చదువుకోవడం ఒక ఎత్తు అయితే.. చదువుకున్న తరువాత జాబ్ తెచ్చుకోవడం మరో ఎత్తు అయిపోయింది. అయితే కొందరు మాత్రం వచ్చిన ఉద్యోగం నచ్చక.. గంటల వ్యవధిలో లేదా రోజుల వ్యవధిలో ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నారు. ఇలాంటి సంఘటనే ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పలువురు నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్వాపరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
మూడు గంటల్లో జాబ్ వదిలేశా!
”ఈ రోజు నాకు ఉద్యోగం వచ్చింది. ఇదే నా మొదటి జాబ్. ఇంటి నుంచి పనిచేసే (వర్క్ ఫ్రమ్ హోమ్) ఉద్యోగమే.. కొంత ఒత్తిడితో కూడుకున్నది. అయినప్పటికీ.. రోజుకు 9 గంటల పని, జీతం రూ. 12వేలు మాత్రమే. ఈ ఉద్యోగం చేయాలనుకున్నాను. కానీ మూడు గంటల తరువాత.. ఇది (జాబ్) నా సమయాన్నంతా తీసుకుంటోంది. నేను కెరీర్లో ఎదగలేనని గ్రహించాను. దీంతో నేను ఉద్యోగం వదులుకున్నాను” అని రెడ్డిట్లో పోస్ట్ చేశారు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో.. నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. కెరియర్ గురించి ఆలోచించడం మంచిదే అని కొందరు చెబుతుంటే.. ఉద్యోగం చేరడానికి ముందే అలొచుకుంకోలేదా అని ఇంకొందరు అంటున్నారు. కొంతమంది మాకు అలాంటి వర్క్ ఫ్రమ్ జాబ్ కావాలని అంటున్నారు.
విశ్లేషణ చేద్దాం..
కెరియర్ దృష్ట్యా.. రెడ్డిట్లో పోస్ట్ చేసిన యూజర్ చేసిన పని సమర్ధనీయమే. కానీ 140 కోట్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న మనదేశంలో.. ప్రతి ఏటా డిగ్రీలు చదివి బయటకు వస్తున్నవారు లెక్కకు మించి ఉన్నారు. అయితే బయటకు వచ్చినవారిలో ఏదో ఒక ఉద్యోగం చూసుకుని.. అందులోనే ముందుకు వెళ్లేవారు కొందరు ఉంటే.. నచ్చిన ఉద్యోగం కోసం చాలా రోజులు ఎదురు చూసేవారు కూడా ఎక్కువగానే ఉన్నారు. మరికొందరు నచ్చిన ఉద్యోగం వచ్చేవరకు.. చేతికి దొరికిన పని చేస్తూ, ఖర్చులకు డబ్బులు సంపాదించుకుంటున్నారు.
చదువుకుని డిగ్రీలు తెచ్చుకుని, ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న పేదకుటుంబాలకు చెందినవారు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ.. ఒకానొక దశలో గొప్ప ఉద్యోగాలను సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే డబ్బున్నవారు.. తమకు కావలసిన ఉద్యోగం వచ్చేవరకు ఇంకో పనిచేయడానికి బహుశా సుముఖత చూపరు. దీన్ని బట్టి చూస్తే రెడ్డిట్లో పోస్ట్ చేసిన వ్యక్తి ఏ కోవకు చెందినవారో అర్థం చేసుకోవచ్చు. బహుశా అతడు రూ. 12వేలు జీతం వచ్చే ఉద్యోగానికి అప్లై చేసాడంటే.. వారిది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు.
ఉద్యోగానికి అప్లై చేయడానికి ముందే..
ఇకపోతే.. ఉద్యోగానికి అప్లై చేయడానికి ముందే, జీతం ఎంత?, చేయాల్సిన పని గంటలు ఎంత? అనే విషయాలను తప్పకుండా చూసుకోవాలి. అవన్నీ ఒకే అనుకున్నప్పుడే ఉద్యోగాలకు అప్లై చేయాలి. ఎందుకంటే ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్లు చాలామందే ఉన్నారు. మీరు జాబ్ తెచ్చుకుని.. గంటల్లో రాజీనామా చేస్తే.. వెనుక ఉన్న ఉద్యోగి మొదట్లో మీ వల్లనే ఉద్యోగం కోల్పోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా ఉద్యోగం చేయాలి, ఆ ఉద్యోగం నాకు చాలా అవసరం అనుకున్నప్పుడే.. జాబ్ కోసం ముందగు వేయడం మంచిదని మా అభిప్రాయం.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.