10వేల మందికి ఏఐ నైపుణ్య శిక్షణ: ఎన్విడియాతో ఒప్పందం

AP Signs MoU with NVIDIA For AI: ఈ రోజు టెక్నాలజీ అంటే.. ముందుగా వినిపిస్తున్న పేరు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్). ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో AI టెక్నాలజీ గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. అన్ని రంగాల్లోనూ ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. అలాంటి టెక్నాలజీని రాష్ట్రంలో (ఆంధ్రప్రదేశ్) కూడా ప్రవేశపెట్టాలని.. ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగానే ఏఐ యూనివర్సిటీకి ఎన్వీడియా కంపెనీ సహకారం అందించడానికి ముందుకు వచ్చింది.

రాష్ట్రంలో ఏఐ నైపుణ్యాభివృద్ధికి ఎన్విడియాతో కీలక ఒప్పందం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్రంలోని సుమారు 10వేలమంది విద్యార్థులకు ఏఐలో శిక్షణ ఇవ్వడానికి, మరో 500 స్టార్టప్‌ల అభివృద్ధికి ఎన్వీడియా కంపెనీతో శుక్రవారం ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఉండవల్లిలోని నివాసంలో విద్యాశాఖా మంత్రి ‘నారా లోకేష్’ సమక్షంలో ఉన్నత విద్యాశాఖ అధికారులు, కంపెనీ ప్రతినిధుల సమక్షంలో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఎన్విడియా సహకారం – మంత్రి నారా లోకేష్ చొరవ

రాష్ట్రంలోని సుమారు 10వేలమంది విద్యార్థులకు ఏఐలో ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు.. ఏఐ యూనివర్సిటీ అభివృద్ధికి కూడా ఎన్వీడియా తన సహకారం అందించనుంది. అక్టోబర్ 2024లో మంత్రి నారా లోకేష్ ముంబైలో ఎన్వీడియా సీఈఓ ‘జెన్సన్ హుయాంగ్’ను కలిశారు. ఆ సమయంలో ఏపీలోని అమరావతిలో ఏర్పాటు చేయనున్న ఏఐ యూనివర్సిటీకి సహకారం అందించాలని కోరారు. లోకేష్ ప్రతిపాదనకు హుయాంగ్ సానుకూలంగా స్పందించారు. ఆ తరువాత ఇప్పటికే ఎన్వీడియా కంపెనీతో ఒప్పందం జరిగింది.

ఏపీని ఏఐ రీసెర్చ్ హబ్‌గా మార్చే ప్రభుత్వ లక్ష్యం

భారతదేశంలో ఏపీని ఏఐ రీసర్చ్ హబ్ చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే దిగ్గజ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందం వల్ల రాష్ట్రంలోని ఇంజినీరింగ్ విద్యార్థులకు ఏఐ మీద శిక్షణ ఇవ్వనున్నారు.

ప్రభుత్వ మద్దతు మరియు వనరులు

ఏఐ యూనివర్సిటీకి కావాల్సిన పరికరాలు (కంప్యూటింగ్ వనరులు, సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్స్ మరియు హార్డ్‌వేర్ సామర్త్యలు) ప్రభుత్వం అందిస్తుంది. అంతే కాకుండా.. ప్రభుత్వమే విద్యార్థులకు పరిశోధనావకాశాలను, ఉద్యోగావకాశాలను కల్పించనుంది.

ఒప్పంద కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు

రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం కార్యక్రమంలో పాల్గొన్నారు:

  • మంత్రి నారా లోకేష్
  • ఎన్వీడియా సౌత్ ఇండియా ఎండీ దూపర్
  • గణేష్ మహబాల
  • ఉన్నత విద్యా కార్యదర్శి
  • ఉన్నత విద్యామండలి చైర్మన్ మధుమూర్తి

ఏఐ టెక్నాలజీ: ప్రపంచవ్యాప్త ప్రభావం మరియు భవిష్యత్ దిశ

ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని చాలా దేశాల్లో దిగ్గజ కంపెనీలు సైతం ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాయి. ఈ రోజు భారతదేశం ఏఐ టెక్నాలజీలో వేగంగా ముందుకు సాగుతోంది. ఈ కారణంగానే.. పలు కంపెనీలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీ మరిన్ని రంగాలకు విస్తరిస్తుందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు.

వివిధ రంగాల్లో ఏఐ అనువర్తనాలు, ఉద్యోగాలపై ప్రభావం

ఏఐ టెక్నాలజీ ఒక్క ఐటీ రంగంలో మాత్రమే కాకుండా.. ఎడ్యుకేషన్, మీడియా, టెలి కమ్యూనికేషన్ మరియు ఆటోమొబైల్ రంగాల్లో కూడా విస్తరించి ఉంది. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయని చాలామంది గతంలోనూ.. ఇప్పుడు కూడా భయపడుతున్నారు. అయితే ఏఐ వల్ల ఉద్యోగాలు పోవు, ఏఐ టెక్నాలజీ పనిని వేగవంతం చేయడానికి పనికొస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే ఉద్యోగులు లేదా ఉద్యోగార్థులు మారుతున్న ప్రపంచంలో.. వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని నేర్చుకోవడం ఉత్తమం.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *