Tag: Telugu Cinema

  • మగబిడ్డకు జన్మనిచ్చిన రహస్య: మొదటి ఫోటో షేర్ చేసిన కిరణ్ అబ్బవరం

    మగబిడ్డకు జన్మనిచ్చిన రహస్య: మొదటి ఫోటో షేర్ చేసిన కిరణ్ అబ్బవరం

    Kiran Abbavaram Became a Father: ప్రముఖ టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) మరియు ఆయన సతీమణి, నటి రహస్య గోరక్ (Rahasya Gorak) తల్లిదండ్రులయ్యారు. పవిత్రమైన హనుమాన్ జయంతి నాడు రహస్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ ఆనందకరమైన విషయాన్ని కిరణ్ అబ్బవరం స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే అభిమానులు, సినీ ప్రముఖులు, మరియు సన్నిహితులు నూతన తల్లిదండ్రులకు శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తున్నారు.

    కిరణ్ అబ్బవరం ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్

    కిరణ్ అబ్బవరం తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, “మగబిడ్డ పుట్టాడు, థాంక్యూ రహస్య కిరణ్.. జై శ్రీరామ్” అని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌తో పాటు, తన నవజాత శిశువు లేత పాదాలను ముద్దాడుతున్న ఒక ఫోటోను కూడా ఆయన షేర్ చేశారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది, అభిమానుల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

    మొదటి సినిమా & వివాహం

    నటుడు కిరణ్ అబ్బవరం మరియు నటి రహస్య గోరక్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం విదితమే. వీరిరువురూ ‘రాజావారు రాణివారు’ సినిమా షూటింగ్ సమయంలో ఒకరినొకరు ఇష్టపడ్డారు. అనంతరం ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి, ఆగష్టు 2024న ఘనంగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ ఏడాది జనవరిలో తాము తల్లిదండ్రులం కాబోతున్నామన్న తీపికబురును అభిమానులతో పంచుకున్నారు. ఆ తరువాత రహస్య సీమంతం వేడుకకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి మురిసిపోయారు. ఇప్పుడు మగబిడ్డ రాకతో వారి కుటుంబంలో ఆనందం రెట్టింపు అయ్యింది.

    కిరణ్ అబ్బవరం గురించి

    విద్యాభ్యాసం

    నటుడు కిరణ్ అబ్బవరం (అసలు పేరు కిరణ్ రెడ్డి అబ్బవరం) ఆంధ్రప్రదేశ్‌లోని రాయచోటిలో 1992 జులై 15న జన్మించారు. బీటెక్ పూర్తి చేసిన తరువాత, చెన్నై మరియు బెంగళూరు నగరాల్లో సుమారు 2.5 సంవత్సరాల పాటు నెట్‌వర్క్ కన్సల్టెంట్‌గా విధులు నిర్వర్తించారు.

    సినీరంగ ప్రవేశం..

    ఉద్యోగం చేస్తూనే నటనపై ఉన్న ఆసక్తితో షార్ట్ ఫిల్మ్‌లు చేయడం ప్రారంభించారు. 2019లో విడుదలైన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘రాజావారు రాణివారు’ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కిరణ్, ఆ తరువాత ‘ఎస్ఆర్ కల్యాణమండపం’, ‘వినరో భాగ్యము విష్ణు కథ’, మరియు ‘క’ వంటి విభిన్నమైన చిత్రాల్లో నటించి, అతి తక్కువ కాలంలోనే యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

    నటి రహస్య గోరక్ గురించి

    విద్యాభ్యాసం

    రహస్య గోరక్ 1995 మార్చి 26న జన్మించారు. ఆమె తెలుగు మరియు తమిళ చిత్ర పరిశ్రమలో గుర్తింపు పొందింది. హైదరాబాదుకు చెందిన రహస్య.. బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌ (BITS)లో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించారు. చిన్న వయసులోనే కూచిపూడి నృత్యంలో శిక్షణ పొందిన ఆమె, నటి కావాలనే తన కలను సాకారం చేసుకున్నారు.

    సినీ ప్రస్థానం

    మొదట్లో ‘ఆకాశమంత ప్రేమ’, ‘బాయ్స్ ఇన్ స్కూల్’ వంటి షార్ట్ ఫిల్మ్‌లలో నటించి ప్రతిభ చాటుకున్నారు. 2016లో ‘ఆకాశమంత ప్రేమ’తో సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ, 2019లో కిరణ్ అబ్బవరం సరసన ‘రాజావారు రాణివారు’ చిత్రంలో పోషించిన పాత్ర ఆమెకు విశేషమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. అనంతరం, 2021లో ‘సర్బత్’ అనే తమిళ సినిమాలో కూడా ఆమె ప్రేక్షకులను అలరించారు.

  • భైరవం ట్రైలర్ లాంచ్: కన్నీళ్లు పెట్టుకున్న మంచు మనోజ్

    భైరవం ట్రైలర్ లాంచ్: కన్నీళ్లు పెట్టుకున్న మంచు మనోజ్

    Manchu Manoj Bhairavam Movie: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భైరవం సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. అంతకంటే ముందు విడుదలైన ట్రైలర్ అభిమానులను ఎంతగానో మెప్పించింది. మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్ మరియు నారా రోహిత్ ప్రధాన పాత్రలలో కనిపించిన ఈ భైరవం సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. సుమారు తొమ్మిదేళ్ల తరువాత మంచు మనోజ్ సినిమాలో కనిపించడం ఇదే మొదటిసారి.

    ట్రైలర్ లాంచ్‌లో మంచు మనోజ్ భావోద్వేగం

    భైరవం సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా మంచు మనోజ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పక్కనే ఉన్న డైరెక్టర్ ఆయనను (మనోజ్) ఓదార్చారు. కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమాలో.. అతిధి శంకర్, ఆనంది, దివ్య పిళ్ళై కథానాయికలుగా నటించారు.

    ప్రేమాభిమానాలకు రుణపడి ఉంటాను

    ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. “నాపై చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి చాలా రుణపడి ఉంటాను.” తన కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసుకుని ఈ సందర్బంగా బాధపడ్డారు. “తెర మీద కనిపించి 9 సంవత్సరాలు అయింది. అయినవాళ్లు అందరూ కాదనుకున్నారు, దూరం పెట్టేసారు. కట్టుబట్టలతో రోడ్డుపై నిలబెట్టేశారు. అలాంటి సమయంలో భైరవం సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఎన్ని జన్మలెత్తినా.. డైరెక్టర్ ఋణం తీర్చులేను” అని మంచు మనోజ్ అన్నారు.

    11 నెలల వయసులోనే సినిమాలోకి

    “చాన్నాళ్లుగా సినిమాలకు దూరంగానే ఉన్నాను. కరోనా మహమ్మారి సమయంలో కొన్ని సినిమాలను ఆపేయాల్సి వచ్చింది. వ్యక్తిగత కారణాల వల్ల మరికొన్ని సినిమాలను ఆపేయాల్సి వచ్చింది. నాకు సినిమా తప్పా వేరే ప్రపంచం తెలియదు. 11 నెలల వయసు ఉన్నప్పటి నుంచే సినిమాల్లో నటించడం మొదలుపెట్టాను. 19 ఏళ్ల వయసులో దొంగ దొంగది సినిమాలో నటించాను. ఆ తరువాత ఎన్ని సినిమాల్లో నటించాను. ఈ మధ్య కాలంలో కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి.”

    అభిమానులే నా కుటుంబం

    “ఈ వేదికపై నుంచి ఎంతో చెప్పాలనుకున్న.. కానీ మాటలు రావడం లేదు. నేను మీకోసం డబ్బు ఇవ్వలేదు, ఏమీ చేయలేదు. కానీ నీ మీద మీరు అపారమైన ప్రేమ కురిపిస్తున్నారు. గొడవలు జరిగినప్పుడు కూసే నాకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మీడియాకు కూడా ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా మద్దతుగా నిలిచారు. నాకు ఇప్పుడు పెద్ద కుటుంబం లేదు. ఉన్నది నా ఇద్దరు పిల్లలు, భార్య మాత్రమే. నా పిల్లలు ఎక్కడ నీ కుటుంబం అంటే.. తప్పకుండా మిమ్మల్నే చూపిస్తా. ఇదే నా కుటుంబం అని చెబుతా..” అంటూ మంచి నమోజ్ ఎమోషనల్ అయ్యారు.

    శివుడిని శివయ్యా అని పిలిస్తే రాడు..

    భైరవం చాలా మంచి సినిమా. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమాలో నాకు నటించే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. డైరెక్టర్ (విజయ్ కనకమేడల) తలచుకుంటే.. ఎంతోమంది నటులను తీసుకోగలడు. కానీ నాకు అవకాశం ఇచ్చాడు. “శివుడిని శివయ్యా అని పిలిస్తే రాడు, ఆయన్ని మనసారా తలచుకుంటే.. మీ అందరి రూపంలో వస్తాడు” అని మంచు మనోజ్ చెప్పాడు. బెల్లంకొండ శ్రీనివాస్ నాకు తమ్ముడిగా ఎందుకు పుట్టలేదు అని అనుకుంటున్నారా.. కానీ ఎప్పుడూ నీకు అన్నయ్యగా నేను నిలబడతాను. నారా రోహిత్ నాకు మంచి ఫ్రెండ్ అని చెబుతూ.. ఎప్పటికీ నేను మోహన్ బాబు కొడుకునే అని అన్నారు మనోజ్.

  • పవన్ కళ్యాణ్ OG సినిమా అప్డేట్: రిలీజ్ ఎప్పుడంటే?

    పవన్ కళ్యాణ్ OG సినిమా అప్డేట్: రిలీజ్ ఎప్పుడంటే?

    Pawan Kalyan OG Shooting: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రాజకీయాల్లోకి వచ్చాక సినిమాల్లో నటించడం బాగా తగ్గించేసాడు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత అప్పటికే ఒప్పుకున్న సినిమాలకు సైతం దూరమయ్యాడు. కానీ తన మీద నమ్మకం పెట్టుకున్న ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లను బాధపెట్టడం ఇష్టం లేకపోవడంతో.. ఆగిపోయిన సినిమాలను పూర్తి చేయడానికి ముందడుగు వేసాడు. ఇటీవలే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్.. తాజాగా ఓజీ (OG) షూటింగులోకి అడుగుపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    పవన్ కళ్యాణ్ ఓజీ సెట్స్‌లో సందడి: అభిమానుల ఆనందోత్సాహాలు

    పవన్ కళ్యాణ్ ఓజీ సెట్‌లో అడుగుపెట్టడంతో.. అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. మూవీ మేకర్స్ కూడా ”అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడంటే” అని ఒక ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఓజీ సినిమాకు సంబంధించిన కీలకమైన సన్నివేశాల షూటింగ్ కూడా జరుగుతోంది. ఇది కూడా త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమా తరువాత వెయిటింగ్ లిస్టులో ఉన్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమాలో నటించనున్నట్లు సమాచారం.

    ఓజీ సినిమా విశేషాలు: తారాగణం

    ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ కథానాయకుడుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈయన సరసన ప్రియాంక మోహన్ కథానాయకిగా నటించనుంది. ఇమ్రాన్ హష్మీ విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, అభిమన్యు సింగ్, హరీష్ ఉత్తమన్, అజయ్ ఘోష్ వంటివారు కీలక పాత్రలలో నటిస్తున్నారు. అనుకున్న విధంగా అన్నీ జరిగితే.. ఈ ఏడాది చివరి నాటికి థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

    ఓజీ సినిమాకు సంగీతం & పాన్-ఇండియా విడుదల ప్రణాళికలు

    పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాకు ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. వకీలు సాబ్, బీమ్లా నాయక్ మరియు బ్రో వంటి సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈయన ఇప్పుడు నాలుగో సినిమాకు కూడా కంపోజ్ చేయనున్నారు. ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ, తమిళం, మలయాళం మరియు హిందీ భాషల్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే దీనిపై స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి ఉంది.

    పవన్ కళ్యాణ్ వరుస చిత్రాలు: అభిమానులకు పండుగే

    చాన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్.. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు కూడా వెంట వెంటనే రిలీజ్ అయ్యే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమాల విడుదల విషయంలో చాలా ఆలస్యమైంది. ఈ ఆలస్యాన్ని మరింత ఆలస్యం చేయడం ఏ మాత్రం సరైనది కాదని అటు నిర్మాతలు, చిత్ర బృందం భావిస్తున్నారు. దీనికి పవన్ కళ్యాణ్ కూడా సహకరిస్తున్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇక పండగే అని తెలుస్తోంది. త్వరలోనే హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కానుంది.

  • పెళ్ళైనా దూరం దూరంగానే.. ‘LAT’పై పూరి జగన్నాథ్ వివరణ

    పెళ్ళైనా దూరం దూరంగానే.. ‘LAT’పై పూరి జగన్నాథ్ వివరణ

    Puri Jagannadh LAT Relationship: లెజెండరీ డైరెక్టర్‌గా కీర్తించబడిన ‘రామ్ గోపాల్ వర్మ’ సినిమా రంగంలోనే కాదు.. జీవన విధానంలో కూడా ఓ ప్రత్యేకమైన బాణీ. డిఫరెంట్ ఆలోచనలు, డిఫరెంట్ విధానాల వల్ల ఆయన్ను అభిమానించేవారికంటే.. దూషించేవాళ్లు, విమర్శించే వాళ్లే ఎక్కువ. అలాంటి వ్యక్తికి శిష్యుడైన ‘పూరి జగన్నాథ్’ గురువు మాదిరిగానే ఆలోచిస్తూ.. గొప్ప సినిమాలతో సక్సెస్ సాధించారు. ఎప్పటికప్పుడు తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు.

    పూరీ జగన్నాథ్ ‘ల్యాట్’ (లివింగ్ అపార్ట్ టుగెదర్) పై ఆసక్తికర వ్యాఖ్యలు

    ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తన యూట్యూబ్ ఛానల్ వేదికగా.. పూరీ మ్యూజింగ్స్ అనే లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఈ ల్యాట్ (లివింగ్ అపార్ట్ టుగెదర్) గురించి ప్రస్తావించారు. ఆధునిక సంబంధాలలో వస్తున్న మార్పులు, విడాకుల సమస్యకు ఇదొక పరిష్కార మార్గంగా ఆయన అభిప్రాయపడ్డారు.

    ‘ల్యాట్’ ఆవశ్యకత

    ఒకప్పుడు పెళ్లి అంటే.. ఓ పవిత్రమైన బంధం అని చెప్పుకునేవాళ్ళు. అయితే నేడు కాలం మారింది. పద్ధతులు కూడా మారిపోతున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉంటే.. గొడవలు వచ్చేస్తున్నాయి. ఈ కారణాల వల్లనే తొందరగా విడాకులు తీసుకుంటున్నారు. దీనికి చరమగీతం పాడాలంటే.. ఈ ల్యాట్ పద్ధతినే అనుసరించాలంటాడు మన పూరీ జగన్నాథ్.

    ఇద్దరు కలిసి బతకడం కష్టమైన రోజుల్లో.. విడివిడిగా ఉంటూ ఎప్పుడో ఒకసారి కలుసుకుంటే, వారి మధ్య ప్రేమ బలంగా ఉంటుంది. అంతే కాకుండా విడిపోకుండా కూడా ఉంటారనియు పూరీ జగన్నాథ్ చెబుతున్నారు. ఎలా అంటే.. చాలామంది పర్సనల్ స్పేస్ కోరుకుంటారు. అలాంటి సమయంలోనే వేరువేరు ఇళ్లలో ఉంటారు. ఇలా దూరంగా ఉండటం వల్లనే ప్రేమ, అనుబంధం పెరుగుతుంది. కొంతమంది ఇప్పటికి కూడా పెళ్ళైన తరువాత ఒక్కో దేశంలో నివసిస్తున్నారు. వేర్వేరు ఉద్యోగాలు చేస్తున్నారు.

    ‘ల్యాట్’ – బంధాలు బలపడటానికి ఒక మార్గం

    జీవితంలో బ్రేకప్స్, విడాకులు వంటివి చూసిన తరువాత చాలామంది.. దూరంగా ఉంటేనే బంధంబలపడుతుందని పూరీ జగన్నాథ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. విడాకులు తీసుకోకుండా.. పిల్లల భవిష్యత్తు కోసం తల్లితండ్రులు దూరంగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి ఎంత దూరం వెళ్తుంతో అంచనా వేయడం కూడా కొంత కష్టమే.

    ప్రపంచవ్యాప్తంగా ‘ల్యాట్’ ధోరణి

    ప్రస్తుతం యూరప్, జపాన్ వంటి దేశాల్లో ల్యాట్ రిలేషన్‌షిప్స్ ఎక్కువవుతున్నాయి. ఈ విధానంలో భారతదేశంలో కూడా అవలంబించే రోజులు దగ్గరలోనే ఉన్నట్లు కొన్ని సంఘటనలు, సన్నివేశాలు చూస్తుంటే అర్థమవుతోంది.

    ‘ల్యాట్’ విజయానికి కావలసినవి

    పెళ్ళైన తరువాత ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండాలని సమాజం చెబుతుంది. కానీ నేటి తరం మాత్రం స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ.. దూరంగా ఉంటేనే ప్రేమ, అనుబంధం పెరుగుతుందని దూరంగా ఉంటున్నారు. ల్యాట్ రిలేషన్‌లో ఉండాలంటే మానసిక పరిణతి అవసరం, ఒకరిపై ఒకరికి నమ్మకం మరియు గౌరవం వంటివి ఉండాలి. అంతే కాకుండా ఎవరి కాళ్లమీద వారు నిలబడి ఉండాలి. కలిసి ఉండకపోయినా.. కలిసి ఎదుగుతామనేది వాళ్ళ ఫిలాసఫీ.

    పూరీ జగన్నాథ్ వ్యక్తిగత అనుభవం

    కొన్నేళ్ల క్రితం నేను విమానంలో ప్రయాణిస్తూ.. ఒక వివాహితతో మాట్లాడాను. ఆమె భర్త గోవాలో ఒక రెస్టారెంట్‌లో గిటారిస్ట్. అతను అక్కడే పనిచేస్తూ ఉంటాడు. ఆమె ప్రపంచ దేశాలు తిరుగుతూ ఉంటుంది. అయితే వారిద్దరూ ఏడాదిలో ఒక నెల రోజులు మాత్రం కలిసి ఉంటారు. తరువాత ఎవరిదారి వారిదే అని ఆమె చెప్పింది. ఆమె తన భర్తను కలిసే క్రమంలోనే నాతో మాట్లాడింది. ఆ మాటల్లో తన భర్త గురించి చాలా గొప్పగా చెప్పింది. అపరిమితమైన గౌరవం మరియు నమ్మకం ఉన్నవారు మాత్రమే ఆలా ఉండగలుగుతారు.

    ముగింపు: ‘ల్యాట్’ అందరికీ సరిపోతుందా?

    అందరూ ల్యాట్ పద్ధతినే అవలంభించాలని లేదు. అన్యోన్యంగా ఉండి.. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగిపోతే ఎలాంటి ఇబ్బందులు లేదు. అయితే చిన్న చిన్న సమస్యల వల్లనే విడిపోవాలనే సమయం వచ్చినప్పుడు ఈ ల్యాట్ విధానం ఓ మంచి మార్గం. ఇందులో ఎవరికీ వారు ప్రైవసీ పొందుతారు.

  • పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ పూర్తి: అభిమానులకు శుభవార్త!

    పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ పూర్తి: అభిమానులకు శుభవార్త!

    Pawan Kalyan Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాకు సంబంధించి చిత్ర బృందం ఒక శుభవార్తను అందించింది. సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తయినట్లు అధికారికంగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్, ఈ చిత్రంతో త్వరలోనే ప్రేక్షకులను పలకరించనున్నారు.

    హరిహర వీరమల్లు: షూటింగ్ ప్రస్థానం మరియు సవాళ్లు

    2020లో ప్రారంభమైన ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ ప్రయాణంలో అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆటంకాలతో పాటు, ఎన్నికల ప్రచారం వంటి ఇతర కారణాల వల్ల షూటింగ్ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. సుదీర్ఘకాలం తర్వాత, 2020లో మొదలైన ఈ సినిమా చిత్రీకరణ 2025 నాటికి పరిసమాప్తమైంది. ఈ విషయాన్ని నిర్మాత ఏ.ఎం. రత్నం అధికారికంగా ధృవీకరించారు. “థియేటర్లలోకి రావడమే ఇక ఆలస్యం. అద్భుతమైన పాటలు, ట్రైలర్ అన్నీ త్వరలోనే విడుదలవుతాయి,” అని ఆయన తెలిపారు.

    విడుదల తేదీపై ఉత్కంఠ: పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం

    నిజానికి ‘హరిహర వీరమల్లు’ మే 9న విడుదలవుతుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే, షూటింగ్ పూర్తి కాకపోవడంతో విడుదల వాయిదా పడింది. ఇప్పుడు షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో, సినిమా విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన రీ-రికార్డింగ్, డబ్బింగ్ మరియు వీఎఫ్ఎక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

    రెండు భాగాలుగా ‘హరిహర వీరమల్లు’: పార్ట్ 1 చిత్రీకరణ పూర్తి

    ‘హరిహర వీరమల్లు’ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మొదటి భాగం, ‘హరిహర వీరమల్లు: పార్ట్ 1 – స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా కొంత భాగం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో చిత్రీకరణ జరుపుకోగా, ఆ తర్వాత నిర్మాత ఏ.ఎం. రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. పార్ట్ 2 షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

    రిలీజ్ డేట్ పై రూమర్లు: విజయ్ దేవరకొండ సినిమాపై ప్రభావం?

    సినిమా షూటింగ్ పూర్తి కావడంతో, ఈ నెల 30న ‘హరిహర వీరమల్లు’ విడుదలవుతుందని సోషల్ మీడియాలో కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ ఈ తేదీన సినిమా విడుదలైతే, అదే రోజున విడుదల కావాల్సిన విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

    ‘హరిహర వీరమల్లు’ కథాంశం, నటీనటులు

    పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్య నేపథ్యంతో కూడిన చారిత్రక చిత్రంగా తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక యోధుని పాత్రలో, వీరమల్లుగా కనిపించనున్నారు. కథానాయికగా నిధి అగర్వాల్ నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, అలాగే అనుపమ్ ఖేర్, అనసూయ భరద్వాజ్, మరియు సత్యరాజ్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

    పవన్ కళ్యాణ్ ఇతర క్రేజీ ప్రాజెక్టులు

    పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’తో పాటు మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులలో కూడా నటిస్తున్నారు.

    ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్)

    ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమా షూటింగ్ 2023లో ప్రారంభమైంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, శ్రియ రెడ్డి, ప్రకాష్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

    ఉస్తాద్ భగత్‌సింగ్

    ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా కూడా 2023లోనే చిత్రీకరణ ప్రారంభించుకుంది. తమిళంలో విజయవంతమైన ‘తేరి’ సినిమాకు ఇది రీమేక్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్, చేకూరి మోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, సాక్షి వైద్య నటిస్తుండగా, అశుతోష్ రాణా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ కూడా విడుదలైంది.

  • బరిలోకి దిగిన వీరమల్లు: పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే..

    బరిలోకి దిగిన వీరమల్లు: పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే..

    Pawan Kalyan Joins Sets of Hari Hara Veera Mallu: ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన తరువాత సినిమాల్లో కనిపించడం దాదాపు తగ్గిపోయింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. అప్పటికే ఒప్పుకున్న సినిమాలకు కూడా దూరమయ్యారు. అయితే, తనవల్ల నిర్మాతలకు, దానిపై ఆధారపడిన ఇతరులకు ఎలాంటి నష్టం కలగకూడదనే ఉద్దేశ్యంతో, పెండింగ్‌లో ఉన్న ‘హరిహర వీరమల్లు’ మరియు ‘ఓజీ’ సినిమాలను పూర్తి చేయడానికి సంకల్పించారు. ఇందులో భాగంగానే ఇటీవల ‘హరిహర వీరమల్లు’ సెట్‌లోకి అడుగుపెట్టారు.

    హరిహర వీరమల్లు చివరి షెడ్యూల్ ప్రారంభం

    ఇప్పటికే దాదాపు పూర్తయిన ‘హరిహర వీరమల్లు’ సినిమా చివరి షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంది. దీనిని పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్‌లో రెండు రోజుల పాటు షూటింగ్ జరగనుంది. దర్శకుడు జ్యోతికృష్ణ నేతృత్వంలో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

    సినిమా విడుదల తేదీపై ఉత్కంఠ

    2025 మే 6వ తేదీ తరువాత ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదల ఎప్పుడు ఉంటుందనే విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించనుంది. గతంలో ఈ సినిమా విడుదల తేదీ మే 9 అని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

    సినిమా కథాంశం మరియు ఇతర వివరాలు

    17వ శతాబ్దం నాటి మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ ఒక గొప్ప యోధుని పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. మొదటి భాగం ‘స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ (Sword vs Spirit) పేరుతో విడుదల కానుంది. ఆ తరువాత పార్ట్ 2 విడుదలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

    ఇప్పటికే విడుదలైన ‘హరిహర వీరమల్లు’ సినిమా టీజర్లు, పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

    నటీనటులు మరియు సాంకేతిక బృందం

    • కథానాయకుడు: పవన్ కళ్యాణ్
    • కథానాయకి: నిధి అగర్వాల్
    • ప్రధాన పాత్రలు: బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్య రాజ్, అనసూయ భరద్వాజ్
    • దర్శకులు: క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ
    • సంగీతం: ఎంఎం కీరవాణి
    • నిర్మాత: ఏ దయాకర్ రావు

    పవన్ కళ్యాణ్ సినీ ప్రస్థానం

    1996లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో తెలుగు చిత్ర సీమలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్, అనేక ఆటుపోట్లను ఎదుర్కొని అగ్ర కథానాయకుడిగా, అత్యధిక సంఖ్యలో అభిమానులను కలిగిన ‘పవర్ స్టార్’‌గా నిలిచారు. వరుస విజయాలు, కొన్ని పరాజయాల తర్వాత కూడా పట్టుదలతో సినిమాల్లో నటిస్తూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ‘గబ్బర్ సింగ్’, ‘అత్తారింటికి దారేది’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో పాటు, ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’, ‘ఓజీ’, మరియు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘హరిహర వీరమల్లు’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుండగా, ‘ఓజీ’ మరియు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాల వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

  • హిట్-4 హీరోగా అతడే ఫైనల్: ఏసీపీ వీరప్పన్‌గా ఎంట్రీ..

    హిట్-4 హీరోగా అతడే ఫైనల్: ఏసీపీ వీరప్పన్‌గా ఎంట్రీ..

    HIT 4 Karthi: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నేచురల్ స్టార్ ‘నాని’ నటించిన ‘హిట్ 3: ది థర్డ్ కేస్’ సినిమా వచ్చేసింది. సొంత నిర్మాణ సంస్థ ద్వారా తెరకెక్కించిన ఈ సినిమాకు ‘శైలేష్ కొలను’ దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే హిట్, హిట్ 2 సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ‘హిట్ 3: ది థర్డ్ కేస్’ కూడా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నారు.

    ‘హిట్ 4’ హీరోగా కార్తీ కన్ఫర్మ్!

    కాగా ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ అయిన హిట్ 4లో ఎవరు నటిస్తున్నారో కూడా ఇప్పుడే తెలిసిపోయింది. హిట్ సినిమాలో విశ్వక్ సేన్, హిట్ 2లో అడవి శేష్ నటించగా.. తాజాగా విడుదలైన హిట్ 3 సినిమాలో నాని ప్రధాన పాత్ర పోషించారు. ప్రతి సినిమా క్లైమాక్స్ లో సీక్వెల్ హీరోను దర్శకుడు పరిచయం చేస్తారు. ఇందులో భాగంగానే హిట్ 4లో కార్తీ నటించనున్నట్లు తెలిసిపోయింది.

    ఏసీపీ వీరప్పన్ పాత్రలో కార్తీ

    కార్తీ ఏసీపీ వీరప్పన్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులకు ముందే హిట్ 4 సినిమా కోసం కార్తీ ఫైనల్ అయినట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. అదే ఇప్పుడు నిజమైంది. ఇందులో పోలీస్ క్యారెక్టర్లో అలరించబోతున్నారు. ఇప్పటికే పలు సినిమాల్లో పోలీస్గా నటించి మంచి సక్సెస్ సాధించిన కార్తీ.. హిట్ 4లో కూడా విజయం సొంతం చేసుకుంటారని పలువురు చెబుతున్నారు.

    ‘హిట్ 4’ షూటింగ్ పుకార్లు

    రాబోయే హిట్ 4 కోసం.. కార్తీతో కొన్ని సన్నివేశాలను హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ కూడా జరిగినట్లు పుకార్లు వచ్చాయి. ఇది ఎంతవరకు నిజమో, కాదో సినిమా విడుదలైతే కానీ చెప్పలేము.

    ‘హిట్’ యూనివర్స్ భవిష్యత్ ప్రణాళికలు

    నిజానికి హిట్ సిరీస్ మొత్తం 8 సినిమాలుగా తెరకెక్కనుంది. ఇప్పటికి మూడు సినిమాలు విడుదలయ్యాయి. ఇంకా ఐదు సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. హిట్ 4, హిట్ 5, హిట్ 6, హిట్ 7 మరియు హిట్ 8 సినిమాలు త్వరలోనే తెరమీదకు రానున్నాయి.

    ‘హిట్ 8’ – హీరోలందరి కలయిక?

    రాబోయే హిట్ 8 సిరీస్ మాత్రం.. మిగిలిన అన్ని హిట్ సిరీస్లకంటే భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. ఎందుకంటే హిట్ 1 సిరీస్ నుంచి హిట్ 7 సిరీస్ వరకు నటించిన హీరోలందరూ.. హిట్ 8లో కనిపించనున్నట్లు, వారందరూ ఓ పెద్ద కేసును పరిష్కారిస్తారని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన తెలియాల్సి ఉంది.

    ‘హిట్ 3: ది థర్డ్ కేస్’ గురించి

    అర్జున్ సర్కార్ పాత్రలో నటించిన నాని తనదైన రీతిలో.. ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పెళ్లికోసం మాట్రిమొనీలో చూడటం, అర్జున్ (నాని) వేసే ప్రశ్నలకు అమ్మాయిలు పారిపోవడం వంటివి మంచి ఎంటర్‌టైన్‌గా సాగుతాయి. కొన్ని యాక్షన్ సీన్లు ఒళ్ళు గగుర్పుట్టేలా ఉన్నప్పటికీ.. మొత్తం సినిమా అద్భుతంగా ఉందనే టాక్.

    మొదటి రోజు కలెక్షన్స్ (అంచనా)

    హిట్ 3 సినిమా మొదటి రోజు కలెక్షన్స్ 18 కోట్ల రూపాయల వరకు ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడికావాల్సి ఉంది. ఈ సినిమా విజయం సాధిస్తే.. నాని ఖాతాలో మరో సక్సెస్ పడ్డట్టే అవుతుంది.