Category: Business

  • అద్దెకు ఆర్ మాధవన్ అపార్ట్‌మెంట్‌: రెంట్ ఎంతో తెలుసా?

    అద్దెకు ఆర్ మాధవన్ అపార్ట్‌మెంట్‌: రెంట్ ఎంతో తెలుసా?

    R Madhavan Couple Rent Out Flat In Bandra Kurla Complex: ప్రముఖ నటుడు ఆర్ మాధవన్ (R Madhavan) మరియు అతని భార్య సరితా (Saritha) ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతాలలో ఒకటైన బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో తమ విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను అద్దెకు ఇచ్చారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

    అద్దె వివరాలు

    స్క్వేర్ యార్డ్స్ ద్వారా లభించిన ఆస్తి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ప్రకారం.. ఆర్ మాధవన్ దంపతులు బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని లగ్జరీ అపార్ట్‌మెంట్ కోసం నెలకు రూ. 6.50 లక్షలు అద్దెగా వసూలు చేయనున్నారు. దీనికి సంబంధించిన ఒప్పందం 2025 జూన్ 11న నమోదైనట్లు సమాచారం. ఆర్ మాధవన్ దుబాయ్‌కు మకాం మార్చడం వల్లనే.. ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌ను అద్దెకు ఇచ్చారు.

    అపార్ట్‌మెంట్ ప్రత్యేకతలు – లీజు ఒప్పందం

    ఈ అపార్ట్‌మెంట్ సుమారు 4,182 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇది బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని ప్రీమియం రెసిడెన్షియల్ టవర్ అయిన ‘సిగ్నియా పెర్ల్’ (Signia Pearl) లో ఉంది. మాధవన్ దంపతులు ఈ అపార్ట్‌మెంట్‌ను రెండేళ్ల కాలానికి లీజుకు ఇచ్చారు.

    నివేదికల ప్రకారం, ఈ లీజు ఒప్పందం రెండేళ్లపాటు కొనసాగుతుంది. ఇది జూన్ 2025 మొదటివారంలో ప్రారంభమై, 16 నెలల లాక్-ఇన్ వ్యవధిని కలిగి ఉంటుంది. మొదటి ఏడాది నెలవారీ అద్దె రూ. 6.50 లక్షలు కాగా, రెండవ సంవత్సరం అద్దె 5 శాతం పెరిగి రూ. 6.83 లక్షలకు చేరుతుంది. మొత్తం మీద, రెండేళ్లకుగానూ అద్దె సుమారు రూ. 1.60 కోట్లు అవుతుంది.

    లీజు కోసం రూ. 39 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం లావాదేవీలకు గాను రూ. 47,000 స్టాంప్ డ్యూటీ మరియు రూ. 1000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినట్లు సమాచారం.

    నటుడు ఆర్ మాధవన్ గురించి..

    ఆర్ మాధవన్ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సుప్రసిద్ధ నటుడు మరియు చిత్ర నిర్మాత. ఆయన ప్రధానంగా తమిళం మరియు హిందీ సినిమాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. అంతేకాకుండా, తెలుగు, కన్నడ, మలయాళం మరియు ఇంగ్లీష్ సినిమాల్లో కూడా నటించి మెప్పించారు. ‘మిన్నలే’, ‘కన్నతిల్ ముత్తమిట్టల్’, ‘అన్బే శివమ్’, ‘ఆయత ఎజుతు’ వంటి తమిళ చిత్రాలు; ‘రంగ్ దే బసంతి’, ‘గురు’, ‘3 ఇడియట్స్’ వంటి హిందీ సినిమాలు ఆయన కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచాయి.

    బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) గురించి

    బీకేసీ (BKC) లేదా బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ముంబైలోని ప్రముఖ వాణిజ్య కేంద్రాలలో ఒకటి. ఇది సుమారు 500 కంపెనీలకు ప్రధాన కార్యాలయంగా ఉంది. భారతదేశంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాలలో బీకేసీ కూడా ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ జియో, యాపిల్, నెట్‌ఫ్లిక్స్, ఫేస్‌బుక్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, వీవర్క్, సిస్కో, ఫైజర్, స్పాటిఫై మరియు బ్లాక్‌స్టోన్ వంటి దిగ్గజ కంపెనీల కార్యాలయాలు ఉన్నాయి. జీఎస్టీ (GST), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ఆదాయ పన్ను శాఖ వంటి ప్రభుత్వ సంస్థలు కూడా ఇక్కడ ఉన్నాయి.

    బీకేసీ కనెక్టివిటీ

    బాంద్రా కుర్లా కాంప్లెక్స్, ముంబై ఆర్థిక రాజధాని యొక్క పశ్చిమ మరియు తూర్పు భాగాల మధ్యలో ఉంది. ఇది వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే, బాంద్రా వర్లీ సీ లింక్, అంతర్జాతీయ విమానాశ్రయం, ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే మరియు ఈస్టర్న్ ఫ్రీవే వంటి అనేక ప్రధాన రహదారులతో అద్భుతమైన కనెక్టివిటీని కలిగి ఉంది.

  • 6 లక్షలమంది కొన్న ఎలక్ట్రిక్ స్కూటర్: అమ్మకాల్లో సరికొత్త రికార్డ్!

    6 లక్షలమంది కొన్న ఎలక్ట్రిక్ స్కూటర్: అమ్మకాల్లో సరికొత్త రికార్డ్!

    TVS iQube Sales: టీవీఎస్ మోటార్ కంపెనీ లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ఐక్యూబ్‘ (TVS iQube) అమ్మకాల్లో అరుదైన ఘనత సాధించింది. సంస్థ ఈ స్కూటర్‌ను లాంచ్ చేసినప్పటి నుంచి దేశీయ విఫణిలో 6 లక్షల మందికి పైగా విక్రయించింది, ఇది భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో దానికున్న ఆదరణకు నిదర్శనం.

    టీవీఎస్ ఐక్యూబ్ సేల్స్

    ఎస్ఐఏఎమ్ (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరింగ్ అండ్ సర్వీస్ ఇంటిగ్రేషన్ అండ్ మేనేజ్‌మెంట్) డేటా ప్రకారం, టీవీఎస్ ఐక్యూబ్ ప్రయాణం ఇలా సాగింది:

    • తొలి లక్ష యూనిట్ల అమ్మకాలకు సుమారు మూడేళ్ళ సమయం పట్టింది.
    • ఆ తదుపరి లక్ష యూనిట్లకు కేవలం 10 నెలల సమయం మాత్రమే అవసరమైంది.
    • మే 2024 ప్రారంభం నాటికి, కంపెనీ మొత్తం 3,00,000 లక్షల యూనిట్ల అమ్మకాలు జరిపింది.
    • ఆ తరువాత మరో మూడు లక్షల యూనిట్లు కేవలం 12 నెలల్లోనే అమ్ముడయ్యాయి.

    మొత్తం మీద, సంస్థ ఇప్పటివరకు 6,26,297 యూనిట్ల ఐక్యూబ్ స్కూటర్లను విజయవంతంగా విక్రయించింది.

    టీవీఎస్ ఐక్యూబ్ సేల్స్ పెరగడానికి కారణాలు

    భారత మార్కెట్లో టీవీఎస్ మోటార్ కంపెనీ యొక్క ఐక్యూబ్ సేల్స్ దానికున్న విపరీతమైన డిమాండును స్పష్టంగా తెలియజేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణాలు:

    • చూడగానే ఆకట్టుకునే ఆకర్షణీయమైన డిజైన్.
    • ఆధునిక వినియోగదారుల అవసరాలకు తగిన లేటెస్ట్ ఫీచర్స్.
    • విశ్వసనీయమైన మరియు మంచి పనితీరు.

    ఈ అంశాల వల్లే ఎక్కువమంది కొనుగోలుదారులు టీవీఎస్ ఐక్యూబ్‌ను ఎంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు, ఫలితంగా సేల్స్ గణనీయంగా పెరిగాయి.

    ఐక్యూబ్: ఫీచర్స్ & ప్రత్యర్థులు

    2020 జనవరిలో మార్కెట్లోకి వచ్చిన టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్, భారత మార్కెట్ కోసం టీవీఎస్ లాంచ్ చేసిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది అనేక ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తుంది:

    • ఫుల్ ఎల్ఈడీ లైటింగ్
    • కనెక్టెడ్ టెక్నాలజీ
    • విశాలమైన సీటు
    • మంచి స్టోరేజ్ కెపాసిటీ

    ఈ స్కూటర్ మార్కెట్లో బజాజ్ చేతక్, ఓలా ఎస్1 మరియు ఏథర్ రిజ్టా వంటి ప్రముఖ మోడళ్లకు గట్టి పోటీనిస్తోంది.

    ఏకంగా 18,13,103 యూనిట్ల సేల్స్

    2025 ఆర్ధిక సంవత్సరంలో టీవీఎస్ కంపెనీ మంచి లాభాలను ఆర్జించింది. చెన్నైకి చెందిన ఈ ద్విచక్ర వాహన తయారీ సంస్థ, పెట్రోల్ ఇంజిన్ కలిగిన జుపీటర్, ఎన్‌టార్క్, జెస్ట్ మరియు ఎలక్ట్రిక్ ఐక్యూబ్‌లతో సహా ఏకంగా 18,13,103 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. కాగా, ఐక్యూబ్ సేల్స్ 6,00,000 యూనిట్ల మార్కును చేరడానికి 65 నెలల సమయం పట్టింది.

    2026 ఆర్ధిక సంవత్సరంలో కూడా ఐక్యూబ్ అమ్మకాలు శుభారంభం చేశాయి. జూన్ 1 నుంచి 14వ తేదీ మధ్య కాలంలో కంపెనీ 11,841 యూనిట్లను విక్రయించింది. ఈ కాలంలో భారతదేశంలో అమ్ముడైన మొత్తం 43,917 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో ఐక్యూబ్ వాటా 27 శాతం కావడం విశేషం. ఇది ఐక్యూబ్ భవిష్యత్తుపై సానుకూల దృక్పథాన్ని సూచిస్తుంది.

    2025 ఐక్యూబ్

    టీవీఎస్ మోటార్ కంపెనీ ఈ ఏడాది 2025 ఎడిషన్ ఐక్యూబ్ లాంచ్ చేసింది. దీని ధర రూ. లక్ష కంటే తక్కువ. ఈ స్కూటర్ 2.2 కిలోవాట్, 3.5 కిలోవాట్ మరియు 5.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్స్ పొందుతాయి. ఈ స్కూటర్ గరిష్టంగా 212 కిమీ రేంజ్ అందిస్తుంది.

  • రేటు తగ్గినా.. రూ.లక్షకు తగ్గని బంగారం: నేటి కొత్త ధరలివే!

    రేటు తగ్గినా.. రూ.లక్షకు తగ్గని బంగారం: నేటి కొత్త ధరలివే!

    Today Gold and Silver Price: ఇతర దేశాలతో పోలిస్తే, భారతదేశంలో పసిడి ప్రేమికులు ఎక్కువే. చాలామంది బంగారాన్ని కేవలం ఒక ముడిపదార్థంగా పరిగణిస్తే, భారతీయులు మాత్రం దానిని పవిత్రంగా భావించి, ఆభరణాలుగా ధరించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ సాంస్కృతిక అనుబంధం కారణంగానే మన దేశంలో బంగారు ఆభరణాలు లేదా బంగారం ధరలు తరచుగా పెరుగుతూ ఉంటాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు, నిన్న (ఆదివారం) స్థిరంగా ఉండి, నేడు (జూన్ 16) స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.

    తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు (జూన్ 16)

    ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధరలు కొంతమేర తగ్గాయి. ఈ రోజు (జూన్ 16) నాటి ధరల వివరాలు:

    • 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ. 150 తగ్గి, రూ. 93,050 వద్ద స్థిరపడింది.
    • 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ. 170 తగ్గి, రూ. 1,01,510 వద్ద నిలిచింది. ఇదే విధమైన ధరల సరళి బెంగళూరు, చెన్నై మరియు ముంబై వంటి ప్రధాన నగరాల్లో కూడా కొనసాగుతోంది.

    ఢిల్లీలో పసిడి ధరల తాజా పరిస్థితి

    దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి:

    • 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ. 150 తగ్గి, రూ. 93,200 వద్ద ఆగింది.
    • 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ. 170 తగ్గి, రూ. 1,01,660 వద్ద నిలిచింది. నిన్నటి వరకు స్థిరంగా ఉన్న పసిడి ధరలు, నేడు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి.

    వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

    గత కొన్ని రోజులుగా బంగారం ధరల మాదిరిగానే వెండి ధరలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. రాబోయే రోజుల్లో వెండి ధరలు కూడా ఊహకందని రీతిలో అమాంతం పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కిలో వెండి ధర లక్ష రూపాయలు దాటింది.

    ప్రధాన నగరాల్లో వెండి ధర

    హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ముంబై మరియు బెంగుళూరులలో.. వెండి రేటు 100 రూపాయలు మాత్రమే తగ్గింది. దీంతో ఇక్కడ కేజీ సిల్వర్ రేటు రూ. 1,19,900 వద్ద నిలిచింది.

    ఢిల్లీలో వెండి ధర

    దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. వెండి రేటు ఢిల్లీలో కొంత తక్కువగా ఉంది. ఇక్కడ కేజీ వెండి రేటు రూ. 1,09,900 దగ్గర ఉంది. దీన్ని బట్టి చూస్తే ఢిల్లీలో వెండి రేటు ఎంత తగ్గువగా ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

    బంగారం ధరల పెరుగుదలకు గల కారణాలు

    బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలు దోహదం చేస్తాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి:

    • భౌగోళిక మరియు రాజకీయ అనిశ్చితులు: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ, ఆర్థిక అస్థిరతలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి.
    • డిమాండ్ మరియు సరఫరా: మార్కెట్లో డిమాండ్‌కు తగినంత బంగారం అందుబాటులో లేకపోవడం ధరల పెరుగుదలకు దారితీస్తుంది. కొనుగోలుదారుల సంఖ్య ఎక్కువగా ఉండి, లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ధరలు సహజంగానే పెరుగుతాయి.
    • పెట్టుబడిగా బంగారం: చాలా మంది పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన ఆస్తిగా భావిస్తారు. మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పుడు, వారు బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతారు, ఇది కూడా ధరల పెరుగుదలకు ఒక ప్రధాన కారణం.
  • యాపిల్‌ను తాకిన ట్రంప్ టారిఫ్స్: ఆ ఐఫోన్లపై 25 శాతం సుంకం

    యాపిల్‌ను తాకిన ట్రంప్ టారిఫ్స్: ఆ ఐఫోన్లపై 25 శాతం సుంకం

    Trump 25 Percent Tariff On Apple: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రపంచ దేశాలపై అధిక సుంకాలను విధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సుంకాల కారణంగానే స్టాక్ మార్కెట్లు సైతం కుప్పకూలిపోయాయి. చైనా మాత్రం వెనక్కి తగ్గేదేలే అన్నట్లు అమెరికాపై విరుచుకుపడి సుంకాలను అమాంతం పెంచుకుంటూ పోయింది. అమెరికా కూడా చైనాకు బుద్ధిచెప్పాలనే క్రమంలో సుంకాలను అంతకంతకూ పెంచుకుంటూ పోయింది. అయితే ఈ మధ్యకాలంలో ఈ రెండు దేశాలు సుంకాలను దాదాపు తగ్గించుకున్నాయి. కానీ ట్రంప్ సుంకాల ప్రభావం ఇప్పుడు యాపిల్ కంపెనీ మీద పడింది.

    అమెరికా బయట తయారీ చేస్తే 25% సుంకం

    యాపిల్ కంపెనీ అమెరికాలో తన ఉత్పత్తులను తయారు చేయనియెడల భారీ సుంకాలు చెల్లించాల్సి ఉంటుందని శుక్రవారం డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. భారతదేశంలోనో లేదా ఇతర దేశాల్లోనూ యాపిల్ తమ ఉత్పత్తులను తయారు చేసి అమెరికాకు దిగుమతి చేసుకుంటే 25 శాతం సుంకాలను విధించాల్సి ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు.

    ఐఫోన్ ధరలపై సుంకాల ప్రభావం

    ప్రస్తుతం అమెరికాలో యాపిల్ ఐఫోన్ విలువ 1200 డాలర్ల (రూ.1.02 లక్షలు) వరకు ఉంది. 25 శాతం సుంకాలను విధిస్తే వీటి ధరలు 1500 డాలర్ల నుంచి 2000 డాలర్లకు చేరే అవకాశం ఉంటుంది.

    భారత్‌లో యాపిల్ ప్రణాళికలకు అడ్డంకి?

    డొనాల్డ్ ట్రంప్ చైనాపై అధిక సుంకాలను విధించిన తరువాత యాపిల్ కంపెనీ భారతదేశంలో తమ ఉత్పత్తులను గణనీయంగా పెంచాలని సంకల్పించింది. అయితే దీనికి ఇప్పుడు ట్రంప్ సుంకాలు అడ్డుపడుతున్నాయి. కాబట్టి యాపిల్ కంపెనీ సుంకాల కారణంగా అమెరికాలోనే ఉత్పత్తులను పెంచుతుందా?, సుంకాలను పక్కన పెట్టి భారతదేశంలోనే ఉత్పత్తులను పెంచుతుందా?, అనే విషయం తెలియాల్సి ఉంది.

    “మేడ్ ఇన్ అమెరికా”కు ప్రాధాన్యత..

    యాపిల్ కంపెనీ ప్రస్తుతం అమెరికాలో ఐమ్యాక్, ఐప్యాడ్, ఎయిర్‌పాడ్, యాపిల్ వాచ్ వంటి వాటిని ఉత్పత్తి చేస్తోంది. వీటన్నిటికీ కంపెనీ ప్రత్యేకంగా సుంకాలను చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ “మేడ్ ఇన్ అమెరికా” ఉత్పత్తులు. అదే అమెరికా వెలుపల యాపిల్ తన ఉత్పత్తులను ఉత్పత్తి చేసి దిగుమతి చేసుకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ స్పష్టంగా వెల్లడించారు. అమెరికాలోనే దాదాపు అన్ని కంపెనీలు తమదేశంలోనే ఉత్పత్తులను పెంచాలని, కావాలంటే కొత్త ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేసుకోవాలని ట్రంప్ చెబుతున్నారు. ఈ కారణంగానే ఇప్పుడు యాపిల్ వేరే దేశాలకు తరలి వెళ్లకుండా ఉండటానికే 25 శాతం సుంకాలను చెల్లించాల్సి ఉంటుందని అన్నారు.

    ప్రపంచ మార్కెట్‌లో యాపిల్ హవా

    ప్రపంచ మార్కెట్లో యాపిల్ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ప్రతి ఏటా కొత్త ఉత్పత్తులను పరిచయం చేయడం లేదా ఉన్న ఉత్పత్తులనే గణనీయంగా పెంచడం వంటివి చేస్తోంది. దీంతో యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది.

    ఐఫోన్ ప్రత్యేకత: స్టేటస్ మరియు భద్రత

    ఐఫోన్ అంటే కేవలం స్టేటస్ మాత్రమే కాదు, సెక్యూర్ అని భావించే చాలామంది నేడు ఐఫోన్స్ ఉపయోగిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య భారీగా పెరుగుతుందని స్పష్టంగా తెలుస్తోంది.

  • రూ.10 లక్షలుంటే చాలు!.. ఇందులో ఓ కారు కొనేయొచ్చు

    రూ.10 లక్షలుంటే చాలు!.. ఇందులో ఓ కారు కొనేయొచ్చు

    Cars under Rs. 10 Lakhs: ఇండియన్ మార్కెట్లో లెక్కకు మించిన కార్లు అందుబాటులో ఉన్నాయి. సొంతంగా ఓ కారు కొనుగోలు చేయాలనేది చాలా మంది కల. అయితే, మన బడ్జెట్‌కు సరిపోయే, మంచి ఫీచర్లున్న కారును ఎంచుకోవడం కొంచెం కష్టమైన పనే. ఈ కథనంలో, రూ.10 లక్షల కంటే తక్కువ ధరలో లభించే కొన్ని బెస్ట్ కార్ మోడల్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

    రూ.10 లక్షలలోపు బెస్ట్ కార్లు..

    రూ.10 లక్షల కంటే తక్కువ ధరలో.. కారు కొనాలనుకునే వారి కోసం ఇక్కడ బెస్ట్ మోడల్స్ ఉన్నాయి..

    1. టాటా నెక్సాన్ (Tata Nexon)

    దేశీయ వాహన దిగ్గజం టాటా మోటార్స్ నుంచి వచ్చిన అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ SUV నెక్సాన్. దీని ప్రారంభ ధర సుమారు రూ. 8 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుంది. ఇందులోని పెట్రోల్ మాన్యువల్, పెట్రోల్ ఆటోమాటిక్, డీజిల్ మాన్యువల్ మరియు సిఎన్‌జీ మాన్యువల్ ఆప్షన్స్ కలిగిన సుమారు 9 వేరియంట్స్ ధరలు రూ. 10 లక్షల కంటే తక్కువగానే ఉంటాయి. టాటా నెక్సాన్ యొక్క కొన్ని టాప్-ఎండ్ వేరియంట్ల ధరలు రూ. 10 లక్షల కంటే ఎక్కువగా ఉండవచ్చు. నెక్సాన్ అన్ని వేరియంట్ల డిజైన్ దాదాపు ఒకే విధంగా ఉన్నప్పటికీ, ఫీచర్లు మరియు ఇంజిన్ పర్ఫామెన్స్‌లో కొంత తేడా ఉంటుందని గమనించాలి. ఇది 5-స్టార్ గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్‌తో వస్తుంది.

    2. కియా సోనెట్ (Kia Sonet)

    స్టైలిష్ లుక్ మరియు ప్రీమియం ఫీచర్లతో ఆకట్టుకునే కియా సోనెట్ కూడా ఈ జాబితాలో ప్రముఖంగా నిలుస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 7.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుంది. ఈ మోడల్ యొక్క 7 వేరియంట్లు రూ. 10 లక్షల కంటే తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటాయి. ఇవి 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తాయి. ఇవి మాన్యువల్ మరియు ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో వస్తాయి. దీని ఆధునిక డిజైన్ మరియు ఫీచర్లు యువ కొనుగోలుదారులను విశేషంగా ఆకర్షిస్తాయి.

    3. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO (Mahindra XUV 3XO)

    రూ.10 లక్షల కంటే తక్కువ ధరలో లభించే కార్ల జాబితాలో మహీంద్రా నుంచి వచ్చిన అప్‌డేటెడ్ ఎక్స్‌యూవీ 3XO (గతంలో XUV300) ఒకటి. దీని ప్రారంభ ధర రూ. 7.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కారు 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్‌ను పొందుతుంది. ఇంజిన్ ఆటోమాటిక్ మరియు మాన్యువల్ టార్క్ కన్వర్టర్ ఆప్షన్స్‌తో లభిస్తుంది. సింపుల్ ఇంకా ఆకర్షణీయమైన డిజైన్ కలిగిన ఈ కారు అత్యాధునిక ఫీచర్లతో పాటు ఉత్తమమైన పనితీరును అందిస్తుంది.

    4. హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue)

    రూ. 7.94 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే హ్యుందాయ్ వెన్యూ కూడా రూ.10 లక్షల లోపు బడ్జెట్‌లో ఓ మంచి కారు. ఈ మోడల్ 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్‌ను కలిగి ఉంటుంది. నిజానికి ఇండియన్ మార్కెట్లో అత్యధిక అమ్మకాలు సాధిస్తున్న లేదా ఎక్కువమంది ఇష్టపడి కొనుగోలు చేస్తున్న కాంపాక్ట్ SUVల జాబితాలో వెన్యూ కూడా ఒకటి. ఇది మంచి డిజైన్, ఆధునిక ఫీచర్లు కలిగి, అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.

    5. టయోటా టైసర్ (Toyota Taisor)

    ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా నుంచి వచ్చిన అర్బన్ క్రూయిజర్ టైసర్ కూడా రూ. 10 లక్షల కంటే తక్కువ ధరలో లభించే ఉత్తమ కార్లలో ఒకటి. ఈ కారు ప్రారంభ ధర రూ. 7.74 లక్షలు (ఎక్స్-షోరూమ్). మల్టిపుల్ వేరియంట్లలో లభించే ఈ కారు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ మరియు 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్‌ను పొందుతుంది. ఇంజిన్లు 5-స్పీడ్ మాన్యువల్, AMT మరియు 6-స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్‌తో వస్తాయి. టయోటా బ్రాండ్ నమ్మకం, మంచి మైలేజ్ దీని అదనపు ఆకర్షణలు.

    ఇతర బడ్జెట్-ఫ్రెండ్లీ కార్లు (Other Budget-Friendly Cars)

    పైన చెప్పిన కార్లు మాత్రమే కాకుండా, రూ. 10 లక్షల బడ్జెట్‌లో మరికొన్ని మంచి కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని:

    • మారుతి సుజుకి ఫ్రాంక్స్ (ప్రారంభ ధర రూ. 7.55 లక్షలు)
    • టాటా పంచ్ (ప్రారంభ ధర రూ. 6.13 లక్షలు)
    • రెనాల్ట్ కిగర్ (ప్రారంభ ధర రూ. 6.00 లక్షలు)
    • నిస్సాన్ మాగ్నైట్ (ప్రారంభ ధర రూ. 6.00 లక్షలు)
    • హ్యుందాయ్ ఎక్స్‌టర్ (ప్రారంభ ధర రూ. 6.13 లక్షలు)

    గమనిక: ఇక్కడ పేర్కొన్న ధరలన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమే. ఆన్-రోడ్ ధరలు మీ నగరం మరియు రాష్ట్రం బట్టి మారవచ్చు. ఖచ్చితమైన ధరల వివరాల కోసం మీ సమీప డీలర్‌ను సంప్రదించడం మంచిది.

  • నీతా అంబానీకి టైమ్స్ మ్యాగజైన్ గుర్తింపు: దాతృత్వంలోనూ రికార్డ్!

    నీతా అంబానీకి టైమ్స్ మ్యాగజైన్ గుర్తింపు: దాతృత్వంలోనూ రికార్డ్!

    Nita Ambani in TIME100 Philanthropy List 2025: అంబానీ ఫ్యామిలీ అంటే కేవలం భారతదేశంలో అత్యంత సంపన్న కుటుంబం మాత్రమే కాదు, ఎన్నో సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న కుటుంబం కూడా. ఇటీవల, ప్రతిష్టాత్మక టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన 100 మంది ప్రభావశీలుల జాబితాలో (Time Magazine’s 100 Most Influential People) ముకేశ్ అంబానీ భార్య, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు & చైర్మన్ శ్రీమతి నీతా అంబానీ (Nita Ambani) కూడా స్థానం సంపాదించారు.

    టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన దాతృత్వ నివేదిక ప్రకారం, 2024 సంవత్సరంలో నీతా అంబానీ ఏకంగా 48 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 407 కోట్లు) విరాళంగా అందించారు. ఈ ఘనతతో, భారతదేశంలో అత్యధికంగా దానం చేసిన పారిశ్రామికవేత్తల జాబితాలో ఆమె అగ్రస్థానంలో నిలిచారు. సుమారు 100 బిలియన్ డాలర్ల నికర సంపదతో దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముకేశ్ అంబానీ కేవలం వ్యాపార దిగ్గజమే కాకుండా గొప్ప పరోపకారి అని కూడా నిరూపించుకున్నారు.

    రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా అంబానీ కుటుంబం సేవా కార్యక్రమాలు

    అంబానీ కుటుంబం, రిలయన్స్ ఫౌండేషన్ (Reliance Foundation) ద్వారా అనేక దాతృత్వ కార్యక్రమాలను చురుకుగా చేపడుతోంది. విద్య, ఆరోగ్య సంరక్షణ, గ్రామీణాభివృద్ధి మరియు మహిళా సాధికారత వంటి కీలక రంగాలలో వారి కృషి లక్షలాది మంది జీవితాల్లో సానుకూల మార్పును తీసుకువచ్చింది.

    ముఖ్య సేవా రంగాలు మరియు కార్యక్రమాలు:

    • విద్య మరియు నైపుణ్యాభివృద్ధి: స్కాలర్‌షిప్‌లకు నిధులను సమకూర్చడం, పాఠశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, మరియు మహిళలు కెరీర్ నైపుణ్యాలను బలోపేతం చేసుకోవడంలో సహాయపడటం.
    • గ్రామీణాభివృద్ధి: స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, అధునాతన నీటి సంరక్షణ ప్రాజెక్టులు చేపట్టడం, మరియు గ్రామీణ వర్గాలకు ఆర్థిక సహాయం అందించడం.
    • ఆరోగ్య సంరక్షణ: ఆసుపత్రుల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించడం, ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను విస్తరించడం, మరియు దృష్టిలోపం ఉన్న వ్యక్తులకు సహాయం చేయడం. వీరి దాతృత్వం కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా, గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించింది.

    ముకేశ్ అంబానీ మరియు నీతా అంబానీలు ఈ కార్యక్రమాల ద్వారా సమాజ శ్రేయస్సుకు పాటుపడుతున్నారు.

    క్రీడాభివృద్ధికి ప్రోత్సాహం

    సేవా కార్యక్రమాలతో పాటు, రిలయన్స్ ఫౌండేషన్ క్రీడా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నాయకత్వం వహిస్తోంది. నీతా అంబానీ తన కుమారుడు ఆకాష్ అంబానీతో కలిసి ముంబై ఇండియన్స్ ఐపీఎల్ జట్టుకు సహ యజమానిగా వ్యవహరిస్తూ, మహిళా అథ్లెట్లకు మద్దతు ఇవ్వడంపై ప్రత్యేక దృష్టి సారించారు.

    గుర్తింపు పొందిన ఇతర భారతీయ దాతలు

    టైమ్స్ మ్యాగజైన్ జాబితాలో విప్రో వ్యవస్థాపక చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ (Azim Premji) మరియు జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ (Nikhil Kamath) కూడా స్థానం పొందారు.

    అజీమ్ ప్రేమ్‌జీ సుమారు 25 సంవత్సరాల క్రితం తన ఫౌండేషన్‌ను స్థాపించి, 29 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను తన సంస్థ నుంచి ఫౌండేషన్‌కు బదిలీ చేశారు. పర్యావరణ పరిరక్షణ మరియు విద్య వంటి ప్రాజెక్టుల కోసం భారీ మొత్తంలో విరాళాలు అందించిన నిఖిల్ కామత్, ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించారు.

  • బంగారం కొనడానికి మంచి తరుణం!.. తగ్గిన గోల్డ్ రేటు: నేటి ధరలు ఇలా..

    బంగారం కొనడానికి మంచి తరుణం!.. తగ్గిన గోల్డ్ రేటు: నేటి ధరలు ఇలా..

    Gold and Silver Price: బంగారం ధరలు పడిలేస్తున్న కెరటంలా.. తగ్గుతూ, పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ రోజు (మే 20) పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరలలో మార్పు జరిగింది. తులం గోల్డ్ రేటు సుమారు రూ. 95,000 వద్ద నిలిచాయి. ఈ కథనంలో తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఢిల్లీ, ముంబై మరియు చెన్నై వంటి నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే విషయం తెలుసుకుందాం.

    ఢిల్లీలో బంగారం ధరలు

    దేశ రాజధాని నగరం ఢిల్లీలో బంగారం ధరలు (Gold Price) స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 450 తగ్గి.. రూ. 87,250 వద్ద నిలిచింది, 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 490 తగ్గి.. రూ. 95,170 వద్ద నిలిచింది. నిన్న (సోమవారం) స్వల్పంగా పెరిగిన గోల్డ్ రేటు ఈ రోజు తగ్గుముఖం పట్టడంతో.. బంగారం ధరల్లో మార్పులు జరిగాయి.

    తెలుగు రాష్ట్రాలు & ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

    ఇక తెలుగు రాష్ట్రాల (తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్) విషయానికి వస్తే.. ఇక్కడ కూడా గోల్డ్ రేటు తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 450 తగ్గి.. రూ. 87,100 వద్ద నిలిచింది. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ గోల్డ్ రేటు రూ. 490 తగ్గి.. రూ. 95,020 వద్ద ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా.. ముంబై, చెన్నై మరియు బెంగుళూరులలో కూడా దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

    వెండి ధరలు (Silver Price)

    గోల్డ్ రేటు మాత్రమే కాకుండా.. సిల్వర్ రేటు కూడా తగ్గింది. నేడు (మంగళవారం) వెండి ధరలు గరిష్టంగా రూ. 1,000 తగ్గింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ముంబై మరియు బెంగుళూరులలో కేజీ వెండి రేటు రూ. 1,08,000 వద్ద నిలిచింది. అంటే ఒక గ్రామ్ వెండి ధర 108 రూపాయలన్నమాట. అయితే ఢిల్లీలో మాత్రం కేజీ సిల్వర్ రేటు రూ. 97,000 వద్ద ఉంది. ఇక్కడ కూడా కేజీ ధర రూ. 1,000 తగ్గింది.

    బంగారం ధరల భవిష్యత్తు: నిపుణుల విశ్లేషణ

    అంతర్జాతీయ పరిణామాలు చూస్తుంటే.. బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చైనా మరియు అమెరికా పరస్పర సుంకాలను తగ్గించుకోవడం మాత్రమే కాకుండా.. చెన్నైలో విస్తృతమైన బంగారు నిల్వలు బయటపడుతున్నట్లు తెలుస్తోంది. అధిక మొత్తంలో బంగారం ఉన్నప్పుడు.. కావలసినంత సరఫరా ఉంటుంది. సరఫరా పెరిగినప్పుడు.. ధరలు తప్పకుండా తగ్గుతాయి. భారతదేశంలో లక్ష రూపాయలు దాటేసిన బంగారం ధరలు.. ఇప్పుడిప్పుడే తగ్గుతూ వస్తున్నాయి. ఇది పసిడి ప్రియులకు ఓ మంచి శుభవార్త అనే చెప్పాలి. బహుశా ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉంది.

    ఇదిలా ఉండగా.. కొంతమంది పరిశోధకులు సంవత్సరాలుగా కష్టపడి పరిశోధనలు చేస్తూ.. సీసం నుంచి బంగారం తయారు చేసే విధానం కనిపెట్టారని చెబుతున్నారు. ఇది పూర్తిగా విజయవంతం అయితే.. బంగారం బఠానీల్లా దొరుకుతుందని పరిశోధకులు అంటున్నారు. అయితే దీనికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

  • పసిడి ప్రియులకు శుభవార్త! రూ.2130 తగ్గిన గోల్డ్ రేటు: ఈ రోజు ధరలు ఇవే

    పసిడి ప్రియులకు శుభవార్త! రూ.2130 తగ్గిన గోల్డ్ రేటు: ఈ రోజు ధరలు ఇవే

    Gold and Silver Price Today: భారతదేశంలో బంగారం ధరలు రోజురోజుకి క్రమంగా తగ్గుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలో భారీగా పెరిగిన పసిడి ధరలు, ఆ తరువాత ఒడిదుడుకులకు లోనవుతూ, గత రెండు రోజులుగా ఊహించని రీతిలో తగ్గాయి. ఈ రోజు (మే 15) బంగారం ధర గరిష్టంగా 2130 రూపాయల వరకు తగ్గింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు, అలాగే వెండి ధరల వివరాలను స్పష్టంగా తెలుసుకుందాం.

    హైదరాబాద్, చెన్నై, ముంబై, బెంగళూరులలో నేటి బంగారం ధరలు

    లక్ష రూపాయల మార్కును దాటిన బంగారం ధర, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలతో పాటు చెన్నై, ముంబై, మరియు బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో కూడా వరుసగా రెండో రోజు పతనమైంది. ఈ నగరాల్లో నేటి బంగారం ధరల వివరాలు:

    • 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర: రూ. 1950 తగ్గి, రూ. 86,100 వద్ద స్థిరపడింది.
    • 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర: రూ. 2130 తగ్గి, రూ. 93,930 వద్ద ఉంది.

    నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు గణనీయంగా తగ్గినట్లు స్పష్టమవుతోంది.

    ఢిల్లీలో బంగారం ధరల పరిస్థితి

    దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే, ఢిల్లీలో బంగారం ధరలు సాధారణంగా కొంత ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ, దేశ రాజధాని నగరంలో కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి:

    • 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర: రూ. 1950 తగ్గి, రూ. 86,250 వద్ద ఉంది.
    • 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర: రూ. 2130 తగ్గి, రూ. 94,080 వద్ద నిలిచింది.

    నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధర, ఈరోజు మరింత క్షీణించింది.

    వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

    బంగారం ధరల బాటలోనే వెండి ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. నిన్న కిలో వెండి ధర రూ. 1,09,000 ఉండగా, ఈరోజు రూ. 1000 తగ్గి, రూ. 1,08,000 వద్దకు చేరింది. ఈ ధరలు తెలుగు రాష్ట్రాలతో పాటు, ముంబై, చెన్నై, మరియు బెంగళూరు వంటి నగరాలకు వర్తిస్తాయి. అయితే, ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 900 తగ్గింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ. 97,000 వద్దకు చేరింది.

    బంగారం ధరల తగ్గుదలకు కారణాలు మరియు కొనుగోలు దారులకు సూచనలు

    అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడుతున్న మార్పుల కారణంగానే బంగారం ధరలు భారీగా తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఈ ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు సైతం చెబుతున్నారు. అమెరికా – చైనా దేశాలు ప్రతీకార సుంకాలను తగ్గించుకోవడం కూడా బంగారం ధరలు తగ్గడానికి ఒక కారణమని తెలుస్తోంది. 90 రోజుల వరకు కొత్త సుంకాలు ఆ రెండు దెసలలో అమలులో ఉంటాయి. కాబట్టి గోల్డ్ రేటు కొంతవరకు తగ్గుముఖం పట్టిందనిపిస్తోంది. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. బంగారం ధరలు తగ్గినప్పుడే పసిడి ప్రియులు కొనుగోలు చేయడం ఉత్తమం. కాబట్టి ధరలు తగ్గుతున్నప్పుడు.. బంగారం కొనాలనే ఆలోచన ఉన్నవారు వెంటనే కొనుగోలు చేసుకోవడం ఉత్తమం.

  • బంగారం కొనడానికి ఇదే మంచి సమయం!.. అమాంతం తగ్గుతున్న ధరలు

    బంగారం కొనడానికి ఇదే మంచి సమయం!.. అమాంతం తగ్గుతున్న ధరలు

    Gold and Silver Price: బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయా, ఎప్పుడు కొనుగోలు చేద్దామా అని ఎదురుచూసే వారికి ఇది నిజంగా శుభవార్త. పసిడి ధరలు (Gold Prices) మే 14వ తేదీన మరోసారి తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. నిన్న కొంత పెరిగిన ధరలు, ఈరోజు స్వల్పంగా తగ్గడం గమనార్హం. ఈ కథనంలో, తెలుగు రాష్ట్రాలు మరియు దేశ రాజధాని ఢిల్లీలో బంగారం, వెండి ధరల తాజా వివరాలు (Gold and Silver Price Today) వివరంగా తెలుసుకుందాం.

    హైదరాబాద్, విజయవాడలో నేటి బంగారం ధరలు

    తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ మరియు విజయవాడలలో బంగారం ధరలు ఈరోజు (మే 14) ఇలా ఉన్నాయి:

    • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర: రూ. 500 తగ్గి, రూ. 88,050 వద్ద స్థిరపడింది.
    • 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర: రూ. 540 తగ్గి, రూ. 96,060 వద్ద నిలిచింది.

    ఇదే విధమైన ధరల తగ్గుదల గుంటూరు, ప్రొద్దుటూరు, విజయనగరం వంటి నగరాలతో పాటు దేశంలోని ఇతర ముఖ్య నగరాలైన ముంబై, బెంగళూరు, చెన్నైలలో కూడా కొనసాగుతోంది.

    దేశ రాజధాని ఢిల్లీలో పసిడి పతనం (Gold Rate in Delhi)

    దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు ఈ రోజు (బుధవారం, మే 14) తగ్గాయి. ఇక్కడ తాజా రేట్లు క్రింది విధంగా ఉన్నాయి:

    • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర: రూ. 500 తగ్గి, రూ. 88,200 వద్ద ఉంది.
    • 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర: రూ. 540 తగ్గి, రూ. 96,210 వద్ద కొనసాగుతోంది.

    వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? (Silver Price Update)

    బంగారంతో పాటు వెండి ధరలు కూడా వినియోగదారులకు ముఖ్యమైనవే. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి:

    ప్రధాన నగరాల్లో కేజీ వెండి ధర

    తెలుగు రాష్ట్రాల్లో (హైదరాబాద్, విజయవాడ), అలాగే ముంబై, చెన్నై మరియు బెంగళూరులో కేజీ వెండి ధర రూ. 1,09,000 వద్ద స్థిరంగా ఉంది.

    ఢిల్లీలో కేజీ వెండి ధర

    అయితే, దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం కేజీ వెండి ధర రూ. 97,900 వద్ద ఉంది. దీనిని బట్టి చూస్తే, ఢిల్లీలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే స్వల్పంగా ఎక్కువగా ఉన్నప్పటికీ, వెండి ధరలు మాత్రం కొంత తక్కువగానే ఉన్నాయని స్పష్టమవుతోంది.

    బంగారం ధరలు తగ్గడానికి కారణం ఏమిటి?

    దేశంలో బంగారం ధరలు తగ్గడానికి అంతర్జాతీయ పరిణామాలు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా, అమెరికా మరియు చైనా మధ్య కుదిరిన వాణిజ్య సుంకాల ఒప్పందం (Tariff Deal) ఈ తగ్గుదలకు దోహదపడినట్లు తెలుస్తోంది.

    అమెరికా-చైనా టారిఫ్ డీల్ వివరాలు:

    • ప్రారంభంలో, అమెరికా ఉత్పత్తులపై చైనా 125 శాతం వరకు సుంకాలను విధించింది.
    • దీనికి ప్రతిగా, చైనా ఉత్పత్తులపై అమెరికా ఏకంగా 145 శాతం వరకు సుంకాలను విధించింది.
    • ఇటీవల ఇరు దేశాల మధ్య కుదిరిన ఒక ఒప్పందం ప్రకారం, ప్రతీకార సుంకాలను 115 శాతం మేర తగ్గించుకున్నాయి.
    • అంటే, ఇప్పుడు చైనా అమెరికాపై విధించే సుంకం 10 శాతానికి (125% – 115%) తగ్గింది.
    • అదేవిధంగా, అమెరికా కూడా చైనాపై విధించే సుంకం 30 శాతానికి (145% – 115%) చేరింది.

    అమెరికా మరియు చైనా కుదుర్చుకున్న ఈ కొత్త సుంకాలు 90 రోజుల పాటు అమలులో ఉంటాయి. ఈ రెండు అగ్రదేశాల మధ్య కుదిరిన ఒప్పందం కారణంగా స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి, ఇది బంగారం వంటి సురక్షిత పెట్టుబడులపై ఒత్తిడి తగ్గించి, ధరలు తగ్గుముఖం పట్టడానికి దారితీసిందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని కూడా వారు అంచనా వేస్తున్నారు.

  • ఏప్రిల్ 2025లో ఎక్కువమంది కొన్న టాప్ 10 కార్లు: జాబితా ఇదే..

    ఏప్రిల్ 2025లో ఎక్కువమంది కొన్న టాప్ 10 కార్లు: జాబితా ఇదే..

    Top Selling Cars India April 2025: సొంతంగా కారును కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో చాలామంది కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఇండియన్ మార్కెట్లో కార్ సేల్స్ మంచిగా జరుగుతున్నాయి. ఈ తరుణంలో 2025 ఏప్రిల్ నెలలో దేశీయ విఫణిలో ఎక్కువమంది ఈ కారును కొనుగోలు చేశారు. టాప్ 10 జాబితాలో నిలిచిన కార్లు ఏవి అనే వివరాలు వెల్లడయ్యాయి. ఆ విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

    ఏప్రిల్ 2025 కార్ సేల్స్: హ్యుందాయ్ క్రెటా అగ్రస్థానం

    నివేదికల ప్రకారం, 2025 ఏప్రిల్ నెలలో అత్యధికంగా అమ్ముడైన కారుగా హ్యుందాయ్ క్రెటా రికార్డు సృష్టించింది. ఈ కారు గత నెలలో ఏకంగా 17,016 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి, సేల్స్ చార్టులో అగ్రస్థానంలో నిలిచింది. 2024 ఏప్రిల్ నెల అమ్మకాలతో పోలిస్తే, క్రెటా అమ్మకాలు 10.2 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం.

    మారుతి సుజుకి ఆధిపత్యం: టాప్ 10లో 7 స్థానాలు కైవసం

    టాప్ 10 కార్ల జాబితాలో మారుతి సుజుకి కంపెనీకి చెందిన కార్లు ఏకంగా 7 స్థానాలను కైవసం చేసుకున్నాయి. దీనిని బట్టి ప్రతి 10 మంది కార్ల కొనుగోలుదారులలో 7 మంది మారుతి సుజుకి కార్లనే ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇది మారుతి సుజుకి బ్రాండ్‌పై ప్రజలకు ఉన్న అపారమైన నమ్మకాన్ని, డిమాండ్‌ను సూచిస్తుంది. గత నెలలో మారుతి డిజైర్, బ్రెజ్జా, ఎర్టిగా, స్విఫ్ట్, ఫ్రాంక్స్, వ్యాగన్ ఆర్, బాలెనొ వంటి మోడళ్లు గణనీయమైన అమ్మకాలను నమోదు చేశాయి.

    ఏప్రిల్ 2025: టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు మరియు వాటి అమ్మకాలు

    హ్యుందాయ్ క్రెటా తరువాత, మిగిలిన స్థానాల్లో నిలిచిన కార్లు మరియు వాటి అమ్మకాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

    • 2. మారుతి డిజైర్: 16,996 యూనిట్లు
    • 3. మారుతి బ్రెజ్జా: 16,917 యూనిట్లు
    • 4. మారుతి ఎర్టిగా: 15,780 యూనిట్లు
    • 5. మహీంద్రా స్కార్పియో: 15,534 యూనిట్లు
    • 6. టాటా నెక్సాన్: 15,457 యూనిట్లు
    • 7. మారుతి స్విఫ్ట్: 14,592 యూనిట్లు
    • 8. మారుతి ఫ్రాంక్స్: 14,345 యూనిట్లు
    • 9. మారుతి వ్యాగన్ ఆర్: 13,413 యూనిట్లు
    • 10. మారుతి బాలెనొ: 13,180 యూనిట్లు

    హ్యుందాయ్ క్రెటా: ఎందుకింత ప్రజాదరణ?

    భారతదేశంలో అత్యధికంగా కొనుగోలు చేస్తున్న కార్ల జాబితాలో హ్యుందాయ్ క్రెటా ఒక ప్రధాన మోడల్‌గా నిలుస్తోంది. ఈ కారు మార్కెట్లోకి ప్రవేశించినప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు 12 లక్షల యూనిట్ల అమ్మకాలను సాధించినట్లు సమాచారం. అంటే, 12 లక్షల మందికి పైగా వినియోగదారులు హ్యుందాయ్ క్రెటా కారును ఎంచుకున్నారన్నమాట.

    హ్యుందాయ్ క్రెటా వేరియంట్లు మరియు ధరలు

    వివిధ వేరియంట్లలో లభ్యమవుతున్న హ్యుందాయ్ క్రెటా ప్రారంభ ధర రూ. 11.11 లక్షలు కాగా, టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 20.50 లక్షల (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా) వరకు ఉంది. 54 వేరియంట్లలో లభించే హ్యుందాయ్ క్రెటా ప్రస్తుతం పెట్రోల్, CNG మరియు ఎలక్ట్రిక్ రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి. CNG క్రెటా.. పెట్రోల్ మోడల్ కంటే కూడా కొంత ఎక్కువ మైలేజ్ అందిస్తుంది. ఎలక్ట్రిక్ క్రెటా ఒక ఫుల్ ఛార్జితో 390 కిమీ నుంచి 473 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని ధరలు రూ. 17.99 లక్షల నుంచి రూ. 24.38 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. క్రెటా కారు మంచి డిజైన్ మరియు అత్యాధునిక ఫీచర్స్ కలిగి ఉండటం వల్లనే అధిక అమ్మకాలు పొందుతోందని సమాచారం.