Anganwadi new phones Telangana: ‘అంగన్వాడీ సిబ్బందికి కొత్త స్మార్ట్‌ఫోన్లు’: సీఎం రేవంత్

Anganwadi new phones Telangana: ఇప్పటికే అంగన్వాడీ సిబ్బందికి ప్రభుత్వం మొబైల్ ఫోన్లు అందించిన విషయం తెలిసిందే. అయితే, గతంలో ఇచ్చిన ఫోన్లు పాతబడిపోవడం, సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల పనుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పోషణ్ ట్రాకింగ్ వంటి కీలక పనులు చేయడానికి ఆ ఫోన్లు సరిపోవడం లేదని సిబ్బంది పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఈ నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం ఆధునిక సాంకేతికతతో కూడిన కొత్త ఫోన్లు అందించాలని నిర్ణయించింది. కొత్తగా ఇవ్వబోయే ఫోన్లలో 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ వంటి మెరుగైన ఫీచర్లు ఉండటంతో పనితీరు వేగంగా సాగుతుందని అధికారులు భావిస్తున్నారు.

కీలక బాధ్యతల కోసం!

అంగన్వాడీ సిబ్బంది చిన్నారుల ఆరోగ్యం, పోషణ, గర్భిణీ స్త్రీల సంరక్షణ వంటి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తారు. ప్రతి రోజు ‘పోషణ్ ట్రాకర్’ యాప్‌లో సుమారు 14 రకాల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. పాత ఫోన్ల వల్ల డేటా ఎంట్రీ ఆలస్యం అవుతుండగా, కొత్త ఫోన్లతో ఈ ప్రక్రియ సులభతరం అవుతుంది. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు మరింత పారదర్శకంగా, వేగంగా జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

కొత్త ఫోన్ల ఫీచర్లు

తెలంగాణలో అంగన్వాడీలకు ఇవ్వబోయే ఈ కొత్త ఫోన్లు ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేయబడ్డాయి. 4GB ర్యామ్‌తో యాప్‌లు వేగంగా పనిచేస్తాయి. 64GB మెమొరీతో డేటా నిల్వకు సరిపడా స్థలం ఉంటుంది. ఇవి కేవలం కాల్స్ కోసం కాకుండా, డిజిటల్ సేవల కోసం ప్రత్యేకంగా ఉపయోగపడే విధంగా రూపొందించబడ్డాయి. ముఖ్యంగా పోషణ్ ట్రాకర్ యాప్, పిల్లల ఆరోగ్య వివరాలు, టీకాలు, ఆహార పంపిణీ వివరాలు నమోదు చేయడం వంటి పనులు మరింత సులభతరం అవుతాయి.

పోషణ్ ట్రాకర్ యాప్ ప్రాముఖ్యత

అంగన్వాడీ సిబ్బంది ప్రతి రోజు పోషణ్ ట్రాకర్ యాప్‌లో నమోదు చేసే సమాచారం ప్రభుత్వానికి అత్యంత కీలకం. ఈ డేటా ఆధారంగా పిల్లల ఆరోగ్య స్థితి, పోషకాహార లోపాలు, గర్భిణీ స్త్రీల పరిస్థితి వంటి అంశాలను విశ్లేషిస్తారు. పాత ఫోన్లతో యాప్ సరిగా పనిచేయకపోవడం వల్ల డేటా ఎంట్రీలో ఆలస్యం అవుతుండేది. కొత్త ఫోన్లతో ఈ సమస్యలు తొలగి, సమయానికి డేటా నమోదు చేయడం సాధ్యమవుతుంది. ఇది ప్రభుత్వానికి పాలసీ నిర్ణయాల్లో కూడా సహాయపడుతుంది.

డిజిటలైజేషన్ దిశగా అంగన్వాడీ

హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ నిర్ణయం అమలు చేయడం ద్వారా అంగన్వాడీ వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కొత్త ఫోన్లు అందించడం ద్వారా సిబ్బంది పనిభారం తగ్గి, సేవల నాణ్యత పెరుగుతుందని భావిస్తున్నారు. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో కూడా సాంకేతిక సేవలు అందుబాటులోకి రావడం వల్ల సంక్షేమ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలవుతాయి.

అంగన్వాడీలు తన పనిని పూర్తి చేయడానికి అనువైన స్మార్ట్‌ఫోన్లు చాలా అవసరం. పిల్లలకు సంబంధించిన విషయాల నమోదు మాత్రమే కాకుండా.. గుడ్లు, పాలు వంటి సరుకుల విషయాల గురించి కూడా వెల్లడించాల్సి ఉంటుంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవ్వండనికి సంకల్పించారు. వీటిని ఎప్పుడు ఇస్తారనే విషయం వెల్లడించలేదు. కానీ త్వరలోనే అందించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Also read: సోషల్ మీడియాలో జాగ్రత్త.. యువతులకు సజ్జనార్ హెచ్చరిక (వీడియో)