అప్పుడే సంగీత జ్ఞానం బయటపడింది: ఇళయరాజా గురించి ఆసక్తికర విషయాలు

Interesting Facts About Ilayaraja: సంగీత సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజులుగా ఎదిగిన దిగ్గజాలలో ఒకరు.. ఇళయరాజా (Ilayaraja). ఎనిమిది పదుల వయసులో కూడా తనదైన రీతిలో ఎన్నో పాటలకు సంగీత దర్శకత్వం వహించిన ఈయన.. 1943 జూన్ 2న జన్మించారు. ఈయన పుట్టిన రోజు సందర్భంగా ఈ కథనంలో కొన్ని ఆసక్తిరమైన విషయాలను వివరంగా తెలుసుకుందాం.

ఇళయరాజా బాల్యం మరియు సంగీత ప్రస్థానం

తమిళనాడులోని తేని జిల్లాలోని పన్నైపురమ్ గ్రామంలో ఓ పేద కుటుంబంలో జన్మించిన ఇళయరాజా.. అసలు పేరు జ్ఞానదేశికన్. ఈయన తల్లిదండ్రులు రామస్వామి, చిన్నతాయమ్మాళ్. వ్యవసాయ కుటుంబంలో జన్మించడం వల్ల.. పంట పొలాల్లో పాడుకునే జానపద సంగీతం పరిచయమైంది. అయితే 14వ ఏటనే అతనిలోని సంగీత జ్ఞానం బయటపడింది. ఆ సమయంలోనే ఇళయరాజా సవతి అన్న ‘పావలార్ వరదరాజన్’ భారత కమ్యూనిస్టు పార్టీ ప్రచారక బృందంలో సంగీతకారుడుగా ఉండేవాడు. ఆ బృందంలో ఊరూరా తిరుగుతూ.. ఉండేవాడు.

ఆ సమయంలో తన సంగీత పరిజ్ఞానం పరీక్షించుకున్నాడు. మొదటిసారి కన్నదాసన్ అనే తమిళ కవి.. భారత మొదటి ప్రధాని నెహ్రూకు నివాళిగా.. రాసిన దుఃఖంతో కూడిన పాటకు బాణీ కట్టారు. ఈయన తన జీవితంలో సంగీతకారుడు, స్వరకర్త, ఆరేంజర్, కండక్టర్, ఆర్కెస్ట్రాటర్, మల్టీ ఇన్స్ట్రుమెంటలిస్ట్, గీత రచయిత మరియు నేపథ్య గాయకుడుగా పనిచేశారు.

సంగీత ప్రపంచంలో ఇళయరాజా ఘనతలు

కేవలం తెలుగు భాషలో మాత్రమే కాకుండా.. కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో కూడా సంగీత దర్శకత్వం వహించారు. 49 ఏళ్ల తన కెరీర్‌లో.. సక్సెస్ స్వరకర్తలలో ఒకరుగా నిలిచారు. మొత్తం 8600 కంటే ఎక్కువ పాటలకు స్వరపరిచారు. తొమ్మిది భాషల్లో సుమారు 1523 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు.

బిరుదులు మరియు సత్కారాలు

ఈయనకు ఇసైజ్ఞాని (సంగీత ఋషి) అనే మారుపేరు ఉంది. అంతే కాకుండా.. ఈయన్ను మాస్ట్రో అని పిలుస్తారు. ఈ బిరుదులను లండన్‌లోని రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా అతనికి ప్రధానం చేసింది.

ఇళయరాజా వ్యక్తిగత జీవితం

ఇళయరాజా.. జీవాను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కార్తీక్ రాజా, భవతారణి మరియు యువన్ శంకర్ రాజా అనే ముగ్గురు సంతానం. వీరందరూ కూడా చలన చిత్ర స్వరకర్తలు మరియు గాయకులు. అయితే జీవా 31 అక్టోబర్ 2011న కన్నుమూశారు. భవతారణి కూడా 25 జనవరి 2024న ఈ లోకం వీడారు. కాగా ఈయన (ఇళయరాజా) తమిళ హిందూ ఋషి రమణ మహర్షిని తన ఆధ్యాత్మిక గురువుగా భావిస్తారు.

ప్రభుత్వ పురస్కారాలు మరియు గౌరవాలు

సంగీత ప్రపంచంలో తాను చేసిన సేవలకు గానూ.. భారత ప్రభుత్వం 2010లో పద్మభూషణ్, 2018లో పద్మవిభూషణ్ పురస్కారాలు అందించింది. 2022 జులై 6న ఇళయరాజా భారత రాష్ట్రపతి ‘రామ్ నాథ్ కోవింద్’ చేత పార్లమెంట్ సభ్యునిగా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. అంతే కాకుండా నవంబర్ 2022లో తమయిలాండులోని దిండిగల్‌లోని గాంధీగ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్ 36వ స్నాతకోత్సవం సందర్భంగా.. ప్రధాని నరేంద్ర మోదీ ఇళయరాజాకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *