విజయదశమి ముందుంది.. దీపావళి రాబోతోంది. ఇలాంటి సమయంలో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సెప్టెంబర్ 2025లో చుక్కలు తాకిన గోల్డ్ రేటు.. ఈ నెలలో కూడా శాంతించే సూచనలు ఏ మాత్రం కనిపించడం లేదు. ఇప్పటికే.. రూ. 1.11 లక్షలు దాటేసిన పసిడి ధరలు.. ఇంకెంత పెరుగుతాయో అని పసిడి ప్రియులు ఒకింత భయపడుతున్నారు. ఈ రోజు (2025 అక్టోబర్ 1) కూడా 10 గ్రాముల గోల్డ్ ధరలు గరిష్టంగా రూ. 1200 పెరిగింది.
బంగారం ధరలు
హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు మొదలైన ప్రాంతాల్లో ఈ రోజు (బుధవారం) గోల్డ్ రేటు పెటిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1200 పెరిగి రూ. 1,18,640 వద్ద నిలిచింది. ఇదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1100 పెరిగి రూ. 108750 వద్దకు చేరింది.
చెన్నైలో అయితే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ. 320 మాత్రమే పెరుగగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 300 పెరిగింది. దీంతో ఇక్కడ ధరలు వరుసగా రూ. 1,18,800 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ. 1,08,900 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్) వద్దకు చేరాయి.
ఢిల్లీలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 1200 (24 క్యారెట్స్ 10గ్రా), రూ. 1100 (22 క్యారెట్స్ 10గ్రా) పెరిగాయి. దీంతో ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రామ్స్ గోల్డ్ రేటు రూ. 1,18,790 వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,08,900 వద్దకు చేరింది. ప్రస్తుత ధరలను బట్టి చూస్తే.. గోల్డ్ రేటు జీవితకాల గరిష్టాలను చేరుకున్నట్లు స్పష్టమవుతోంది.
వెండి ధరలు
ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే.. ఈ రోజు (బుధవారం) సిల్వర్ రేటు రూ. 1000 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ. 1,60,000 వద్దకు చేరింది. అంటే నేడు ఒక్క గ్రామ్ వెండి రేటు రూ. 160 అన్నమాట. ఇదే ధరలు బెంగళూరు, చెన్నైలలో కూడా కొనసాగుతాయి. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రూ. 1,51,000 వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే.. వెండి ధరలు త్వరలోనే రూ. 2 లక్షలకు చేరుతుందని నిపుణులు చెబుతున్నారు.
18 క్యారెట్స్ & 16 క్యారెట్లకు పెరుగుతున్న డిమాండ్
భారతదేశంలో 24 క్యారెట్స్, 22 క్యారెట్స్ బంగారం ధరలు భారీగా పెరుగుతున్న సమయంలో.. పసిడి ప్రియుల చూపు 18 క్యారెట్స్, 16 క్యారెట్స్ బంగారంవైపు పడింది. 18 క్యారెట్స్ & 16 క్యారెట్స్ గోల్డ్ రేటు.. 24 క్యారెట్స్, 22 క్యారెట్స్ గోల్డ్ రేటు కంటే తక్కువ. ఈ కారణంగానే ఈ రకమైన గోల్డ్ కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
బంగారం & వెండి ధరలు పెరగడానికి కారణాలు
భారతదేశంలో బంగారం, వెండి ధరలు పెరగడానికి ప్రధాన కారణం డిమాండ్ పెరగడమే. అంటే గోల్డ్, సిల్వర్ కొనుగోలు చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. పండుగలు, ఇతర కార్యక్రమాల సమయంలో గోల్డ్ కొనేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అంతే కాకుండా గోల్డ్, సిల్వర్ మీద పెట్టుబడి పెడుతున్నవారి సంఖ్య కూడా పెరిగింది. ఇవన్నీ కూడా పసిడి ధరలు పెరగడానికి కారణమయ్యాయి. ఇప్పుడు వెండి రేటు కూడా తారా స్థాయికి చేరుతోంది. వెండి కూడా రాబోయే రోజుల్లో బంగారం ధరలను చేరుకునే లేకపోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.