Gold and Silver Price: బంగారం ధరలు పడిలేస్తున్న కెరటంలా.. తగ్గుతూ, పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ రోజు (మే 20) పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరలలో మార్పు జరిగింది. తులం గోల్డ్ రేటు సుమారు రూ. 95,000 వద్ద నిలిచాయి. ఈ కథనంలో తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఢిల్లీ, ముంబై మరియు చెన్నై వంటి నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే విషయం తెలుసుకుందాం.
ఢిల్లీలో బంగారం ధరలు
దేశ రాజధాని నగరం ఢిల్లీలో బంగారం ధరలు (Gold Price) స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 450 తగ్గి.. రూ. 87,250 వద్ద నిలిచింది, 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 490 తగ్గి.. రూ. 95,170 వద్ద నిలిచింది. నిన్న (సోమవారం) స్వల్పంగా పెరిగిన గోల్డ్ రేటు ఈ రోజు తగ్గుముఖం పట్టడంతో.. బంగారం ధరల్లో మార్పులు జరిగాయి.
తెలుగు రాష్ట్రాలు & ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
ఇక తెలుగు రాష్ట్రాల (తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్) విషయానికి వస్తే.. ఇక్కడ కూడా గోల్డ్ రేటు తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 450 తగ్గి.. రూ. 87,100 వద్ద నిలిచింది. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ గోల్డ్ రేటు రూ. 490 తగ్గి.. రూ. 95,020 వద్ద ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా.. ముంబై, చెన్నై మరియు బెంగుళూరులలో కూడా దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
వెండి ధరలు (Silver Price)
గోల్డ్ రేటు మాత్రమే కాకుండా.. సిల్వర్ రేటు కూడా తగ్గింది. నేడు (మంగళవారం) వెండి ధరలు గరిష్టంగా రూ. 1,000 తగ్గింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ముంబై మరియు బెంగుళూరులలో కేజీ వెండి రేటు రూ. 1,08,000 వద్ద నిలిచింది. అంటే ఒక గ్రామ్ వెండి ధర 108 రూపాయలన్నమాట. అయితే ఢిల్లీలో మాత్రం కేజీ సిల్వర్ రేటు రూ. 97,000 వద్ద ఉంది. ఇక్కడ కూడా కేజీ ధర రూ. 1,000 తగ్గింది.
బంగారం ధరల భవిష్యత్తు: నిపుణుల విశ్లేషణ
అంతర్జాతీయ పరిణామాలు చూస్తుంటే.. బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చైనా మరియు అమెరికా పరస్పర సుంకాలను తగ్గించుకోవడం మాత్రమే కాకుండా.. చెన్నైలో విస్తృతమైన బంగారు నిల్వలు బయటపడుతున్నట్లు తెలుస్తోంది. అధిక మొత్తంలో బంగారం ఉన్నప్పుడు.. కావలసినంత సరఫరా ఉంటుంది. సరఫరా పెరిగినప్పుడు.. ధరలు తప్పకుండా తగ్గుతాయి. భారతదేశంలో లక్ష రూపాయలు దాటేసిన బంగారం ధరలు.. ఇప్పుడిప్పుడే తగ్గుతూ వస్తున్నాయి. ఇది పసిడి ప్రియులకు ఓ మంచి శుభవార్త అనే చెప్పాలి. బహుశా ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా.. కొంతమంది పరిశోధకులు సంవత్సరాలుగా కష్టపడి పరిశోధనలు చేస్తూ.. సీసం నుంచి బంగారం తయారు చేసే విధానం కనిపెట్టారని చెబుతున్నారు. ఇది పూర్తిగా విజయవంతం అయితే.. బంగారం బఠానీల్లా దొరుకుతుందని పరిశోధకులు అంటున్నారు. అయితే దీనికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.