Tag: Gold Rate India

  • ఒక్కరోజే అమాంతం పెరిగిన గోల్డ్ రేటు.. నేటి కొత్త ధరలు ఇవే..

    ఒక్కరోజే అమాంతం పెరిగిన గోల్డ్ రేటు.. నేటి కొత్త ధరలు ఇవే..

    Gold and Siler Price Today: ఇంతకాలం తగ్గుతుంది, తగ్గిపోతుందనుకుంటున్న బంగారం ధరలు ఒక్కసారిగా షాకిచ్చాయి. ఒకేరోజు (2025 మే 6) అమాంతం పెరిగి.. పసిడి ప్రియులను సైతం కంగుతినేలా చేసింది. రూ. 90,000 కంటే తక్కువలో ఉన్న 22 క్యారెట్ల బంగారం.. ఇప్పుడు ఆ మార్కును దాటేసింది. 24 క్యారెట్ల గోల్డ్ లక్ష రూపాయలకు చేరువయ్యేందుకు పరుగులు పెడుతోంది. ఈ కథనంలో దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే విషయం తెలుసుకుందాం.

    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు (2025 మే 6)

    తెలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ) నిన్నటి నుంచి ధరల పెరుగుదల మొదలైంది. ఈ రోజు వరుసగా 22 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం రూ. 2,500 పెరిగి రూ. 90,250 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం రూ. 2,730 పెరిగి రూ. 98,460 వద్ద ఉంది. ఇదే ధరలు ప్రొద్దుటూరు, కడప వంటి ప్రాంతాల్లో మాత్రమే కాకుండా.. ముంబై, బెంగళూరు నగరాల్లో కూడా కొనసాగుతాయి.

    చెన్నైలో పసిడి ధరల వివరాలు

    చెన్నైలో ధరలు విషయానికి వస్తే.. ఇక్కడ కూడా ధరలు తెలుగు రాష్టాల్లో మాదిరిగానే ఉంటాయి. ఈ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రామ్స్ గోల్డ్ రేటు రూ. 2,500 పెరిగి రూ. 90,250 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం ధర రూ. 2,730 పెరిగి రూ. 98,460 వద్ద నిలిచింది. నిన్నటి ధరలో పోలిస్తే ఈ రోజు ధరలు భారీగా పెరిగిందని స్పష్టమవుతోంది.

    దేశ రాజధాని ఢిల్లీలో బంగారం రేట్లు

    దేశరాజధానిలో కూడా గోల్డ్ రేటు ఎగిసిపడింది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం రేటు రూ. 2,500 పెరిగింది. దీంతో ధర రూ. 90,400లకు చేరింది. అదే సమయంలో 24 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే.. దీని ధర రూ. 2,730 పెరిగింది. కాబట్టి 10 గ్రామ్స్ 24 క్యారెట్ పసిడి ధర రూ. 98,610లకు చేరింది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో బంగారం ధరలు కొంత ఎక్కువే అన్న విషయం స్పష్టంగా అవగతం అవుతోంది.

    వెండి ధరలు: బంగారం బాటలో కాకుండా తగ్గుముఖం

    బంగారం ధరలు భారీగా పెరిగినప్పటికీ.. వెండి ధరలు మాత్రం తగ్గుతూనే ఉంది. ఈ రోజు (2025 మే 6) కేజీ వెండి ధర హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో రూ. 1,07,900 వద్ద ఉంది. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 96,900 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే వెండి ధరలు దేశ వ్యాప్తంగా కేజీ మీద రూ. 1,000 తగ్గినట్లు తెలుస్తోంది.

    నిపుణుల అంచనాలు తారుమారు: బంగారం లక్షకు చేరువలో?

    అమెరికా టారిఫ్ భయాలు పూర్తిగా తొలగిపోయాయి. కాబట్టి బంగారం ధరలు తగ్గుముఖం పడతాయాని పలువురు ప్రముఖులు అంచనా వేశారు. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.. వారి అంచనాలు మొత్తం తారుమారు అయ్యాయని స్పష్టంగా తెలుస్తోంది. కొందరు ప్రముఖులు మాత్రం బంగారం ఇప్పుడే కోనేయండి అని కూడా ప్రస్తావించారు. ఎవరు ఎన్ని చెప్పినా ధరలు మాత్రం ఊరిస్తూ.. ఓ సారి తగ్గతూ, మరోమారు పెరుగుతూ.. లక్ష రూపాయలకు చేరిపోవడానికి తొందరపడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద త్వరలోనే బంగారం రేటు.. రూ. లక్షకు చేరుతుంది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు అని స్పష్టంగా తెలుస్తోంది.

  • అంచనాలకు అందని పసిడి: ఈ రోజు గోల్డ్ రేటు ఎలా ఉందంటే?

    అంచనాలకు అందని పసిడి: ఈ రోజు గోల్డ్ రేటు ఎలా ఉందంటే?

    Today Gold and Silver Price: 2025 మే నెల ప్రారంభమైనప్పటి నుంచి బంగారం ధరలు ఏ మాత్రం పెరగడంలేదు. గత రెండు రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలకు ఈ రోజు బ్రేక్ పడింది. దీంతో గోల్డ్ రేట్లలో ఎలాంటి మార్పు జరగలేదు. అయితే ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం.

    హైదరాబాద్, విజయవాడలలో నేటి బంగారం ధరలు (మే 3)

    హైదరాబాద్ మరియు విజయవాడలలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ రోజు (మే 3) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87,550 వద్ద స్థిరంగా ఉంది. అలాగే, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 95,510 వద్ద కొనసాగుతోంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలలో ఎలాంటి మార్పు లేదు.

    ఇదే ధరలు బెంగళూరు, ముంబై మరియు చెన్నై నగరాలతో పాటు గుంటూరు, ప్రొద్దుటూరు, కడప వంటి ప్రాంతాల్లో కూడా వర్తిస్తాయి.

    ఢిల్లీలో బంగారం ధరలు

    దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే స్వల్పంగా ఎక్కువగా ఉన్నప్పటికీ, నేడు ధరలలో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో 22 క్యారెట్ల తులం (10 గ్రాములు) బంగారం ధర రూ. 87,700 వద్ద ఉండగా, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 95,660 వద్ద నిలిచింది. నిన్నటి ధరలకే ఇవి సమానంగా ఉన్నాయి.

    స్థిరంగా వెండి ధరలు

    బంగారం ధరల మాదిరిగానే వెండి ధరలు కూడా ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్, విజయవాడలతో పాటు బెంగళూరు, ముంబై మరియు చెన్నైలలో కూడా వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. ఈ నగరాల్లో కేజీ వెండి ధర రూ. 1,09,000 గా ఉంది.

    అయితే, ఢిల్లీలో కేజీ వెండి ధర కాస్త తక్కువగా, రూ. 98,000 వద్ద ఉంది. దేశ రాజధానిలో కూడా వెండి ధరలో నేడు ఎటువంటి మార్పు లేదు.

    బంగారం ధరలు తగ్గుముఖం పట్టడానికి కారణాలు?

    గత కొన్ని రోజులుగా బంగారం ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. ఏప్రిల్ నెలలో రూ. లక్ష మార్కును దాటిన 10 గ్రాముల బంగారం ధర, నేడు రూ. 95,000 స్థాయికి చేరుకుంది. అంటే దాదాపు రూ. 5,000 వరకు తగ్గినట్లు స్పష్టమవుతోంది.

    నిపుణుల విశ్లేషణ

    కొందరు నిపుణులు ఈ తగ్గుదల ధోరణి కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు గణనీయంగా తగ్గడానికి ప్రధాన కారణాలలో ఒకటి అమెరికా టారిఫ్ ప్రభావం తగ్గడమని విశ్లేషకులు భావిస్తున్నారు.

    అమెరికా ప్రతీకార సుంకాల భయాలు తగ్గడంతో, పెట్టుబడిదారులు బంగారం వంటి సురక్షిత పెట్టుబడుల నుంచి ఇతర మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంగా బంగారం కొనుగోళ్లు కొంత తగ్గినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ పసిడి ధరలు తగ్గేందుకు దోహదపడ్డాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద, బంగారం ధరలు ఇలాగే తగ్గుముఖం పడితే, పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది శుభవార్తే అని చెప్పవచ్చు.