24.7 C
Hyderabad
Sunday, March 16, 2025
Home Blog Page 14

టాక్‌ ఆఫ్‌ ద టౌన్‌గా లేడీ అఘోరి.. ఆమె వాడే కారేంటో తెలుసా?

0

Lady Aghori Naga Sadhu Car Details: అఘోర అంటేనే.. అన్నీ త్యజించి జనసంచారానికి దూరంగా ఎక్కడో గుహల్లో, అడవుల్లో తపస్సు చేసుకుంటూ బతికేస్తారని చాలా వీడియోల్లో చెబుతుంటారు. అయితే ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరి నాగ సాధువుగా చెప్పుకుంటూ నగ్నంగా తిరుగుతున్న ఓ మహిళ మాత్రం తాను ప్రయాణించడానికి ఓ కారును ఉపయోగిస్తోంది. ఇంతకీ ఈమె ఉపయోగించే కారు పేరు ఏంటి? దాని వివరాలు ఏంటనేది ఇక్కడ తెలుసుకుందాం..

మహిళా అఘోరి నాగసాధు ఉపయీగిస్తున్న కారు హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఐ20 (Hyundai i20) అని తెలుస్తోంది. అయితే ఈ కారు సాధారణ కారు మాదిరిగా కాకుండా.. ముందు, వెనుక, సైడ్లలో ఎక్కడ చూసిన కొంత భయాన్ని కలిగించే దేవుని బొమ్మలతో నిండి ఉంది. కారులో లెక్కకు మించిన పుర్రెలు, రుద్రాక్షలు ఉన్నట్లు సమాచారం.

ఇక్కడ తెలుసుకోవకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. అఘోరి ఉపయోగిస్తున్న కారుకు రిజిస్ట్రేషన్ ప్లేట్ లేదు. ఆ ప్రదేశంలో అఘోరి నాగ సాధు అనే అక్షరాలు ఉన్నాయి. ఇది చట్ట రీత్యా నేరం. ఎందుకంటే ఎవ్వరైనా పబ్లిక్ రోడ్డుపై ప్రయాణించాలంటే వారి వాహనానికి నెంబర్ ప్లేట్ తప్పనిసరి. కానీ లేడీ అఘోరి నాగ సాధు కారుకు నెంబర్ ప్లేట్ లేదు. దీనిపైన సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

హ్యుందాయ్ ఐ20

ఇక హ్యుందాయ్ ఐ20 కారు విషయానికి వస్తే.. ఇది మార్కెట్లో అత్యధిక అమ్మకాలు పొందిన బ్రాండ్ యొక్క పాపులర్ కారు. ఈ కారు ప్రారంభ ధర రూ. 7.04 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది చూడటానికి సింపుల్‌గా ఉన్నప్పటికీ.. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. కాబట్టి అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. ఇప్పటి వరకు ఈ కారును సుమారు 18 లక్షల కంటే ఎక్కువ మంది కొనుగోలు చేశారు అని కొన్ని గణాంకాలు చెబుతున్నాయి.

2008లో భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన హ్యుందాయ్ ఐ20.. కాలక్రమంలో అనేక అప్డేట్స్ పొందింది. ఇది 2023లో చివరిసారి అప్డేట్ పొందినట్లు సమాచారం. ఆరు ఎయిర్‌బ్యాగులు కలిగిన ఐ20 కారు 26 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా.. ఇందులో 60 కంటే ఎక్కువ బ్లూలింక్ కనెక్టెడ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

ఇక లేడీ అఘోరీ నాగసాధు విషయానికి వస్తే.. ఈమె బట్టలు లేకుండా మేడలో రుద్రాక్ష మాలలు వేసుకుని, చేతిలో త్రిశూలం పట్టుకుని చాలా దేవాలయాలలోకి ప్రవేశిస్తుంది. దేవాలయాల్లో కూడా తనదైన శైలిలో పూజలు చేస్తుంది. కొంతమంది ఆమెను వ్యతిరేకిస్తుంటే.. మరికొందరు ఇళ్లకు పిలిపించుకుని ప్రత్యేకంగా పూజలు చేయించుకుంటున్నారు.

యూట్యూబ్ ఇంటర్వ్యూలలో..

అఘోరి నాగసాధు చాలా యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలలో అనేక సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది. మెదడును ఆహారంగా తింటానని, నెలసరి (ఋతుక్రమం) సమయంలో ఎవరికీ కనిపించకుండా ఉంటానని, ఇలా చాలా విషయాలను వెల్లడిస్తూ.. సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.

కారును కూడా భయం కల్పించే విధంగా డిజైన్ చేసుకుని ఉండటం కూడా చూడవచ్చు. కాళీమాత బొమ్మలు, శివుని బొమ్మకు.. కారు ముందు భాగంలో పుర్రెలు.. అఘోరి అన్న పదానికి సరిగ్గా సూటయ్యే విధంగా కారును రెడీ చేసుకుంది. ఈమె ఎక్కడికెళ్లినా అక్కడ జనం తండోపతండాలుగా గుమికూడుతారు. దీనికి కారణం ఈమె విచిత్ర వేషధారణ అనే చెప్పాలి.

అఘోరి ఆత్మాహుతి..

కొంతమంది ఈ లేడీ అఘోరి నాగసాధుని దైవం భావిస్తే.. మరికొందరు ఈమెను వ్యతిరేకిస్తున్నారు. అఘోరాలు కంటికి కనిపించకుండా దైవధ్యానంలోనే ఉంటారని చెబుతూ.. కేవలం పబ్లిసిటీ కోసమే ఆమె ఆలా చేస్తుందని దూషిస్తున్నారు. మంగళగిరిలో కొంతమంది యువకులు ఆమెను నిలువరిస్తే, వారిపై రాళ్లతో దాటి చేయడమే కాకుండా.. త్రిశూలంతో కూడా వాళ్ళను భయపెట్టేసింది.

Also Read: పుష్ప 2 విడుదలే కాలేదు.. అప్పుడే లగ్జరీ కారు కొనేసింది: దీని రేటెంతో తెలుసా?

కొన్ని రోజులకు ముందు లేడీ అఘోరి ఆత్మాహుతి చేసుకోబోతున్నట్లు కూడా చెప్పి.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఇలా ఎన్నో సందర్భాల్లో సంచలన వ్యాఖ్యలు చేసి అందరిని భయభ్రాంతులను చేసింది. ఈమెకు వ్యతిరేఖంగా ఇంటర్వ్యూలు ఇచ్చినవారు కూడా చాలామందే తెరమీదకు వచ్చారు. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరి నాగసాధు బాగా ఫేమస్ అయిపోయింది.

పుష్ప 2 విడుదలకు ముందే.. లగ్జరీ కారు కొనేసిన శ్రీలీల: దీని రేటెంతో తెలుసా?

0

Pushpa 2 Actor Sreeleela Buys New Range Rover: శ్రీలీల.. చిత్రసీమలో ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయమే అవకాశం లేదు. ఎందుకంటే చిత్రాంగద సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించిన ఈ అమ్మడు, ఆ తరువాత కన్నడ సినిమాల్లో కూడా నటించింది. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగుపెట్టి.. ఆ తరువాత ధమాకా, స్కంద, భగవంత్ కేసరి మరియు గుంటూరు కారం వంటి సినిమాల్లో నటించి బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున సినిమా పుష్ప-2లో ఐటం సాంగ్‌లో కనిపించనుంది. ఈ సినిమా డిసెంబర్ 4న విడుదల కానుంది.

పుష్ప 2 సినిమా విడుదలకు ముందే నటి శ్రీలీల ఓ ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేసినట్లు సమాచారం. దీని ధర ఏకంగా రూ. 3 కోట్లు కావడం గమనార్హం. ఇటీవల ఈ కారుతో శ్రీలీల హైదరాబద్ విమానాశ్రయంలో కనిపించింది. ఈ కారు గురించి పూర్తి వివరాలు ఇక్కడ చూసేద్దాం..

రేంజ్ రోవర్

నటి శ్రీలీల కొనుగోలు చేసిన కారు ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన ‘రేంజ్ రోవర్ ఎల్‌డబ్ల్యుబీ’ (Range Rover LWB) అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ కారు బోరాస్కో గ్రే కలర్ ఆప్షన్‌లో ఉంది. ఈ రంగు చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉండటం గమనించవచ్చు.

రేంజ్ రోవర్ విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు తమ గ్యారేజిలో ల్యాండ్ రోవర్ కార్లను చేర్చారు. ఈ జాబితాలోకి ఇప్పుడు శ్రీలీల కూడా చేరింది. రేంజ్ రోవర్ ప్రారంభ ధరలు రూ. 2.36 కోట్లు (ఎక్స్ షోరూమ్) అని తెలుస్తోంది.

భారతదేశంలో అందుబాటులో ఉన్న రేంజ్ రోవర్ మూడు పవర్‌ట్రెయిన్ ఎంపికలలో అందుబాటులో ఉంది. అవి పెట్రోల్, డీజిల్ మరియు ప్లగ్ ఇన్ హైబ్రిడ్. పెట్రోల్ వెర్షన్ 3.0 లీటర్ 6 సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 510 బీహెచ్‌పీ పవర్, 700 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డీజిల్ మరియు ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వెర్షన్స్ కూడా ఉత్తమ పనితీరును అందిస్తాయి.

Also Read: ‘పుష్ప 2’ సినిమాలో అల్లు అర్జున్ వాడిన కారు ఇదే.. దీని గురించి తెలుసా?

మంచి డిజైన్ మరియు లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన రేంజ్ రోవర్ ఎల్‌డబ్ల్యుబీ.. అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, లేన్ డిపార్చర్ వార్ణింగ్, ఫార్వార్డ్ కొలీషియన్ బ్రేక్, ఆటోమాటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, హై బీమ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, చైల్డ్ సీట్ యాంకర్ పాయింట్స్ మరియు సీట్ బెల్ట్ వార్ణింగ్ వంటి మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి.

శ్రీలీల గ్యారేజిలోని ఇతర కార్లు

నటి శ్రీలీల రేంజ్ రోవర్ కారును మాత్రమే కాకుండా.. హోండా సిటీ కారును కూడా కలిగి ఉంది. అంతకంటే ముందు ఈమె మారుతి ఎస్-ప్రెస్సో కారును ఉపయోగించేది. అయితే వీటన్నింటిలో కంటే.. ఇటీవల కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ ఖరీదు చాలా ఎక్కువ. మొత్తానికి ఈమె కోట్ల రూపాయల విలువైన కారును కొనుగోలు చేసేసింది.

రేంజ్ రోవర్ కార్లను కలిగి ఉన్న సెలబ్రిటీలు

ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కార్లను కలిగి ఉన్న సెలబ్రిటీల జాబితాలో రష్మిక మందన్నా, శృతి హాసన్, అనుష్క శర్మ, కత్రినా కైఫ్, మలైకా అరోరా, అక్షయ్ కుమార్, అర్జున్ కపూర్, సల్మాన్ ఖాన్, అలియా భట్, పూజ హెగ్డే, అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, సంజయ్ దత్, షారుఖ్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ మరియు పృద్విరాజ్ మొదలైన వారు ఉన్నారు.

శ్రీలీల ప్రస్తుతం చేస్తున్న సినిమాలు & రెమ్యునరేషన్

ప్రస్తుతం నటి శ్రీలీల మాస్ జాతర, రాబిన్‌హుడ్ వంటి చిత్రాలతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా కనిపించనుంది. ఇక పోతే డిసెంబర్ 4న తెరపైకి రానున్న పుష్ప 2 సినిమాలో కిస్సిక్ అనే పాటకు చిందులేస్తూ కనిపించనుంది. శ్రీలీల రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. ఈమె ఒక సినిమాలో నటించడానికి సుమారు రూ. 2 కోట్లు వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం. అయితే పుష్ప సినిమాలో ఒక్క పాటకు మాత్రమే రూ. 2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్స్: ఒకటి లాంచ్.. మరొకటి రివీల్

0

Royal Enfield New Bikes Goan Classic 350 And Scram 440: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశీయ మార్కెట్లో మరో బైక్ లాంచ్ చేసింది. ఇప్పటికే టూ వీలర్ విభాగంలో దూసుకెళ్తున్న కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త బైకులను పరిచయం చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు తాజాగా ‘గోవాన్ క్లాసిక్ 350’ (Goan Classic 350) లాంచ్ చేసింది. స్క్రామ్ 440 బైకును ఆవిష్కరించింది. ఈ సరికొత్త బైకుల గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూసేద్దాం..

ధరలు (Price)

రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంచ్ చేసిన కొత్త గోవాన్ క్లాసిక్ 350.. బాబర్ స్టైల్ మోటార్‌సైకిల్. ఇది రెట్రో డిజైన్ పొందుతుంది. ఇది రెండు వేరియంట్లలో లభించనున్నట్లు సమాచారం. కాబట్టి బేస్ వేరియంట్ ధర రూ. 2.35 లక్షలు కాగా.. టాప్ వేరియంట్ ధర రూ. 2.38 లక్షలు (ఎక్స్ షోరూమ్, చెన్నై). కంపెనీ ఈ బైకును 2024 మోటోవర్స్ రైడింగ్ ఫెస్టివల్‌ (2024 Motoverse Riding Festival)లో లాంచ్ చేసింది.

డిజైన్ (Design)

కొత్త గోవాన్ క్లాసిక్ 350 బైక్.. రౌండ్ ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ పైలట్ లైట్స్, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్ వంటివి పొందుతుంది. ఇది పొడవైన హ్యాంగర్ హ్యాండిల్‌బార్ పొందుతుంది. పిలియన్ కోసం సీటును అమర్చుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్. అయితే ఈ కొత్త బైక్ పర్పుల్ హేజ్, రేవ్ రెడ్, షాక్ బ్లాక్ మరియు ట్రిప్ టీల్ అనే కలర్ ఆప్షన్​లలో లభిస్తుంది.

ఫీచర్స్ (Features)

గోవాన్ క్లాసిక్ 350 యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది డిజిటల్ అనలాగ్ కన్సోల్ పొందుతుంది3. ఇది స్పీడో మీటర్, ట్రిప్ మీటర్, ఓడోమీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్ వంటి వాటిని ప్రదర్శిస్తుంది. అయితే ట్రిప్పర్ నావిగేషన్ కోసం సెకండరీ డయల్స్ ఉంటాయి.

ఇంజిన్ (Engine)

రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350 బైక్ 350 సీసీ విభాగంలో లాంచ్ అయిన బైక్. కాబట్టి ఇది 349 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 20.2 హార్స్ పవర్. 27 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది. సుమారు 197 కేజీల బరువున్న ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్లు కావడం గమనార్హం.

జావా 42 బాబర్, జావా పెరాక్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవాల్ క్లాసిక్ 350 బైక్.. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, డ్యూయెల్ రియర్ స్ప్రింగ్ పొందుతుంది. ట్యూబ్‌లెస్ టైర్‌లను కలిగిన ఈ బైక్ యొక్క ముందు భాగంలో 19 ఇంచెస్ వీల్స్, వెనుక 16 ఇంచెస్ వీల్స్ ఉన్నాయి. అయితే రెండు చివర్లలో డిస్క్ ఉంటుంది. ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 170 మీమీ వరకు ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 440 (Royal Enfield Scram 440)

కంపెనీ గోవాన్ క్లాసిక్ 350 లాంచ్ చేయడంతో పాటు.. స్క్రామ్ 440 బైకును ఆవిష్కరించింది. ఇది చూడటానికి దాని మునుపటి స్క్రామ్ 411 మాదిగిగా కనిపించినప్పటికీ.. కొన్ని అప్డేటెడ్ ఫీచర్లను చూడవచ్చు. ఈ బైకులో 443 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 6500 rpm వద్ద 25.4 హార్స్ పవర్ మరియు 4000 rpm వద్ద 34 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ కలిగిన ఈ బైక్ మంచి పనితీరును అందిస్తుందని తెలుస్తోంది.

Also Read: భారత్‌లో ఒకేసారి నాలుగు బైకులు లాంచ్: గన్ లాంటి డిజైన్, రేసుగుర్రం లాంటి స్పీడ్

కంపెనీ ఆవిష్కరించిన ఈ బైక్ 2025 జనవలో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడే దీని ధరలు కూడా వెల్లడవుతాయి. బహుశా ఈ బైక్ ధర దాని మునుపటి మోడల్ కంటే కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది కూడా రెండు వేరియంట్లలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. టాప్ ఫోర్స్ మోడల్ అల్లాయ్ వీల్స్ కలిగి.. ట్యూబ్‌లెస్ టైర్లను పొందుతుంది. ట్రైల్ వెర్షన్ స్పోక్ వీల్స్ పొందనున్నట్లు తెలుస్తోంది. అయితే కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ ఎప్పుడు ప్రారంభిస్తుంది. డెలివరీలకు సంబంధించిన చాలా విషయాలను వెల్లడించాల్సి ఉంది.

సల్మాన్ ఖాన్ తండ్రి మొదటి బైక్ ఇదే.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

0

Salman Khan Reveals His Dad First Bike: ప్రముఖ సినీ నటుడు ‘సల్మాన్ ఖాన్’ (Salman Khan) గురించి దాదాపు అందరికి తెలుసు. సినిమాల్లో నటిస్తూ.. ఎంతోమంది అభిమానుల మనసు దోచిన ఈ సల్లూభాయ్ తన సోషల్ మీడియా ఖాతాలో తన తండ్రి బైక్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ ఫోటోలలో కనిపించే బైక్ ఏది? దాని వివరాలు ఏంటి? అనేది ఇక్కడ తెలుసుకుందాం.

తండ్రితో మంచి అనుబందం కలిగి ఉన్న సల్మాన్ ఖాన్.. తన తండ్రితో తన ప్రేమ, జీవిత ప్రయాణానికి సంబంధించి ‘యాంగ్రీ యంగ్ మెన్’ అనే డాక్యుమెంటరీ కూడా రిలీజ్ చేశారు. ఇదిలా ఉండగా.. తాజాగా సల్మాన్ ఖాన్ తన తండ్రి మొదటి బైక్ ‘ట్రయంఫ్ టైగర్ 100’ (Triumph Tiger 100) ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది 1956 నాటి బైక్ అయినప్పటికీ.. మంచి కండీషన్‌లో ఉంది.

ట్రయంఫ్ టైగర్ 100

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలను గమనిస్తే.. ఒక ఫొటోలో బైకు మీద సల్మాన్ ఖాన్ తండ్రి కూర్చుని ఉన్నారు. మరో ఫొటోలో సల్మాన్ ఖాన్ కూర్చుని ఉండటం చూడవచ్చు. ఈ ఫోటోలు అభిమానులను తెగ ఫిదా చేసేస్తున్నాయి. లెక్కకు మించిన వీక్షణలు పొందిన ఈ ఫోటోలపై.. అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం మార్కెట్లో కూడా ట్రయంఫ్ కంపెనీ బైకులు ఉన్నాయి. కానీ ఈ బ్రాండ్ యొక్క టైగర్ 100 బైకులు ఉత్పత్తి దశలో లేదు. అయితే కొంతమంది ఆటోమొబైల్ ఔత్సాహికులు వీటిని ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. కాబట్టి అప్పుడప్పుడు రోడ్ల మీద కనిపిస్తూ ఉంటాయి. ఇది చూడటానికి చాలా గంభీరంగా, శక్తివంతంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది అడ్వెంచర్ బైకుగా కూడా పనికొస్తుంది.

ట్రయంఫ్ టైగర్ 100 బైక్ 1939 – 1940 మరియు 1946 – 1973 మధ్య బాగా ఫేమస్ అయ్యింది. కఠినమైన భూభాగాల్లో కూడా రైడ్ చేయడానికి టైగర్ 100 అద్భుతంగా ఉంటుంది. ఈ బైక్ టాప్ స్పీడ్ 100 మైల్స్ / గం. అప్పట్లో గొప్ప సక్సెస్ సాధించిన ఈ బైక్ ఎంతోమంది వాహన ప్రేమికులను ఆకర్శించింది. అప్పట్లో ఈ బైక్ ధర రూ. 9,500 నుంచో రూ. 10,500 మధ్య ఉండేదని సమాచారం.

ప్రస్తుతం మార్కెట్లో ట్రయంఫ్ టైగర్ 100 బైక్ లేదు.. కానీ దీని స్థానంలో టైగర్ టీ100 వచ్చింది. ఈ బైక్ ఉత్పత్తి కూడా ప్రస్తుతం లేదు. ఎందుకంటే యుద్ధ సమయంలో జర్మన్లు ట్రయంఫ్ ఫ్యాక్టరీని ధ్వంసం చేశారు. అయితే టైగర్ 100 బైక్ రియర్ స్వింగ్ ఆర్మ్ సెటప్ పొందింది.

సల్మాన్ ఖాన్ కార్ అండ్ బైక్ కలెక్షన్స్

నటుడు సల్మాన్ అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇందులో 2023 రేంజ్ రోవర్ ఎస్‍వీ ఎల్‌డబ్ల్యుబీ 3.0 (రూ. 4.4 కోట్లు), బుల్లెట్ ఫ్రూఫ్ నిస్సాన్ పెట్రోల్ (రూ. 2 కోట్లు), బుల్లెట్ ఫ్రూఫ్ ల్యాండ్ రోవర్ క్రూయిజర్ ఎల్‌సీ200 (రూ. 2.10 కోట్లు), రేంజ్ రోవర్ వోగ్ బయోగ్రఫీ (రూ. 1.82 కోట్లు), ఓల్డ్ జనరేషన్ రేంజ్ రోవర్ (రూ. 20 లక్షలు), ఆడి ఆర్ఎస్7 (రూ. 2.24 కోట్లు), మెర్సిడెస్ బెంజ్ జీఎల్ క్లాస్ (రూ. 77.68 లక్షలు), మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ 43 ఏఎంజీ కూపే (రూ. 1.12 కోట్లు), మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ (రూ. 1.86 కోట్లు), బీఎండబ్ల్యూ ఎక్స్6 (రూ. 1.04 కోట్లు), లెక్సస్ ఎల్ఎక్స్ (రూ. 2.82 కోట్లు), సుజుకి ఇంట్రూడర్ ఎం1800ఆర్ (రూ. 15 లక్షలు) మరియు సుజుకి హయబుసా (రూ. 15.1 లక్షలు).

Also Read: భారత్‌లో ఒకేసారి నాలుగు బైకులు లాంచ్: గన్ లాంటి డిజైన్, రేసుగుర్రం లాంటి స్పీడ్

సల్మాన్ ఖాన్ పూర్తి పేరు ‘అబ్దుల్ రషీద్ సలీం సల్మాన్ ఖాన్’. ఈయన 1965 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జన్మించారు. 1988లో బీవీ హో తో ఐసీ సినిమాతో సల్మాన్ ఖాన్ సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత కాలంలో అనేక సినిమాల్లో నటించి పాపులర్ అయ్యారు. ఈయన రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు, రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సైతం కైవసం చేసుకుంది.

భారత్‌లో ఒకేసారి నాలుగు బైకులు లాంచ్: గన్ లాంటి డిజైన్, రేసుగుర్రం లాంటి స్పీడ్

0

Brixton Bikes Launched in India: ప్రపంచంలో ప్రతి రోజూ ఏదో ఒక మూల.. ఏదో ఒక వెహికల్ లాంచ్ అవుతూనే ఉంది. భారతదేశంలో కూడా ఇదే వరుస కొనసాగుతోంది. గ్లోబల్ మార్కెట్లో అగ్ర ఆటోమొబైల్ మార్కెట్ల సరసన చేసిన ఇండియాలో వాహనాలు విరివిగా లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ‘బ్రిక్స్‌టన్ మోటార్‌సైకిల్స్’ (Brixton Motorcycle) దేశీయ విఫణిలో ఒకేసారి నాలుగు బైకులు లాంచ్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే?.. ఈ కథనం చదివేయాల్సిందే..

బ్రిక్స్‌టన్ బైకులు

  • క్రాస్‌ఫైర్ 500ఎక్స్
  • క్రాస్‌ఫైర్ 500 ఎక్స్‌సీ
  • క్రోమ్‌వెల్ 1200
  • క్రోమ్‌వెల్ 1200 ఎక్స్

బ్రిక్స్‌టన్ క్రాస్‌ఫైర్ 500ఎక్స్ (Brixton Crossfire 500X)

కంపెనీ లాంచ్ చేసిన బైకులలో ఒకటి ఈ క్రాస్‌ఫైర్ 500ఎక్స్. దీని ధర రూ. 4.74 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది బ్రిక్స్‌టన్ లాంచ్ చేసిన బైకులలో అత్యంత సరసమైన మోడల్. నియో రెట్రో స్టైల్ కలిగిన ఈ బైక్ చూడటానికి హస్క్‌వర్నా విట్‌పిలెన్ మాదిరిగా ఉంటుంది. ఎల్ఈడీ లైటింగ్, అడ్జస్టబుల్ కేవైబీ సస్పెన్షన్ వంటివి ఈ బైకులో ఉంటాయి.

క్రాస్‌ఫైర్ 500ఎక్స్ బైక్ లిక్విడ్ కూల్డ్ 486 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 47.6 హార్స్ పవర్, 43 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. 13.5 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగిన ఈ బైక్ 190 కేజిల బరువుంటుంది. ఇది సింగిల్ పిస్టన్ యూనిట్. ముందు, వెనుక వైపు డిస్క్ బ్రేక్స్ కలిగి.. డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ కూడా పొందుతుంది.

బ్రిక్స్‌టన్ క్రాస్‌ఫైర్ 500ఎక్స్‌సీ (Brixton Crossfire 500XC)

కంపెనీ లాంచ్ చేసిన మరో బైక్ క్రాస్‌ఫైర్ 500ఎక్స్‌సీ విషయానికి వస్తే.. ఇది చూడటానికి 500ఎక్స్ మాదిరిగా ఉన్నప్పటికీ, కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. దీని ధర రూ. 5.19 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ అదనపు కాస్మొటిక్ అప్డేటెడ్స్ కలిగి ఉండటం వల్ల ధర కొంత ఎక్కువగా ఉంటుంది. 195 కేజీల బరువున్న ఈ బైక్ ఫ్రంట్ పెండర్, 19 ఇంచెస్ ఫ్రంట్ వీల్ వంటివి పొందుతుంది. ఇది 500ఎక్స్ మాదిరిగే అదే ఇంజిన్ పొందుతుంది, కాబట్టి పర్ఫామెన్స్ ఆ బైక్ మాదిరిగానే ఉంటుందని సమాచారం.

బ్రిక్స్‌టన్ క్రోమ్‌వెల్ 1200 (Brixton Cromwell 1200)

క్రోమ్‌వెల్ 1200 బైక్ విషయానికి వస్తే.. దీని ధర రూ. 7.84 లక్షలు (ఎక్స్ షోరూమ్). చూడటానికి ట్రయంఫ్ బోన్‌విల్లే మాదిరిగా ఉండే ఈ బైక్ లిక్విడ్ కూల్డ్ 1222 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 83 హార్స్ పవర్, 108 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైకులో 16 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. దీని బరువు 235 కేజీలు కావడం గమనార్హం.

బ్రిక్స్‌టన్ క్రోమ్‌వెల్ 1200 బైక్ ఎల్ఈడీ లైటింగ్, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, యాంటీ థెఫ్ట్ సిస్టం వంటివి కూడా పొందుతుంది. డిజైన్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ బైక్.. లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఈ బైక్ స్పోక్డ్ రిమ్స్, ట్యూబ్డ్ టైర్‌లను పొందుతుంది. కాబట్టి దీని ద్వారా ఉత్తమ రైడింగ్ అనుభూతిని పొందవచ్చు.

క్రోమ్‌వెల్ 1200ఎక్స్ (Brixton Cromwell 1200X)

ఇక చివరగా బ్రిక్స్‌టన్ యొక్క నాలుగో బైక్ లేదా చివరి బైక్ క్రోమ్‌వెల్ 1200ఎక్స్. దీని ధర ఏకంగా రూ. 9.11 లక్షలు (ఎక్స్ షోరూమ్). చూడటానికి స్క్రాంబ్లర్ మాదిరిగా ఉన్న ఈ బైక్ క్రోమ్‌వెల్ 1200 బైక్ కంటే కూడా రూ. 1.27 లక్షలు ఎక్కువ. ఇది చిన్న ఫ్లైస్క్రీన్, ట్యాన్ బ్రౌన్ సీటు, హెడ్‌లైట్ గ్రిల్ వంటివి పొందుతుంది.

Also Read: మూడు కార్లమ్మేసి కొత్తది కొన్న సన్నీలియోన్‌.. ఎందుకంటే?

ఇప్పుడిప్పుడే తన ఉనికిని చాటుకుంటున్న బ్రిక్స్‌టన్ వచ్చే ఏడాది నాటికి భారతదేశంలో మరో ఎనిమిది (అహ్మదాబాద్, హైదరాబాద్, పూణే, థానే, కొల్హాపూర్, గోవా మరియు బెంగళూరు) నగరాలలో విస్తరించనున్నట్లు సమాచారం. మొత్తానికి బ్రాండ్ దేశీయ విఫణిలో తన హవా చాటుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది.

బామ్మ మాట విన్నాడు.. ఇండియాలో మూడో వ్యక్తిగా రికార్డ్ కొట్టాడు

0

Indian Buys Mclaren 675 LT After Grand Mother Suggestion: ఏ కారు కొంటే బాగుంటుంది చెప్పు అని ఎప్పుడైనా.. మీ బామ్మను అడిగారా?, ఒక వేళా అడిగి ఉంటే.. నాకేం తెలుసు మనవడా అని చెప్పే బామ్మలే ఎక్కువగా ఉంటారు.. కదా!. అయితే ఈ కథనంలో మనం చెప్పుకోబోతున్న బామ్మ మాత్రం, ఏకంగా మెక్‌లారెన్ కారును కోనేయ్ మనవడా అంటూ చెప్పేసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.

వీడియోలో గమనిస్తే బామ్మ మెక్‌లారెన్ కారును కొనాలని చెప్పించి. పోర్స్చే కార్లు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయని, వాటికి డోర్స్ కూడా రెక్కలు మాదిరిగా లేదని చెబుతూ.. మెక్‌లారెన్ కారు కొనమని చెబుతుంది. బామ్మ మాట ప్రకారమే మనవడు ‘మెక్‌లారెన్ 765 ఎల్‌టీ’ (McLaren 765 LT) కొనుగోలు చేశాడు. ఈ కారు డెలివరీకి సంబంధించిన సంఘటనలను కూడా ఇక్కడ చూడవచ్చు.

బామ్మ కోసం మెక్‌లారెన్

ఈ కారును దుబాయ్‌లో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మెక్‌లారెన్ 765 ఎల్‌టీ కారు ధర ఇండియన్ మార్కెట్లో రూ. 12 కోట్లు వరకు ఉంటుందని సమాచారం. అయితే దీని ధర దుబాయ్‌లో కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ కారు కొనుగోలుతో మనవడు అతి చిన్న వయసులోనే మెక్‌లారెన్ 765 ఎల్‌టీ సొంత చేసుకున్న మూడో భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు.

ఇప్పటికి గ్లోబల్ మార్కెట్లో చాలా తక్కువమంది మాత్రమే మెక్‌లారెన్ కారును కొనుగోలు చేశారు. ఇందులో బామ్మ మాట విన్న మనవడు కూడా ఒకరు కావడం గమనార్హం. ఈ కారును డెలివరీ చేసుకునే సమయంలో ఆ మనవడి కుటుంబం మొత్తం అక్కడ ఉండటం చూడవచ్చు. మెక్‌లారెన్ 765 ఎల్‌టీ కారును కొనుగోలు చేసిన మూడో భారతీయుడు అయినప్పటికీ.. కేరళకు చెందిన మొదటి వ్యక్తి ఇతడే కావడం గమనించదగ్గ విషయం.

బామ్మ మాట విని రూ. 12 కోట్ల ఖరీదైన కారును కొనుగోలు చేసిన మనవడు, ఆ కారును ఇండియాకు తీసుకురావడానికి కూడా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడి కావాల్సి ఉంది. నిజానికి ఈ కారు లిమిటెడ్ ఎడిషన్. కేవలం 765 మంది మాత్రమే దీనిని కొనుగోలు చేయగలరు. ఈ కారు ధర ఎక్కువ కాబట్టి ప్రస్తుతానికి అన్ని యూనిట్లు పూర్తిగా అమ్ముడవ్వలేదు.

ఇండియాలోని మెక్‌లారెన్ 765 ఎల్‌టీ యజమానులు

ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త నసీర్ ఖాన్ మొట్ట మొదటి మెక్‌లారెన్ 765 ఎల్‌టీ కారును కొనుగోలు చేశారు. రెండో కారును బెంగళూరుకు చెందిన రంజిత్ సుందర్‌మూర్తి కొనుగోలు చేశారు. రెండు కారు దుబాయ్ నుంచి ఇండియాకు దిగుమతి అయినట్లు తెలుస్తోంది. ఇక మూడో కారు బామ్మ మాట విన్న మనవడే అని తెలుస్తోంది.

మెక్‌లారెన్ 765 ఎల్‌టీ

ప్రపంచ మార్కెట్లోని అత్యంత ఖరీదైన కార్లలో ఒకటిగా నిలిచిన మెక్‌లారెన్ కంపెనీకి చెందిన 765 ఎల్‌టీ 4.0 లీటర్ ట్విన్ టర్బో వీ8 పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 765 పీఎస్ పవర్, 800 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ సీక్వెన్షియల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి.. వెనుక చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. కాబట్టి ఇది అద్భుతమైన పనితీరును అందిస్తుంది.

మెక్‌లారెన్ 765 ఎల్‌టీ కారు స్పైడర్ వెర్షన్ మాదిరిగా కూపే డిజైన్ పొందుతుంది. అయితే దీని బాడీ వర్క్ మొత్తం కార్బన్ ఫైబర్ నిర్మితం. ఈ కారు మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి అప్డేటెడ్ ఫ్రంట్ బంపర్, స్ప్లిటర్, సైడ్ స్కర్ట్స్, ర్యాప్‌రౌండ్ రియర్ బంపర్ వంటివన్నీ పొందుతుంది. ఫీచర్స్ కూడా చాలా ఆధునికంగా ఉంటాయి. కాబట్టి ఈ సూపర్ కారు అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

Also Read: మూడు కార్లమ్మేసి కొత్తది కొన్న సన్నీలియోన్‌.. ఎందుకంటే?

అన్ని విధాలా అనుకూలంగా ఉండే మెక్‌లారెన్ 765 ఎల్‌టీ కారును ధనవంతులు సైతం కొనడానికి వెనుకడుగు వేయడానికి ప్రధాన కారణం అధిక ధర. ఈ ఒక్క బ్రాండ్ కారు మాత్రమే కాకుండా చాలా ఖరీదైన బ్రాండ్ కార్ల పరిస్థితి కూడా ఇదే. కాబట్టి ఖరీదైన కార్ల అమ్మకాలు భారతీయ మార్కెట్లో మాత్రమే కాకుండా.. గ్లోబల్ మార్కెట్లో కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి.

 

View this post on Instagram

 

A post shared by ᴀɴᴀɴᴅ (@_anand912)

మూడు కార్లమ్మేసి కొత్తది కొన్న సన్నీలియోన్‌.. ఎందుకంటే?

0

Do You Know Why Sunny Leone Sold Benz And BMW: చిత్రసీమలో అగ్ర కథానాయకిగా.. తనకంటూ ఓ ప్రత్యేకతను తెచ్చుకున్న సెలబ్రిటీ ‘సన్నీ లియోన్’ (Sunny Leone) గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఈమె ఒకప్పుడు తన ఖరీదైన కార్లను విక్రయించి.. కొంత తక్కువ ధరలో లభించే కారును కొనుగోలు చేసింది. సన్నీ లియోన్ ఇలా చేయడానికి కారణం ఏమిటి? ఈమె ప్రస్తుతం ఏ కారును ఉపయోగిస్తోంది అనే మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

సన్నీ లియోన్ విక్రయించిన కార్లు

నిజానికి ఇతర సెలబ్రిటీల మాదిరిగానే సన్నీ లియోన్ ఒకప్పుడు ఖరీదైన బీఎండబ్ల్యూ 7 సిరీస్ మరియు మెర్సిడెస్ బెంజ్ జీఎల్ క్లాస్ కారుతో పాటు మరో లగ్జరీ కారును ఉపయోగించేది. సన్నీ లియోన్ ఉపయోగించిన మూడో కారు ఏదనేది స్పష్టంగా వెల్లడికాలేదు. అయితే ఈమె ఆ మూడు కార్లను విక్రయించి రూ. 38 లక్షల విలువైన ‘ఎంజీ గ్లోస్టర్’ (MG Gloster) కారును కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ కారునే ఎక్కువగా వినియోగిస్తున్నట్లు సమాచారం.

లగ్జరీ కార్లను విక్రయించడానికి కారణం?

రుతుపవనాల కారణంగా ముంబైలో విపరీతమైన వర్షాలు కురిశాయని, దీంతో గ్యారేజిలోకి వర్షపు నీరు చేరడం వల్ల ఖరీదైన కార్లను విక్రయించాల్సి వచ్చిందని సన్నీ లియోన్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఎంతో ఇష్టపడి కొనుగోలు చేసుకున్న అత్యంత ఖరీదైన కార్లు కొన్ని సార్లు వర్షాల కారణంగా చాలా దెబ్బతింటాయి. ఆ సమయంలో వాటిని రిపేర్ చేసుకోవడానికి భారీమొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కువమంది వర్షపు నీటివల్ల రిపేర్ అయిన వాహనాలను దాదాపు విక్రయించేస్తారు.

ఒకసారి నీటిలో మునిగిన కార్లలో చాలా సమస్యలు తలెత్తుతాయి. కారులోని ఎలక్ట్రానిక్స్ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఇంజిన్‌లోకి నీరు చేరటం వల్ల దాని పనితీరు కూడా బాగా తగ్గిపోతుంది. ఇలాంటి వాటిని రిపేర్ చేయడానికి చాలా డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలను ఎదుర్కోలేకనే.. ఎంత ఖరీదైన కారు అయినా.. వర్షపు నీటిలో మునిగితే దానిని నిర్దాక్షిణ్యంగా విక్రయించే అవకాశం ఉంది.

ఎంజీ గ్లోస్టర్ కొనుగోలు

నటి సన్నీ లియోన్ లగ్జరీ కార్లను విక్రయించి ఎంజీ గ్లోస్టర్ కారును కొనుగోలు చేసింది. ఈ కారుకు సన్నీ లియోన్ ‘ఇండియన్ ట్రక్’ అని పేరుపెట్టుకుంది. ప్రస్తుతం ఈమె ఎక్కువగా ఈ కారునే వినియోగిస్తున్నట్లు సమాచారం.

ఎంజీ గ్లోస్టర్ కారును కంపెనీ 2020లో మొదటిసారి పరిచయం చేసింది. చూడటానికి విలాసవంతంగా కనిపించే ఈ కారు భారీ ఎస్‌యూవీ. గ్లోస్టర్ 2.0 లీటర్ సింగిల్ టర్బో ఛార్జ్డ్ మరియు ట్విన్ టర్బో ఛార్జ్డ్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. స్లిగిల్ టర్బో వేరియంట్ 158 బిహెచ్‌పీ పవర్ మరియు 373 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ట్విన్ టర్బో ఛార్జ్డ్ ఇంజిన్ 212 బిహెచ్‌పీ, 478 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

Also Read: సన్నీలియోన్‌ గ్యారేజీలో ఇన్ని కార్లున్నాయా? ఒక్కో కార్‌ రేటు చూస్తే మతిపోవడం ఖాయం!

గ్లోస్టర్ యొక్క హై-ఎండ్ వేరియంట్ 4×4 ఫీచర్స్ కూడా పొందుతుంది. ఈ కారు ధరలు రూ. 38.30 లక్షల నుంచి రూ. 43.87 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఎంజీ గ్లోస్టర్ ఆధునిక డిజైన్ కలిగి.. చాలా వరకు అప్డేటెడ్ ఫీచర్లను పొందుతుంది. ఇందులో ఏసీ వెంట్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, పెద్ద సన్‌రూఫ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటి మరెన్నో ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి. ఈ కారణంగానే చాలామంది దీనిని ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు.

సన్నీ లియోన్ ఉపయోగించిన కార్లు (Sunny Leone కార్ Collection)

నటి సన్నీ లియోన్ ఎంజీ గ్లోస్టర్ కారును మాత్రమే కాకుండా మసెరటి కంపెనీకి చెందిన కార్లను ఉపయోగించారు. ఇందులో మసెరటి ఘిబ్లీ నెరిస్సిమో, మసెరటి క్వాట్రోపోర్టే, ఆడి ఏ5, బీఎండబ్ల్యూ 7 సిరీస్ మరియు మెర్సిడెస్ బెంజ్ జెఎల్350డీ వంటివి ఉన్నాయి. ఇతర సెలబ్రిటీలతో పోలిస్తే మసెరటి బ్రాండ్ కార్లను ఎక్కువగా ఇష్టపడి కొనుగోలు చేసిన నటి సన్నీ లియోన్ కావడం గమనార్హం.

కేటీఎమ్ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌..10 కేటీఎమ్ కొత్త బైకులు వచ్చేశాయ్..

0

KTM New Bikes Launched in India: యువతను తన బైకులతో ఎంతగానో ఆకట్టుకునే ‘కేటీఎమ్’ (KTM) ఒకేసారి ఏకంగా 10 బైకులను మార్కెట్లో లాంచ్ చేసింది. ఒకదాన్ని మించి.. మరొకటి చూపరులను ఎంతగానో కనువించు చేస్తున్నారు. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైకుల గురించి మరిన్ని వివరాలు వివరంగా ఇక్కడ చూసేద్దాం..

కంపెనీ లాంచ్ చేసిన బైకులు:

  • కేటీఎమ్ 1290 సూపర్ అడ్వెంచర్ ఎస్
  • కేటీఎమ్ 1390 సూపర్ డ్యూక్ ఆర్
  • కేటీఎమ్ 890 డ్యూక్ ఆర్
  • కేటీఎమ్ 890 అడ్వెంచర్ ఆర్
  • కేటీఎమ్ 50 ఎస్ఎక్స్
  • కేటీఎమ్ 65 ఎస్ఎక్స్
  • కేటీఎమ్ 85 ఎస్ఎక్స్
  • కేటీఎమ్ 250 ఎస్ఎక్స్-ఎఫ్
  • కేటీఎమ్ 450 ఎస్ఎక్స్-ఎఫ్
  • కేటీఎమ్ 350 ఈఎక్స్‌సీ-ఎఫ్

కేటీఎమ్ 1290 సూపర్ అడ్వెంచర్ (KTM 1290 Super Adventure)

New Luxury Bikes in India

ప్రముఖ వాహన తయారీ సంస్థ కేటీఎమ్ లాంచ్ చేసిన బైకులలో ఒకటి ఈ 1290 సూపర్ అడ్వెంచర్. దీని ధర రూ. 22.74 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). లాంచ్ రైడ్ చేయడానికి లేదా కఠినమైన భూభాగాల్లో ప్రయాణించడానికి దీనిని కంపెనీ ప్రత్యేకంగా రూపొందించింది. ఇది ప్రస్తుతం సింగిల్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తున్న ఈ బైక్.. బెంగళూరు మరియు పూణేలలో మాత్రమే విక్రయానికి ఉంది.

Also Read: మీకు తెలుసా!.. 2025లో భారత్‌లో లాంచ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లు ఇవే

23 లీటర్ల ఫ్యూయెల్ త్యాంక్ కెపాసిటీ కలిగిన ఈ బైక్ 1301 సీసీ వీ-ట్విన్ ఇంజిన్ పొందుతుంది. ఇది 9000 rpm వద్ద 160 హార్స్ పవర్, 6500 rpm వద్ద 138 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కాబట్టి లాంగ్ రైడ్ చేయడానికి కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ముందు భాగంలో 320 మిమీ డ్యూయెల్ డిస్క్ సెటప్, వెనుక 267 మిమీ డిస్క్ ఇందులో అమర్చబడి ఉన్నాయి.

కేటీఎమ్ 1390 సూపర్ డ్యూక్ ఆర్ (KTM 1390 Super Duck R)

KTM Big Bikes in India

కంపెనీ లాంచ్ చేసిన బైకులలో అత్యంత ఖరీదైన బైక్ ఈ 1390 సూపర్ డ్యూక్ ఆర్. దీని ధర రూ. 22.96 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ప్రస్తుతం కేటీఎమ్ యొక్క అత్యంత శక్తివంతమైన బైక్ ఏది అంటే.. 1390 సూపర్ డ్యూక్ ఆర్ అనే చెప్పాలి. ఇది డుకాటీ స్ట్రీట్‌ఫైటర్ వీ4 ఎస్, బీఎండబ్ల్యూ ఎస్1000ఆర్, ట్రయంఫ్ స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్ఎస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

కేటీఎమ్ 890 డ్యూక్ ఆర్ (KTM 890 Duke R)

890 Duke R of KTM Bike

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త కేటీఎమ్ 890 డ్యూక్ ఆర్ ధర రూ. 14.5 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 889 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ పొందుతుంది. ఇది బెంగళూరు, పూణేలలోని కేటీఎమ్ స్టోర్‌లలో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం. అయితే కంపెనీ ఈ బైకును కంప్లీట్ బిల్డ్ యూనిట్ (CBU) మార్గం ద్వారా మన దేశానికి దిగుమతి అవుతుందని తెలుస్తోంది.

కేటీఎమ్ 890 అడ్వెంచర్ ఆర్ (KTM 890 Adventure R)

KTM motor sports 890 Adventure R

కంపెనీ లాంచ్ చేసిన మరో బైక్ 890 అడ్వెంచర్ ఆర్. దీని ధర రూ. 15.80 లక్షలు (ఎక్స్ షోరూమ్). ట్రయంఫ్ టైగర్ 900 ర్యాలీ, బీఎండబ్ల్యూ ఎఫ్ 900 జీఎస్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ఈ బైక్.. బరువు 200 కేజీలు. దీనిని కంపెనీ ప్రధానంగా ఆఫ్ రోడింగ్ కోసం రూపొందించినట్లు తెలుస్తోంది. ఇది ఒక మిడ్ సైజ్ అడ్వెంచర్ బైక్.

కేటీఎమ్ డర్ట్ బైక్స్ (KTM Dirt Bikes)

Know the Price of KTM Dirt Bikes

ఆస్ట్రియన్ బైక్ తయారీ సంస్థ కేటీఎమ్ ఆరు డర్ట్ బైకులను లాంచ్ చేసింది. ఇందులో ఒకటి 50 ఎస్ఎక్స్. దీని ధర రూ. 4.75 లక్షలు. ఈ విభాగంలో లాంచ్ అయిన ఇతర బైకుల విషయానికి వస్తే.. అవి కేటీఎమ్ 65 ఎస్ఎక్స్ (రూ. 5.47 లక్షలు), 85 ఎస్ఎక్స్ (రూ. 6.69 లక్షలు), 250 ఎస్ఎక్స్ ఎఫ్ (రూ. 9.58 లక్షలు), 450 ఎస్ఎక్స్ ఎఫ్ (రూ. 10.25 లక్షలు), 350 ఈఎక్స్‌సీ-ఎఫ్ (రూ. 12.96 లక్షలు).. అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ ఇండియా.

Also Read: ఒబెన్ రోర్ మరో కొత్త ఎలక్ట్రిక్ బైక్ ఇదే.. ధర తెలిస్తే కొనకుండా ఉండలేరు!

కేటీఎమ్ డర్ట్ బైకులలో మూడు ప్రత్యేకంగా యువకులను దృష్టిలో ఉంచుకుని లాంచ్ అయ్యాయి. అవి కేటీఎమ్ 50 ఎస్ఎక్స్, 65 ఎస్ఎక్స్, 85 ఎస్ఎక్స్. ఇవి టూ స్ట్రోక్ ఇంజిన్ ఆప్షన్స్ కలిగి మంచి పనితీరును అందిస్తాయి. సింపుల్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ రైడర్లకు కావాల్సిన ఫీచర్స్ ఇందులో లభిస్తాయి. ఈ మూడు బైకుల బరువు కూడా చాలా తక్కువే.

మరో మూడు (కేటీఎమ్ 250 ఎస్ఎక్స్-ఎఫ్, 450 ఎస్ఎక్స్-ఎఫ్ మరియు 350 ఈఎక్స్‌సీ-ఎఫ్) డర్ట్ బైకులను కంపెనీ ఆఫ్ రోడింగ్ చేయడానికి అనుకూలంగా ఉండేలా డిజైన్ చేసింది. ఇవన్నీ మొదటి మూడు డర్ట్ బైకుల కంటే ఉత్తమ పనితీరును అందిస్తాయి. అయితే వీటి బరువు కొంత ఎక్కువగా ఉంటుంది. కానీ ఆఫ్ రోడింగ్ చేయడానికి ఇవి అత్యుత్తమ బైకులు అని చెప్పాల్సిందే.

రతన్ టాటా అరుదైన వీడియో: ఫిదా అయిపోతున్న జనం

0

Ratan Tata Car Collection: అందరూ పుడతారు, చనిపోతారు. కానీ కొంతమంది మాత్రమే చరిత్రలో యుగపురుషులుగా నిలుస్తారు. అలాంటి వారిలో ఒకరు.. భరతమాత ముద్దుబిడ్డ ‘రతన్ టాటా’ (Ratan Tata). పారిశ్రామిక రంగంలో అంచెలంచెలుగా ఎదిగి దేశం కోసం లెక్కకు మించి దానం చేసిన ఈ దానశీలి 2024 అక్టోబర్ 09న కన్ను మూసారు. ఈయన మరణం ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలను కంటతడి పెట్టేలా చేశాయి. అయితే ఇప్పుడు రతన్ టాటా మెర్సిడెస్ బెంజ్ కారును డ్రైవ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రస్తుతం నెట్టింట్లో ఇది వైరల్ అవుతోంది.

దివంగత దేశీయ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్500 స్పోర్ట్స్ కారును స్వయంగా డ్రైవ్ చేశారు. ముంబైలోని మెరైన్ డ్రైవ్‌లో డ్రైవ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రతన్ టాటా కారును డ్రైవ్ చేస్తుంటే.. మరో కారులో ప్రయాణించే ఎవరో వీడియో రికార్డ్ చేసినట్లు స్పష్టమవుతోంది. రతన్ టాటా డ్రైవ్ చేస్తున్న కారు సిల్వర్ కలర్ స్పోర్ట్స్ కారు. ఈయన కారును డ్రైవ్ చేస్తుంటే.. పక్కన ఎవరో సిబ్బంది కూడా ఉన్నట్లు వీడియోలో చూడవచ్చు.

మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్500 (Mercedes Benz SL500)

నిజానికి వీడియోలో కనిపిస్తన్న మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్500 కారును రతన్ టాటా కోసం ప్రత్యేకంగా డెలివరీ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ కారుకు స్టీరింగ్ వీల్ ఎడమ వైపున ఉండటం గమనిఉంచవచ్చు. సాధారణంగా ఇండియాలో కనిపించే కార్లన్నింటికీ.. కుడివైపునే స్టీరింగ్ వీల్ ఉంటుంది. ఇతర దేశాల్లో కారులో స్టీరింగ్ వీల్ ఎడమవైపున ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే.. ఇక్కడ కనిపించే బెంజ్ కారును ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ కారు వీఐపీ రిజిస్ట్రేషన్ నెంబర్ ”500” కలిగి ఉండటం చూడవచ్చు.

ఇక్కడ కనిపిస్తున్న మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్500 అనేది హార్డ్‌టాప్ కన్వర్టిబుల్ స్పోర్ట్స్ కారు. ఒకప్పుడు ఇది అంతర్జాతీయ మార్కెట్లో గొప్ప ప్రజాదరణ పొందింది. ఇందులో కొన్ని భారత్‌కు కూడా దిగుమతి అయ్యాయి. ఈ కారు 5.0 లీటర్ వీ8 మోటారు ద్వారా 306 Bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. సిల్వర్ రంగులో కనిపించే ఈ కారు రెడ్ కలర్ ఇంటీరియర్ పొందుతుంది. కాబట్టి ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

రతన్ టాటా ఉపయోగించిన ఇతర కార్లు

పారిశ్రామిక వేత్త రతన్ టాటా ఉపయోగించిన కార్ల జాబితాలో మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్500 మాత్రమే కాకుండా.. ఫెరారీ కాలిఫోర్నియా టీ (Ferrari California T), కాడిలాక్ ఎక్స్ఎల్ఆర్ (Cadillac XLR), క్రిస్లర్ సెబ్రింగ్ (Chrysler Sebring), మెర్సిడెస్ బెంజ్ డబ్ల్యు124 (Mercedes Benz W124), మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ (Mercedes Benz S-Class), ల్యాండ్ రోవర్ ఫ్రీల్యాండర్ 2 (Land Rover Freelander 2), హోండా సివిక్ (Honda Civic), టాటా ఇండిగో మరీనా (Tata Indigo Marina), టాటా నెక్సాన్ (Tata Nexon) మరియు టాటా నానో ఈవీ (Tata Nano EV) మొదలైనవి ఉన్నాయి.

టాటా నానో ఈవీ

రతన్ టాటా ఉపయోంచే కార్లలో ఎంత ఖరీదైన అన్యదేశ్య కార్లు ఉన్నప్పటికీ.. టాటా నానో ఎలక్ట్రిక్ కారుకు ఓ ప్రత్యేకత ఉంది. ఎందుకంటే దీనిని కంపెనీ ప్రత్యేకంగా రతన్ టాటా కోసం రూపొందించింది. రతన్ టాటా కూడా ఎక్కువగా ఈ కారు డ్రైవ్ చేస్తూనే కనిపించారు. నిజానికి టాటా నానో ఎలక్ట్రిక్ కారు అధికారికంగా మార్కెట్లో లాంచ్ కాలేదు. అయితే కంపెనీ రతన్ టాటా కోసం ఒక్క కారును మాత్రమే ప్రత్యేకంగా తయారు చేసింది. రాబోయే రోజుల్లో నానో ఈవీ మార్కెట్లో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నాము.

Don’t Miss: మీకు తెలుసా!.. 2025లో భారత్‌లో లాంచ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లు ఇవే

ప్రతి ఒక్క కుటుంబం కారుకు కలిగి ఉండాలి అనే గొప్ప ఆలోచనతోనే.. రతన్ టాటా టాటా నానో కారుకు శ్రీకారం చుట్టారు. ప్రారంభంలో ఇది గొప్ప అమ్మకాలను పొందినప్పటికీ.. ఆ తరువాత దీనికున్న ఆదరణ క్రమంగా తగ్గిపోయింది. కాబట్టి కంపెనీ ఇప్పుడు దీనిని ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. అయితే ఇది మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుందనే వివరాలు తెలియాల్సి ఉంది.

మీకు తెలుసా!.. 2025లో భారత్‌లో లాంచ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లు ఇవే

0

Upcoming Electric Cars in India: భారతదేశంలో ఇప్పటికే టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా ఎక్స్‌యూవీ300, ఎంజీ విండ్సర్, బీవైడీ సీల్, కియా ఈవీ6 వంటి ఎన్నో ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. కాగా వచ్చే ఏడాది కూడా మార్కెట్లో మరికొన్ని ఎలక్ట్రిక్ కార్లు లాంచ్ కావడానికి సిద్ధమవుతున్నాయి. ఈ జాబితాలో హ్యుందాయ్ క్రెటా ఈవీ, మారుతి సుజుకి ఈ-వితారా, మహీంద్రా బీఈ 6ఈ, మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ, టయోటా అర్బన్ ఎలక్ట్రిక్, టాటా హారియార్ ఈవీ మరియు టాటా సఫారీ ఈవీ వంటివి ఉన్నాయి. ఈ కార్ల గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

హ్యుందాయ్ క్రెటా ఈవీ (Hyundai Creta EV)

2025లో భారతీయ మార్కెట్లో లాంచ్ కానున్న ఎలక్ట్రిక్ కార్లలో ‘హ్యుందాయ్ క్రెటా ఈవీ’ ఒకటి. ఇది స్టాండర్డ్ హ్యుందాయ్ క్రెటా కంటే భిన్నంగా ఉంటుంది. క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్, కొత్త అల్లాయ్ వీల్స్ వంటివి క్రెటా ఈవీలో ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ కారు 45 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా 450 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఇది 138 బీహెచ్‌పీ పవర్ మరియు 255 న్యూటన్ మీటర్ టార్క్ అందించే ఎలక్ట్రిక్ మోటారును పొందుతుంది. క్రెటా ఈవీ దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత టాటా కర్వ్ ఈవీ, మారుతి ఈ-వితారా, టాటా హారియార్ ఈవీ మరియు బీవైడీ ఆట్టో 3 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండనుంది.

మారుతి సుజుకి ఈ-వితారా (Maruti Suzuki E-Vitara)

దేశీయ మార్కెట్లో లాంచ్ కావడానికి సిద్దమవుతున్న మరో ఎలక్ట్రిక్ కారు మారుతి సుజుకి ఈ-వితారా. ఇది 2025 మార్చిలో లాంచ్ అవుతుందని సమాచారం. ఈ-వితారా హార్ట్ టెక్ స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు 49 కిలోవాట్ మరియు 61 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇవి రెండూ వరుసగా 450 కిమీ నుంచి 500 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క ధరలు మరియు ఇతర వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

మహీంద్రా బీఈ 6ఈ (Mahindra BE 6E)

దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా నవంబర్ 26న తన ‘బీఈ 6ఈ’ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయనుంది. ఇది స్ప్లిట్ హెడ్‌లైట్ సెటప్, ఏరో బ్లేడ్ స్టైల్ అల్లాయ్ వీల్స్ మరియు కాక్‌పిట్ వంటి ఇంటీరియర్ పొందుతుంది. పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే.. ఇందులో 60 కిలోవాట్ బ్యాటరీ మరియు 79 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్స్ ఉంటాయి. ఇది ఒక ఛార్జీతో 450 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఈ కారు ధరలకు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికాలేదు.

మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ (Mahindra XEV 9E)

2025లో మార్కెట్లో లాంచ్ కానున్న ఎలక్ట్రిక్ కార్లలో మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ కూడా ఒకటి. ఇది కూపే మాదిరిగా ఉన్న ఏటవాలుగా ఉన్న రూఫ్, సి-షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ హెడ్‌లైట్, ప్లష్ డోర్ హ్యాండిల్స్ మరియు ఏరో బ్లేడ్ స్టైల్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క బ్యాటరీ మరియు రేంజ్ వంటి వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. దీనికి సంబంధించిన చాలా వివరాలు నవంబర్ 26న జరగనున్న మహీంద్రా అన్‌లిమిట్ ఈవెంట్‌లో వెల్లడయ్యే అవకాశం ఉంది.

టయోటా అర్బన్ ఎలక్ట్రిక్ (Toyota Urban Electric)

మారుతి సుజుకి మరియు టయోటా వ్యూహాత్మక భాగస్వామ్యంతో ఎలక్ట్రిక్ కారు లాంచ్ కావడానికి సిద్ధమవుతోంది. ఇది పూర్తిగా భిన్నమైన డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. ఇది మారుతి ఈ-వితారా మాదిరిగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారు 2025 మొదటి త్రైమాసికంలో లాంచ్ అవుతుందని సమాచారం. అయితే కంపెనీ లాంచ్ చేయనున్న ఈ ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన చాలా వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

టాటా హారియార్ ఈవీ (Tata Harrier EV)

దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ తన హారియార్ కారును ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ కారు 2025 ప్రారంభంలోనే మార్కెట్లో అధికారికంగా లాంచ్ అవుతుందని సమాచారం. ఇది ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం పొందుతుందని తెలుస్తోంది. యాక్టి.ఈవీ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడిన ఈ కొత్త కారు 60 కిలోవాట్ బ్యాటరీ, 80 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది సింగిల్ ఛార్జీతో 500 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది కూడా 2025 మార్చిలో లాంచ్ అవుతుందని సమాచారం.

Don’t Miss: 2024 మారుతి డిజైర్ లాంచ్ ఈ రోజే: ధర ఎంతంటే?

టాటా సఫారీ ఈవీ (Tata Safari EV)

వచ్చే ఏడాది ఇండియన్ మార్కెట్లో లాంచ్ కానున్న మరో టాటా ఎలక్ట్రిక్ కారు సఫారీ ఈవీ. ఇది యాంత్రికంగా హారియార్ ఎలక్ట్రిక్ కారుకు సమానంగా ఉంటుంది. ఇది 2025 మార్చిలో అధికారికంగా లాంచ్ అవుతుందని సమాచారం. మార్కెట్లో టాటా సఫారీ ఈవీ లాంచ్ అయిన తరువాత మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ, ఎక్స్‌యూవీ.ఈ8 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండనుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ధరలను కంపెనీ లాంచ్ సమయంలో వెల్లడయ్యేరు అవకాశం ఉంది.