Category: Business

  • పసిడి ప్రియులకు శుభవార్త! రూ.2130 తగ్గిన గోల్డ్ రేటు: ఈ రోజు ధరలు ఇవే

    పసిడి ప్రియులకు శుభవార్త! రూ.2130 తగ్గిన గోల్డ్ రేటు: ఈ రోజు ధరలు ఇవే

    Gold and Silver Price Today: భారతదేశంలో బంగారం ధరలు రోజురోజుకి క్రమంగా తగ్గుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలో భారీగా పెరిగిన పసిడి ధరలు, ఆ తరువాత ఒడిదుడుకులకు లోనవుతూ, గత రెండు రోజులుగా ఊహించని రీతిలో తగ్గాయి. ఈ రోజు (మే 15) బంగారం ధర గరిష్టంగా 2130 రూపాయల వరకు తగ్గింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు, అలాగే వెండి ధరల వివరాలను స్పష్టంగా తెలుసుకుందాం.

    హైదరాబాద్, చెన్నై, ముంబై, బెంగళూరులలో నేటి బంగారం ధరలు

    లక్ష రూపాయల మార్కును దాటిన బంగారం ధర, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలతో పాటు చెన్నై, ముంబై, మరియు బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో కూడా వరుసగా రెండో రోజు పతనమైంది. ఈ నగరాల్లో నేటి బంగారం ధరల వివరాలు:

    • 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర: రూ. 1950 తగ్గి, రూ. 86,100 వద్ద స్థిరపడింది.
    • 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర: రూ. 2130 తగ్గి, రూ. 93,930 వద్ద ఉంది.

    నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు గణనీయంగా తగ్గినట్లు స్పష్టమవుతోంది.

    ఢిల్లీలో బంగారం ధరల పరిస్థితి

    దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే, ఢిల్లీలో బంగారం ధరలు సాధారణంగా కొంత ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ, దేశ రాజధాని నగరంలో కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి:

    • 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర: రూ. 1950 తగ్గి, రూ. 86,250 వద్ద ఉంది.
    • 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర: రూ. 2130 తగ్గి, రూ. 94,080 వద్ద నిలిచింది.

    నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధర, ఈరోజు మరింత క్షీణించింది.

    వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

    బంగారం ధరల బాటలోనే వెండి ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. నిన్న కిలో వెండి ధర రూ. 1,09,000 ఉండగా, ఈరోజు రూ. 1000 తగ్గి, రూ. 1,08,000 వద్దకు చేరింది. ఈ ధరలు తెలుగు రాష్ట్రాలతో పాటు, ముంబై, చెన్నై, మరియు బెంగళూరు వంటి నగరాలకు వర్తిస్తాయి. అయితే, ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 900 తగ్గింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ. 97,000 వద్దకు చేరింది.

    బంగారం ధరల తగ్గుదలకు కారణాలు మరియు కొనుగోలు దారులకు సూచనలు

    అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడుతున్న మార్పుల కారణంగానే బంగారం ధరలు భారీగా తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఈ ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు సైతం చెబుతున్నారు. అమెరికా – చైనా దేశాలు ప్రతీకార సుంకాలను తగ్గించుకోవడం కూడా బంగారం ధరలు తగ్గడానికి ఒక కారణమని తెలుస్తోంది. 90 రోజుల వరకు కొత్త సుంకాలు ఆ రెండు దెసలలో అమలులో ఉంటాయి. కాబట్టి గోల్డ్ రేటు కొంతవరకు తగ్గుముఖం పట్టిందనిపిస్తోంది. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. బంగారం ధరలు తగ్గినప్పుడే పసిడి ప్రియులు కొనుగోలు చేయడం ఉత్తమం. కాబట్టి ధరలు తగ్గుతున్నప్పుడు.. బంగారం కొనాలనే ఆలోచన ఉన్నవారు వెంటనే కొనుగోలు చేసుకోవడం ఉత్తమం.

  • బంగారం కొనడానికి ఇదే మంచి సమయం!.. అమాంతం తగ్గుతున్న ధరలు

    బంగారం కొనడానికి ఇదే మంచి సమయం!.. అమాంతం తగ్గుతున్న ధరలు

    Gold and Silver Price: బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయా, ఎప్పుడు కొనుగోలు చేద్దామా అని ఎదురుచూసే వారికి ఇది నిజంగా శుభవార్త. పసిడి ధరలు (Gold Prices) మే 14వ తేదీన మరోసారి తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. నిన్న కొంత పెరిగిన ధరలు, ఈరోజు స్వల్పంగా తగ్గడం గమనార్హం. ఈ కథనంలో, తెలుగు రాష్ట్రాలు మరియు దేశ రాజధాని ఢిల్లీలో బంగారం, వెండి ధరల తాజా వివరాలు (Gold and Silver Price Today) వివరంగా తెలుసుకుందాం.

    హైదరాబాద్, విజయవాడలో నేటి బంగారం ధరలు

    తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ మరియు విజయవాడలలో బంగారం ధరలు ఈరోజు (మే 14) ఇలా ఉన్నాయి:

    • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర: రూ. 500 తగ్గి, రూ. 88,050 వద్ద స్థిరపడింది.
    • 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర: రూ. 540 తగ్గి, రూ. 96,060 వద్ద నిలిచింది.

    ఇదే విధమైన ధరల తగ్గుదల గుంటూరు, ప్రొద్దుటూరు, విజయనగరం వంటి నగరాలతో పాటు దేశంలోని ఇతర ముఖ్య నగరాలైన ముంబై, బెంగళూరు, చెన్నైలలో కూడా కొనసాగుతోంది.

    దేశ రాజధాని ఢిల్లీలో పసిడి పతనం (Gold Rate in Delhi)

    దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు ఈ రోజు (బుధవారం, మే 14) తగ్గాయి. ఇక్కడ తాజా రేట్లు క్రింది విధంగా ఉన్నాయి:

    • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర: రూ. 500 తగ్గి, రూ. 88,200 వద్ద ఉంది.
    • 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర: రూ. 540 తగ్గి, రూ. 96,210 వద్ద కొనసాగుతోంది.

    వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? (Silver Price Update)

    బంగారంతో పాటు వెండి ధరలు కూడా వినియోగదారులకు ముఖ్యమైనవే. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి:

    ప్రధాన నగరాల్లో కేజీ వెండి ధర

    తెలుగు రాష్ట్రాల్లో (హైదరాబాద్, విజయవాడ), అలాగే ముంబై, చెన్నై మరియు బెంగళూరులో కేజీ వెండి ధర రూ. 1,09,000 వద్ద స్థిరంగా ఉంది.

    ఢిల్లీలో కేజీ వెండి ధర

    అయితే, దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం కేజీ వెండి ధర రూ. 97,900 వద్ద ఉంది. దీనిని బట్టి చూస్తే, ఢిల్లీలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే స్వల్పంగా ఎక్కువగా ఉన్నప్పటికీ, వెండి ధరలు మాత్రం కొంత తక్కువగానే ఉన్నాయని స్పష్టమవుతోంది.

    బంగారం ధరలు తగ్గడానికి కారణం ఏమిటి?

    దేశంలో బంగారం ధరలు తగ్గడానికి అంతర్జాతీయ పరిణామాలు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా, అమెరికా మరియు చైనా మధ్య కుదిరిన వాణిజ్య సుంకాల ఒప్పందం (Tariff Deal) ఈ తగ్గుదలకు దోహదపడినట్లు తెలుస్తోంది.

    అమెరికా-చైనా టారిఫ్ డీల్ వివరాలు:

    • ప్రారంభంలో, అమెరికా ఉత్పత్తులపై చైనా 125 శాతం వరకు సుంకాలను విధించింది.
    • దీనికి ప్రతిగా, చైనా ఉత్పత్తులపై అమెరికా ఏకంగా 145 శాతం వరకు సుంకాలను విధించింది.
    • ఇటీవల ఇరు దేశాల మధ్య కుదిరిన ఒక ఒప్పందం ప్రకారం, ప్రతీకార సుంకాలను 115 శాతం మేర తగ్గించుకున్నాయి.
    • అంటే, ఇప్పుడు చైనా అమెరికాపై విధించే సుంకం 10 శాతానికి (125% – 115%) తగ్గింది.
    • అదేవిధంగా, అమెరికా కూడా చైనాపై విధించే సుంకం 30 శాతానికి (145% – 115%) చేరింది.

    అమెరికా మరియు చైనా కుదుర్చుకున్న ఈ కొత్త సుంకాలు 90 రోజుల పాటు అమలులో ఉంటాయి. ఈ రెండు అగ్రదేశాల మధ్య కుదిరిన ఒప్పందం కారణంగా స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి, ఇది బంగారం వంటి సురక్షిత పెట్టుబడులపై ఒత్తిడి తగ్గించి, ధరలు తగ్గుముఖం పట్టడానికి దారితీసిందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని కూడా వారు అంచనా వేస్తున్నారు.

  • ఏప్రిల్ 2025లో ఎక్కువమంది కొన్న టాప్ 10 కార్లు: జాబితా ఇదే..

    ఏప్రిల్ 2025లో ఎక్కువమంది కొన్న టాప్ 10 కార్లు: జాబితా ఇదే..

    Top Selling Cars India April 2025: సొంతంగా కారును కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో చాలామంది కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఇండియన్ మార్కెట్లో కార్ సేల్స్ మంచిగా జరుగుతున్నాయి. ఈ తరుణంలో 2025 ఏప్రిల్ నెలలో దేశీయ విఫణిలో ఎక్కువమంది ఈ కారును కొనుగోలు చేశారు. టాప్ 10 జాబితాలో నిలిచిన కార్లు ఏవి అనే వివరాలు వెల్లడయ్యాయి. ఆ విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

    ఏప్రిల్ 2025 కార్ సేల్స్: హ్యుందాయ్ క్రెటా అగ్రస్థానం

    నివేదికల ప్రకారం, 2025 ఏప్రిల్ నెలలో అత్యధికంగా అమ్ముడైన కారుగా హ్యుందాయ్ క్రెటా రికార్డు సృష్టించింది. ఈ కారు గత నెలలో ఏకంగా 17,016 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి, సేల్స్ చార్టులో అగ్రస్థానంలో నిలిచింది. 2024 ఏప్రిల్ నెల అమ్మకాలతో పోలిస్తే, క్రెటా అమ్మకాలు 10.2 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం.

    మారుతి సుజుకి ఆధిపత్యం: టాప్ 10లో 7 స్థానాలు కైవసం

    టాప్ 10 కార్ల జాబితాలో మారుతి సుజుకి కంపెనీకి చెందిన కార్లు ఏకంగా 7 స్థానాలను కైవసం చేసుకున్నాయి. దీనిని బట్టి ప్రతి 10 మంది కార్ల కొనుగోలుదారులలో 7 మంది మారుతి సుజుకి కార్లనే ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇది మారుతి సుజుకి బ్రాండ్‌పై ప్రజలకు ఉన్న అపారమైన నమ్మకాన్ని, డిమాండ్‌ను సూచిస్తుంది. గత నెలలో మారుతి డిజైర్, బ్రెజ్జా, ఎర్టిగా, స్విఫ్ట్, ఫ్రాంక్స్, వ్యాగన్ ఆర్, బాలెనొ వంటి మోడళ్లు గణనీయమైన అమ్మకాలను నమోదు చేశాయి.

    ఏప్రిల్ 2025: టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు మరియు వాటి అమ్మకాలు

    హ్యుందాయ్ క్రెటా తరువాత, మిగిలిన స్థానాల్లో నిలిచిన కార్లు మరియు వాటి అమ్మకాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

    • 2. మారుతి డిజైర్: 16,996 యూనిట్లు
    • 3. మారుతి బ్రెజ్జా: 16,917 యూనిట్లు
    • 4. మారుతి ఎర్టిగా: 15,780 యూనిట్లు
    • 5. మహీంద్రా స్కార్పియో: 15,534 యూనిట్లు
    • 6. టాటా నెక్సాన్: 15,457 యూనిట్లు
    • 7. మారుతి స్విఫ్ట్: 14,592 యూనిట్లు
    • 8. మారుతి ఫ్రాంక్స్: 14,345 యూనిట్లు
    • 9. మారుతి వ్యాగన్ ఆర్: 13,413 యూనిట్లు
    • 10. మారుతి బాలెనొ: 13,180 యూనిట్లు

    హ్యుందాయ్ క్రెటా: ఎందుకింత ప్రజాదరణ?

    భారతదేశంలో అత్యధికంగా కొనుగోలు చేస్తున్న కార్ల జాబితాలో హ్యుందాయ్ క్రెటా ఒక ప్రధాన మోడల్‌గా నిలుస్తోంది. ఈ కారు మార్కెట్లోకి ప్రవేశించినప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు 12 లక్షల యూనిట్ల అమ్మకాలను సాధించినట్లు సమాచారం. అంటే, 12 లక్షల మందికి పైగా వినియోగదారులు హ్యుందాయ్ క్రెటా కారును ఎంచుకున్నారన్నమాట.

    హ్యుందాయ్ క్రెటా వేరియంట్లు మరియు ధరలు

    వివిధ వేరియంట్లలో లభ్యమవుతున్న హ్యుందాయ్ క్రెటా ప్రారంభ ధర రూ. 11.11 లక్షలు కాగా, టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 20.50 లక్షల (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా) వరకు ఉంది. 54 వేరియంట్లలో లభించే హ్యుందాయ్ క్రెటా ప్రస్తుతం పెట్రోల్, CNG మరియు ఎలక్ట్రిక్ రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి. CNG క్రెటా.. పెట్రోల్ మోడల్ కంటే కూడా కొంత ఎక్కువ మైలేజ్ అందిస్తుంది. ఎలక్ట్రిక్ క్రెటా ఒక ఫుల్ ఛార్జితో 390 కిమీ నుంచి 473 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని ధరలు రూ. 17.99 లక్షల నుంచి రూ. 24.38 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. క్రెటా కారు మంచి డిజైన్ మరియు అత్యాధునిక ఫీచర్స్ కలిగి ఉండటం వల్లనే అధిక అమ్మకాలు పొందుతోందని సమాచారం.

  • ఊహకందని రీతిలో భారీగా తగ్గిన గోల్డ్ రేటు: బంగారం కొనడానికి ఇదే రైట్ టైమ్!

    ఊహకందని రీతిలో భారీగా తగ్గిన గోల్డ్ రేటు: బంగారం కొనడానికి ఇదే రైట్ టైమ్!

    Gold Price Drop India: దాదాపు ఆరు రోజుల నిరంతర పెరుగుదల తరువాత, భారతదేశంలో బంగారం ధరలు ఈరోజు (మే 9) అమాంతం తగ్గుముఖం పట్టాయి. గరిష్టంగా ₹1250 వరకు ధర తగ్గడంతో, దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి రేట్లలో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ కథనంలో వివిధ నగరాల్లో బంగారం మరియు వెండి ధరల తాజా వివరాలను స్పష్టంగా తెలుసుకుందాం.

    ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (Gold Prices Today in Major Cities)

    హైదరాబాద్, విజయవాడ మరియు ఇతర దక్షిణ భారత నగరాలు

    హైదరాబాద్ మరియు విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,150 తగ్గి, ₹90,150 వద్ద స్థిరపడింది. అదేవిధంగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,250 తగ్గి, ₹98,350 వద్ద నిలిచింది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు చాలా వరకు తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇదే విధమైన ధరల సరళి గుంటూరు, ప్రొద్దుటూరు, విజయనగరం వంటి నగరాలతో పాటు చెన్నై, ముంబై, బెంగుళూరులలో కూడా కొనసాగుతోంది.

    ఢిల్లీలో బంగారం ధరలు (Gold Prices in Delhi)

    దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కూడా బంగారం ధరలు ఊహించని రీతిలో తగ్గాయి. ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర ₹1,150 తగ్గి ₹90,300 వద్దకు చేరింది. అలాగే, 24 క్యారెట్ల బంగారం ధర ₹1,250 తగ్గి ₹98,500 వద్ద నిలిచింది. వరుసగా పెరుగుతూ వచ్చిన ధరలు ఈ రోజు తగ్గుముఖం పట్టడం గమనార్హం. ఈ తగ్గుదల కొనసాగుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

    వెండి ధరల పరిస్థితి (Silver Price Status)

    బంగారం ధరలు తగ్గినప్పటికీ, ఈ రోజు (శుక్రవారం, మే 9) వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. సిల్వర్ రేటు స్థిరంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ముంబై, బెంగళూరు మరియు చెన్నైలలో కూడా వెండి రేటులో ఎటువంటి మార్పు లేదు. ఇక్కడ కిలో వెండి ధర ₹1,11,000 వద్ద ఉంది. అయితే, ఢిల్లీలో కిలో వెండి ధర ₹99,000 వద్ద ఉంది, ఇది ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే కొంత తక్కువ అని చెప్పవచ్చు.

    బంగారం ధరల తగ్గుదలకు కారణాలు

    స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్న తరుణంలో బంగారం ధరలు అమాంతం తగ్గడం వినియోగదారులకు శుభవార్త. బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం కొనుగోలుదారుల సంఖ్య తక్కువగా ఉండటమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే, గోల్డ్ రేటు మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా.

    బంగారం కొనుగోలుకు ఇదే సరైన సమయమా? (Is this the right time to buy gold?)

    ప్రస్తుత ధరల తగ్గుదల నేపథ్యంలో, బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి అవకాశమని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, భవిష్యత్తులో భారత్ మరియు పాక్ మధ్య ఉద్రిక్తతలు (యుద్ధం) ముగిసిన తరువాత బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని అంచనాలున్నాయి. కాబట్టి, కొనుగోలుదారులు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిదని సలహా.

  • మూడురోజులు.. రూ.3490 పెరిగిన ధర: నేటి బంగారం ధరలు ఇలా..

    మూడురోజులు.. రూ.3490 పెరిగిన ధర: నేటి బంగారం ధరలు ఇలా..

    Today’s Gold Prices: బంగారం ధరలు మరోమారు షాకిచ్చాయి. నేడు (మే 07) కూడా తులం బంగారం ధర గరిష్టంగా రూ. 540 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. ఇంతకీ ఏ నగరం బంగారం రేటు ఎక్కువ ఉంది?, ఏ నగరం తగ్గువ ఉంది?, వెండి ధరలు పెరిగాయా?.. తగ్గాయా? అనే వివరాలు ఇక్కడ ఈ కథనంలో తెలుసుకుందాం.

    ఢిల్లీలో బంగారం ధరల జోరు

    ఢిల్లీలో గోల్డ్ రేటు పెరుగుదల వైపు అడుగులు పరుగులు పెట్టింది. మంగళవారం గరిష్టంగా రూ. 2730 పెరిగిన రేటు.. ఈ రోజు రూ. 540 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 99,150 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రామ్స్ గోల్డ్ రేటు రూ. 90,900 (రూ. 500 పెరిగింది) వద్ద ఉంది.

    తెలుగు రాష్ట్రాలు మరియు ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

    తెలుగు రాష్ట్రాల్లో (తెలంగాణ & ఆంధ్రప్రదేశ్) మాత్రమే కాకుండా గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో, అలాగే ముంబై, బెంగళూరులలో కూడా గోల్డ్ రేటు పెరిగింది. కాబట్టి ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 500 పెరిగి రూ. 90,750 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం రేటు 540 రూపాయలు పెరిగి రూ. 99,000 వద్దకు చేరింది.

    చెన్నైలో బంగారం ధరల పరిస్థితి

    ఇక చెన్నై నగరంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే విషయానికి వస్తే.. ఈ నగరం కూడా గోల్డ్ రేటు వరుసగా రూ. 500 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్) మరియు రూ. 550 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్) పెరిగింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90,750 వద్ద మరియు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90,900 వద్ద ఉన్నాయి.

    వెండి ధరలు: భారీగా పెరిగిన రేట్లు

    బంగారం ధరలు మెల్లగా పెరుగుతుంటే.. వెండి ధర మాత్రం ఒక్కసారిగా పెరిగింది. ఈ రోజు కేజీ వెండి రేటు రూ. 3100 పెరిగి రూ. 1,11,000 వద్ద నిలిచింది. ఇదే ధరలు దేశం మొత్తం మీద ఉంటాయి.

    ఢిల్లీలో వెండి ధర ఎంతంటే?

    అయితే ఢిల్లీలో మాత్రం సిల్వర్ రేటు రూ. 2100 పెరిగి రూ. 99,000 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే.. దేశరాజధానిలో బంగారం రేటు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ వెండి ధర దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే ఢిల్లీలోనే తక్కువగా ఉన్నట్లు స్పష్టమైంది.

    బంగారం ధరలు మరింత పెరుగుతాయా? భవిష్యత్ అంచనాలు

    ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే.. బంగారం ధరలు మరింత పెరిగే సూచనలు ఉన్నట్లే తెలుస్తోంది. అంతే కాకుండా గోల్డ్ రేటు లక్ష రూపాయలు దాటుతుందనటానికి కూడా ప్రస్తుత పరిస్థితులే కారణమని స్పష్టమవుతోంది. అయితే ధరలు తగ్గుతాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఇది ఎంతవరకు నిజమో స్పష్టంగా అర్థం కావడం లేదు. ఒకవేళా నిపుణులు చెప్పినట్లే తగ్గితే.. మరీ చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గే అవకాశం మాత్రం లేదని మాత్రం స్పష్టమవుతోంది. మొత్తానికి బంగారం ధరలు రాబోయే రోజుల్లో ఆకాశాన్నంటేలా దూసుకెళ్తున్నాయి. ఇది పసిడి ప్రియులను ఒకింత కలవరపాటుకు గురిచేస్తుందనే చెప్పాలి.

  • ఒక్కరోజే అమాంతం పెరిగిన గోల్డ్ రేటు.. నేటి కొత్త ధరలు ఇవే..

    ఒక్కరోజే అమాంతం పెరిగిన గోల్డ్ రేటు.. నేటి కొత్త ధరలు ఇవే..

    Gold and Siler Price Today: ఇంతకాలం తగ్గుతుంది, తగ్గిపోతుందనుకుంటున్న బంగారం ధరలు ఒక్కసారిగా షాకిచ్చాయి. ఒకేరోజు (2025 మే 6) అమాంతం పెరిగి.. పసిడి ప్రియులను సైతం కంగుతినేలా చేసింది. రూ. 90,000 కంటే తక్కువలో ఉన్న 22 క్యారెట్ల బంగారం.. ఇప్పుడు ఆ మార్కును దాటేసింది. 24 క్యారెట్ల గోల్డ్ లక్ష రూపాయలకు చేరువయ్యేందుకు పరుగులు పెడుతోంది. ఈ కథనంలో దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే విషయం తెలుసుకుందాం.

    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు (2025 మే 6)

    తెలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ) నిన్నటి నుంచి ధరల పెరుగుదల మొదలైంది. ఈ రోజు వరుసగా 22 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం రూ. 2,500 పెరిగి రూ. 90,250 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం రూ. 2,730 పెరిగి రూ. 98,460 వద్ద ఉంది. ఇదే ధరలు ప్రొద్దుటూరు, కడప వంటి ప్రాంతాల్లో మాత్రమే కాకుండా.. ముంబై, బెంగళూరు నగరాల్లో కూడా కొనసాగుతాయి.

    చెన్నైలో పసిడి ధరల వివరాలు

    చెన్నైలో ధరలు విషయానికి వస్తే.. ఇక్కడ కూడా ధరలు తెలుగు రాష్టాల్లో మాదిరిగానే ఉంటాయి. ఈ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రామ్స్ గోల్డ్ రేటు రూ. 2,500 పెరిగి రూ. 90,250 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం ధర రూ. 2,730 పెరిగి రూ. 98,460 వద్ద నిలిచింది. నిన్నటి ధరలో పోలిస్తే ఈ రోజు ధరలు భారీగా పెరిగిందని స్పష్టమవుతోంది.

    దేశ రాజధాని ఢిల్లీలో బంగారం రేట్లు

    దేశరాజధానిలో కూడా గోల్డ్ రేటు ఎగిసిపడింది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం రేటు రూ. 2,500 పెరిగింది. దీంతో ధర రూ. 90,400లకు చేరింది. అదే సమయంలో 24 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే.. దీని ధర రూ. 2,730 పెరిగింది. కాబట్టి 10 గ్రామ్స్ 24 క్యారెట్ పసిడి ధర రూ. 98,610లకు చేరింది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో బంగారం ధరలు కొంత ఎక్కువే అన్న విషయం స్పష్టంగా అవగతం అవుతోంది.

    వెండి ధరలు: బంగారం బాటలో కాకుండా తగ్గుముఖం

    బంగారం ధరలు భారీగా పెరిగినప్పటికీ.. వెండి ధరలు మాత్రం తగ్గుతూనే ఉంది. ఈ రోజు (2025 మే 6) కేజీ వెండి ధర హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో రూ. 1,07,900 వద్ద ఉంది. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 96,900 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే వెండి ధరలు దేశ వ్యాప్తంగా కేజీ మీద రూ. 1,000 తగ్గినట్లు తెలుస్తోంది.

    నిపుణుల అంచనాలు తారుమారు: బంగారం లక్షకు చేరువలో?

    అమెరికా టారిఫ్ భయాలు పూర్తిగా తొలగిపోయాయి. కాబట్టి బంగారం ధరలు తగ్గుముఖం పడతాయాని పలువురు ప్రముఖులు అంచనా వేశారు. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.. వారి అంచనాలు మొత్తం తారుమారు అయ్యాయని స్పష్టంగా తెలుస్తోంది. కొందరు ప్రముఖులు మాత్రం బంగారం ఇప్పుడే కోనేయండి అని కూడా ప్రస్తావించారు. ఎవరు ఎన్ని చెప్పినా ధరలు మాత్రం ఊరిస్తూ.. ఓ సారి తగ్గతూ, మరోమారు పెరుగుతూ.. లక్ష రూపాయలకు చేరిపోవడానికి తొందరపడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద త్వరలోనే బంగారం రేటు.. రూ. లక్షకు చేరుతుంది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు అని స్పష్టంగా తెలుస్తోంది.

  • అంచనాలకు అందని పసిడి: ఈ రోజు గోల్డ్ రేటు ఎలా ఉందంటే?

    అంచనాలకు అందని పసిడి: ఈ రోజు గోల్డ్ రేటు ఎలా ఉందంటే?

    Today Gold and Silver Price: 2025 మే నెల ప్రారంభమైనప్పటి నుంచి బంగారం ధరలు ఏ మాత్రం పెరగడంలేదు. గత రెండు రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలకు ఈ రోజు బ్రేక్ పడింది. దీంతో గోల్డ్ రేట్లలో ఎలాంటి మార్పు జరగలేదు. అయితే ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం.

    హైదరాబాద్, విజయవాడలలో నేటి బంగారం ధరలు (మే 3)

    హైదరాబాద్ మరియు విజయవాడలలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ రోజు (మే 3) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87,550 వద్ద స్థిరంగా ఉంది. అలాగే, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 95,510 వద్ద కొనసాగుతోంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలలో ఎలాంటి మార్పు లేదు.

    ఇదే ధరలు బెంగళూరు, ముంబై మరియు చెన్నై నగరాలతో పాటు గుంటూరు, ప్రొద్దుటూరు, కడప వంటి ప్రాంతాల్లో కూడా వర్తిస్తాయి.

    ఢిల్లీలో బంగారం ధరలు

    దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే స్వల్పంగా ఎక్కువగా ఉన్నప్పటికీ, నేడు ధరలలో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో 22 క్యారెట్ల తులం (10 గ్రాములు) బంగారం ధర రూ. 87,700 వద్ద ఉండగా, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 95,660 వద్ద నిలిచింది. నిన్నటి ధరలకే ఇవి సమానంగా ఉన్నాయి.

    స్థిరంగా వెండి ధరలు

    బంగారం ధరల మాదిరిగానే వెండి ధరలు కూడా ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్, విజయవాడలతో పాటు బెంగళూరు, ముంబై మరియు చెన్నైలలో కూడా వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. ఈ నగరాల్లో కేజీ వెండి ధర రూ. 1,09,000 గా ఉంది.

    అయితే, ఢిల్లీలో కేజీ వెండి ధర కాస్త తక్కువగా, రూ. 98,000 వద్ద ఉంది. దేశ రాజధానిలో కూడా వెండి ధరలో నేడు ఎటువంటి మార్పు లేదు.

    బంగారం ధరలు తగ్గుముఖం పట్టడానికి కారణాలు?

    గత కొన్ని రోజులుగా బంగారం ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. ఏప్రిల్ నెలలో రూ. లక్ష మార్కును దాటిన 10 గ్రాముల బంగారం ధర, నేడు రూ. 95,000 స్థాయికి చేరుకుంది. అంటే దాదాపు రూ. 5,000 వరకు తగ్గినట్లు స్పష్టమవుతోంది.

    నిపుణుల విశ్లేషణ

    కొందరు నిపుణులు ఈ తగ్గుదల ధోరణి కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు గణనీయంగా తగ్గడానికి ప్రధాన కారణాలలో ఒకటి అమెరికా టారిఫ్ ప్రభావం తగ్గడమని విశ్లేషకులు భావిస్తున్నారు.

    అమెరికా ప్రతీకార సుంకాల భయాలు తగ్గడంతో, పెట్టుబడిదారులు బంగారం వంటి సురక్షిత పెట్టుబడుల నుంచి ఇతర మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంగా బంగారం కొనుగోళ్లు కొంత తగ్గినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ పసిడి ధరలు తగ్గేందుకు దోహదపడ్డాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద, బంగారం ధరలు ఇలాగే తగ్గుముఖం పడితే, పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది శుభవార్తే అని చెప్పవచ్చు.

  • పసిడి ప్రియులకు శుభవార్త: వరుసగా మూడో రోజూ తగ్గిన బంగారం ధర!

    పసిడి ప్రియులకు శుభవార్త: వరుసగా మూడో రోజూ తగ్గిన బంగారం ధర!

    Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త! భారతీయ మార్కెట్లో బంగారం ధర వరుసగా మూడో రోజు తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ రోజు (మే 2, 2025) భారతదేశంలో బంగారం ధర గరిష్టంగా రూ. 220 వరకు తగ్గింది. నిన్న భారీగా తగ్గిన పసిడి ధర, నేడు కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఈ కథనంలో, నేటి బంగారం మరియు వెండి ధరల వివరాలను తెలుసుకుందాం.

    నేటి బంగారం ధరల వివరాలు (మే 2, 2025)

    దేశవ్యాప్తంగా బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. వివిధ నగరాల్లో ధరల వివరాలు ఇక్కడ చూడవచ్చు.

    ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

    తెలుగు రాష్ట్రాలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ), బెంగళూరు, ముంబై మరియు చెన్నై నగరాల్లో ఈ రోజు (శుక్రవారం) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 200 తగ్గి రూ. 87,550 వద్ద స్థిరపడింది. అదేవిధంగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 220 తగ్గి రూ. 95,510 వద్ద కొనసాగుతోంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ తగ్గుదల స్వల్పమే అని చెప్పవచ్చు.

    ముఖ్యంగా చెన్నైలో కూడా వరుసగా మూడో రోజు బంగారం ధర తగ్గడం గమనార్హం. ఇక్కడ కూడా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 87,550 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 95,510 గాను ఉంది.

    ఢిల్లీలో బంగారం ధరలు

    దేశ రాజధాని నగరం ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 200 తగ్గి రూ. 87,700 వద్ద ఉంది. అలాగే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 220 తగ్గి రూ. 95,660 వద్ద ట్రేడ్ అవుతోంది.

    పెరిగిన వెండి ధరలు

    బంగారం ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ, వెండి ధరలు మాత్రం నేడు భారీగా పెరిగాయి. కేజీ వెండి ధర ఏకంగా రూ. 2,000 పెరిగి రూ. 1,09,000 వద్దకు చేరింది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై మరియు చెన్నై వంటి నగరాల్లో ఇదే ధర కొనసాగుతోంది. అయితే, ఢిల్లీలో సిల్వర్ ధర కొంత తక్కువగా ఉంటుంది. ఇక్కడ కేజీ వెండి ధర రూ. 98,000 వద్ద ఉంది.

    మూడు రోజుల తగ్గుదల & మార్కెట్ సరళి

    గత మూడు రోజులుగా దేశంలో బంగారం ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ మూడు రోజుల్లో గరిష్టంగా రూ. 2,460 వరకు ధర తగ్గింది. ఈ ధోరణి కొనసాగితే, రాబోయే రోజుల్లో బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

    అయితే, ధరల తగ్గుదల నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు పెరుగుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఇటీవల జరిగిన అక్షయ తృతీయ నాడు ఒక్కరోజే సుమారు రూ. 12,000 కోట్ల విలువైన బంగారం అమ్మకాలు జరిగాయని సమాచారం. దీన్ని బట్టి చూస్తే, ధరలలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య తగ్గడం లేదని స్పష్టమవుతోంది.

  • అక్షయ తృతీయ 2025: ఈ ఒక్కరోజే ఎంత బంగారం కొన్నారో తెలుసా?

    అక్షయ తృతీయ 2025: ఈ ఒక్కరోజే ఎంత బంగారం కొన్నారో తెలుసా?

    Akshaya Tritiya 2025 Gold Sales: బంగారం ఎప్పుడైనా కొనుగోలు చేయొచ్చు. కొందరు పండుగలకు కొనుగోలు చేస్తే.. మరికొందరు పెళ్లిళ్లకు కొనుగోలు చేస్తారు. అయితే అక్షయ తృతీయకు మాత్రం దాదాపు అందరూ గోల్డ్ కొనాలని అనుకుంటారు. డబ్బున్నవారు ఎక్కువ బంగారం కొనుగోలు చేస్తే.. మధ్యతరగతి లేదా పేదవారు కనీసం ఒక గ్రామ్ బంగారమైన కొనుగోలు చేయాలని అనుకుంటారు.

    రికార్డు స్థాయిలో బంగారం, వెండి అమ్మకాలు

    ఇలా అనుకోవడం వల్లనే.. నిన్న (అక్షయ తృతీయ 2025) ఒక్క రోజే ఏకంగా భారతదేశంలో ఏకంగా రూ. 16000 కోట్ల విలువైన బంగారం & వెండి అమ్మకాలు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.

    ధరల పెరుగుదల ఉన్నప్పటికీ.. గోల్డ్ రేటు తులం లక్ష రూపాయలకు చేరువైనప్పటికీ.. కొనుగోలుదారులు మాత్రం అస్సలు తగ్గలేదు. ఎగబడి మరీ బంగారం కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. ఇలా కొనుగోలు చేయడంతోనే సుమారు 15 టన్నుల కంటే ఎక్కువ బంగారం అమ్ముడైపోయింది.

    అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొనాలి?

    హిందూ క్యాలెండర్ ప్రకారం.. అత్యంత పవిత్రమైన రోజుగా భావించే అక్షయ తృతీయ శ్రేయస్సుకు, అదృష్టం మరియు కొత్త పనుల ప్రారంభానికి అనుకూలమైనది భావిస్తారు. అందులోనూ బంగారం కొనుగోలు చేసి తీసుకొస్తే.. సాక్షాత్తు మహాలక్ష్మినే ఇంటికి తెచ్చినట్లు భావిస్తారు. ఈ కారణంగానే చాలామంది గోల్డ్ కొనుగోలు చేస్తారు.

    పురాణాల ప్రకారం ప్రాముఖ్యత

    పురాణాల ప్రకారం.. ఈ రోజు (అక్షయ తృతీయ) మహా శివుడు కుబేరునికి అపారమైన సంపదను ఇవ్వడమే కాకుండా, లక్ష్మి దేవికి అదృష్ట దేవత అనే బిరుదును కూడా అనుగ్రహించారు. లక్ష్మి అంటే డబ్బు లేదా బంగారం. డబ్బు ఉంటే ఖర్చు అయిపోతుంది. బంగారం మాత్రం మనదగ్గరే శాశ్వతంగా ఉంటుందని ఈ పండుగ రోజున బంగారం కొనుగోలు చేయడం సంప్రదాయంగా పెట్టుకున్నారు.

    మార్కెట్ వర్గాల అంచనాలు

    ఢిల్లీలోని చాందిని చౌక్ పార్లమెంట్ సభ్యుడు మరియు అఖిల భారత వర్తకుల సమాఖ్య (CAIT) జాతీయ కార్యదర్శి ‘ప్రవీణ్ ఖండేల్వాల్’ మాట్లాడుతూ.. అక్షయ తృతీయ రోజు దేశం మొత్తం మీద రూ. 12000 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు మరియు సంబంధిత వస్తువులు అమ్ముడయ్యాయి. వెండి వ్యాపారం రూ. 4000 కోట్లు జరిగినట్లు అంచనా అని పేర్కొన్నారు. ధరలు పెరుగుదల ఉన్నప్పటికీ.. బంగారంపై పెట్టుబడి ఉత్తమమని భావిస్తున్న చాలామంది గోల్డ్ కొనుగోలు చేశారని అన్నారు. ధరలు ఇంకా తక్కువగా ఉండి ఉంటే.. బంగారం కొనుగోలు మరింత ఎక్కువగా ఉండేదని స్పష్టం చేశారు.

    గత కొన్నేళ్లుగా బంగారం, వెండి ధరలు

    గత సంవత్సరాలతో పోలిస్తే బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. వాటి వివరాలు:

    • 2022: 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 52,700, కేజీ వెండి ధర రూ. 65,000.
    • 2023: 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 61,800, కేజీ వెండి ధర రూ. 76,500.
    • 2024: 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 74,900 వద్ద నిలిచింది (అక్షయ తృతీయ నాటికి).

    దీన్ని బట్టి చూస్తే.. ప్రతి ఏటా గోల్డ్ రేటు ఎంతగా పెరుగుతోందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు, ఇది పెట్టుబడిగా బంగారం ప్రాముఖ్యతను సూచిస్తుంది.

  • అక్షయ తృతీయ ఎఫెక్ట్: తలకిందులైన అంచనాలు.. ఒక్కసారిగా తగ్గిన గోల్డ్ రేటు!

    అక్షయ తృతీయ ఎఫెక్ట్: తలకిందులైన అంచనాలు.. ఒక్కసారిగా తగ్గిన గోల్డ్ రేటు!

    Gold Price Today: అక్షయ తృతీయ సందర్భంగా బంగారం ధరలు భారీగా పెరుగుతాయని చాలామంది ఊహించారు. కానీ ఊహలన్నీ తారుమారు అయ్యాయి. బుధవారం స్వల్పంగా తగ్గిన ధరలు గురువారం (1 మే 2025) నాటికి భారీగా తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాలలో గోల్డ్ రేటు గణనీయంగా తగ్గింది. నేడు భారతదేశంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.

    రికార్డు స్థాయి నుంచి తగ్గిన పసిడి

    ఏప్రిల్ 22న రూ. 1,01,350 వద్ద ఉన్న 10 గ్రాముల బంగారం ధర ఈ రోజు రూ. 95,730 వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే దేశంలో బంగారం ధరలు ఎంతలా తగ్గాయో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

    హైదరాబాద్, విజయవాడ & ఇతర నగరాల్లో ధరలు

    ఈ రోజు హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు మరియు ముంబై నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 2,000 రూపాయలు తగ్గి రూ. 87,750 వద్ద నిలిచింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు 2,180 రూపాయలు తగ్గి రూ. 95,730 వద్దకు చేరింది.

    ఢిల్లీలో బంగారం ధరల పరిస్థితి

    దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 87,900 వద్ద ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే.. ఈ రేటు రూ. 2,000 తక్కువ. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు కూడా రూ. 2,160 తగ్గింది. దీంతో స్వచ్ఛమైన గోల్డ్ రేటు రూ. 95,880 కావడం గమనార్హం.

    చెన్నైలో తగ్గిన రేట్లు

    చెన్నైలో కూడా ధరలు తగ్గుముఖం పట్టాయి. నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 87,750 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 95,730 వద్ద నిలిచింది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 2,000 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ. 2,180 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్) తక్కువ.

    వెండి ధరలు కూడా డౌన్

    బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా రెండు రోజుల నుంచి తగ్గుముఖం పట్టాయి. నిన్న మాదిరిగానే ఈ రోజు (మే 1) కూడా సిల్వర్ రేటు 2,000 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర హైదరాబాద్, బెంగళూరు, ముంబై మరియు విజయవాడలలో రూ. 1,07,000 వద్ద ఉంది. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 98,000 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే.. దేశంలోని ఇతర నగరాల కంటే ఢిల్లీలో వెండి రేటు కొంత తక్కువని తెలుస్తోంది.

    గోల్డ్ రేటు తగ్గుదలపై నిపుణుల అంచనాలు

    బంగారం రేటు ఇంకా తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ టీ కియోసాకి కూడా ఇప్పుడు బంగారం కొనుగోలు చేయడం ఉత్తమమని వారం రోజుల క్రితమే సూచించారు. పేదవాళ్ళు బంగారం కొనుగోలు చేస్తే.. రాబోయే రోజుల్లో ధనవంతులు అవుతారని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.. బంగారం ధరలు రాబోయే రోజుల్లో ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందనిపిస్తోంది. అనుకున్న విధంగా అన్నీ జరిగి బంగారం ధరలు తగ్గితే.. ఇప్పటి వరకు బంగారం కొనుగోలు చేయాలని వేచిచూస్తున్న వారి పంట పండినట్లే.