్టేలా ఉన్నప్పటికీ.. మొత్తం సినిమా అద్భుతంగా ఉందనే టాక్.

    మొదటి రోజు కలెక్షన్స్ (అంచనా)

    హిట్ 3 సినిమా మొదటి రోజు కలెక్షన్స్ 18 కోట్ల రూపాయల వరకు ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడికావాల్సి ఉంది. ఈ సినిమా విజయం సాధిస్తే.. నాని ఖాతాలో మరో సక్సెస్ పడ్డట్టే అవుతుంది.

  • కాజోల్ కోసం రూ.84 కోట్ల ప్రైవేట్ జెట్ కొన్నారా?: క్లారిటీ ఇచ్చిన అజయ్ దేవగన్

    కాజోల్ కోసం రూ.84 కోట్ల ప్రైవేట్ జెట్ కొన్నారా?: క్లారిటీ ఇచ్చిన అజయ్ దేవగన్

    Ajay Devgn Private Jet: సినీ పరిశ్రమలో ప్రముఖులు ఖరీదైన కార్లు, బైకులు మాత్రమే కాకుండా సొంతంగా ప్రైవేట్ జెట్‌లు కొనుగోలు చేయడం కూడా చూస్తూనే ఉన్నాం. ఇటీవల, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ తన భార్య కాజోల్ కోసం సుమారు రూ. 84 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ కొనుగోలు చేశారంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై అజయ్ దేవగన్ తాజాగా స్పందించారు.

    జెట్ కొనుగోలుపై అజయ్ దేవగన్ ఏమన్నారు?

    ప్రస్తుతం తన ‘రైడ్ 2’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న అజయ్ దేవగన్, ‘బుక్‌మైషో అన్‌స్క్రిప్టెడ్‌’లో జరిగిన చాట్‌లో ఈ విషయంపై మాట్లాడారు. “ప్రస్తుతానికి నేను ఎలాంటి జెట్ కొనుగోలు చేయలేదు. కానీ భవిష్యత్తులో ప్రైవేట్ జెట్ కొనాలనే ఆలోచన ఉంది,” అని స్పష్టం చేశారు. 2010లో కూడా అజయ్ దేవగన్ ప్రైవేట్ జెట్ కొనుగోలు చేశారని వచ్చిన పుకార్లలో కూడా నిజం లేదని దీనితో తేలిపోయింది.

    అజయ్ దేవగన్ సినీ ప్రస్థానం

    1969 ఏప్రిల్ 2న ఢిల్లీలో జన్మించిన అజయ్ దేవగన్, 1985లో ‘ప్యారీ బెహ్నా’ సినిమాలో బాల నటుడిగా కనిపించారు. ఆ తర్వాత 1991లో విడుదలైన ‘పూల్ ఔర్ కాంటే’ సినిమాతో హీరోగా బాలీవుడ్ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. అప్పటినుండి ‘సింఘం’, ‘సింఘం రిటర్న్స్’, ‘యాక్షన్ జాక్సన్’, ‘రైడ్’ మరియు తాజాగా ‘రైడ్ 2’ వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించి, ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.

    కాజోల్‌తో వివాహం, కుటుంబం

    నటుడు అజయ్ దేవగన్, ప్రముఖ నటి కాజోల్‌ను నాలుగు సంవత్సరాలు డేటింగ్ చేసిన తర్వాత 1999 ఫిబ్రవరి 14న వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు నైసా అనే కుమార్తె, యుగ్ అనే కుమారుడు ఉన్నారు. వీరు ముంబైలోని జుహు ప్రాంతంలో ‘శివశక్తి’ అనే విలాసవంతమైన బంగ్లాలో నివసిస్తున్నారు. దీని విలువ రూ. 60 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఇది కాకుండా, మహారాష్ట్రలోని కర్జాత్‌లో ఒక ఫామ్‌హౌస్ మరియు లండన్‌లో సుమారు రూ. 50 కోట్ల విలువైన ఆస్తి కూడా వీరికి ఉన్నట్లు సమాచారం.

    అజయ్ దేవగన్, కాజోల్ విలాసవంతమైన కార్ కలెక్షన్

    విలాసవంతమైన జీవితాన్ని గడిపే ఈ బాలీవుడ్ జంట వద్ద ఖరీదైన కార్లు అనేకం ఉన్నాయి. వారి కార్ కలెక్షన్‌లో కొన్ని ప్రముఖమైనవి:

    • రోల్స్ రాయిస్ కలినన్ (Rolls Royce Cullinan)
    • మెర్సిడెస్ మేబ్యాక్ జీఎల్ఎస్600 (Mercedes Maybach GLS600)
    • మసరేటి క్వాట్రోపోర్టే (Maserati Quattroporte)
    • రేంజ్ రోవర్ వోగ్ (Range Rover Vogue)
    • బీఎండబ్ల్యూ జెడ్4 (BMW Z4)
    • ఆడి క్యూ7 (Audi Q7)
    • మినీ కంట్రీమ్యాన్ (Mini Countryman)
    • బీఎండబ్ల్యూ ఎక్స్7 (BMW X7)
    • వోల్వో ఎక్స్సీ90 (Volvo XC90)

    ప్రస్తుత కెరీర్, రెమ్యునరేషన్

    ఒకప్పుడు బాలీవుడ్ చిత్రసీమలో అగ్రనటిగా వెలుగొందిన కాజోల్, ప్రస్తుతం నటనకు కొంత దూరంగా ఉంటూ కుటుంబ బాధ్యతలపై ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, అజయ్ దేవగన్ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆయన ఒక్కో సినిమాకు రూ. 60 కోట్ల నుంచి రూ. 120 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారని అంచనా.

  • ముమైత్ ఖాన్ రీఎంట్రీ: ‘కాకమ్మ కథలు’ షోలో షాకింగ్ విషయాలు

    ముమైత్ ఖాన్ రీఎంట్రీ: ‘కాకమ్మ కథలు’ షోలో షాకింగ్ విషయాలు

    Mumaith Khan Health Issue: తెలుగు సినీ ప్రేక్షకులకు ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే’ పాటతో సుపరిచితమైన నటి, డ్యాన్సర్ ముమైత్ ఖాన్ చాలా కాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్నారు. అయితే, ఇటీవల ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న ‘కాకమ్మ కథలు’ సీజన్ 2 టాక్ షోలో ఆమె బిగ్‌బాస్ ఫేమ్ తేజస్వితో కలిసి పాల్గొన్నారు. ఈ షోకు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముమైత్ ఖాన్ తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యల గురించి వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

    ‘కాకమ్మ కథలు’ షోలో ముమైత్, శేఖర్ మాస్టర్ ముచ్చట్లు

    తేజస్వి హోస్ట్ చేస్తున్న ‘కాకమ్మ కథలు’ లేటెస్ట్ ఎపిసోడ్‌లో శేఖర్ మాస్టర్, ముమైత్ ఖాన్ అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. షోలోని ‘మినిమమ్ డిగ్రీ ఉండాలి’ అనే రౌండ్‌లో తేజస్వి వారి విద్యార్హతల గురించి అడగ్గా, తాను ఇంటర్ వరకు చదివానని శేఖర్ మాస్టర్ తెలిపారు. అయితే, ముమైత్ ఖాన్ తాను 8వ తరగతి వరకే చదివానని చెప్పి ఆశ్చర్యపరిచారు.

    ట్రోలింగ్స్‌పై శేఖర్ మాస్టర్ ఆవేదన

    షోలో భాగంగా, “మీరు బాగా బాధపడిన సంఘటన ఏమిటి?” అని తేజస్వి శేఖర్ మాస్టారును ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ, “నేను చేసే సాంగ్స్ కొరియోగ్రఫీపై చాలా ట్రోల్స్ వచ్చాయి. మొదట్లో సరదాగా తీసుకున్నాను. కానీ కొందరు కావాలనే నన్ను కించపరుస్తూ, కిందికి లాగాలని ప్రయత్నించారు. అది నన్ను చాలా బాధపెట్టింది” అని తన ఆవేదనను వ్యక్తం చేశారు. అలాగే, తన భార్యకు ఇచ్చిన గొప్ప సర్‌ప్రైజ్ గిఫ్ట్ ‘పిల్లలు’ అని సరదాగా సమాధానమిచ్చారు.

    ముమైత్ ఖాన్ ఎదుర్కొన్న తీవ్ర ఆరోగ్య సంక్షోభం

    ఈ సంభాషణలోనే తేజస్వి, ముమైత్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి గురించి ప్రస్తావించారు. “ముమైత్ ఖాన్ బ్రెయిన్‌లో 7-8 వైర్లు ఉన్నాయని మీకు తెలుసా శేఖర్ మాస్టర్? ఆ సమయంలో తను ఎంత వేదన అనుభవించిందో నాకు తెలుసు” అని తేజస్వి అన్నారు. “డాక్టర్లు కనీసం షూ లేస్ కూడా కట్టుకోవద్దని చెబితే, తను స్టంట్ షో చేయడానికి బ్యాంకాక్ వచ్చింది. ఒకరోజు స్టంట్స్ కూడా చేసింది. ఆ తరువాత రోజు తను లేవలేదు” అంటూ గతంలో జరిగిన సంఘటనలను గుర్తుచేసుకున్నారు.

    ప్రాణాల మీద ఆశ వదులుకున్న క్షణాలు

    తేజస్వి మాటలకు ముమైత్ ఖాన్ స్పందిస్తూ, “నేను స్టంట్స్ చేసిన రోజు రాత్రే స్వప్నదత్‌కి చెప్పాను. రేపు ఉదయం నేను నిద్రలేవకపోతే, నేను ఇక లేనని అర్థం చేసుకోండి అని చెప్పాను. అదృష్టవశాత్తూ అలాంటిది ఏమీ జరగలేదు” అని ఆనాటి భయంకర పరిస్థితిని వివరించారు.

    కోమాలోకి వెళ్లిన ముమైత్ ఖాన్: అసలేం జరిగింది?

    జరిగిన ఈ సంఘటన వెనుక కారణాన్ని ముమైత్ ఖాన్ గతంలోనే ఓ టాక్ షోలో వెల్లడించారు. 2015లో బాలకృష్ణ హీరోగా నటించిన ‘డిక్టేటర్’ సినిమాలో ఓ పాట చిత్రీకరణ పూర్తి చేసుకున్న తర్వాత, ముమైత్ తన తల్లితో కలిసి గోవాకు వెళ్లారు. ఆ ట్రిప్ ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, ఒకరోజు స్నానం చేసి బయటకు వస్తుండగా అనుకోకుండా కాలు జారీ కిందపడిపోయారు.

    ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్ బెడ్‌పై ఉన్నారు. దాదాపు 15 రోజులు కోమాలో ఉన్నారు. తలకు బలంగా దెబ్బ తగలడం వల్ల, బ్రెయిన్‌లోని ఐదు ప్రధాన నరాలు దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారు. దీనివల్ల మెదడు పనితీరును సరిచేయడానికి 7-8 టైటానియం వైర్లను ఫిక్స్ చేయాల్సి వచ్చిందని ముమైత్ ఖాన్ వివరించారు. ఈ సంఘటన తన జీవితంలో మరిచిపోలేనిదని, ఎంతో మానసిక, శారీరక వేదనకు గురి చేసిందని ఆమె తెలిపారు.