29.7 C
Hyderabad
Sunday, February 16, 2025
Home Blog

రూ.300 కోట్ల ఇల్లు.. రూ.3 కోట్ల కారు: ఈ ఆర్ఆర్ఆర్ బ్యూటీ ఎవరో తెలుసా?

0

Alia Bhatt Net Worth Car Collection And Remuneration: సినీ ప్రపంచంలో అలియా భట్ (Alia Bhatt) పేరుకు పెద్దగా పరిచయమే అవసరం లేదు. ఎందుకంటే.. ఈమె ఒక స్టార్ హీరోయిన్, ఓ స్టార్ హీరోకు (రణ్‌బీర్ కపూర్) భార్య, స్టార్ డైరెక్టర్ (ప్రకాష్ పదుకొనె) కుమార్తె.. సుమారు మూడు పదుల వయసు దాటినా కూడా, కుర్ర హీరోయిన్లకు సైతం పోటీ ఇస్తున్న ఈ అమ్మడు, భర్త కంటే కూడా ఎక్కువ సంపాదిస్తూ.. విలాసవంతమైన జీవితం గడుపుతోంది. ఈమె గురించి మరిన్ని ఆసక్తికరమైన ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

దాదాపు ఐదేళ్లు ప్రేమించుకుని రణ్‌బీర్ కపూర్‌ను పెళ్లి చేసుకున్న అలియా భట్‌కు ఒక కుమార్తె కూడా ఉంది. ఈ పాపా పేరు ‘రహ’. 1999లో బాలనటిగా సంఘర్ష్ సినిమాలో కనిపించిన అలియా.. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రికార్డ్ బద్దలుకొట్టిన ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్ర పోషించింది. అంతకంటే ముందు గంగూభాయ్ సినిమాలో నటించి ఎంతోమంది హృదయాలను గెలుచుకోవడం మాత్రమే కాకుండా.. ఉత్తమ నటి అవార్డును సైతం సొంతం చేసుకుంది. చిన్న వయసులోనే సినిమాల్లో నటించడం ప్రారంభించినప్పటికీ… స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

హీరోయిన్‌గా మాత్రమే కాకుండా.. తన అందం, అభినయంతో ఎంతోమందిని ఆకట్టుకున్న దీపికా పదుకొనె మోడల్ కూడా. అటు బాలీవుడ్, మరోవైపు తెలుగులో కూడా తెరంగేట్రం చేసిన ఈమె ఆస్థి విషయంలో.. భర్తనే మించిపోయింది. ఈమె మొత్తం ఆస్తి ఏకంగా రూ. 550 కోట్ల కంటే ఎక్కువే అని తెలుస్తోంది. పైగా సుమారు 300 కోట్ల విలువ చేసే ఒక బంగ్లాలో నివసిస్తూ.. ఖరీదైన అన్యదేశ్య కార్లను ఎన్నో ఉపయోగిస్తోంది.

నటుడు రణ్‌బీర్ ఆస్తుల విలువ రూ. 345 కోట్లు అని సమాచారం. ఒక్కో సినిమాకు రూ. 10 నుంచి రూ. 20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న అలియా భట్.. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు బిజినెస్ కూడా చేస్తోంది. ఎడ్-ఏ-మమ్మా పేరుతో పిల్లల స్పోర్ట్స్‌వేర్ వ్యాపారంలో కూడా రాణిస్తోంది. ఈ సంస్థ కూడా బాగా అభివృద్ధి చెందింది. దీని విలువ రూ. 150 కోట్ల కంటే ఎక్కువని సమాచారం. సినిమా రంగంలో మాత్రమే కాకుండా.. దీపికా పదుకొనె వ్యాపార రంగంలో కూడా ముందుకు దూసుకెళ్తోంది.

అలియా భట్ కార్ కలెక్షన్ (Alia Bhatt Car Collection)

నటి అలియా భట్ ఉపయోగించే కార్లలో.. ఖరీదైన లగ్జరీ కార్లు ఎన్నో ఉన్నాయి. ఇందులో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, ఆడి క్యూ5, ఆడి క్యూ7, ఆడి ఏ6 మరియు బీఎండబ్ల్యూ 7 సిరీస్ వంటివి ఉన్నాయి.

ల్యాండ్ రోవర్ (Land Rover)

నటి అలియా ఉపయోగించే కార్ల జాబితాలో ఖరీదైన ల్యాండ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కూడా ఉంది. దీని ధర రూ. 3 కోట్ల కంటే ఎక్కువే అని తెలుస్తోంది. చూడటానికి అద్భుతంగా ఉన్న ఈ కారు.. వాహన వినియోగదారులకు అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ కారణంగానే దీనిని ఎక్కువమంది సెలబ్రిటీలు ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. 2996 సీసీ ఇంజిన్ కలిగిన ఈ కారు 394 Bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగి అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. ఇక డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

ఆడి క్యూ 5 (Audi Q5)

అలియా భట్ గ్యారేజిలోని కార్లలో ఆడి క్యూ 5 కూడా ఒకటి. ఈ కారు ప్రారంభ ధర రూ. 66.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). మంచి డిజైన్ కలిగి వాహన వినియోగదారులకు అవసరమైన అన్ని ఫీచర్స్ కలిగిన ఈ కారు 1984 సీసీ ఇంజిన్ ద్వారా.. 245.49 Bhp పవర్, 370 Nm టార్క్ అందిస్తుంది. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగిన ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 240 కిమీ కావడం గమనార్హం. ఈ కారు కేవలం దీపికా పదుకొనె గ్యారేజిలో మాత్రమే కాకుండా.. చాలామంది సెలబ్రిటీల గ్యారేజిలో ఉంది.

Also Read: ప్రేమకు అర్థం ఏమంటే: చరిత్ర చెప్పిన సంగతులు.. తెలుసుకోవలసిన నిజాలు

ఆడి క్యూ7 & ఏ6 (Audi Q7 & A6)

ల్యాండ్ రోవర్ కారుతో పాటు.. రూ. 73.49 లక్షల ఖరీదైన ఆడి ఏ6 మరియు రూ. 86.92 లక్షల ఖరీదైన ఆడి క్యూ7 వంటి కార్లు ఉన్నాయి. క్యూ5తో కలిపి.. దీపికా పదుకొనె గ్యారేజిలో మొత్తం 3 ఆడి కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆడి క్యూ7 మరియు ఏ6 రెండూ కూడా అద్భుతమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతాయి. పనితీరు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇవి ఉత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి. ఈ కారణంగానే.. చాలామంది ప్రముఖులు ఈ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు.

బీఎండబ్ల్యూ 7 సిరీస్ (BMW 7 Series)

దీపికా పదుకొనె గ్యారేజిలోని మరో ఖరీదైన కారు బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన 7 సిరీస్ 730ఎల్‌డీ. దీని ప్రారంభ ధర రూ. 1 కోటి కంటే ఎక్కువే. 2993 సీసీ ఇంజిన్ కలిగిన ఈ కారు 4000 rpm వద్ద 262 Bhp పవర్, 2000 rpm వద్ద 620 Nm టార్క్ అందిస్తుంది. రియర్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగిన ఈ కారు అద్భుతమైన పనితీరును అందిస్తుంది. కాబట్టి దీనికి సెలబ్రిటీలు, క్రికెటర్స్ మాత్రమే కాకుండా ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు.

Also Read: బ్యాడ్మింటన్‌ నుంచి స్టార్‌ హీరోయిన్‌.. వందల కోట్ల ఆస్తి, లగ్జరీ కార్లు.. రాయల్‌ లైఫ్‌!

రణ్‌బీర్ కపూర్ కార్ కలెక్షన్ (Ranbir Kapoor Car Collection)

దీపికా పదుకొనె దగ్గర మాత్రమే కాకుండా.. నటుడు మరియు ఆమె భర్త రణ్‌బీర్ కపూర్ దగ్గర కూడా చాలా కార్లు ఉన్నాయి. ఇందులో రూ. 5 కోట్ల విలువైన బెంట్లీ కాంటినెంటల్ జీటీ వీ8, లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్ (రూ. 2 కోట్ల కంటే ఎక్కువ), మెర్సిడెస్ ఏఎంజీ జీ 63 (రూ. 2.28 కోట్లు), ఆడి ఏ8 ఎల్ (రూ. 1.71 కోట్లు), ఆడి ఆర్8 (రూ. 2.72 కోట్లు) మరియు ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ (రూ. 3.27 కోట్లు) మొదలైనవి ఉన్నాయి.

రూ.1.07 లక్షలకే.. కొత్త బజాజ్ పల్సర్ ఎన్ఎస్125 బైక్: పూర్తి వివరాలివిగో..

0

Bajaj Pulsar NS125 Single Channel ABS:భారతీయ విఫణిలో అత్యధిక ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ ‘బజాజ్ ఆటో’ (Bajaj Auto) 2025లో సరికొత్త పల్సర్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన లేటెస్ట్ బైక్ ‘పల్సర్ ఎన్ఎస్125’. ఇది సింగిల్ ఛానల్ ఏబీఎస్ పొందుతుంది. దీని ధర ఇతర వేరియంట్స్ కంటే కొంత తక్కువగానే ఉంటుంది.

బజాజ్ ఎన్ఎస్125 సింగిల్ ఛానల్ ఏబీఎస్ వేరియంట్ ధర రూ. 1.07 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఇప్పటికే ఎన్ఎస్125 రూపంలో రెండు వేరియంట్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కాగా ఇప్పుడు లాంచ్ అయిన బైక్.. ముచ్చటగా మూడోది. ఇది చూడటానికి.. కొంత దాని మునుపటి మోడల్స్ మాదిరిగా ఉన్నప్పటికీ.. కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు.

ఇంజిన్ డీటైల్స్

ఆరంజ్, రెడ్, గ్రే మరియు బ్లూ కలర్ ఆప్షన్లలో లభించే బజాజ్ ఎన్ఎస్125.. 124.45 సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8,500 rpm వద్ద 11.82 Bhp పవర్, 7000 rpm వద్ద 11 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ కలిగి ఉత్తమ పనితీరును అందిస్తుంది. కాబట్టి వాహన ప్రియులు పనితీరు గురించి కంగారుపడాల్సిన అవసరం లేదు.

బజాజ్ ఎన్ఎస్125 బైక్ ఎల్ఈడీ హెడ్‌లైట్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ మరియు USB ఛార్జింగ్ పోర్ట్ వంటివి పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. బైక్ గురించి చాలా సమాచారాన్ని రైడర్లకు అందిస్తుంది. ఈ బైకును చాలామంది రోజువారి వినియోగానికి మాత్రమే కాకుండా.. లాంగ్ రైడ్ చేయడానికి కూడా ఉపయోగిస్తారు.

హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ మరియు టీవీఎస్ రైడర్ 125 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండే.. బజాజ్ ఎన్ఎస్125 బైక్ స్ప్లిట్ సీటును పొందుతుంది. ఇది రైడర్ మరియు పిలియన్‌కు చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ బైకును చాలామంది ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు.

బజాజ్ ఎన్ఎస్125 లాంచ్ సందర్భంగా.. బజాజ్ ఆటో లిమిటెడ్ మోటార్ సైకిల్ బిజినెస్ యూనిట్ హెడ్ ‘సారంగ్ కనడే’ మాట్లాడుతూ.. ఇప్పటికి జనరేషన్ ఏమి కోరుకుంటుందో మాకు తెలుసు. దీనిని దృష్టిలో ఉంచుకునే కంపెనీ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ లేదా కొత్త బైకులు లాంచ్ చేస్తోంది. ఇప్పుడు లాంచ్ అయిన కొత్త ఏబీఎస్ పల్సర్ ఎన్ఎస్125 తప్పకుండా బైక్ రైడర్లకు గొప్ప రైడింగ్ అనుభూతిని అందిస్తుందని అన్నారు.

పల్సర్ ఎన్ఎస్125.. 17 ఇంచెస్ వీల్స్ పొందుతుంది. ఈ బైక్ యొక్క ముందు భాగంలో టెలిస్కోపిక్ పోర్క్స్, వెనుక భాగంలో మోనో షాక సస్పెన్షన్ పొందుతుంది. ఈ బైక్ బరువు 144 కేజీలు కాగా.. సీటు ఎత్తు 805 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 179 మీమీ. కాబట్టి ఇది అన్ని విధాలా చాలా ఉపయోగకరమైన బైక్ అని తెలుస్తోంది.

బజాజ్ పల్సర్ సేల్స్

భారతీయ మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతున్న బైకుల జాబితాలో పల్సర్ కూడా ఒకటి. ఇప్పటి వరకు పల్సర్ బైకును 1.4 మిలియన్ (14 లక్షలు) మంది కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే.. మార్కెట్లో ఈ బైకుకు మంచి డిమాండ్ ఉందని స్పష్టంగా అర్థమవుతోంది.

బజాజ్ పల్సర్ విభాగంలో.. పల్సర్ ఎన్125, పల్సర్ ఎన్ఎస్400జెడ్, పల్సర్ ఆర్ఎస్200, పల్సర్ ఎన్250, పల్సర్ 220ఎఫ్, పల్సర్ ఎన్ఎస్200, పల్సర్ ఎన్ఎస్160, పల్సర్ ఎన్160, పల్సర్ ఎన్150, పల్సర్ 150, పల్సర్ ఎన్ఎస్125 మరియు పల్సర్ 125 వంటివి ఉన్నాయి. ఇవన్నీ చూడటానికి మంచి డిజైన్ మరియు లేటెస్ట్ ఫీచర్స్ పొందుతాయి. ఈ కారణంగానే.. బ్రాండ్ బైకులు విపరీతమైన సేల్స్ పొందుతున్నాయి.

Also Read: 2025 హోండా షైన్ 125.. ఇప్పుడు మరింత కొత్తగా: రూ. 84493 మాత్రమే..

ఇప్పుడు మార్కెట్లో లాంచ్ చేసిన కొత్త ఎన్ఎస్125 ఏబీఎస్ వేరియంట్.. దాని మునుపటి అన్ని మోడల్స్ కంటే కూడా ఎక్కువ లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. కాబట్టి ఇది ఎలాంటి అమ్మకాలను పొందుతుంది.. ప్రత్యర్థుల నుంచి ఎలాంటి పోటీని ఎదుర్కోనుంది వంటి విషయాలు తెలుసుకోవడానికి ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. అయితే ఇతర పల్సర్ బండి మాదిరిగానే ఇది కూడా మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము.

ప్రేమకు అర్థం ఏమంటే: చరిత్ర చెప్పిన సంగతులు.. తెలుసుకోవలసిన నిజాలు

0

Special Story of Valentines Day and Love: ముందుగా ప్రేముకులందరికీ.. ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. ప్రేమ (Love).. ఇది వినడానికి రెండక్షరాలే అయినా, సమస్తం ఇందులోనే దాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే చూపులతో మొదలై.. విశ్వాన్ని సైతం మరిపించే శక్తి బహుశా ప్రేమకే ఉందేమో. ప్రేమ కోసం ఖండాలు దాటిన వ్యక్తులను ఎందోమందిని చూశాము, చూస్తున్నాము, అంత పవిత్రమైన బంధం ప్రేమ. ఈ రోజు ప్రేమకు అర్థాలు మారిపోతున్నాయి. ఈ రోజు ప్రేమించుకుని.. రేపటికే విడిపోతున్నారు. దీన్నే నేడు ప్రేమ అంటున్నారు.

చరిత్రలో ప్రేమ..

ప్రేమంటే నమ్మకం, బాధ్యత, భరోసా.. ఇలా ఎన్ని చెప్పినా, ప్రేమను వర్ణించడం కష్టమే. ప్రేమించడం గొప్ప కాదు, ప్రేమించబడటం గొప్ప. ఒక అమ్మాయి లేదా అబ్బాయి నిజాయితీగా ప్రేమించుకుంటే.. ఎన్ని కష్టాలు వచ్చినా విడిపోకూడదు. దీనికి మన చరిత్రే సాక్ష్యం. ఎన్నో దశాబ్దాల క్రితం ప్రేమించుకున్న ఆంటోని – క్లియోపాత్ర, ముంతాజ్ – షాజహాన్, రోమియో – జూలియట్, షిరిన్ – ఫర్హాద్, లైలా – మజ్ను వంటివారి ప్రేమ కథలు ఈ రోజుకి మనకు వినిపిస్తున్నాయంటే.. వారి ప్రేమలోని నిజాయితీనే కారణం. అందుకే వీరి ప్రేమను చరిత్రకారులు సువర్ణాక్షరాలతో లిఖించారు. ఈ విశ్వం ఉన్నంతకాలం.. తప్పకుండా వీరి ప్రేమ కథలు వినిపిస్తూనే ఉంటాయి.

ప్రేమించడం తప్పు కాదు, ప్రేమ పేరుతో వంచించడం తప్పు. ఒక మూర్ఖుడిని మార్చాలన్నా?.. ఒక వ్యక్తిని సరైన దారిలో నడిచేలా చేయాలన్నా.. అది తప్పకుండా ప్రేమతోనే సాధ్యమవుతుంది. ఎందోమంది యువకులు తాము ప్రేమించిన అమ్మాయికి నచ్చినట్లు ఉండాలని.. అహర్నిశలు పరితపిస్తుంటారు. అమ్మాయిలు సైతం.. తమకు నచ్చిన అబ్బాయి దగ్గర చంటిపిల్లలైపోతారు. అందుకే ”ప్రేమను ప్రేమతో.. ప్రేమగా ప్రేమిస్తే.. ప్రేమించబడిన ప్రేమ ప్రేమించబడిన ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది”.

ప్రేమ ఎలా పుడుతుందంటే?

సినిమాల్లో చూపించినట్లు.. ప్రేమ పుట్టునప్పుడు లేదా ప్రేమించాల్సిన వ్యక్తి కనిపించినప్పుడు.. గుండెల్లో గంటలు మోగడం, మెరుపులు మెరవడం, వర్షం పడటం లాంటి సంఘటనలు జరగవు. అసలు ప్రేమ అనేది.. ఎవరి మీద ఎప్పుడు, ఎలా పుడుతుందో తెలియదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమ అసలు ఎందుకు పుడుతుందో కూడా తెలియదు. అందుకే లవ్ ఈస్ బ్లైండ్ అంటారు.

లేటెస్ట్ ప్రేమలు ఎలా ఉన్నాయంటే?

టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో.. ప్రేమించుకోవడానికి కూడా టెక్నాలజీలనే వాడేస్తున్నారు. ఫేస్‌బుక్‌లో పరిచయమై.. ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ చేసుకునే.. ఎక్స్(ట్విటర్)లో పెళ్లిళ్లు జరిగిపోతున్నాయి. ఇలా జరిగిన పెళ్లిళ్లు కొన్ని రోజులకు పెటాకులవుతున్నాయి. ఆ తరువాత ఎవరిదారి వారిదే. ఇలా అందరి జీవితాల్లో జరుగుతాయని చెప్పలేము కానీ.. కొంతమంది టెక్నాలజీలను నమ్మి నట్టేట మునిగిపోతున్నారు. మరికొందరు.. తెలియనివారని నమ్మి మోసపోయి ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే.. ప్రేమ పేరుతో మోసం చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండటంతో.. అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి.

Also Read: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్.. స్పందించిన రష్మిక – ఏమందో తెలుసా?

ప్రేమించుకోవడం బాగానే ఉంటుంది.. ఆ తరువాత పెద్దలను కాదని పెళ్లి చేసుకుని జీవితం మొదలు పెడితే.. ఎన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అమ్మాయి తరపున వాళ్ళు, అబ్బాయి తరపున వాళ్ళు దూరం పెట్టేస్తే.. అప్పుడప్పుడే ఊహల ప్రపంచం వీడి జీవితంలో అడుగుపెట్టిన పసి మొగ్గలు.. ఓ పెను తుఫాన్ లాంటి కష్టాలను దాటాల్సి ఉంటుంది. బహుశా ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఆ కష్టాల కడలి దాటితేనే అసలైన అందమైన జీవితం మొదలవుతుంది. ఆ కష్టాలను తట్టుకోలేక కన్ను మూసిన హృదయాలు ఎన్నో ఉన్నాయి.

ప్రేమ తప్పు కాదు!

రెండు మనసులు ప్రేమించుకోవడం తప్పేమీ కాదు. అయితే ప్రేమించాల్సిన వ్యక్తిని సెలక్ట్ చేసుకోవడంలో తప్పటడుగు వేసినా.. తప్పుడు వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినా.. కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నట్లే. అయితే పిల్లల ప్రేమ విషయంలో పెద్దలు కూడా జాగ్రత్త వహించాలి. వారు ఎలాంటి వ్యక్తిని ప్రేమిస్తున్నారు? ఎలాంటి వ్యక్తిని ఎంచుకుంటున్నారు? అనే విషయాలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, వారిని దూరం చేసుకోకూడదు. పిల్లలు చేసిన తప్పును కొంత పెద్ద మనసుతో క్షమించి.. వారిని దగ్గర పెట్టుకుని కొంత ఎదగటానికి సహాయం చేయాలి. ప్రేమించడం తప్పని.. వారిని దూరం పెడితే, కష్టాలు తట్టుకోలేక కన్ను మూసే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే.. కన్నబిడ్డలకు తల్లిదండ్రులే కడసారి వీడ్కోలు చెప్పాల్సి ఉంటుంది.

2025 హోండా షైన్ 125.. ఇప్పుడు మరింత కొత్తగా: రూ. 84493 మాత్రమే..

0

2025 Honda Shine 125 Launched In India: రోజువారీ వినియోగానికి లేదా.. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువమంది ఇష్టపడే బైకులలో ఒకటైన ‘హోండా షైన్ 125’ (Honda Shine 125) ఇప్పుడు ఆధునిక హంగులను పొందింది. కంపెనీ ఈ బైకును ఓబీడీ2బీ (OBD2B) నియమాలకు అనుగుణంగా అప్డేట్ చేసింది. కాబట్టి ధరలలో కూడా కొంత వ్యత్యాసం ఏర్పడింది.

కొత్త ధరలు

హోండా కొత్త షైన్ 125 బైక్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఒకటి డ్రమ్ వేరియంట్, మరొకటి డిస్క్ వేరియంట్. వీటి ధరలు వరుసగా రూ. 84,493 మరియు రూ. 89,245 (ధరలు, ఎక్స్ షోరూమ్ – ఢిల్లీ). ఈ ధరలు స్టాండర్డ్ వేరియంట్ కంటే కూడా రూ. 1242 (డ్రమ్ వేరియంట్) మరియు రూ. 1994 (డిస్క్ వేరియంట్) ఎక్కువ.

కొత్త హోండా షైన్ 125 బైక్ 123.94 సీసీ ఇంజిన్.. లేటెస్ట్ OBD2B నిబంధనలకు అనుగుణంగా అప్డేట్ అయింది. ఇది 7500 rpm వద్ద 14.9 హార్స్ పవర్ మరియు 6000 rpm వద్ద 11 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది పనితీరు పరంగా స్టాండర్డ్ మోడల్ కంటే కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. కాబట్టి రోజువారీ వినియోగానికి లేదా నగర ప్రయాణానికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని సమాచారం. ఇంధన సామర్థ్యాన్ని పెంచే ఐడెల్ స్టార్ట్ / స్టాప్ సిస్టం కూడా ఈ బైకులో ఉంటుంది.

ఇందులో కొత్తగా ఏమున్నాయంటే?

2025 హోండా షైన్ 125 లేదా కొత్త షైన్ 125 బైక్ ఇప్పుడు డిజిటల్ అనలాగ్ యూనిట్ స్థానంలో.. డిజిటల్ డ్యాష్ బోర్డు పొందుతుంది. ఇందులో రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్, డిస్టెన్స్ టు ఎంప్టీ వంటివి కనిపిస్తాయి. వీటితో పాటు.. మునుపటి బైకులోని సర్వీస్ డ్యూ ఇండికేటర్ మరియు సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ వంటి ఫీచర్స్ కూడా కొత్త బైకులో లభిస్తాయి.USB టైప్ సీ పోర్ట్ కూడా కొత్త షైన్ 125లో కనిపిస్తుంది.

అప్డేటెడ్ హోండా షైన్ 125 బైక్ యొక్క వెనుక టైర్ ఇప్పుడు 90 సెక్షన్ యూనిట్, ఇది మునుపటి 80 సెక్షన్ టైర్ స్థానంలో ఫిక్స్ చేయబడింది. ఈ బైక్ పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, జెనీ గ్రే మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, రెబెల్ రెడ్ మెటాలిక్, డీసెంట్ బ్లూ మెటాలిక్ మరియు పెర్ల్ సైరెన్ బ్లూ వంటి కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుండటం వల్ల.. కొనుగోలుదారులు తమకు నచ్చిన కలర్ బైక్ కొనుగోలు చేయవచ్చు.

షైన్ 125 బైక్ మార్కెట్లో టీవీఎస్ కంపెనీకి చెందిన రేడియన్ మరియు హీరో మోటోకార్ప్ సంస్థకు చెందిన సూపర్ స్ప్లెండర్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. షైన్ 125 మాత్రమే కాకుండా.. దీని ప్రత్యర్థులు కూడా మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి అత్యుత్తమ పనితీరును అందిస్తాయి. కాబట్టి 2025 షైన్ 125 బైక్ అమ్మకాల పరంగా తప్పకుండా కొంత పోటీని ఎదుర్కోవాలి ఉంటుంది.

హోండా షైన్ 125 అమ్మకాలు

కంపెనీ యొక్క హోండా షైన్ బైక్.. మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి దాదాపు కోటి యూనిట్ల కంటే ఎక్కువ అమ్మకాలను పొందింది. అంటే ఈ బైకును కోటి మంచి కొనుగోలు చేశారు. దీన్ని బట్టి చూస్తే.. ఈ బైకుకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బైక్ మరింత ఆధునిక హంగులతో లాంచ్ అవ్వడంతో మరింత మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉందని భావిస్తున్నాము.

Also Read: నిమిషాల్లో అమ్ముడైపోయిన రూ.4.25 లక్షల రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇదే: దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?

హోండా షైన్ బైకును ఎక్కువమంది ఇష్టపడి కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం.. ఈ బైక్ యొక్క సింపుల్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్, కలర్ ఆప్షన్స్ మాత్రమే కాకుండా.. మంచి మైలేజ్ కూడా. ఈ బైక్ 55 కిమీ / లీ నుంచి 65 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. అంతే కాకుండా లోడింగ్ కెపాసిటీ లేదా బరువులు మోయడానికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కారణాల వల్లనే ఈ బైకుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.

చెప్పకనే చెప్పేసిన టిమ్ కుక్.. ఐఫోన్ ఎస్ఈ 4 వచ్చేస్తోంది: పూర్తి వివరాలివిగో..

0

Apple iPhone SE 4 Launch Date Revealed: ప్రపంచ మార్కెట్లో యాపిల్ కంపెనీ యొక్క ‘ఐఫోన్’లకు అధిక ప్రజాదరణ ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఈ మొబైల్ ఫోన్లకు అభిమానుల సంఖ్య కొంత ఎక్కువగానే ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ కూడా ఎప్పటికప్పుడు మార్కెట్లోకి సరికొత్త ఫోన్స్ లాంచ్ చేస్తూనే ఉంది. ఇప్పుడు యాపిల్ మొబైల్స్ జాబితాలోకి మరో ఫోన్ రావడానికి సిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ అండ్ ఫౌండర్ టిమ్ కుక్ (Tim Cook) పరోక్షంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసాడు.

టిమ్ కుక్ షేర్ చేసిన ఏడు సెకండ్స్ వీడియోలో.. యాపిల్ లోగో మాత్రమే ఉంది. అయితే 2025 ఫిబ్రవరి 19వ తేదీ యాపిల్ కుటుంబంలో కొత్త సభ్యుడిని కలవడానికి సిద్ధంగా ఉందని అని ట్వీట్ చేసారు. దీన్ని బట్టి చూస్తుంటే.. వచ్చే వారంలో యాపిల్ ఎస్ఈ 4 (Apple SE 4) లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎక్స్ (ట్విటర్)లో కూడా ప్రస్తుతం ఇదే ట్రెండింగ్ టాపిక్ కూడా.

యాపిల్ ఎస్ఈ 4

ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే అనేక యాపిల్ మొబైల్స్ ఉన్నాయి. కాగా కంపెనీ త్వరలో ఓ కొత్త మోడల్ తీసుకురావడానికి సిద్ధమైంది. బహుశా ఇదే ‘ఎస్ఈ 4’ అని తెలుస్తోంది. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర ఐఫోన్ మొబైల్స్ కన్నా.. తక్కువ ధర వద్ద అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ మొబైల్ ధరలు అధికారికంగా వెల్లడి కాలేదు.

ఎస్ఈ లైనప్ కొత్తేమీ కాదు. కాబట్టి కొందరు రాబోయే ఎస్ఈ 4 మొబైల్ పాత డిజైన్ కలిగి ఉంటుందని భావించవచ్చు. కానీ కంపెనీ దీనికి కొత్త డిజైన్ అందించే అవకాశం ఉంది. బహుశా దీని డిజైన్ ఐఫోన్ 14 మాదిరిగా ఉండే అవకాశం ఉంది. అయితే దీని గురించి మరిన్ని వివరాలు కూలంకశంగా తెలుసుకోవాలంటే.. ఇంకొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

డిజైన్

ఇప్పటికి అందుబాటులో ఉండే సమాచారం ప్రకారం.. యాపిల్ ఐఫోన్ ఎస్ఈ 4 డిజైన్ దాదాపు ఐఫోన్ 14 మాదిరిగానే ఉండే అవకాశం ఉంది. కంపెనీ ఇప్పటి వరకు ఎక్కువ మొత్తంలో ఎస్ఈ 14 ఫోన్స్ విక్రయిస్తోంది. కానీ ఎస్ఈ 4 లాంచ్ తరువాత ఐఫోన్ 14 కనుమరుగయ్యే అవకాశం ఉందని సమాచారం. ఎస్ 4లో బయోమెట్రిక్ కోసం పేస్ ఐడీ అందించనున్నారు. ఎస్ఈ 3లో జనిపించే 4.7 ఇంచెస్ స్క్రీన్ మాదిరిగా కాకుండా.. ఎస్ఈ 4లో 6.06 ఇంచెస్ ఓఎల్ఈడీ ప్యానెల్ ఉండనుంది.

పవర్

కొత్త ఐఫోన్ ఎస్ఈ 4లో.. ఏ18 ప్రాసెసర్ ఉండే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. యాపిల్ ఇంటెలిజెన్స్ ప్యాకేజీలో భాగమయ్యే అవకాశం కూడా ఎక్కువే అని తెలుస్తోంది. స్టోరేజ్ కెపాసిటీ కూడా భారీగా పెరుగే అవకాశం ఉంది. ఇందులో ఒక ఫ్రంట్ కెమెరా, మరొకటి బ్యాక్ కెమెరా మాత్రమే ఉండండుంది. మొత్తం మీద కెమెరా క్వాలిటీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.

ధర & వివరాలు

త్వరలో లాంచ్ కానున్న యాపిల్ ఐఫోన్ ఎస్ఈ 4 మొబైల్ 128 జీబీ, 256 జీబీ మరియు 512 జీబీ వేరియంట్ల రూపంలో విక్రయానికి రానుంది. దీని ప్రారంభ ధర రూ. 50000 వరకు ఉండే అవకాశం ఉంది. కంపెనీ ఈ మొబైల్ లాంచ్ చేసిన తరువాత ఫ్రీ ఆర్డర్స్ మొదలవుతాయి. ఆ తరువాత డెలివరీలు మొదలవుతాయి.

Also Read: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్.. స్పందించిన రష్మిక – ఏమందో తెలుసా?

తక్కువ ధరలో ఓ ఐఫోన్ కావాలనుకునేవారికి.. ఎస్ఈ 4 ఓ ఉత్తమ ఎంపిక. అయితే కొనుగోలుదారు ఎంచుకునే వేరియంట్ మీద ఆధారపడి ధరలు ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే ఇది వివిధ రకాల స్టోరేజ్ ఎముకలతో వస్తుంది. కాబట్టి బేస్ వేరియంట్ ధర ఒకమాదిరిగానే.. టాప్ ఎండ్ మోడల్ కొంత ఎక్కువ ధరకు లభిస్తుందని సమాచారం. మొత్తం మీద ఎస్ఈ4 ఫోన్ మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుందా.. అని ఐఫోన్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్.. స్పందించిన రష్మిక – ఏమందో తెలుసా?

0

Rashmika Comments On Vijay Devarakonda Kingdom Teaser: నేషనల్ క్రష్ రష్మిక మందన్న అనగానే.. చాలామందికి విజయ్ దేవరకొండ కూడా గుర్తుకోచేస్తాడు. ఎందుకంటే వీరిరువురు డేటింగ్‌లో ఉన్నట్లు సినీ పరిశ్రమలో కొన్నేళ్లుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. చాలా సందర్భాల్లో వీరు జంటగా కలిసి బయట కూడా ఎన్నోసార్లు కనిపించారు. గత సంవత్సరం దీపావళిని దేవరకొండ ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేసుకున్న ఈ అమ్మడు.. గీత గోవిందం మరియు డియర్ కామ్రేడ్స్ సినిమాల్లో విజయ్ దేవరకొండతో కలిసి నటించింది. అయితే తాజాగా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటించిన వీడీ 12 (VD 12) లేదా కింగ్‌డమ్ (Kingdom) టీజర్ లాంచ్‌పై రష్మిక స్పందించింది. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

నటి రష్మిక మందన్న.. విజయ్ దేవరకొండ కొత్త సినిమా టీజర్ చూసిన తరువాత, ‘దిస్ మ్యాన్ ఆల్వేస్ కమ్ విత్ సంథింగ్ మెంటల్.. చాలా గర్వంగా ఉంది విజయ్ దేవరకొండ” అని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కాస్త నెట్టింట్లో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు.

రష్మిక మందన్న విజయ్ దేవరకొండ సినిమాలు లేదా టీజర్స్ మీద స్పందించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చాలా సందర్భాల్లో విజయ్ దేవరకొండను ప్రశంసిస్తూ కూడా పోస్టులు చేసింది. కాగా మారోమారు ప్రశంసిస్తూ పోస్ట్ చేసింది. దీంతో రూమర్స్ ఇంకాస్త ముదిరింది.

విజయ్ దేవరకొండ

2012లో లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ సినిమాలో కనిపించిన విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఆ తరువాత అర్జున్ రెడ్డి సినిమాతో హీరోగా సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. అర్జున్ రెడ్డి సినిమా తరువాత గీత గోవిందం, డియర్ కామ్రేడ్స్, వరల్డ్ ఫేమస్ లవర్, ఖుషి మరియు లైగర్ మొదలైన సినిమాల్లో నటించాడు. ఇప్పుడు కింగ్‌డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

ఇక టీజర్ విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ ఇప్పటివరకు నటించిన అన్ని సినిమాల కంటే కింగ్‌డమ్ చాలా భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పుడూ లవ్, రొమాంటిక్ సినిమాలకు పరిమితమైన దేవరకొండ ఇప్పుడు ఫుల్ యాక్షన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికి విడుదలైన టీజర్ దేవరకొండ అభిమానులను తెగ ఆకట్టుకుంది. ఈ సినిమా తప్పకుండా గొప్ప సక్సెస్ సాధిస్తుందని పలువురు చెబుతున్నారు. ఈ సినిమా 2025 మే 30న రిలీజ్ అవుతుందని సమాచారం.

రష్మిక మందన్న (Rashmika Mandanna)

చలో సినిమాతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన రష్మిక మందన్న.. విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందం, మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు, నితిన్ సరసన భీష్మ సినిమాలో నటించింది. ఆ తరువాత పుష్ప, పుష్ప 2 సినిమాల్లో అల్లు అర్జున్ సరసన నటించి బాగా పాపులర్ అయింది. ఇప్పుడు ఛావా సినిమాలో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ సరసన కనిపించనుంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రష్మిక రూ. 10 కోట్ల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇకపోతే భవిష్యత్తులో పుష్ప 3 సినిమా రిలీజ్ అయితే.. అందులో కూడా రష్మిక మందన్న కనిపించనుంది.

నటి రష్మిక మందన్న సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా.. విలాసవంతమైన జీవితం గడుపుతూ, ఖరీదైన కార్లను ఉపయోగిస్తోంది. రష్మిక ఉపయోగించే కార్ల జాబితాలో రేంజ్ రోవర్ (Range Rover), ఆడి క్యూ3 (Audi Q3), మెర్సిడెస్ బెంజ్ సీ క్లాస్ (Mercedes Benz C Class), టయోటా ఇన్నోవా క్రిష్టా (Toyota Innova Crysta) మరియు హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) వంటివి ఉన్నాయి. రష్మిక మందన్న నెట్‍వర్త్ రూ. 70 కోట్లకంటే ఎక్కువే అనే తెలుస్తోంది.

Also Read: శ్రీవల్లి (రష్మిక) వాడే కార్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే.. ఒక్కో కారు అంత రేటా?

విజయ్ దేవరకొండ కార్ కలెక్షన్స్

నటుడు విజయ్ దేవరకొండ కూడా ఖరీదైన కార్లను ఉపయోగిస్తున్నారు. ఈయన గ్యారేజిలోని కార్ల జాబితాలో బీఎండబ్ల్యూ 5 సిరీస్ (BMW 5 Series), ఫోర్డ్ మస్టాంగ్ (Ford Mustang), రేంజ్ రోవర్ (Range Rover) మరియు వోల్వో ఎక్స్‌సీ90 (Volvo XC90) మొదలైనవి ఉన్నాయి. ఇకపోతే విజయ్ ఒక్కో సినిమాకు రూ. 80 కోట్ల నుంచి రూ. 90 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఇతని నెట్‍వర్త్ వందల కోట్లలో ఉంటుందని సమాచారం.

నిమిషాల్లో అమ్ముడైపోయిన రూ.4.25 లక్షల రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇదే: దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?

0

Royal Enfield Shotgun 650 Icon Edition Sold Out: ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) కంపెనీ కొన్ని రోజులకు ముందు మార్కెట్లో షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్ (Shotgun 650 Icon Edition) లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే సంస్థ ఈ రోజు (ఫిబ్రవరి 12) రాత్రి 8:30 గంటలకు బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. బుకింగ్స్ మొదలైన కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ బైక్ అన్నీ అమ్ముడైపోయినట్లు కంపెనీ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.. వచ్చేయండి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంచ్ చేసిన షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్ కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించిన కేవలం నిమిషాల వ్యవధిలోనే మొత్తం అమ్ముడైపోయాయి. ఈ బైక్ లిమిటెడ్ ఎడిషన్. కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా కంపెనీ ఈ బైకును 100 మందికి మాత్రమే విక్రయిస్తుంది. అందులో భారత్ కోసం 25 బైకులను కేటాయించింది. అంటే ఇండియన్ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్ బైకులను కేవలం 25 మంది మాత్రమే కొనుగోలు చేయడానికి అర్హులు.

సాధారణ షాట్‌గన్ 650 బైక్ కంటే కూడా షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్ ధర రూ. 65,000 ఎక్కువ. అంటే ఐకాన్ ఎడిషన్ ధర మార్కెట్లో రూ. 4.25 లక్షలు (ఎక్స్ షోరూమ్). ధర ఎక్కువైనప్పటికీ.. కొనుగోలుదారులు మాత్రం అస్సలు వెనక్కి తగ్గడం లేదు. మొత్తం మీద కంపెనీ లాంచ్ చేసిన స్పెషల్ ఎడిషన్ బైక్ అమ్మకాలు విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్బంగా కంపెనీ కొనుగోలుదారులకు ధన్యవాదాలు తెలిపింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్

కంపెనీ లాంచ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్.. దాని మునుపటి అన్ని బైకుల కంటే కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇందులో చెప్పుకోదగ్గది కలర్ ఆప్షన్. ఎందుకంటే ఈ బైక్ వైట్, రెడ్, సీ బ్లూ రంగులతో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ బైక్ యొక్క రిమ్స్ కూడా బంగారు రంగులో ఉండటం చూడవచ్చు. ఈ బైకును కంపెనీ ప్రత్యేకంగా.. రైడింగ్ గేర్ తయారీదారు ఐకాన్ మోటార్‌స్పోర్ట్స్ సహకారంతో రూపొందించింది.

ఈ ఐకాన్ ఎడిషన్ బైకును కంపెనీ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేయడానికంటే ముందు.. EICMA 2024 మరియు మోటోవర్స్ 2024లో ప్రదర్శించింది. ఆ సమయంలో ఈ బైక్ ఎంతోమంది వాహన ప్రేమికులను ఆకర్శించింది. ఇప్పుడు ఏకంగా నిమిషాల వ్యవధిలోనే కొనుగోలు చేసేలా చేసింది. అయితే ఇప్పుడు ఈ బైకును బుక్ చేసుకున్న కస్టమర్లకు డెలివరీలు త్వరలోనే జరుగుతాయని సమాచారం. కానీ డెలివరీలు ఎప్పుడనేది స్పష్టంగా వెల్లడికాలేదు.

డిజైన్ కాకూండా.. ఈ బైక్ యొక్క ఇంజిన్ మరియు మెకానికల్స్ ఎటువంటి మార్పు లేదు. కాబట్టి షాట్‌గన్ 650 బైకులోని అదే 648 సీసీ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్, ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 7250 rpm వద్ద 46.6 Bhp పవర్ మరియు 5650 rpm వద్ద 52.3 Nm టార్క్ అందిస్తుంది. కాబట్టి పనితీరు ఉత్తమంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్ ముందు భాగం లేత నీలం మరియు తెలుపు రంగులో ఉంది. ఫ్యూయెల్ ట్యాంక్ కూడా లేత నీలం, ఎరుపు మరియు తెలుపు రంగుల్లో ఉంది. సైడ్ ప్యానెల్ 24 సంఖ్యతో ఉండటం చూడవచ్చు. రియర్ ఫెండర్ ఐకాన్ లోగోతో పాటు ఎరుపు మరియు తెలుపు రంగుల కలయికలో ఉంటుంది. గోల్డ్ కలర్ వీల్స్, రెడ్ కలర్ సీటు మరియు లేత నీలం రంగులో పెయింట్ చేయబడిన రియర్ స్ప్రింగ్ వంటివి ఈ బైకులో గమనించవచ్చు.

Also Read: ఫిబ్రవరి 17న లాంచ్ కానున్న కొత్త ఎలక్ట్రిక్ కారు ఇదే: ఒక్క ఛార్జ్.. 567 కిమీ రేంజ్ బాసూ!

కంపెనీ ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్ బుక్ చేసుకున్న వారికి.. ప్రత్యేకంగా రూపొందించబడిన జాకెట్ కూడా ఇస్తుంది. దీని కలర్.. బైక్ రంగుకు సరిపోయేలా ఉంటుంది. మొత్తం మీద ఈ బైక్ ప్రత్యేకంగా.. ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న అన్ని బ్రాండ్ బైకుల కంటే కూడా చాలా భిన్నంగా ఉంది. ఈ కారణంగానే చాలా తొందరగా అమ్ముడైనట్లు తెలుస్తోంది.

248 కిమీ రేంజ్ అందించే ఈ స్కూటర్.. రూ.1.66 లక్షలు మాత్రమే!: దీని గురించి తెలుసా?

0

Simple One Gen 1.5 Electric Scooter Launched in India: బెంగళూరుకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ సింపుల్ ఎనర్జీ (Simple Energy) ఎట్టకేలకు దేశీయ విఫణిలో ‘సింపుల్ వన్ జెన్ 1.5’ (Simple One Gen 1.5) వెర్షన్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కొన్ని అప్డేట్స్ గమనించవచ్చు. కాబట్టి దీని గురించి మరిన్ని వివరాలు, వివరంగా.. ఈ కథనంలో చూసేద్దాం.

ధర

సింపుల్ వన్ జెన్ 1.5 ఎలక్ట్రిక్ స్కూటర్ లేటెస్ట్ అప్డేట్స్ పొందింది. అయితే ధరలో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి దీని ధర స్టాండర్డ్ మోడల్ ధరకు సమానంగా ఉందన్నమాట. అంటే ఈ లేటెస్ట్ స్కూటర్ ధర రూ. 1.66 లక్షలు (ఎక్స్ షోరూమ్, బెంగళూరు) మాత్రమే. ఈ స్కూటర్ ఇప్పుడు కంపెనీ యొక్క అధీకృత డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది.

రేంజ్

ఇక్కడ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం.. రేంజ్. ఎందుకంటే స్టాండర్డ్ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక సింగిల్ ఛార్జితో 121 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. కానీ అప్డేటెడ్ సింపుల్ వన్ జెన్ 1.5 స్కూటర్ ఏకంగా 248 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. అంటే అప్డేటెడ్ స్కూటర్ స్టాండర్డ్ స్కూటర్ కంటే రెట్టింపు రేంజ్ అందిస్తుందన్నమాట. దీంతో ఈ స్కూటర్ భారతదేశంలో అత్యధిక రేంజ్ అందించే స్కూటర్ల జాబితాలో ఒకటిగా చేరింది.

అప్డేటెడ్ ఫీచర్స్

కొత్త సింపుల్ వన్ జెన్ 1.5 ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది యాప్ ఇంటిగ్రేషన్, నావిగేషన్, అప్డేటెడ్ రైడింగ్ మోడ్స్, పార్క్ అసిస్ట్, ఓటీఏ అప్డేట్స్, రీజనరేటివ్ బ్రేకింగ్, ట్రిప్ హిస్టరీ మరియు స్టాటిస్టిక్స్ వంటివి పొందుతుంది. ఈ ఫీచర్స్ మాత్రమే కాకుండా ఇందులో ఫైండ్ మై వెహికల్ ఫీచర్, ఆటో బ్రైట్‌నెస్ మరియు సౌండ్ వంటి మల్టిపుల్ సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి. ఫాస్ట్ బ్రేక్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, USB ఛార్జింగ్ పోర్ట్ వంటివి కూడా ఈ అప్డేటెడ్ స్కూటర్‌లో ఉన్నాయి.

కంపెనీ ఇప్పుడు అప్డేటెడ్ సింపుల్ వన్ జెన్ 1.5 స్కూటర్‌ను స్టాండర్డ్ మోడల్ ధర వద్దనే లాంచ్ చేసింది. కాబట్టి ఇప్పటికే స్టాండర్డ్ మోడల్ లేదా సాధారణ సింపుల్ వన్ కొనుగోలు చేసిన కస్టమర్లు లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ కూడా పొందవచ్చు. అయితే ఇక్కడ తెలుసుకోవలసిన మరో విషయం ఏమిటంటే.. కొత్త జెన్ 1.5 సిఎంపీల వన్ కొనుగోలు చేసినవారు 750 వాట్స్ ఛార్జర్ కూడా పొందవచ్చు.

ఇతర వివరాలు

అప్డేటెడ్ సింపుల్ వన్ జెన్ 1.5 స్కూటర్ పార్క్ అసిస్ట్ ఫీచర్ కలిగి ఉండటం వల్ల.. ముందుకు మరియు వెనుకకు వెళ్లగలదు. ఈ స్కూటర్ కేవలం 2.77 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అంతే కాకుండా ఇది 30 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ కూడా పొందుతుంది. కాబట్టి ఎక్కువ అండర్ సీట్ స్టోరేజ్ కావాలనుకునే వారికి సింపుల్ వన్ జెన్ 1.5 మోడల్ ఓ ఉత్తమ ఎంపిక అనే చెప్పాలి.

సింపుల్ ఎనర్జీ కంపెనీకి దేశ వ్యాప్తంగా 10 స్టోర్స్ మాత్రమే ఉన్నాయి. అవి బెంగళూరు, హైదరాబాద్, గోవా, పూణే, వైజాగ్ మరియు కొచ్చి ప్రాంతాల్లో ఉన్నాయి. అయితే సంస్థ 2026 ఆర్ధిక సంవత్సరం నాటికి 150 కొత్త స్టోర్లను మరియు 200 సర్వీస్ సెంటర్లను ప్రారంభించాలని యోచిస్తోంది.

Also Read: ఫిబ్రవరి 17న లాంచ్ కానున్న కొత్త ఎలక్ట్రిక్ కారు ఇదే: ఒక్క ఛార్జ్.. 567 కిమీ రేంజ్ బాసూ!

నిజానికి ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలను మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం మార్కెట్లో లెక్కకు మించిన ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లు మరియు కార్లు ఉన్నాయి. స్కూటర్ల విభాగంలో ఎన్నెన్ని స్కూటర్లు ఉన్నా.. సింపుల్ ఎనర్జీ స్కూటర్లకు మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ బ్రాండ్ స్కూటర్ల మీద ఒక్క కంప్లైంట్ (పిర్యాదు) లేదు. మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగిన ఈ స్కూటర్.. అద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ కారణంగానే చాలామంది దీనిని ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. పేరు సింపుల్ అయినప్పటికీ.. దీనికున్న ఫ్యాన్స్ మాత్రం చాలా ఎక్కువే అని తెలుస్తోంది.

ఫిబ్రవరి 17న లాంచ్ కానున్న కొత్త ఎలక్ట్రిక్ కారు ఇదే: ఒక్క ఛార్జ్.. 567 కిమీ రేంజ్ బాసూ!

0

BYD Sealion 7 To Launch in India On February 17: 2025 గ్లోబల్ ఆటో ఎక్స్‌పోలో కనిపించిన ‘బీవైడీ సీలియన్ 7’ (BYD Sealion 7) ఈ నెల 17న (ఫిబ్రవరి 17) భారతీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ అవుతుందని కంపెనీ ధ్రువీకరించింది. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కారు బ్రాండ్ యొక్క అత్యంత ఖరీదైన కారు కానుంది. దీని దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.

బుకింగ్స్ & డెలివరీలు

కంపెనీ లాంచ్ చేయనున్న బీవైడీ సీలియన్ 7 ఎలక్ట్రిక్ కారు కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కాబట్టి రూ. 70000 చెల్లించిన దీనిని బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు 2025 మార్చి 7న ప్రారంభమవుతాయి. కంపెనీ మొదటి దశలో కేవలం 70 యూనిట్లను మాత్రమే డెలివరీ చేయనుంది. ఈ కారు కొనుగోలుపైన సంస్థ 7 సంవత్సరాలు లేదా 1,50,000 కిమీ వారంటీ మరియు ఫ్రీ ఇన్‌స్టాలేషన్‌తో కాంప్లిమెంటరీ 7kW ఏసీ హోమ్ ఛార్జర్ అందిస్తుంది. ఇది మార్కెట్లో లాంచ్ అయిన తరువాత కియా ఈవీ6 ఫేస్‌లిఫ్ట్ కారుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

వేరియంట్స్ మరియు బ్యాటరీ & రేంజ్

బీవైడీ సీలియన్ 7 ఎలక్ట్రిక్ కారు ప్రీమియం మరియు పర్ఫామెన్స్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇవి రెండూ 82.56 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతాయి. రేంజ్ విషయానికి వస్తే ప్రీమియం మోడల్ 567 కిమీ, పర్ఫామెన్స్ మోడల్ 542 కిమీ అందిస్తాయి.

ప్రీమియం మోడల్ రియర్ వీల్ డ్రైవ్ సిస్టం పొందుతుంది, ఇది 6.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ వేరియంట్ 313 హార్స్ పవర్, 318 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసే మోటారును కలిగి ఉంటుంది. పర్ఫామెన్స్ మోడల్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం పొందుతుంది. ఇది 0 నుంచి 100 కిమీ / గం వేగవంతం కావడానికి పట్టే సమయం 4.5 సెకన్లు మాత్రమే. ఇందులోని మోటార్ 530 హార్స్ పవర్ మరియు 690 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.

ఫీచర్స్

కొత్త బీవైడీ సీలియన్ 7.. బ్రాండ్ యొక్క ఇతర మోడల్స్ మాదిరిగానే ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 15.6 ఇంచెస్ రొటేటింగ్ టచ్‌స్క్రీన్.. డాష్‌బోర్డ్ మధ్యలో ఉంటుంది. హెడ్స్ ఆప్ డిస్ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, మెమరీ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, పనోరమిక్ గ్లాస్ రూఫ్, యాంబియంట్ లైట్స్, 12 స్పీకర్లు, వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్ మరియు పవర్ టెయిల్‌గేట్ వంటి ఎన్నో ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.

Also Read: సింగిల్ ఛార్జ్.. 323 కిమీ రేంజ్: సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ – ధర ఎంతో తెలుసా?

సీలియన్ 7 కారులో 11 ఎయిర్‌బ్యాగ్‌లు, ఫార్వర్డ్ కొలిషన్ అలర్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, లేన్ డిపార్చర్ అసిస్ట్ వంటి ఏడీఏఎస్ (ADAS) సూట్ వంటి వాటితో పాటు.. 360 డిగ్రీ కెమెరా, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, హిల్ హోల్డ్ కంట్రోల్మరియు ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఇవి వాహనదారులకు మంచి భద్రతను అందిస్తాయి.

డిజైన్ మరియు కలర్ ఆప్షన్స్

కొత్త సీలియన్ 7 కారు ఒక్క చూపుతోనే.. తప్పకుండా ఆకర్శించగలదు. ఎందుకంటే ఇది చూడటానికి కొంత, ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న బీవైడీ సీల్ మాదిరిగా ఉంది. కొత్త బంపర్ డిజైన్, హెడ్‌ల్యాంప్, టెయిల్ ల్యాంప్ సెటప్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారు 19 ఇంచెస్ మరియు 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఆప్షన్ పొందుతుంది.

Also Read: మరచిపోలేని గిఫ్ట్.. భార్యను ముద్దుపెట్టుకున్న భర్త – వీడియో

బీవైడీ సీలియన్ 7 ఎలక్ట్రిక్ కారు మొత్తం నాలుగు రంగులలో లభించనుంది. అవి కాస్మోస్ బ్లాక్, అట్లాంటిస్ గ్రే, అరోరా వైట్ మరియు షార్క్ గ్రే కలర్స్. కలర్ ఆప్షన్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ కొత్త కారు నాలుగు రంగులలో లభించడం వల్ల, కొనుగోలుదారు తనకు నచ్చిన కలర్ ఎందుకోవచ్చు. కాగా కంపెనీ ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ధరలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. లాంచ్ సమయంలో ఆ వివరాలు తెలుస్తాయి.

ఆర్మీలో అడుగుపెట్టిన 60 కొత్త కార్లు.. అన్నీ ఒకటే బ్రాండ్: వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా?

0

Maruti Jimny Replaces Gypsy in Indian Army: ప్రముఖ వాహన తయారీ సంస్థ ‘మారుతి సుజుకి’ (Maruti Suzuki) భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్ల తయారీ సంస్థల్లో ఒకటిగా ఉంది. ఈ కంపెనీ లాంచ్ చేసిన ‘జిమ్నీ’ కారు ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో సేవలందించడానికి సిద్ధమైంది. ఈ కార్లు త్వరలోనే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (CAPF)లో చేరనున్నాయి. దీనికోసం కంపెనీ ఒకేసారి 60 కార్లను ‘ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్’ (ITBT)లకు అప్పగించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జిమ్నీ కార్లు లేహ్ లడక్ మరియు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో మోహరించనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు మారుతి జిప్సీ కార్లను ఉపయోగించిన సిఏపీఎఫ్.. వాటి స్థానంలో జిమ్నీ కార్లను ఉపయోగించనుంది. ఐటీబీపీ భారతదేశంలో అత్యంత కఠినమైన భూభగాల్లో పనిచేస్తుంది. ఇలాంటి భూభాగాల్లో ఆఫ్ రోడర్ కార్లను మాత్రమే ఉపయోగించడానికి సాధ్యమవుతుంది. జిమ్నీ ఆఫ్ రోడర్ మాత్రమే కాకుండా.. తేలికైన వాహనం కూడా. కాబట్టి ఇది ఆ భూభాగాల్లో ఉపయోగించడానికి ఖచ్చితంగా సరిపోతుంది.

ఎత్తైన హిమాలయ ప్రాంతాల్లో.. తీవ్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు -45 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతాయి. హిమానీనదాలు, మంచుతో కప్పబడిన ప్రాంతాలు.. కఠినమైన ప్రదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆ ప్రాంతాల్లో పెట్రోలింగ్ లేదా సరిహద్దు కాపలాకు ఐటీబీటీ సిబ్బంది వీటిని ఉపయోగిస్తాయి.

జిమ్నీ కార్లను డెలివరీ చేసిన సందర్భంగా.. మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ & సేల్స్) పార్థో బెనర్జీ మాట్లాడుతూ.. ఐటీబీటీకి జిమ్నీ కార్లను డెలివరీ చేయడం చాలా ఆనందంగా ఉంది. కఠినమైన భూభాగాల్లో లేదా సరిహద్దు ప్రాంతాల్లో న్యావిగేట్ చేయడానికి ఈ కార్లు మంచి ఎంపిక. మారుతి సుజుకి ఇండియన్ ఆర్మీతో దీర్ఘకాల అనుబంధాన్ని కలిగి ఉందని కూడా పేర్కొన్నారు.

మారుతి జిమ్నీ (Maruti Jimny)

భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలో అధిక ప్రజాదరణ పొందిన ఆఫ్ రోడర్లలో ‘జిమ్నీ’ ఒకటి. ఇది ‘మహీంద్రా థార్’కు ప్రత్యర్థిగా విఫణిలో అడుగుపెట్టింది. చూడటానికి కొంత చిన్నదిగా ఉన్నప్పటికీ.. ఈ కారు అద్భుతమైన పనితీరును అందిస్తుంది. ఈ కారులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 103 Bhp పవర్ మరియు 134 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ మాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి అత్యుత్తమ పర్ఫామెన్స్ లభిస్తుంది.

మారుతి జిమ్నీ కారు ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టం పొందుతుంది. ఈ కారణంగానే ఎలాంటి కఠినమైన భూభాగంలో అయినా.. సజావుగా ముందుకు సాగుతుంది. ఈ కారులో బ్రేక్ అసిస్టెట్ లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్ కూడా ఉంటుంది. ఇది కారు చక్రాలకు ఎంత పవర్ అవసమయో.. అంత అందిస్తుంది.కాబట్టి ఆఫ్ రోడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ కారు ప్రారంభ ధర ఇండియన్ మార్కెట్లో రూ. 12.75 లక్షలు (ఎక్స్ షోరూమ్).

జిమ్నీ ఎలక్ట్రిక్ (Jimny EV)

ఇకపోతే, ఇప్పటికే మంచి ప్రజాదరణ పొందిన మారుతి జిమ్నీ.. ఎలక్ట్రిక్ రూపంలో కూడా మార్కెట్లో అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. కంపెనీ దీనిని ఎలక్ట్రిక్ కారుగా లాంచ్ చేయాలని నిర్ణయించుకుంది. జిమ్నీ ఎలక్ట్రిక్ 2028 నాటికి దేశీయ విఫణిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుందని సమాచారం.

Also Read: మరచిపోలేని గిఫ్ట్.. భార్యను ముద్దుపెట్టుకున్న భర్త – వీడియో

మారుతి జిమ్నీ ఎలక్ట్రిక్ కారు.. చూడటానికి కొంత సాధారణ జిమ్నీ మాదిరిగా ఉన్నప్పటికీ, ముందు భాగం మొత్తం క్లోజ్ చేయబడి ఉంటుంది. అక్కడ ఛార్జింగ్ పోర్ట్ వంటివి ఉండే అవకాశం ఉంటుంది. కంపెనీ ఇందులో ఫిక్స్ చేయనున్న బ్యాటరీ.. రేంజ్ వంటి వాటిని అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఇది దాని ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడానికి కావలసిన అన్ని ఫీచర్స్ పొందనున్నట్లు సమాచారం. దీని ధర రూ. 18 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన వివరాలు అధికారికంగా రాబోయే రోజుల్లో వెల్లడవుతాయి. ఈ కారు తప్పకుండా మార్కెట్లో వాహన ప్రేమికులను ఆకర్శించే అవకాశం ఉంటుంది.