చండీగఢ్‌ వ్యాపారవేత్తతో పెళ్లి?: స్పందించిన త్రిష

సినీ పరిశ్రమలో పరిచయమే అవసరం లేని ప్రముఖులలో నటి త్రిష ఒకరు. ఎందుకంటే 2004లో వర్షం సినిమాతో తెలుగు సినిమాల్లో కనిపించిన ఈ అమ్మడు 2025లో రిలీజ్ అవుతున్న సినిమాల్లో కనిపిస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నాలుగు పదుల వయసుదాటినా.. ఏ మాత్రం తగ్గకుండా కుర్ర హీరోయిన్లలకు కూడా గట్టి పోటీ ఇస్తోంది. అయితే ఎప్పుడూ.. త్రిష పెళ్లికి సంబంధించిన రూమర్స్ తెరమీదకు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా అదే టాపిక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనిపై త్రిష కూడా స్పందించింది.

పెళ్లి వార్తలపై స్పందించిన త్రిష

ఇప్పుడు తెరమీదకు వచ్చిన సమాచారం.. చండీగఢ్‌కు చెందిన ఒక వ్యాపారవేత్తతో త్రిష పెళ్లి జరగనున్నట్లు, దీనికి త్రిష తల్లిదండ్రులు కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్త పూర్తిగా అబద్దం అని చెప్పడమే కాకుండా.. ”నా కోసం నా జీవితాన్ని ప్లాన్ చేస్తున్నవారంటే నాకు ఎంతో ఇష్టం, పెళ్లి గురించి మాత్రమే కాకుండా.. హనీమూన్ షెడ్యూల్ కూడా చెప్పేయండి” అని త్రిష కొంచెం ఘాటుగానే సమాధానం ఇచ్చింది. దీంతో త్రిష ఇప్పుడు పెళ్లి చేసుకోవడం లేదని స్పష్టంగా చెప్పేసింది.

త్రిష పెళ్ళికి సంబంధించిన పుకార్లు.. తెరమీదకు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చాలా సార్లు త్రిష పెళ్ళికి సంబంధించిన వార్తలు చాలానే వచ్చాయి. అవన్నీ అబద్దాలని నటి వెల్లడించింది. ఇప్పుడు కూడా అలాంటి రూమర్ ఒకటి వెలుగులోకి రావడంతో.. త్రిష స్పందించింది.

పెళ్లి గురించి చెప్పిన త్రిష

సాధారణంగా.. నటి త్రిష తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను చాలా గోప్యంగా ఉంచుతుంది. అయితే ఈ మధ్య కాలంలో తన వివాహం గురించి చెబుతూ.. సరైన వ్యక్తిని కలిస్తే.. తాను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చింది. అయితే ఆ సరైన వ్యక్తి ఎప్పుడు, ఎలా కలుస్తాడో.. త్రిష పెళ్లి ఎప్పుడు చూస్తామో అని పలువురు అభిమానులు ఎదురు చూస్తున్నారు.

గతంలో నిశ్చితార్థం

2015లో త్రిషకు.. వరుణ్ మణియన్ అనే ఒక వ్యాపారవేత్తతో నిశ్చితార్థం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ బంధం పెళ్లివరకు వెళ్లలేదు. ఆ తరువాత త్రిష ఎప్పుడూ పెళ్లి గురించి బహిరంగంగా చెప్పలేదు. ఈమె తల్లిదండ్రులు కూడా పెళ్ళికి సంబంధించిన విషయాలను పెంచుకోవడం లేదు. మొత్తానికి 42 ఏళ్ల వయసులో కూడా త్రిష.. సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

నటి త్రిష గురించి

1983 మే 4న తమిళనాడులోని మద్రాసు(ఇప్పుడు చెన్నై)లో కృష్ణన్ అయ్యర్ & ఉమా అయ్యర్ దంపతులకు జన్మించారు. చెన్నైలోనే తన ఎడ్యుకేషన్ పూర్తి చేసింది. ఆ తరువాత మోడలింగ్‌లోకి అడుగుపెట్టి.. ప్రింట్ అండ్ టెలివిజన్ వాణిజ్య ప్రకటనల్లో కనిపించారు. 1999లో మిస్ చెన్నై విజేతగా నిలిచింది. ఆ తరువాత 2001లో బ్యూటిఫుల్ స్మైల్ అవార్డును సైతం దక్కించుకుంది. నిజానికి ఈమె మొదట్లో సినిమాల్లోకి రావాలనుకులేదు.. తాను సైకాలజిస్ట్ కావాలని అనుకున్నట్లు గతంలో ఓ సందర్భంలో త్రిష పేర్కొన్నారు. అయితే పాపులర్ నటిగా గొప్ప గుర్తింపు పొందింది. ఈమె కేవలం తెలుగులో మాత్రమే కాకుండా.. తమిళంలో కూడా చాలా సినిమాల్లో నటించింది. ఈమెకు తమిళ అభిమానుల సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంది.