Tag: 24 Carat Gold

  • ఊహకందని రీతిలో భారీగా తగ్గిన గోల్డ్ రేటు: బంగారం కొనడానికి ఇదే రైట్ టైమ్!

    ఊహకందని రీతిలో భారీగా తగ్గిన గోల్డ్ రేటు: బంగారం కొనడానికి ఇదే రైట్ టైమ్!

    Gold Price Drop India: దాదాపు ఆరు రోజుల నిరంతర పెరుగుదల తరువాత, భారతదేశంలో బంగారం ధరలు ఈరోజు (మే 9) అమాంతం తగ్గుముఖం పట్టాయి. గరిష్టంగా ₹1250 వరకు ధర తగ్గడంతో, దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి రేట్లలో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ కథనంలో వివిధ నగరాల్లో బంగారం మరియు వెండి ధరల తాజా వివరాలను స్పష్టంగా తెలుసుకుందాం.

    ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (Gold Prices Today in Major Cities)

    హైదరాబాద్, విజయవాడ మరియు ఇతర దక్షిణ భారత నగరాలు

    హైదరాబాద్ మరియు విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,150 తగ్గి, ₹90,150 వద్ద స్థిరపడింది. అదేవిధంగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,250 తగ్గి, ₹98,350 వద్ద నిలిచింది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు చాలా వరకు తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇదే విధమైన ధరల సరళి గుంటూరు, ప్రొద్దుటూరు, విజయనగరం వంటి నగరాలతో పాటు చెన్నై, ముంబై, బెంగుళూరులలో కూడా కొనసాగుతోంది.

    ఢిల్లీలో బంగారం ధరలు (Gold Prices in Delhi)

    దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కూడా బంగారం ధరలు ఊహించని రీతిలో తగ్గాయి. ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర ₹1,150 తగ్గి ₹90,300 వద్దకు చేరింది. అలాగే, 24 క్యారెట్ల బంగారం ధర ₹1,250 తగ్గి ₹98,500 వద్ద నిలిచింది. వరుసగా పెరుగుతూ వచ్చిన ధరలు ఈ రోజు తగ్గుముఖం పట్టడం గమనార్హం. ఈ తగ్గుదల కొనసాగుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

    వెండి ధరల పరిస్థితి (Silver Price Status)

    బంగారం ధరలు తగ్గినప్పటికీ, ఈ రోజు (శుక్రవారం, మే 9) వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. సిల్వర్ రేటు స్థిరంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ముంబై, బెంగళూరు మరియు చెన్నైలలో కూడా వెండి రేటులో ఎటువంటి మార్పు లేదు. ఇక్కడ కిలో వెండి ధర ₹1,11,000 వద్ద ఉంది. అయితే, ఢిల్లీలో కిలో వెండి ధర ₹99,000 వద్ద ఉంది, ఇది ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే కొంత తక్కువ అని చెప్పవచ్చు.

    బంగారం ధరల తగ్గుదలకు కారణాలు

    స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్న తరుణంలో బంగారం ధరలు అమాంతం తగ్గడం వినియోగదారులకు శుభవార్త. బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం కొనుగోలుదారుల సంఖ్య తక్కువగా ఉండటమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే, గోల్డ్ రేటు మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా.

    బంగారం కొనుగోలుకు ఇదే సరైన సమయమా? (Is this the right time to buy gold?)

    ప్రస్తుత ధరల తగ్గుదల నేపథ్యంలో, బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి అవకాశమని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, భవిష్యత్తులో భారత్ మరియు పాక్ మధ్య ఉద్రిక్తతలు (యుద్ధం) ముగిసిన తరువాత బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని అంచనాలున్నాయి. కాబట్టి, కొనుగోలుదారులు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిదని సలహా.

  • ఒక్కరోజే అమాంతం పెరిగిన గోల్డ్ రేటు.. నేటి కొత్త ధరలు ఇవే..

    ఒక్కరోజే అమాంతం పెరిగిన గోల్డ్ రేటు.. నేటి కొత్త ధరలు ఇవే..

    Gold and Siler Price Today: ఇంతకాలం తగ్గుతుంది, తగ్గిపోతుందనుకుంటున్న బంగారం ధరలు ఒక్కసారిగా షాకిచ్చాయి. ఒకేరోజు (2025 మే 6) అమాంతం పెరిగి.. పసిడి ప్రియులను సైతం కంగుతినేలా చేసింది. రూ. 90,000 కంటే తక్కువలో ఉన్న 22 క్యారెట్ల బంగారం.. ఇప్పుడు ఆ మార్కును దాటేసింది. 24 క్యారెట్ల గోల్డ్ లక్ష రూపాయలకు చేరువయ్యేందుకు పరుగులు పెడుతోంది. ఈ కథనంలో దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే విషయం తెలుసుకుందాం.

    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు (2025 మే 6)

    తెలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ) నిన్నటి నుంచి ధరల పెరుగుదల మొదలైంది. ఈ రోజు వరుసగా 22 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం రూ. 2,500 పెరిగి రూ. 90,250 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం రూ. 2,730 పెరిగి రూ. 98,460 వద్ద ఉంది. ఇదే ధరలు ప్రొద్దుటూరు, కడప వంటి ప్రాంతాల్లో మాత్రమే కాకుండా.. ముంబై, బెంగళూరు నగరాల్లో కూడా కొనసాగుతాయి.

    చెన్నైలో పసిడి ధరల వివరాలు

    చెన్నైలో ధరలు విషయానికి వస్తే.. ఇక్కడ కూడా ధరలు తెలుగు రాష్టాల్లో మాదిరిగానే ఉంటాయి. ఈ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రామ్స్ గోల్డ్ రేటు రూ. 2,500 పెరిగి రూ. 90,250 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం ధర రూ. 2,730 పెరిగి రూ. 98,460 వద్ద నిలిచింది. నిన్నటి ధరలో పోలిస్తే ఈ రోజు ధరలు భారీగా పెరిగిందని స్పష్టమవుతోంది.

    దేశ రాజధాని ఢిల్లీలో బంగారం రేట్లు

    దేశరాజధానిలో కూడా గోల్డ్ రేటు ఎగిసిపడింది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం రేటు రూ. 2,500 పెరిగింది. దీంతో ధర రూ. 90,400లకు చేరింది. అదే సమయంలో 24 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే.. దీని ధర రూ. 2,730 పెరిగింది. కాబట్టి 10 గ్రామ్స్ 24 క్యారెట్ పసిడి ధర రూ. 98,610లకు చేరింది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో బంగారం ధరలు కొంత ఎక్కువే అన్న విషయం స్పష్టంగా అవగతం అవుతోంది.

    వెండి ధరలు: బంగారం బాటలో కాకుండా తగ్గుముఖం

    బంగారం ధరలు భారీగా పెరిగినప్పటికీ.. వెండి ధరలు మాత్రం తగ్గుతూనే ఉంది. ఈ రోజు (2025 మే 6) కేజీ వెండి ధర హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో రూ. 1,07,900 వద్ద ఉంది. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 96,900 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే వెండి ధరలు దేశ వ్యాప్తంగా కేజీ మీద రూ. 1,000 తగ్గినట్లు తెలుస్తోంది.

    నిపుణుల అంచనాలు తారుమారు: బంగారం లక్షకు చేరువలో?

    అమెరికా టారిఫ్ భయాలు పూర్తిగా తొలగిపోయాయి. కాబట్టి బంగారం ధరలు తగ్గుముఖం పడతాయాని పలువురు ప్రముఖులు అంచనా వేశారు. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.. వారి అంచనాలు మొత్తం తారుమారు అయ్యాయని స్పష్టంగా తెలుస్తోంది. కొందరు ప్రముఖులు మాత్రం బంగారం ఇప్పుడే కోనేయండి అని కూడా ప్రస్తావించారు. ఎవరు ఎన్ని చెప్పినా ధరలు మాత్రం ఊరిస్తూ.. ఓ సారి తగ్గతూ, మరోమారు పెరుగుతూ.. లక్ష రూపాయలకు చేరిపోవడానికి తొందరపడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద త్వరలోనే బంగారం రేటు.. రూ. లక్షకు చేరుతుంది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు అని స్పష్టంగా తెలుస్తోంది.