6 లక్షలమంది కొన్న ఎలక్ట్రిక్ స్కూటర్: అమ్మకాల్లో సరికొత్త రికార్డ్!

TVS iQube Sales: టీవీఎస్ మోటార్ కంపెనీ లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ఐక్యూబ్‘ (TVS iQube) అమ్మకాల్లో అరుదైన ఘనత సాధించింది. సంస్థ ఈ స్కూటర్‌ను లాంచ్ చేసినప్పటి నుంచి దేశీయ విఫణిలో 6 లక్షల మందికి పైగా విక్రయించింది, ఇది భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో దానికున్న ఆదరణకు నిదర్శనం.

టీవీఎస్ ఐక్యూబ్ సేల్స్

ఎస్ఐఏఎమ్ (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరింగ్ అండ్ సర్వీస్ ఇంటిగ్రేషన్ అండ్ మేనేజ్‌మెంట్) డేటా ప్రకారం, టీవీఎస్ ఐక్యూబ్ ప్రయాణం ఇలా సాగింది:

  • తొలి లక్ష యూనిట్ల అమ్మకాలకు సుమారు మూడేళ్ళ సమయం పట్టింది.
  • ఆ తదుపరి లక్ష యూనిట్లకు కేవలం 10 నెలల సమయం మాత్రమే అవసరమైంది.
  • మే 2024 ప్రారంభం నాటికి, కంపెనీ మొత్తం 3,00,000 లక్షల యూనిట్ల అమ్మకాలు జరిపింది.
  • ఆ తరువాత మరో మూడు లక్షల యూనిట్లు కేవలం 12 నెలల్లోనే అమ్ముడయ్యాయి.

మొత్తం మీద, సంస్థ ఇప్పటివరకు 6,26,297 యూనిట్ల ఐక్యూబ్ స్కూటర్లను విజయవంతంగా విక్రయించింది.

టీవీఎస్ ఐక్యూబ్ సేల్స్ పెరగడానికి కారణాలు

భారత మార్కెట్లో టీవీఎస్ మోటార్ కంపెనీ యొక్క ఐక్యూబ్ సేల్స్ దానికున్న విపరీతమైన డిమాండును స్పష్టంగా తెలియజేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణాలు:

  • చూడగానే ఆకట్టుకునే ఆకర్షణీయమైన డిజైన్.
  • ఆధునిక వినియోగదారుల అవసరాలకు తగిన లేటెస్ట్ ఫీచర్స్.
  • విశ్వసనీయమైన మరియు మంచి పనితీరు.

ఈ అంశాల వల్లే ఎక్కువమంది కొనుగోలుదారులు టీవీఎస్ ఐక్యూబ్‌ను ఎంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు, ఫలితంగా సేల్స్ గణనీయంగా పెరిగాయి.

ఐక్యూబ్: ఫీచర్స్ & ప్రత్యర్థులు

2020 జనవరిలో మార్కెట్లోకి వచ్చిన టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్, భారత మార్కెట్ కోసం టీవీఎస్ లాంచ్ చేసిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది అనేక ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తుంది:

  • ఫుల్ ఎల్ఈడీ లైటింగ్
  • కనెక్టెడ్ టెక్నాలజీ
  • విశాలమైన సీటు
  • మంచి స్టోరేజ్ కెపాసిటీ

ఈ స్కూటర్ మార్కెట్లో బజాజ్ చేతక్, ఓలా ఎస్1 మరియు ఏథర్ రిజ్టా వంటి ప్రముఖ మోడళ్లకు గట్టి పోటీనిస్తోంది.

ఏకంగా 18,13,103 యూనిట్ల సేల్స్

2025 ఆర్ధిక సంవత్సరంలో టీవీఎస్ కంపెనీ మంచి లాభాలను ఆర్జించింది. చెన్నైకి చెందిన ఈ ద్విచక్ర వాహన తయారీ సంస్థ, పెట్రోల్ ఇంజిన్ కలిగిన జుపీటర్, ఎన్‌టార్క్, జెస్ట్ మరియు ఎలక్ట్రిక్ ఐక్యూబ్‌లతో సహా ఏకంగా 18,13,103 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. కాగా, ఐక్యూబ్ సేల్స్ 6,00,000 యూనిట్ల మార్కును చేరడానికి 65 నెలల సమయం పట్టింది.

2026 ఆర్ధిక సంవత్సరంలో కూడా ఐక్యూబ్ అమ్మకాలు శుభారంభం చేశాయి. జూన్ 1 నుంచి 14వ తేదీ మధ్య కాలంలో కంపెనీ 11,841 యూనిట్లను విక్రయించింది. ఈ కాలంలో భారతదేశంలో అమ్ముడైన మొత్తం 43,917 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో ఐక్యూబ్ వాటా 27 శాతం కావడం విశేషం. ఇది ఐక్యూబ్ భవిష్యత్తుపై సానుకూల దృక్పథాన్ని సూచిస్తుంది.

2025 ఐక్యూబ్

టీవీఎస్ మోటార్ కంపెనీ ఈ ఏడాది 2025 ఎడిషన్ ఐక్యూబ్ లాంచ్ చేసింది. దీని ధర రూ. లక్ష కంటే తక్కువ. ఈ స్కూటర్ 2.2 కిలోవాట్, 3.5 కిలోవాట్ మరియు 5.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్స్ పొందుతాయి. ఈ స్కూటర్ గరిష్టంగా 212 కిమీ రేంజ్ అందిస్తుంది.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *