Gold Price Today: అక్షయ తృతీయ సందర్భంగా బంగారం ధరలు భారీగా పెరుగుతాయని చాలామంది ఊహించారు. కానీ ఊహలన్నీ తారుమారు అయ్యాయి. బుధవారం స్వల్పంగా తగ్గిన ధరలు గురువారం (1 మే 2025) నాటికి భారీగా తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాలలో గోల్డ్ రేటు గణనీయంగా తగ్గింది. నేడు భారతదేశంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.
రికార్డు స్థాయి నుంచి తగ్గిన పసిడి
ఏప్రిల్ 22న రూ. 1,01,350 వద్ద ఉన్న 10 గ్రాముల బంగారం ధర ఈ రోజు రూ. 95,730 వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే దేశంలో బంగారం ధరలు ఎంతలా తగ్గాయో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
హైదరాబాద్, విజయవాడ & ఇతర నగరాల్లో ధరలు
ఈ రోజు హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు మరియు ముంబై నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 2,000 రూపాయలు తగ్గి రూ. 87,750 వద్ద నిలిచింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు 2,180 రూపాయలు తగ్గి రూ. 95,730 వద్దకు చేరింది.
ఢిల్లీలో బంగారం ధరల పరిస్థితి
దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 87,900 వద్ద ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే.. ఈ రేటు రూ. 2,000 తక్కువ. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు కూడా రూ. 2,160 తగ్గింది. దీంతో స్వచ్ఛమైన గోల్డ్ రేటు రూ. 95,880 కావడం గమనార్హం.
చెన్నైలో తగ్గిన రేట్లు
చెన్నైలో కూడా ధరలు తగ్గుముఖం పట్టాయి. నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 87,750 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 95,730 వద్ద నిలిచింది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 2,000 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ. 2,180 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్) తక్కువ.
వెండి ధరలు కూడా డౌన్
బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా రెండు రోజుల నుంచి తగ్గుముఖం పట్టాయి. నిన్న మాదిరిగానే ఈ రోజు (మే 1) కూడా సిల్వర్ రేటు 2,000 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర హైదరాబాద్, బెంగళూరు, ముంబై మరియు విజయవాడలలో రూ. 1,07,000 వద్ద ఉంది. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 98,000 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే.. దేశంలోని ఇతర నగరాల కంటే ఢిల్లీలో వెండి రేటు కొంత తక్కువని తెలుస్తోంది.
గోల్డ్ రేటు తగ్గుదలపై నిపుణుల అంచనాలు
బంగారం రేటు ఇంకా తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ టీ కియోసాకి కూడా ఇప్పుడు బంగారం కొనుగోలు చేయడం ఉత్తమమని వారం రోజుల క్రితమే సూచించారు. పేదవాళ్ళు బంగారం కొనుగోలు చేస్తే.. రాబోయే రోజుల్లో ధనవంతులు అవుతారని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.. బంగారం ధరలు రాబోయే రోజుల్లో ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందనిపిస్తోంది. అనుకున్న విధంగా అన్నీ జరిగి బంగారం ధరలు తగ్గితే.. ఇప్పటి వరకు బంగారం కొనుగోలు చేయాలని వేచిచూస్తున్న వారి పంట పండినట్లే.
Leave a Reply