Category: Cinema

  • కొత్త ఇంట్లోకి అనసూయ.. గృహప్రవేశం ఫోటోలు చూశారా?

    కొత్త ఇంట్లోకి అనసూయ.. గృహప్రవేశం ఫోటోలు చూశారా?

    Anasuya Bharadwaj New House: ప్రముఖ యాంకర్ మరియు సినీ నటి అనసూయ భరద్వాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా బుల్లితెరపై ఓ వెలుగు వెలిగిన ఈ నటి, ఒకవైపు టీవీ కార్యక్రమాలతో అలరిస్తూనే, మరోవైపు సినిమాల్లో తనదైన నటనతో మెప్పిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. తాజాగా, అనసూయ తన జీవితంలో మరో ముఖ్యమైన ఘట్టాన్ని చేరుకున్నారు – ఆమె తన కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. ఈ గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    ‘శ్రీరామ సంజీవిని’ – అనసూయ కలల సౌధం

    తన నూతన గృహప్రవేశ వేడుకకు సంబంధించిన ఫోటోలను అనసూయ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. “ఆ శ్రీరామాంజనేయ కృపతో.. మా తల్లిదండ్రుల కృపతో.. మీ అందరి ప్రేమతో.. మా జీవితంలోని మరో అధ్యాయం” అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా, తమ కొత్త ఇంటికి ‘శ్రీరామ సంజీవిని’ అని పేరుపెట్టినట్లు కూడా అనసూయ వెల్లడించారు. ఈ వార్త తెలియగానే అభిమానులు, శ్రేయోభిలాషులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.

    సాంప్రదాయబద్ధంగా జరిగిన గృహప్రవేశ కార్యక్రమాలు

    అనసూయ తన భర్త సుశాంక్ భరద్వాజ్ మరియు పిల్లలతో కలిసి శాస్త్రోక్తంగా గృహ ప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలుగు సాంప్రదాయం ప్రకారం, ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు నిర్వహించాల్సిన పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు అనసూయ కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. ఇల్లు చూడటానికి చాలా విశాలంగా, అద్భుతంగా ఉందని, అనసూయ అభిరుచులకు అనుగుణంగా ఆధునిక ఇంటీరియర్‌తో తీర్చిదిద్దారని తెలుస్తోంది.

    నటి అనసూయ భరద్వాజ్ – కెరీర్ మరియు వ్యక్తిగత విశేషాలు

    1985 మే 15న జన్మించిన అనసూయ భరద్వాజ్, టీవీ యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. 2016లో ‘క్షణం’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి, నటిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించారు.

    సినిమాల్లో మైలురాళ్లు: రంగమ్మత్త నుండి దాక్షాయణి వరకు

    ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్తగా, ‘పుష్ప: ది రైజ్’ సినిమాలో దాక్షాయణిగా ఆమె పోషించిన పాత్రలు విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మన్ననలు పొందాయి. ఈ పాత్రలు ఆమె కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’లో కూడా అనసూయ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.

    బహుముఖ ప్రజ్ఞ: యాంకరింగ్, నటన మరియు ఇతరాలు

    సినిమాలతో పాటు, అనసూయ షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలు వంటి కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ఎంబీఏ పూర్తిచేసిన ఈమె, కెరీర్ ఆరంభంలో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా కూడా పనిచేశారు. తొలినాళ్లలో వచ్చిన సినిమా ఆఫర్లను తిరస్కరించి, న్యూస్ ప్రెజెంటర్‌గా, అలాగే ‘వేదం’, ‘పైసా’ వంటి సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా తన ప్రతిభను చాటుకున్నారు.

    కుటుంబ జీవితం మరియు విజయాలు

    అనసూయ 2010లో సుశాంక్ భరద్వాజ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు (అయాన్ష్, శౌర్య). అటు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఇటు కెరీర్‌లో దూసుకుపోతున్న అనసూయ, తన నటనకు గాను పలు అవార్డులను కూడా అందుకున్నారు. ఇప్పుడు సొంత ఇంటి కలను నెరవేర్చుకుని, జీవితంలో మరో విజయాన్ని సాధించారు.

    అనసూయ లగ్జరీ కారు మరియు రెమ్యునరేషన్

    టీవీ షోలలో యాంకరింగ్‌ చేస్తూ, సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండే అనసూయ భరద్వాజ్, 2016లో సుమారు రూ. 93 లక్షల విలువైన లగ్జరీ కారు ఆడి క్యూ 7 (Audi Q7) ను కొనుగోలు చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఆమె ఒక్కో టీవీ షో ఎపిసోడ్‌కు సుమారు రూ. 1.2 లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, సినిమాలకు ఆమె అందుకునే రెమ్యునరేషన్ వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు.

  • మరో బెంజ్ కారు కొన్న నటి ‘సోనియా సింగ్’ – రెండు నెలల్లో రెండో లగ్జరీ కారు!

    మరో బెంజ్ కారు కొన్న నటి ‘సోనియా సింగ్’ – రెండు నెలల్లో రెండో లగ్జరీ కారు!

    Sonia Singh Mercedes Benz: ఇటీవల కాలంలో కార్లను కొనుగోలు చేస్తున్న సినీ తారలు సంఖ్య విపరీతంగా పెరిగింది. తాజాగా ఈ జాబితాలోకి నటి ‘సోనియా సింగ్’ చేరారు. గత నెలలో మెర్సిడెస్ బెంజ్ సి క్లాస్ కారును కొనుగోలు చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు సరికొత్త బెంజ్ జీఎల్ఎస్ కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    సోనియా సింగ్ కొన్న కొత్త మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్

    సోనియా సింగ్ కొనుగోలు చేసిన లేటెస్ట్ కారు మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ అని తెలుస్తోంది. దేశీయ విఫణిలో అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లలో ఒకటైన ఈ కారును ఇప్పటికే పలువురు ప్రముఖ సెలబ్రిటీలు కూడా సొంతం చేసుకున్నారు.

    ధర

    దీని ధర ఇండియన్ మార్కెట్లో సుమారు రూ. 1.60 కోట్లు (ఎక్స్ షోరూమ్) అని సమాచారం. సోనియా ఈ కొత్త కారుకు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించడానికి దేవాలయానికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

    ఇంజిన్ & పర్ఫామెన్స్

    అత్యధునికి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ కారు పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ తో లభిస్తుంది:

    • పెట్రోల్ ఇంజిన్: 2989 సీసీ ఇంజిన్, 362 Bhp పవర్, 500 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
    • డీజిల్ ఇంజిన్: 2999 సీసీ ఇంజిన్, 375 Bhp పవర్, 750 Nm టార్క్ అందిస్తుంది.

    ఈ రెండు ఇంజిన్ వేరియంట్లు కూడా ఆల్ వీల్ డ్రైవ్ (AWD) సిస్టం కలిగి ఉండి, ఉత్తమ పనితీరును అందిస్తాయి.

    ఇంతకు ముందే బెంజ్ సి-క్లాస్

    విశేషమేమిటంటే, సోనియా సింగ్ తన బాయ్ ఫ్రెండ్ పవన్ సిద్దుతో కలిసి.. మార్చి 2025లో కూడా ఒక బెంజ్ సీ-క్లాస్ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

    ఆ కారు ధరలు సుమారు రూ. 60 లక్షల నుంచి రూ. 80 లక్షల మధ్య ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులోని 1999 సీసీ హైబ్రిడ్ ఇంజిన్ 255 Bhp పవర్, 400 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రియర్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కలిగిన ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ.

    రెండు నెలల్లో రెండో బెంజ్ కారు

    బెంజ్ కారు కొనుగోలు చేయడం చాలా మందికి ఒక కల. అలాంటిది రెండు నెలల వ్యవధిలోనే రెండు బెంజ్ కార్లను సొంతం చేసుకోవడం విశేషం. సెలబ్రిటీలలో కూడా ఇలాంటి ఘటన అరుదుగా కనిపిస్తుంది. ఈ ఘనత బహుశా సోనియాకే దక్కింది. కొత్త కారు కొన్న సోనియాకు ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

    ఎవరీ సోనియా సింగ్?

    సోనియా సింగ్ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. యూట్యూబ్ స్టార్‌గా కెరీర్ ప్రారంభించిన ఈమె, ఆ తర్వాత చిన్న చిన్న టీవీ షోలలో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ‘విరూపాక్ష’ సినిమాలో కీలక పాత్రలో నటించి తన అందం, అభినయంతో మరింతమంది అభిమానులను సంపాదించుకుంది. ఆ తర్వాత నితిన్, శ్రీలీల నటించిన ‘ఎక్స్‌ట్రార్డినరి మ్యాన్’ సినిమాలో కూడా ఓ కామెడీ రోల్ ప్లే చేసింది.

  • డైరెక్టర్ కల నెరవేర్చిన హీరో కార్తీ.. సూర్య ఇంట్లో మరిచిపోలేని గిఫ్ట్

    డైరెక్టర్ కల నెరవేర్చిన హీరో కార్తీ.. సూర్య ఇంట్లో మరిచిపోలేని గిఫ్ట్

    Hero Karthi Gifts Mahindra Thar to Director: నచ్చిన కారును కొనుగోలు చేయడం చాలామంది కల. ఇందులో సాధారణ ప్రజలు.. సెలబ్రిటీలు అనే బేదభావం ఉండదు. ఎందుకంటే ఎవరికైనా కలలు కనే స్వేచ్ఛ ఉంది. అయితే ఈ కల కొందరికి కలగానే మిగిలిపోతుంది. కొంతమందికి మాత్రమే కన్న కల నిజమవుతుంది. తాజాగా ఒక డైరెక్టర్ కొత్త కారు కొనాలనుకున్న కలను హీరో కార్తీ నిజం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

    దర్శకుడికి మహీంద్రా థార్ బహుమతి

    గతేడాది విడుదలైన ‘సత్యం శివమ్ సుందరం’ సినిమా ఆశించిన కలెక్షన్స్ చేయలేకపోయింది. కానీ.. చాలామంది హృదయాలను టచ్ చేసింది. ఈ సినిమా డైరెక్టర్ ‘ప్రేమ్ కుమార్’కు ఇప్పుడు హీరో కార్తీ మహీంద్రా థార్ 5 డోర్ వెర్షన్ గిఫ్ట్ ఇచ్చారు.

    దర్శకుడు ప్రేమ్ కుమార్ కారు కలను నిజం చేసిన కార్తీ

    నిజానికి తెలుపు రంగు మహీంద్రా థార్ 5 డోర్ కారును కొనుగోలు చేయాలని చాలా రోజుల క్రితమే ప్రేమ్ కుమార్ అనుకున్నారు. దీనికోసం డబ్బులు కూడా కూడబెట్టడం మొదలుపెట్టారు. కానీ అనుకోని సమస్యల వల్ల డబ్బు మొత్తం ఖర్చు అయిపోయింది. దీంతో కారును కొనుగోలు చేయలేకపోయినట్లు ప్రేమ్ కుమార్ చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న కార్తీ.. మహీంద్రా థార్ రోక్స్ ఏఎక్స్ 5ఎల్ 4×4 వెర్షన్ గిఫ్ట్ ఇచ్చారు.

    కార్తీ కారును కొనుగోలు చేసిన తరువాత తనకు ఫోటో పంపించారని.. అది చూసి తాను షాక్ అయ్యానని ప్రేమ్ కుమార్ చెప్పారు. ఆ తరువాత అది కార్తీ ఇస్తున్న గిఫ్ట్ అని తెలుసుకుని సంబరపడిపోయానని అన్నారు. ఆ తరువాత సూర్య ఇంటికి వెళ్లి కారును తీసుకున్నారు. మొత్తానికి ప్రేమ్ కుమార్ కలను కార్తీ తీర్చేశారు.

    సరికొత్త మహీంద్రా థార్ రోక్స్: ఫీచర్లు & స్పెసిఫికేషన్లు

    భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో మహీంద్రా థార్ చెప్పుకోదగ్గది. ఈ కారు ఇప్పుడు 5 డోర్ రూపంలో థార్ రోక్స్ పేరుతో అమ్మకానికి ఉంది. చూడటానికి సాధారణ థార్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ఇది థార్ కంటే పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. ఇది మొత్తం 18 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. దీని ధరలు రూ. 12.99 లక్షల నుంచి రూ. 23.09 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి.

    డిజైన్ & అత్యాధునిక ఫీచర్లు

    చూడగానే ఆకట్టుకునే డిజైన్ కలిగిన థార్ రోక్స్.. 10.25 ఇంచెస్ స్క్రీన్‌లు, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, నాలుగు పవర్ విండోస్, స్లైడింగ్ ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్, కూల్డ్ గ్లోవ్ బాక్స్ వంటి మరెన్నో ఫీచర్స్ ఉంటాయి.

    ఇంజిన్ ఆప్షన్లు & పనితీరు

    మహీంద్రా థార్ రోక్స్ కారులో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మరియు 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ వంటివి ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్ 122 హార్స్ పవర్, 330 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తాయి. డీజిల్ ఇంజిన్ 152 హార్స్ పవర్, 330 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు ఇంజిన్లు మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉత్తమ పనితీరుని అందిస్తాయి. కాబట్టి ఎక్కువమంది ఈ కారును కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు.

  • పెళ్ళైనా దూరం దూరంగానే.. ‘LAT’పై పూరి జగన్నాథ్ వివరణ

    పెళ్ళైనా దూరం దూరంగానే.. ‘LAT’పై పూరి జగన్నాథ్ వివరణ

    Puri Jagannadh LAT Relationship: లెజెండరీ డైరెక్టర్‌గా కీర్తించబడిన ‘రామ్ గోపాల్ వర్మ’ సినిమా రంగంలోనే కాదు.. జీవన విధానంలో కూడా ఓ ప్రత్యేకమైన బాణీ. డిఫరెంట్ ఆలోచనలు, డిఫరెంట్ విధానాల వల్ల ఆయన్ను అభిమానించేవారికంటే.. దూషించేవాళ్లు, విమర్శించే వాళ్లే ఎక్కువ. అలాంటి వ్యక్తికి శిష్యుడైన ‘పూరి జగన్నాథ్’ గురువు మాదిరిగానే ఆలోచిస్తూ.. గొప్ప సినిమాలతో సక్సెస్ సాధించారు. ఎప్పటికప్పుడు తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు.

    పూరీ జగన్నాథ్ ‘ల్యాట్’ (లివింగ్ అపార్ట్ టుగెదర్) పై ఆసక్తికర వ్యాఖ్యలు

    ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తన యూట్యూబ్ ఛానల్ వేదికగా.. పూరీ మ్యూజింగ్స్ అనే లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఈ ల్యాట్ (లివింగ్ అపార్ట్ టుగెదర్) గురించి ప్రస్తావించారు. ఆధునిక సంబంధాలలో వస్తున్న మార్పులు, విడాకుల సమస్యకు ఇదొక పరిష్కార మార్గంగా ఆయన అభిప్రాయపడ్డారు.

    ‘ల్యాట్’ ఆవశ్యకత

    ఒకప్పుడు పెళ్లి అంటే.. ఓ పవిత్రమైన బంధం అని చెప్పుకునేవాళ్ళు. అయితే నేడు కాలం మారింది. పద్ధతులు కూడా మారిపోతున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉంటే.. గొడవలు వచ్చేస్తున్నాయి. ఈ కారణాల వల్లనే తొందరగా విడాకులు తీసుకుంటున్నారు. దీనికి చరమగీతం పాడాలంటే.. ఈ ల్యాట్ పద్ధతినే అనుసరించాలంటాడు మన పూరీ జగన్నాథ్.

    ఇద్దరు కలిసి బతకడం కష్టమైన రోజుల్లో.. విడివిడిగా ఉంటూ ఎప్పుడో ఒకసారి కలుసుకుంటే, వారి మధ్య ప్రేమ బలంగా ఉంటుంది. అంతే కాకుండా విడిపోకుండా కూడా ఉంటారనియు పూరీ జగన్నాథ్ చెబుతున్నారు. ఎలా అంటే.. చాలామంది పర్సనల్ స్పేస్ కోరుకుంటారు. అలాంటి సమయంలోనే వేరువేరు ఇళ్లలో ఉంటారు. ఇలా దూరంగా ఉండటం వల్లనే ప్రేమ, అనుబంధం పెరుగుతుంది. కొంతమంది ఇప్పటికి కూడా పెళ్ళైన తరువాత ఒక్కో దేశంలో నివసిస్తున్నారు. వేర్వేరు ఉద్యోగాలు చేస్తున్నారు.

    ‘ల్యాట్’ – బంధాలు బలపడటానికి ఒక మార్గం

    జీవితంలో బ్రేకప్స్, విడాకులు వంటివి చూసిన తరువాత చాలామంది.. దూరంగా ఉంటేనే బంధంబలపడుతుందని పూరీ జగన్నాథ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. విడాకులు తీసుకోకుండా.. పిల్లల భవిష్యత్తు కోసం తల్లితండ్రులు దూరంగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి ఎంత దూరం వెళ్తుంతో అంచనా వేయడం కూడా కొంత కష్టమే.

    ప్రపంచవ్యాప్తంగా ‘ల్యాట్’ ధోరణి

    ప్రస్తుతం యూరప్, జపాన్ వంటి దేశాల్లో ల్యాట్ రిలేషన్‌షిప్స్ ఎక్కువవుతున్నాయి. ఈ విధానంలో భారతదేశంలో కూడా అవలంబించే రోజులు దగ్గరలోనే ఉన్నట్లు కొన్ని సంఘటనలు, సన్నివేశాలు చూస్తుంటే అర్థమవుతోంది.

    ‘ల్యాట్’ విజయానికి కావలసినవి

    పెళ్ళైన తరువాత ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండాలని సమాజం చెబుతుంది. కానీ నేటి తరం మాత్రం స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ.. దూరంగా ఉంటేనే ప్రేమ, అనుబంధం పెరుగుతుందని దూరంగా ఉంటున్నారు. ల్యాట్ రిలేషన్‌లో ఉండాలంటే మానసిక పరిణతి అవసరం, ఒకరిపై ఒకరికి నమ్మకం మరియు గౌరవం వంటివి ఉండాలి. అంతే కాకుండా ఎవరి కాళ్లమీద వారు నిలబడి ఉండాలి. కలిసి ఉండకపోయినా.. కలిసి ఎదుగుతామనేది వాళ్ళ ఫిలాసఫీ.

    పూరీ జగన్నాథ్ వ్యక్తిగత అనుభవం

    కొన్నేళ్ల క్రితం నేను విమానంలో ప్రయాణిస్తూ.. ఒక వివాహితతో మాట్లాడాను. ఆమె భర్త గోవాలో ఒక రెస్టారెంట్‌లో గిటారిస్ట్. అతను అక్కడే పనిచేస్తూ ఉంటాడు. ఆమె ప్రపంచ దేశాలు తిరుగుతూ ఉంటుంది. అయితే వారిద్దరూ ఏడాదిలో ఒక నెల రోజులు మాత్రం కలిసి ఉంటారు. తరువాత ఎవరిదారి వారిదే అని ఆమె చెప్పింది. ఆమె తన భర్తను కలిసే క్రమంలోనే నాతో మాట్లాడింది. ఆ మాటల్లో తన భర్త గురించి చాలా గొప్పగా చెప్పింది. అపరిమితమైన గౌరవం మరియు నమ్మకం ఉన్నవారు మాత్రమే ఆలా ఉండగలుగుతారు.

    ముగింపు: ‘ల్యాట్’ అందరికీ సరిపోతుందా?

    అందరూ ల్యాట్ పద్ధతినే అవలంభించాలని లేదు. అన్యోన్యంగా ఉండి.. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగిపోతే ఎలాంటి ఇబ్బందులు లేదు. అయితే చిన్న చిన్న సమస్యల వల్లనే విడిపోవాలనే సమయం వచ్చినప్పుడు ఈ ల్యాట్ విధానం ఓ మంచి మార్గం. ఇందులో ఎవరికీ వారు ప్రైవసీ పొందుతారు.

  • సినీతారలకు పోటీ ఇచ్చేందుకు సిద్దమవుతున్న సితార!.. సినిమా ఎంట్రీ ఎప్పుడంటే?

    సినీతారలకు పోటీ ఇచ్చేందుకు సిద్దమవుతున్న సితార!.. సినిమా ఎంట్రీ ఎప్పుడంటే?

    Sithara Ghattamaneni Film Debut: సినిమాల్లోకి వచ్చిన తరువాత ఫేమస్ అవ్వడం సర్వసాధారణమే. కానీ సినిమాల్లోకి రాకుండానే ఫేమస్ అయిపోయింది.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి ‘సితార‘. కేవలం సోషల్ మీడియా ద్వారానే ఎంతోమంది అభిమానుల సంపాదించుకున్న ఈ అమ్మడు.. తండ్రి బాటలోనే నడుస్తూ ఎంతోమందికి సేవచేయడంలో తనవంతు సాయం చేస్తోంది. ప్రస్తుతం సినీతారలకు పోటీ ఇవ్వడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.

    బహుముఖ ప్రజ్ఞతో దూసుకెళ్తున్న సితార

    శాస్త్రీయ నృత్యం మరియు సోషల్ మీడియా క్రేజ్

    శాస్త్రీయ నృత్యం నేర్చుకున్న సితార, తన డ్యాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. గతంలో ఎంతోమంది సెలబ్రిటీలను సైతం ఇంటర్వ్యూ చేసి తన ప్రతిభను చాటుకుంది.

    బ్రాండ్ అంబాసిడర్​గా సితార

    ఇది మాత్రమే కాకుండా.. అనేక ప్రముఖ కంపెనీలకు కూడా సితార బ్రాండ్ అంబాసిడర్​గా కూడా వ్యవహరిస్తోంది, చిన్న వయసులోనే వాణిజ్య ప్రకటనలలో తనదైన ముద్ర వేస్తోంది.

    చిన్నారి సితార సాధించిన విజయాలు

    “పెన్నీ” పాట నుండి “ఫ్రోజెన్ 2” వరకు

    2012 జులై 20న జన్మించిన సితార ఘట్టమనేని, ‘సర్కారు వారి పాట’ సినిమాలోని “పెన్నీ” పాటకు డ్యాన్స్ చేసి సంచలనం సృష్టించింది. ఆ తరువాత డిస్నీ యొక్క “ఫ్రోజెన్ 2” యొక్క తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లో బేబీ ఎల్సాగా తన గాత్రాన్ని అందించి మెప్పించింది.

    ఫ్యాషన్ సెన్స్ మరియు సేవా దృక్పథం

    12 ఏళ్ల వయసులోనే ఆమె ఫ్యాషన్ సెన్స్ మరియు దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొని ఎంతోమందిని ఆకట్టుకుంది. ఈ ఏడాది ప్రారభంలో ఓ ఛారిటీకి ఏకంగా రూ. 1 కోటి విరాళంగా ఇచ్చి తన పెద్ద మనసును చాటుకుంది.

    సితార సినీ అరంగేట్రంపై ఉత్కంఠ

    నమ్రత మాటలు, అభిమానుల ఆశలు

    సినిమా రంగంలోకి అడుగుపెట్టడానికి సితార చాలా ఆసక్తి చూపుతున్నట్లు తల్లి నమ్రత శిరోద్కర్ ఓ సందర్భంలో వెల్లడించారు. ఇప్పటికే పలు యాడ్లలో కనిపించిన ఈమె (సితార) ఎప్పుడు కథానాయకిగా సినిమాలో కనిపిస్తుందో అని చాలామంది సితార అభిమానులు ఆ రోజు కోసం ఆసక్తిగా వేచిచూస్తున్నారు.

    మహేష్ బాబు అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపు

    సితార సినిమా రంగ ప్రవేశానికి సంబంధించిన విషయాన్ని ప్రిన్స్ మహేష్ బాబు ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈమె మరికొన్ని రోజుల్లో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎప్పుడు, ఎలా.. సినిమాల్లో కనిపిస్తుందో తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే అని స్పష్టమవుతోంది.

    సేవా కార్యక్రమాలు మరియు భవిష్యత్ అంచనాలు

    సంపాదనతో సమాజ సేవ

    చిన్న వయసులోనే మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న సితార, ప్రస్తుతం కొన్ని బ్రాండ్లకు అంబాసిడర్​గా వ్యవహరించడం ద్వారా కొంత డబ్బు సంపాదిస్తోంది. విశేషం ఏమిటంటే, ఈ డబ్బును కూడా కొన్ని సేవా కార్యక్రమాల కోసం ఉపయోగిస్తోంది. చిన్న వయసులోనే సేవాదృక్పథాన్ని అలవాటు చేసుకోవడం చాలా గొప్ప విషయం అని ఎంతోమంది సితారను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

    గౌతమ్ సినీ ప్రవేశంపై కూడా చర్చ

    సితార మాత్రమే కాకుండా, ఆమె సోదరుడు గౌతమ్ ఘట్టమనేని కూడా సినీ రంగ అరంగేట్రం చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో ఘట్టమనేని కుటుంబం నుంచి మరో తరం నటీనటులు రాబోతున్నారని అభిమానులు ఆశిస్తున్నారు.

  • పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ పూర్తి: అభిమానులకు శుభవార్త!

    పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ పూర్తి: అభిమానులకు శుభవార్త!

    Pawan Kalyan Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాకు సంబంధించి చిత్ర బృందం ఒక శుభవార్తను అందించింది. సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తయినట్లు అధికారికంగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్, ఈ చిత్రంతో త్వరలోనే ప్రేక్షకులను పలకరించనున్నారు.

    హరిహర వీరమల్లు: షూటింగ్ ప్రస్థానం మరియు సవాళ్లు

    2020లో ప్రారంభమైన ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ ప్రయాణంలో అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆటంకాలతో పాటు, ఎన్నికల ప్రచారం వంటి ఇతర కారణాల వల్ల షూటింగ్ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. సుదీర్ఘకాలం తర్వాత, 2020లో మొదలైన ఈ సినిమా చిత్రీకరణ 2025 నాటికి పరిసమాప్తమైంది. ఈ విషయాన్ని నిర్మాత ఏ.ఎం. రత్నం అధికారికంగా ధృవీకరించారు. “థియేటర్లలోకి రావడమే ఇక ఆలస్యం. అద్భుతమైన పాటలు, ట్రైలర్ అన్నీ త్వరలోనే విడుదలవుతాయి,” అని ఆయన తెలిపారు.

    విడుదల తేదీపై ఉత్కంఠ: పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం

    నిజానికి ‘హరిహర వీరమల్లు’ మే 9న విడుదలవుతుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే, షూటింగ్ పూర్తి కాకపోవడంతో విడుదల వాయిదా పడింది. ఇప్పుడు షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో, సినిమా విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన రీ-రికార్డింగ్, డబ్బింగ్ మరియు వీఎఫ్ఎక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

    రెండు భాగాలుగా ‘హరిహర వీరమల్లు’: పార్ట్ 1 చిత్రీకరణ పూర్తి

    ‘హరిహర వీరమల్లు’ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మొదటి భాగం, ‘హరిహర వీరమల్లు: పార్ట్ 1 – స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా కొంత భాగం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో చిత్రీకరణ జరుపుకోగా, ఆ తర్వాత నిర్మాత ఏ.ఎం. రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. పార్ట్ 2 షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

    రిలీజ్ డేట్ పై రూమర్లు: విజయ్ దేవరకొండ సినిమాపై ప్రభావం?

    సినిమా షూటింగ్ పూర్తి కావడంతో, ఈ నెల 30న ‘హరిహర వీరమల్లు’ విడుదలవుతుందని సోషల్ మీడియాలో కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ ఈ తేదీన సినిమా విడుదలైతే, అదే రోజున విడుదల కావాల్సిన విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

    ‘హరిహర వీరమల్లు’ కథాంశం, నటీనటులు

    పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్య నేపథ్యంతో కూడిన చారిత్రక చిత్రంగా తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక యోధుని పాత్రలో, వీరమల్లుగా కనిపించనున్నారు. కథానాయికగా నిధి అగర్వాల్ నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, అలాగే అనుపమ్ ఖేర్, అనసూయ భరద్వాజ్, మరియు సత్యరాజ్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

    పవన్ కళ్యాణ్ ఇతర క్రేజీ ప్రాజెక్టులు

    పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’తో పాటు మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులలో కూడా నటిస్తున్నారు.

    ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్)

    ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమా షూటింగ్ 2023లో ప్రారంభమైంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, శ్రియ రెడ్డి, ప్రకాష్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

    ఉస్తాద్ భగత్‌సింగ్

    ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా కూడా 2023లోనే చిత్రీకరణ ప్రారంభించుకుంది. తమిళంలో విజయవంతమైన ‘తేరి’ సినిమాకు ఇది రీమేక్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్, చేకూరి మోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, సాక్షి వైద్య నటిస్తుండగా, అశుతోష్ రాణా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ కూడా విడుదలైంది.

  • కోట్లు విలువ చేసే కారు కొన్న సింహాద్రి విలన్

    కోట్లు విలువ చేసే కారు కొన్న సింహాద్రి విలన్

    Rahul Dev Land Rover: సినీ ప్రముఖులు తమకు నచ్చిన, లేటెస్ట్ మోడల్ కార్లను ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తుంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే.. ఇటీవల ప్రముఖ విలన్ నటుడు రాహుల్ దేవ్ ఖరీదైన ల్యాండ్ రోవర్ కారును కొనుగోలు చేశారు. దీనికి సంబందించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

    నటుడు రాహుల్ దేవ్ కొనుగోలు చేసిన కొత్త కారు ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 అని తెలుస్తోంది. భారతీయ మార్కెట్లో దీని ధర రూ. కోటి కంటే ఎక్కువే ఉంటుందని సమాచారం. తెలుపు రంగులో చూడచక్కగా ఉన్న ఈ లగ్జరీ SUV అద్భుతమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది.

    ల్యాండ్ రోవర్ డిఫెండర్: ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లు

    భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ కార్ బ్రాండ్లలో ల్యాండ్ రోవర్ ఒకటి. సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు మరియు ఇతర ప్రముఖులు ఈ కంపెనీకి చెందిన కార్లను ఎంతో ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు నటుడు రాహుల్ దేవ్ కొనుగోలు చేసిన తెల్లని డిఫెండర్ 110, గోధుమ రంగు మరియు నలుపు రంగుల కలయికతో కూడిన ప్రీమియం ఇంటీరియర్‌ను కలిగి ఉంది. అయితే ఇది ఏ ఇంజిన్ (డీజిల్, పెట్రోల్) ఆప్షన్ అనేది ఖచ్చితంగా వెల్లడి కాలేదు. ఏదేమైనా, ఇది ప్రీమియం అనుభూతిని అందిస్తూ.. అద్భుతమైన డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుందని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.

    ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఫీచర్లు:

      • టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం
      • ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
      • ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్
      • హెడ్స్ అప్ డిస్‌ప్లే (HUD)
      • వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్
      • కనెక్టెడ్ కార్ ఫీచర్స్
      • ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్
      • 360 డిగ్రీ కెమెరా
      • హీటెడ్ ఫ్రంట్ సీట్లు
      • బ్లైండ్ స్పాట్ అసిస్ట్
      • ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు
    • ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు
    • ABS విత్ EBD
    • లెదర్ అపోల్స్ట్రే

    వేరియంట్లు మరియు ఇంజిన్ ఆప్షన్లు

    నిజానికి ల్యాండ్ రోవర్ డిఫెండర్ భారతదేశంలో 90 (3-డోర్), 110 (5-డోర్) మరియు 130 (5-డోర్, 3 వరుసల సీట్లు) అనే మూడు ప్రధాన వేరియంట్లలో లభిస్తుంది.

    ల్యాండ్ రోవర్ డిఫెండర్ ప్రస్తుతం 2.0 లీటర్ పెట్రోల్, 3.0 లీటర్ పెట్రోల్ మరియు 3.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. అంతేకాకుండా, కంపెనీ గత ఏడాది డిఫెండర్ 110 మరియు 90 వెర్షన్లకు మరింత శక్తివంతమైన 5.0 లీటర్ సూపర్ఛార్జ్డ్ V8 పెట్రోల్ ఇంజిన్ ఎంపికను కూడా ప్రవేశపెట్టింది. ఈ ఇంజిన్ ఆప్షన్స్ అన్నీ కూడా స్టాండర్డ్‌గా ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ మరియు ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో (లాకింగ్ సెంటర్ డిఫరెన్షియల్ మరియు యాక్టివ్ రియర్ లాకింగ్ డిఫరెన్షియల్ వంటి ఫీచర్లతో) వస్తాయి. ఇండియన్ మార్కెట్లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ ధరలు సుమారు రూ. 1.05 కోట్ల నుంచి రూ. 2.79 కోట్ల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

    రాహుల్ దేవ్ గురించి

    నటుడు రాహుల్ దేవ్ కౌశల్ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషా చిత్రాలలో తన విలక్షణమైన నటనతో ప్రసిద్ధి చెందారు. ముఖ్యంగా తెలుగులో ‘టక్కరి దొంగ’, ‘సింహాద్రి’, ‘సీతయ్య’, ‘మాస్’, ‘నరసింహుడు’ మరియు ‘జై చిరంజీవ’ వంటి సినిమాల్లో పవర్ఫుల్ విలన్ పాత్రలు పోషించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. ఈయన హిందీ బిగ్‌బాస్ సీజన్ 10తో సహా అనేక రియాలిటీ షోలలో కూడా పాల్గొన్నారు.

  • బరిలోకి దిగిన వీరమల్లు: పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే..

    బరిలోకి దిగిన వీరమల్లు: పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే..

    Pawan Kalyan Joins Sets of Hari Hara Veera Mallu: ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన తరువాత సినిమాల్లో కనిపించడం దాదాపు తగ్గిపోయింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. అప్పటికే ఒప్పుకున్న సినిమాలకు కూడా దూరమయ్యారు. అయితే, తనవల్ల నిర్మాతలకు, దానిపై ఆధారపడిన ఇతరులకు ఎలాంటి నష్టం కలగకూడదనే ఉద్దేశ్యంతో, పెండింగ్‌లో ఉన్న ‘హరిహర వీరమల్లు’ మరియు ‘ఓజీ’ సినిమాలను పూర్తి చేయడానికి సంకల్పించారు. ఇందులో భాగంగానే ఇటీవల ‘హరిహర వీరమల్లు’ సెట్‌లోకి అడుగుపెట్టారు.

    హరిహర వీరమల్లు చివరి షెడ్యూల్ ప్రారంభం

    ఇప్పటికే దాదాపు పూర్తయిన ‘హరిహర వీరమల్లు’ సినిమా చివరి షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంది. దీనిని పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్‌లో రెండు రోజుల పాటు షూటింగ్ జరగనుంది. దర్శకుడు జ్యోతికృష్ణ నేతృత్వంలో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

    సినిమా విడుదల తేదీపై ఉత్కంఠ

    2025 మే 6వ తేదీ తరువాత ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదల ఎప్పుడు ఉంటుందనే విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించనుంది. గతంలో ఈ సినిమా విడుదల తేదీ మే 9 అని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

    సినిమా కథాంశం మరియు ఇతర వివరాలు

    17వ శతాబ్దం నాటి మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ ఒక గొప్ప యోధుని పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. మొదటి భాగం ‘స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ (Sword vs Spirit) పేరుతో విడుదల కానుంది. ఆ తరువాత పార్ట్ 2 విడుదలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

    ఇప్పటికే విడుదలైన ‘హరిహర వీరమల్లు’ సినిమా టీజర్లు, పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

    నటీనటులు మరియు సాంకేతిక బృందం

    • కథానాయకుడు: పవన్ కళ్యాణ్
    • కథానాయకి: నిధి అగర్వాల్
    • ప్రధాన పాత్రలు: బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్య రాజ్, అనసూయ భరద్వాజ్
    • దర్శకులు: క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ
    • సంగీతం: ఎంఎం కీరవాణి
    • నిర్మాత: ఏ దయాకర్ రావు

    పవన్ కళ్యాణ్ సినీ ప్రస్థానం

    1996లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో తెలుగు చిత్ర సీమలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్, అనేక ఆటుపోట్లను ఎదుర్కొని అగ్ర కథానాయకుడిగా, అత్యధిక సంఖ్యలో అభిమానులను కలిగిన ‘పవర్ స్టార్’‌గా నిలిచారు. వరుస విజయాలు, కొన్ని పరాజయాల తర్వాత కూడా పట్టుదలతో సినిమాల్లో నటిస్తూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ‘గబ్బర్ సింగ్’, ‘అత్తారింటికి దారేది’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో పాటు, ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’, ‘ఓజీ’, మరియు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘హరిహర వీరమల్లు’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుండగా, ‘ఓజీ’ మరియు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాల వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

  • సైడ్ క్యారెక్టర్ నుంచి.. స్టార్ హీరోయిన్ వరకు: త్రిష గురించి ఆసక్తికర విషయాలు

    సైడ్ క్యారెక్టర్ నుంచి.. స్టార్ హీరోయిన్ వరకు: త్రిష గురించి ఆసక్తికర విషయాలు

    Trisha Krishnan: సినీ ప్రపంచంలో పరిచయమే అవసరం లేని కొంతమంది సెలబ్రిటీల పేర్లలో త్రిష కృష్ణన్ ఒకటి. తెలుగులో మాత్రమే కాకుండా.. తమిళం, మలయాళం మరియు కన్నడ సినిమాల్లో నటిస్తూ.. తన హావభావాలతో ఎంతోమంది అభిమానుల మనసు కొల్లగొట్టిన ఈ అమ్మడు.. నాలుగు పదుల వయసు దాటినప్పటికీ, కుర్ర హీరోయిన్లకు సైతం పోటీ ఇస్తూ దూసుకెళ్తోంది. నేడు (మే 4) త్రిష పుట్టిన రోజు సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

    తొలి జీవితం మరియు మోడలింగ్ ప్రస్థానం

    1983 మే 4న తమిళనాడులోని మద్రాసులో (ప్రస్తుతం చెన్నై) కృష్ణన్ అయ్యర్ మరియు ఉమా అయ్యర్ దంపతులకు జన్మించిన త్రిష.. చెన్నైలోనే తన విద్యాభ్యాసం పూర్తి చేసుకుంది. తాను బీబీఏ చదువుకునే రోజుల్లోనే మోడలింగ్‌ రంగంలోకి అడుగుపెట్టింది.

    1999లో మిస్ చెన్నై పోటీలో గెలుపొందింది, ఆ తరువాత 2001లో మిస్ ఇండియా పోటీలో ‘బ్యూటిఫుల్ స్మైల్’ అవార్డును కూడా సొంతం చేసుకుంది. త్రిష ముద్దు పేర్లు హనీ, ది టెర్రర్.

    సినిమా కెరీర్: అరంగేట్రం నుంచి అగ్ర కథానాయకిగా

    తమిళ చిత్రం ‘జోడి’ (1999)లో సిమ్రాన్ స్నేహితురాలిగా చిన్న పాత్రతో సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన త్రిష.. ప్రభాస్ సరసన ‘వర్షం’ (2004) సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాతో త్రిషకు తెలుగులో మంచి గుర్తింపు లభించింది. ఆ తరువాత వెనుతిరిగి చూడకుండా అనేక విజయవంతమైన సినిమాల్లో నటించింది, వాటిలో కొన్ని:

    • నువ్వొస్తానంటే నేనొద్దంటానా
    • అతడు
    • పౌర్ణమి
    • స్టాలిన్
    • ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
    • బాడీగార్డ్

    ఈ చిత్రాలతో పాటు మరెన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి, మహేష్ బాబు, చిరంజీవి, వెంకటేష్ వంటి అగ్ర హీరోలతో కలిసి పనిచేసింది. ఈమెకు హాలీవుడ్‌లో నటించే అవకాశం వచ్చినప్పటికీ.. దానిని తిరస్కరించింది. ఇండియన్ సినిమాల్లోనే నటించాలనే ఉద్దేశ్యంతోనే ఆ ఆఫర్ వదులుకుంది. త్రిషకు ఇష్టమైన నటులలో వెంకటేష్, అమీర్ ఖాన్ మరియు కమల్ హాసన్ ఉన్నారు.

    వ్యక్తిగత జీవితం, సంపాదన మరియు ఆస్తులు

    సినిమా ప్రపంచంలో తన నటనతో ఎంతోమంది ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న త్రిష, ఎన్నో అవార్డులను కూడా అందుకుంది. ప్రస్తుతం ఈమె.. తన తల్లి మరియు అమ్మమ్మతో కలిసి చెన్నైలోని తన నివాసంలో ఉంటోంది. తరచుగా సినిమా షూటింగులకు తన తల్లితోపాటు వెళ్తుంది. ఈమె నివసించే ఇంటి విలువ సుమారు రూ. 6 కోట్లు ఉంటుందని అంచనా.

    త్రిష మొదటి సంపాదన రూ. 12,000 కాగా, ప్రస్తుతం ఈమె ఒక్కో సినిమాకు రూ. 10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. త్రిష మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ. 100 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.

    విలాసవంతమైన కార్ కలెక్షన్

    అగ్ర కథానాయకిగా రాణిస్తున్న త్రిష వద్ద ఖరీదైన కార్లు ఉన్నాయి. వాటిలో కొన్ని:

    • మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్
    • బీఎండబ్ల్యూ 5 సిరీస్
    • రేంజ్ రోవర్ ఎవోక్

    గమనిక: పైన పేర్కొన్న ధరలు మరియు ఆస్తుల విలువలు కొన్ని నివేదికల ఆధారంగా అంచనా వేయబడినవి.

  • కొత్త కారు కొన్న ఆనందం.. చిందేసిన బిగ్‌బాస్ ఫేమ్ ‘నైనిక’

    కొత్త కారు కొన్న ఆనందం.. చిందేసిన బిగ్‌బాస్ ఫేమ్ ‘నైనిక’

    Nainika Tata Car: వెహికల్ (కారు, బైక్) కొనుగోలు చేయడం అనేది చాలా మందికి ఒక ఎమోషన్. ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన వాహనం సొంతం చేసుకోవాలని కలలు కంటారు. కొందరికి ఇది సులభంగా సాధ్యమైతే, మరికొందరికి కలగానే మిగిలిపోతుంది. ఇటీవల, బిగ్‌బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ మరియు ఢీ డ్యాన్స్ షో ద్వారా ప్రసిద్ధి చెందిన ‘నైనిక’ (Nainika) తన కారు కలను నిజం చేసుకుంది. ఆమె కొత్త కారు కొనుగోలు చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ నైనిక ఏ కారు కొనుగోలు చేసింది? దాని ధర మరియు విశేషాలేంటి?

    నైనిక కొన్న కారు ఇదే..

    సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలను బట్టి, నైనిక టాటా మోటార్స్ (Tata Motors) కంపెనీకి చెందిన సరికొత్త ‘కర్వ్’ (Curvv) కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కారు డెలివరీ తీసుకుంటూ, ఫోటోలకు ఫోజులిస్తున్న నైనికను ఈ చిత్రాలలో చూడవచ్చు. ఆమె ముదురు ఎరుపు రంగు (Dark Red) కారును ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. అయితే, ఇది ఏ ఇంజిన్ వేరియంట్ అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

    టాటా కర్వ్: ధర మరియు వివరాలు

    భారత మార్కెట్లో టాటా కర్వ్ ధరలు రూ. 10 లక్షల నుంచి రూ. 19.52 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ కారు మల్టిపుల్ వేరియంట్లలో లభిస్తుంది. ఆధునిక డిజైన్, అధునాతన ఫీచర్లతో ఇది వినియోగదారులను ఆకట్టుకుంటోంది. టాటా బ్రాండ్ అంటే భద్రతకు పెట్టింది పేరు కాబట్టి, సేఫ్టీ పరంగా కూడా చాలామంది ఈ కారును ఇష్టపడుతున్నారు.

    ఇంజిన్ ఆప్షన్లు

    దేశీయ మార్కెట్లో టాటా కర్వ్ మూడు ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది:

    • 1.2 లీటర్ టర్బో పెట్రోల్: 120 PS పవర్ & 170 Nm టార్క్
    • 1.2 లీటర్ టీ-జీడీఐ టర్బో పెట్రోల్: 125 PS పవర్ & 225 Nm టార్క్
    • 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్: 118 PS పవర్ & 260 Nm టార్క్

    ఈ ఇంజిన్లు అన్నీ మంచి పనితీరును అందిస్తాయి.

    డిజైన్ మరియు ఫీచర్లు

    చూడటానికి కొంత టాటా నెక్సాన్ మాదిరిగా అనిపించినా, టాటా కర్వ్ తనదైన ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఇవి ప్రయాణికులకు సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

    భద్రతా ఫీచర్లు

    ప్రయాణికుల భద్రతకు టాటా కర్వ్ పెద్దపీట వేస్తుంది. ఇందులో:

    • ఆరు ఎయిర్‌బ్యాగులు
    • 360 డిగ్రీ కెమెరా
    • ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు
    • లెవెల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS)

    వంటి కీలకమైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

    నైనిక గురించి క్లుప్తంగా

    ఢీ డ్యాన్స్ షో ద్వారా నైనిక ఎంతో పేరు సంపాదించుకుంది. గతంలో తోటి డ్యాన్సర్ సాయితో రిలేషన్‌లో ఉండి, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోయారు. విడిపోయిన తర్వాత తాను సంతోషంగా ఉన్నానని పలు సందర్భాల్లో పేర్కొంది. ఇటీవల బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో పాల్గొని, మొదట్లో టాస్కుల్లో చురుకుగా పాల్గొన్నప్పటికీ, తర్వాత విష్ణుప్రియ, కిర్రాక్ సీతలతో కలిసి సరదాగా గడిపింది.