Tag: AP Government Schemes

  • ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాల జోరు: తల్లికి వందనంపై కీలక అప్‌డేట్

    ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాల జోరు: తల్లికి వందనంపై కీలక అప్‌డేట్

    Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తమదైన రీతిలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూనే.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోంది. ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటిన్, మెగా డీఎస్సీ, దీపం – 2 వంటివి ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసింది. కాగా మిగిలిన పథకాలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయనేది ఈ కథనంలో వివరంగా చూద్దాం.

    ప్రజలకు అండగా ప్రభుత్వ హామీలు: ఉచిత బస్సు ప్రయాణం మరియు తల్లికి వందనం

    2025 ఆగష్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు, విద్యార్థుల తల్లులకు అండగా నిలిచే “తల్లికి వందనం” పథకం గురించి కీలక ప్రకటన వెలువడింది. పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి శ్రీ నారా లోకేష్ (Nara Lokesh) స్పష్టం చేశారు.

    తల్లికి వందనం పథకం: పూర్తి వివరాలు

    కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తికానున్న సందర్భంగా, “తల్లికి వందనం” పథకంపై మంత్రి నారా లోకేష్ మరిన్ని వివరాలు వెల్లడించారు. ఈ పథకం కింద, అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ. 15,000 జమ చేయనున్నారు. వేసవి సెలవులు ముగిసిన అనంతరం ఈ ఆర్థిక సహాయం తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని ఆయన తెలిపారు.

    లబ్ధిదారుల సంఖ్య మరియు ప్రభుత్వ కేటాయింపులు

    ఎన్నికల సమయంలో ఇచ్చిన “సూపర్ 6” హామీల అమలుకు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆమోదముద్ర వేశారు. ఇందులో భాగంగా, ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నా, వారందరికీ “తల్లికి వందనం” పథకం వర్తిస్తుంది. ఈ ఏడాది, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 67,27,164 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో మొత్తం రూ. 8,745 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది. ఒకటవ తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థుల నుండి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదివే విద్యార్థుల వరకు ఈ పథకం ప్రయోజనాలు అందుతాయి.

    విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి మరిన్ని పథకాలు

    “తల్లికి వందనం” పథకంతో పాటు, విద్యార్థుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం మరికొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను అమలు చేస్తోంది. వీటిలో “డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం” మరియు “సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర” పథకం ద్వారా యూనిఫామ్, పుస్తకాలు, బూట్లు వంటివి అందించడం జరుగుతుంది. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ పథకాలు తెలియజేస్తున్నాయి.

    తల్లికి వందనం పథకానికి అర్హత మరియు ముఖ్యమైన సూచనలు

    ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే వారు ఈ క్రింది ముఖ్యమైన సూచనలను గమనించాలి:

    • హౌస్ డేటా బేస్: తల్లులు మరియు వారి పిల్లల వివరాలు తప్పనిసరిగా హౌస్ డేటా బేస్‌లో నమోదు అయి ఉండాలి.
    • ఈకేవైసీ (eKYC): హౌస్ హోల్డ్ మొత్తానికి ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసి ఉండాలి.
    • ఆధార్ లింకింగ్: బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్ తప్పనిసరిగా అనుసంధానం చేసి ఉండాలి.
    • NPCI లింకింగ్: బ్యాంకు ఖాతాకు NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) మ్యాపింగ్ కూడా అవసరం.

    గమనిక: పైన తెలిపిన ప్రక్రియలన్నీ ఇప్పటికే పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏదైనా ప్రక్రియ పెండింగ్‌లో ఉంటే, వెంటనే పూర్తి చేసుకోవడం మంచిది. ఈకేవైసీ పూర్తి కాకపోయినా లేదా బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ లేకపోయినా “తల్లికి వందనం” పథకం ప్రయోజనాలు అందకపోవచ్చు. కావున, అర్హులైన లబ్ధిదారులు ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి.

  • మహిళలకు శుభవార్త: ఫ్రీ బస్ సర్వీస్ & తల్లికి వందనం ఎప్పుడంటే?

    మహిళలకు శుభవార్త: ఫ్రీ బస్ సర్వీస్ & తల్లికి వందనం ఎప్పుడంటే?

    Free Bus Service in Andhra Pradesh: ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలను అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం వంటి పథకాల అమలుకు సంబంధించిన విషయాలను కర్నూలులో జరిగిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

    ‘సూపర్ సిక్స్’ హామీలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు

    కర్నూలు వేదికగా జరిగిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు కీలక హామీల అమలుపై స్పష్టత ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని ఆయన పునరుద్ఘాటించారు.

    మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటినుంచి?

    మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి మాట్లాడుతూ.. 2025 ఆగష్టు 15 (స్వాతంత్య్ర దినోత్సవం) నుంచి రాష్ట్రంలోని అందరి మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇది మహిళా సాధికారతకు, వారి ఆర్థిక స్వేచ్ఛకు దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

    తల్లికి వందనం పథకం అమలు

    అంతే కాకుండా.. వేసివి సెలవులు పూర్తయిన తరువాత, అంటే వచ్చే అకడమిక్ ఇయర్ ప్రారంభమయ్యే సమయానికి తల్లికి వందనం పథకం కింద.. ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ డబ్బు వేస్తామని అన్నారు. తల్లుల ప్రోత్సాహంతో విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరాలన్నదే ఈ పథకం లక్ష్యమని తెలిపారు.

    చెత్త రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు

    అక్టోబర్ 2 నాటికి చెత్త రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించాలని చంద్రబాబు పేర్కొన్నారు. జపాన్ వంటి దేశాల్లో రోడ్డుపై చెత్తవేయడాన్ని అవమానంగా భావిస్తారని, ఎక్కడైనా చెత్త కనిపిస్తే.. దాన్ని చెత్తబుట్టలో వేస్తారని ఆయన అన్నారు. ప్రజలందరూ చెత్త రహిత రాష్ట్రం కోసం తమవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇంట్లోని తడి చెత్తను మిద్దె తోటలకు ఉపయోగించుకోవాలని సూచించారు.

    ఇతర ముఖ్య సంక్షేమ పథకాలు మరియు హామీలు

    దీపం 2 పథకం: నేరుగా ఖాతాల్లోకి నగదు

    దీపం 2 కింద ఉచిత సిలిండర్ల పథకంలో భాగంగా నాలుగు నెలలకు ఒకసారి నేరుగా ఖాతాల్లోనే డబ్బు జమ చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇది పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని ఆయన అన్నారు.

    రాయలసీమ అభివృద్ధి – ఉద్యానవన పంటల ప్రోత్సాహం

    రాయల సీమను రతనాల సీమగా మార్చే బాధ్యత మాదని అన్నారు. ఉద్యానవన పంటలను ప్రోత్సహించడానికి కావలసిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. దీని ద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందని, ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.

    పేదలకు ఉచిత విద్యుత్ మరియు సౌర విద్యుత్

    పేదలకు ఉచిత కరెంట్ అందించడంతో పాటు.. సౌర విద్యుత్ ప్లాంట్స్ ఏర్పాటుకు సహాయం చేస్తున్నామని పేర్కొన్నారు. ఇది పర్యావరణ హితమైన ఇంధన వాడకాన్ని ప్రోత్సహిస్తుందని తెలిపారు.

    ఉచిత బస్సు ప్రయాణం – వివరాలు

    ఆగష్టు 15 నుంచి ప్రారంభం కానున్న ఉచిత బస్సు సర్వీస్ ద్వారా.. ప్రభుత్వం రూ. 3182 కోట్ల భారాన్ని భరించాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీ 69 శాతం ఉండగా.. ఉచిత బస్సు సర్వీస్ ప్రారంభమైన తరువాత అది 94 శాతానికి చేరుతుందని భావిస్తున్నాము. ఆర్టీసీలో ప్రస్తుతం 11,216 బస్సులు ఉన్నాయి. ఇందులోని 8193 బస్సులలో మాత్రమే ఈ పథకం అమలు చేయనున్నట్లు సమాచారం. ఉచిత బస్సు ప్రయాణ సమయంలో మహిళా ప్రయాణికులకు జీరో టికెట్ జారీ చేయడం జరుగుతుంది.