34.4 C
Hyderabad
Friday, March 14, 2025
Home Blog Page 42

ఆస్టన్ మార్టిన్ కొత్త కారు వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?

0

Aston Martin Vantage Launched in India: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ (Aston Martin) భారతీయ మార్కెట్లో ‘వాన్టేజ్’ (Vantage) పేరుతో ఓ సరికొత్త కారును అధికారికంగా లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు ధర ఎంత, డిజైన్ ఎలా ఉంది? ఫీచర్స్ ఏంటి.. ఇంజిన్ పనితీరు ఎలా ఉంది అనే మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

ధర (Price)

భారతీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త ‘ఆస్టన్ మార్టిన్ వాన్టేజ్’ కారు ప్రారంభ ధర రూ. 3.99 కోట్లు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఈ కారు ప్రపంచ మార్కెట్లో రెండు నెలల క్రితమే ఆవిష్కరించబడింది. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఆధునిక ఫీచర్స్ అందుబాటులో ఉండటం వల్ల, వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

డిజైన్ (Design)

ఆస్టన్ మార్టిన్ వాన్టేజ్‌ కూపే మాదిరిగా చాలా విస్తృతంగా ఉంటుంది. ముందువైపు బంపర్ యొక్క వెడల్పు అంతటా విస్తరించి ఉండే పెద్ద గ్రిల్, అంచుల వద్ద కొత్త ఇన్‌టేక్‌లు ఉన్నాయి. గుండ్రంగా ఉండే హెడ్‌ల్యాంప్‌లు మునుపటి మోడల్స్ కంటే పెద్దవిగా ఉన్నాయి. ఎల్ఈడీ డీఆర్ఎల్ కూడా కొత్తగా ఉంది. ఇది దాదాపు చూడటానికి వన్ 77 సూపర్ కారును పోలి ఉంటుందని తెలుస్తోంది.

అప్డేటెడ్ డిజైన్ పొందిన రియర్ ప్రొఫైల్, బంపర్ మరియు డిఫ్యూజర్ వంటి వాటిని పొందుతుంది. ఇది దాని మునుపటి మోడల్ కంటే 30 మిమీ ఎక్కువ వెడల్పును పొందుతుంది. ఫ్రేమ్‌లెస్ మిర్రర్లు, ఫ్లష్ ఎలక్ట్రిక్ డోర్ హ్యాండిల్స్ వంటివి ఇందులో గమనించవచ్చు. మొత్తం మీద ఈ కారు డిజైన్ చాలా అద్భుతంగా ఉందని తెలుస్తోంది.

ఫీచర్స్ (Features)

కొత్త ఆస్టన్ మార్టిన్ వాన్టేజ్‌ యొక్క కాక్‌పిట్ దాదాపు డీబీ12ను పోలి ఉంటుంది. కాబట్టి ఇంటీరియర్ డిజైన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ పొందుతుంది. ఇది స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ పొందుతుంది. 3డీ లైవ్ మ్యాపింగ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ మిర్రరింగ్, లాస్ట్ మెయిల్ న్యావిగేషన్ వంటి వాటితో పాటు ఇందులో క్లైమేట్ కంట్రోల్, గేర్ సెలక్టర్, డ్రైవ్ కంట్రోల్ స్విచ్, లేన్ అసిస్ట్, పార్కింగ్ సెన్సార్ మరియు కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

ఇంజిన్ వివరాలు (Engine Details)

కొత్త ఆస్టన్ మార్టిన్ వాన్టేజ్‌ (Aston Martin Vantage) 4.0 లీటర్ వీ8 ఇంజిన్ పొందుతుంది. ఇది 665 హార్స్ పవర్ మరియు 800 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 3.4 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 325 కిమీ వరకు ఉంటుంది. ఇది 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.

ప్రత్యర్థులు (Rivals)

కంపెనీ ఈ కారును ఎలక్ట్రిక్ వెర్షన్ రూపంలో లాంచ్ చేస్తుందా? లేదా అనేదానికి సంబంధించిన వివరాలు వెల్లడికాలేదు. అయితే హైబ్రిడ్ వెర్షన్ రూపంలో విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ కారు భారతీయ మార్కెట్లో బెంట్లీ కంపెనీకి చెందిన కాంటినెంటల్ జీటీ మరియు పోర్షే 911 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ఇది లేటెస్ట్ డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల తప్పకుండా మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము.

Don’t Miss: ఫోర్డ్ మస్టాంగ్ కొత్త ఎడిషన్.. కేవలం 1965 మందికి మాత్రమే – ఎందుకో తెలుసా?

భారతదేశంలో సాధారణ కార్లకు ఉన్నంత డిమాండ్ లగ్జరీ కార్లకు లేదు. ఎందుకంటే ఎక్కువ ధర కారణంగా చాలామంది వీటిని కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేస్తారు. అంతే కాకుండా వీటి మెయింటెనెన్స్ ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖరీదైన కార్లను దాదాపు సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు, క్రికెటర్లు మరియు ఇతర ప్రముఖు మాత్రమే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. కాబట్టి ఇది సాధారణ కార్ల మాదిరిగా అమ్ముడుపోవు అనేది అందరికి తెలిసిన విషయమే.

ఏప్రిలియా రూ.31.26 లక్షల బైక్ వచ్చేసింది – పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి

0

Aprilia RSV4 Factory Launched In India: ప్రముఖ బైక్ తయారీ సంస్థ ‘ఏప్రిలియా’ (Aprilia) దేశీయ మార్కెట్లో ఎట్టకేలకు సరికొత్త బైక్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త బైక్ పేరు ‘ఆర్‌ఎస్‌వీ4 ఫ్యాక్టరీ’ (RSV4 Factory). ఏప్రిలియా ఆర్‌ఎస్‌వీ4 బైక్ ధర, ఇతర వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ధర (Price)

కొత్త ఏప్రిలియా ఆర్‌ఎస్‌వీ4 బైక్ ధర రూ. 31.26 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ చూడటానికి చాలా అద్భుతమైన డిజైన్ కలిగి ఒక్క చూపుతోనే ఆకర్షిస్తుంది. ఈ బైక్ కొంత డుకాటీ పానిగెల్ వీ4 ఎస్ మాదిరిగా అనిపిస్తుంది. అయితే దీనికంటే ఏప్రిలియా బైక్ ధర రూ. 2.2 లక్షలు ఎక్కువ.

డిజైన్ (Design)

ఏప్రిలియా ఆర్‌ఎస్‌వీ4 ఫ్యాక్టరీ (Aprilia RSV4 Factory) డ్యూయల్ బీమ్ అల్యూమినియం ఫ్రేమ్‌పై ఆధారపడి ఉంది. ఇది ముందువైపు సర్దుబాటు చేయగల 43 మిమీ USD ఓహ్లిన్స్ ఫోర్క్ మరియు వెనుక వైపు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓహ్లిన్స్ మోనోషాక్‌ పొందుతుంది. ఈ బైక్ డ్యూయెల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, 5 ఇంచెస్ కలర్ TFT డిస్‌ప్లే, క్లిన్ ఆన్ హ్యాండిల్ బార్‌లు, అద్భుతమైన టెయిల్ సెక్షన్ పొందుతుంది.

ఫీచర్స్ (Features)

కొత్త ఏప్రిలియా ఆర్‌ఎస్‌వీ4 బైక్ ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్ మరియు 6 రైడింగ్ మోడ్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. తద్వారా రైడర్ మంచి రైడింగ్ అనుభూతిని పొందవచ్చని తెలుస్తోంది.

ఇంజిన్ (Engine)

ఆర్‌ఎస్‌వీ4 బైకులో ఏప్రిలియా 1099 సీసీ లాంగిట్యూడినల్ వీ4 ఇంజిన్ అందిస్తోంది. ఇది 13000 rpm వద్ద 214 bhp పవర్ మరియు 10550 rpm వద్ద 125 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. పనితీరు పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ బైక్ డ్యూయెల్ బీమ్ అల్యూమినియం ఫ్రేమ్‌తో అండర్‌పిన్ చేయబడింది. అంతే కాకుండా అండర్‌బ్రేస్డ్ స్వింగార్మ్‌ను పొందుతుంది.

కొత్త ఏప్రిలియా ఆర్‌ఎస్‌వీ4 బైక్ 851 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది. ఈ బైక్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 17.9 లీటర్ల వరకు ఉంటుంది. ఈ బైక్ మొత్తం బరువు 202 కేజీల వరకు ఉంటుంది. మొత్తం మీద ఈ బైక్ అన్ని విధాలుగా చాలా అనుకూలంగా ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది.

కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త ఏప్రిలియా ఆర్‌ఎస్‌వీ4 బైక్ ఒకే కలర్ ఆప్షన్‌లో లభిస్తుందని తెలుస్తోంది. ఈ బైక్ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న డుకాటీ పానిగేల్ వీ4 (Ducati Panigele V4) మరియు బీఎండబ్ల్యూ ఎమ్ 1000 ఆర్ఆర్ (BMW M 1000 RR) వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కావున ఇది అమ్మకాల పరంగా కొంత పోటీ ఎదుర్కోవాలి వస్తుందని తెలుస్తోంది.

కొత్త బైకులు లాంచ్ అవుతూనే ఉన్నాయి..

భారతీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త బైకులు లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ఏప్రిలియా కూడా కస్టమర్లను ఆకర్శించడానికి మరియు దాని ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడానికి ఆధునిక ఉత్పత్తులను విడుదల చేస్తూనే ఉంది. ఈ తరుణంలో ఏప్రిలియా ఆర్‌ఎస్‌వీ4 లాంచ్ చేసింది. అయితే ఈ బైక్ ధర చాలా ఎక్కువ కావడం వల్ల ఎలాంటి అమ్మకాలు పొందుతుందనేది తెలియాల్సి వస్తోంది.

ఇండియన్ మార్కెట్లో ఏప్రిలియా బైకులకు, స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే కంపెనీ దేశీయ విఫణిలో స్కూటర్లను, బైకులను లాంచ్ చేస్తోంది. ఖరీదైన సూపర్ బైకులకు కూడా మార్కెట్లో డిమాండ్ ఉంది. ఈ కారణంగానే కంపెనీ ఖరీదైన బైకులు కూడా లాంచ్ చేయడానికి సన్నద్ధమైంది.

Don’t Miss: ఫోర్డ్ మస్టాంగ్ కొత్త ఎడిషన్.. కేవలం 1965 మందికి మాత్రమే – ఎందుకో తెలుసా?

ప్రస్తుతం ఆధునిక కాలంలో రోజువారీ వినియోగానికి కూడా స్పోర్ట్స్ బైకులు ఉపయోగిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని చాలా కంపెనీలు ఈ విభాగంలో బైకులను లాంచ్ చేసి కస్టమర్లను ఆకర్శించడంలో ముందడుగు వేస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలు కొత్త బైకులను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఏప్రిలియా కూడా తనవంతుగా మార్కెట్లో అత్యాధునిక బైకులను లాంచ్ చేస్తూ కొత్త కస్టమర్లను ఆకర్షిస్తోంది.

ఫోర్డ్ మస్టాంగ్ కొత్త ఎడిషన్.. కేవలం 1965 మందికి మాత్రమే – ఎందుకో తెలుసా?

0

Ford Mustang Celebrates 60th Anniversary Edition Revealed: భారతదేశంలో మాత్రమే కాకుండా గ్లోబల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ‘ఫోర్డ్’ (Ford) కంపెనీ యొక్క ‘మస్టాంగ్’ కారు గురించి అందరికి తెలుసు. సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు అందరి హృదయాలను దోచుకున్న ఈ కారు ఇప్పటికి 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

ఫోర్డ్ మస్టాంగ్ మార్కెట్లో 60 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా కంపెనీ దీనిని కొత్తగా 60వ యానివెర్సరీ పేరుతో ఆవిష్కరించింది. కంపెనీ ఆవిష్కరించిన ‘ఫోర్డ్ మస్టాంగ్ 60వ యానివెర్సరీ ఎడిషన్’ (Ford Mustang 60th Anniversary Edition) చాలా అద్భుతంగా ఉంటుంది.

1965 యూనిట్లు మాత్రమే..

కొత్త ఫోర్డ్ మస్టాంగ్ 60వ యానివెర్సరీ ఎడిషన్ రెట్రో డిజైన్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. కంపెనీ ఈ ఎడిషన్‌ను కేవలం 1965 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. ఎందుకంటే ఈ సంవత్సరంలోనే (1965) కంపెనీ ఈ కారు ఉత్పత్తిని ప్రారంభించింది. దీనికి నిదర్శనంగానే అన్ని యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. అంతే ఈ కొత్త కారును కేవలం 1965 మంది కస్టమర్లు మాత్రమే కొనుగోలు చేయడానికి అర్హులు.

కలర్ ఆప్షన్స్ (Colour Options)

కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కారు అమ్మకాలు ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభమవుతాయి. ఫోర్డ్ మస్టాంగ్ యానివెర్సరీ ఎడిషన్ ఆధునిక కాస్మొటిక్ డిజైన్స్ పొందుతుంది. ఇందులో ప్రధానంగా గుర్తించదగినది 20 ఇంచెస్ ముదురు బూడిదరంగు అల్లాయ్ వీల్స్‌. ఫ్రంట్ పెండర్ మీద బ్యాడ్జ్‌లు, బూట్ మీద GT బ్యాడ్జ్ 60, ఇయర్స్ బ్యాడ్జ్ వంటి వాటిని చూడవచ్చు.

డిజైన్ మరియు ఫీచర్స్ (Design and Features)

ఫోర్డ్ మస్టాంగ్ 60వ యానివెర్సరీ ఎడిషన్ (Ford Mustang 60th Anniversary Edition) హెడ్‌ల్యాంప్‌ల కోసం స్మోక్డ్ అవుట్ ఎఫెక్ట్ మరియు గ్రిల్ కోసం కొన్ని కాంట్రాస్టింగ్ సిల్వర్ యాక్సెంట్‌లతో కొత్త రిట్రో మెష్ డిజైన్ పొందుతాయి. వింగ్ మిర్రర్స్ క్యాప్స్ సిల్వర్‌తో పూర్తి చేయబడి ఉండటం చూడవచ్చు. ఈ యానివెర్సరీ ఎడిషన్ మూడు కలర్ ఆప్షన్స్ పొందుతుంది. అవి తెలుపు, రేస్ రెడ్ లేదా వేపర్ బ్లూ మరియు రెడ్ లేదా సిల్వర్ కలర్స్. ఇవన్నీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. లోపలి డ్యాష్‌బోర్డ్‌పై 60వ యానివెర్సరీ అని ఉండటం చూడవచ్చు. అపోల్స్ట్రే గ్రే, బ్లాక్ లేదా రెడ్ కలర్ ఆప్షన్స్ పొందుతుంది. అంతే కాకుండా డ్రైవర్ డిస్ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటివన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

ఇంజిన్ (Engine)

ఫోర్డ్ మస్టాంగ్ యానివెర్సరీ ఎడిషన్ 5.0 లీటర్ కొయెట్ వీ8 ఇంజిన్ పొందుతుంది. ఇది 480 హార్స్ పవర్ మరియు 560 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 10 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ పొందుతుంది. పనితీరు పరంగా ఇది చాలా అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది. ఇది కన్వర్టిబుల్ మరియు కూపే అనే రెండు వెర్షన్లలో లభిస్తుంది.

నిజానికి ఫోర్డ్ (Ford) కంపెనీ ఇప్పటికే భారతదేశంలో తన ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసింది. అయితే రాబోయే రోజుల్లో కొన్ని కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టి.. మళ్ళీ దేశీయ చేయడానికి సన్నద్ధమవుతోంది. బహుశా కంపెనీ ఈ ఏడాది చివరి నాటికి ఫోర్డ్ మళ్ళీ మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉందని సమాచారం. అయితే ఎప్పుడు దేశీయ మార్కెట్లో ప్రవేశిస్తుంది? ఏ కారును మొదట ప్రవేశపెట్టనుంది అనే వివరాలు తెలియాల్సి ఉంది.

Don’t Miss: 19 ఏళ్లలో సుజుకి మోటార్‌సైకిల్ ఉత్పత్తి.. అక్షరాలా ఎన్ని వాహనాలంటే?

ఒకప్పుడు భారతీయ మార్కెట్లో అత్యద్భుతమైన అమ్మకాలు పొందిన అమెరికన్ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ కాలక్రమంలో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడంలో విఫలమైంది. అంతే కాకుండా ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ కూడా ప్రవేశపెట్టలేకపోయింది. దీంతో కంపెనీ ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లలేకపోయింది. క్రమంగా కంపెనీ యొక్క అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. ఇక చేసేదేమి లేక దేశీయ విఫణిలో ఉత్పత్తిని నిలిపివేయడానికి సంకల్పించింది. ఇందులో భాగంగానే ఫోర్డ్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.

Suzuki Motorcycle: 19 ఏళ్లలో సుజుకి మోటార్‌సైకిల్ ఉత్పత్తి.. అక్షరాలా ఎన్ని వాహనాలంటే?

0

Suzuki Motorcycle India Achieves New Record in Production: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా’ (SMIPL) ఉత్పత్తిలో సరికొత్త మైలురాయిని చేరుకుంది. భారతదేశంలో సంస్థ ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 80 లక్షలు లేదా 8 మిలియన్ ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేయగలిగింది. మరిన్ని వివరాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.

జపాన్‌కు చెందిన సుజుకి మోటార్‌సైకిల్ ఇండియన్ మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్న ప్రముఖ కంపెనీలలో ఒకటి. కంపెనీ ఉత్పత్తి చేసిన ద్విచక్ర వాహనాలకు దేశీయ విఫణిలో మంచి డిమాండ్ కూడా ఉంది. ఈ కారణంగానే సంస్థ ఉత్పత్తిలో అరుదైన మైలురాయిని చేరుకోగలిగింది.

ఇండియాలో కార్యకలాపాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయంటే?

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా భారతదేశంలో తన కార్యకలాపాలను 2006 ఫిబ్రవరి నెలలో గుర్‌గావ్‌లోని ఖేర్కి ధౌలాలోని దాని ఉత్పత్తి కేంద్రంలో ‘సుజుకి యాక్సెస్ 125’ (Suzuki Access 125)తో ప్రారంభించింది. అయితే మొదటి నాలుగు మిలియన్ (40 లక్షలు) వాహనాలను ఉత్పత్తి చేయడానికి కంపెనీకి సుమారు 13 సంవత్సరాలు సమయం పట్టింది. ఆ తరువాత మిగిలిన 40 లక్షల (4 మిలియన్) వాహనాలను ఉత్పత్తి చేయడానికి కేవలం 5 సంవత్సరాల సమయం పట్టింది.

8 మిలియన్ వాహనాల ఉత్పత్తికి పట్టిన సమయం..

రెండోసారి కంపెనీ 4 మిలియన్ వాహనాలను ఉత్పత్తి చేయడానికి ఐదు సంవత్సరాల సమయం మాత్రమే పట్టింది. దీన్ని బట్టి చూస్తే క్రమంగా సుజుకి వాహనాలను డిమాండ్ ఏ విధంగా పెరిగింది అనేది ఇట్టే అర్థమవుతుంది. మొత్తం మీద కంపెనీ భారతదేశంలో తన ఉత్పత్తిని ప్రారంభించిన 19వ సంవత్సరంలో 8 మిలియన్ వాహనాల ఉత్పత్తిని చేరుకుంది.

80 లక్షల యూనిట్ ఏదంటే?

గత ఏడాది మాత్రమే కంపెనీ 1 మిలియన్ వాహనాలను ఉత్పత్తి చేసినట్లు సమాచారం. కాగా సంస్థ విడుదల చేసిన 80 లక్షల యూనిట్ పెర్ల్ ఆరెంజ్/గ్లాస్ స్పార్కిల్ బ్లాక్ ‘అవెనిస్ 125’ (Suzuki Avenis 125) స్కూటర్. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో 8 మిలియన్ యూనిట్ అవెనిస్ 125ను చూడవచ్చు.

ఉత్పత్తిలో అరుదైన మైలురాయి చేరుకున్న సందర్భంగా.. సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ‘కెనిచి ఉమెడ’ (Kenichi Umeda) మాట్లాడుతూ.. 8 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకోడవం చాలా ఆనందంగా ఉందన్నారు. కంపెనీ ఉత్పత్తుల మీద ప్రజలకున్న నమ్మకం చాలా గొప్పదని.. వారికి కృతఙ్ఞతలు తెలిపారు. కంపెనీ ఇంత గొప్ప రికార్డ్ సాధించడంలో ఉద్యోగుల పాత్ర కూడా చాలా గొప్పదని ఆయన పేర్కొన్నారు.

భారతదేశంలో మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా సుజుకి మోటార్‌సైకిల్ మంచి ఆదరణ పొందుతోంది. ఎప్పటికప్పుడు కొత్త బైకులు మరియు స్కూటర్లు మార్కెట్లో లాంచ్ చేసి కస్టమర్లను ఆకర్శించడంలో విజయం సాధిస్తోంది. అంతే కాకుండా ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తోంది. రాబోయే రోజుల్లో కంపెనీ మరిన్ని కొత్త ఉత్పత్తులను మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నాము.

సుజుకి బైకులు & స్కూటర్లు

సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీ దేశీయ మార్కెట్లో 125 సీసీ విభాగంలో యాక్సెస్ 125, అవెనిస్, బర్గ్‌మాన్ స్ట్రీట్ మరియు బర్గ్‌మాన్ స్ట్రీట్ ఎస్ఎక్స్ వంటి వాటిని లాంచ్ చేసింది. అదే సమయంలో 150 సీసీ నుంచి 250 సీసీ విభాగంలో జిక్సర్, జిక్సర్ ఎస్ఎఫ్, జిక్సర్ 250, జిక్సర్ 250 ఎస్ఎఫ్ మరియు వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్ వంటి వాటిని లాంచ్ చేసింది. ఇవన్నీ ఇప్పటికే మార్కెట్లో మంచి అమ్మకాలను పొందుతూ.. ఎక్కువమంది కస్టమర్లను ఆకర్శించడంలో విజయం పొందుతోంది.

కంపెనీ ఇటీవల ప్రారంభించిన సుజుకి వీ-స్ట్రోమ్ 800డీఈ, నియో రిట్రో కటన సూపర్‌నేక్డ్ మరియు హయబుసా వంటి బైకులు దేశీయ మార్కెట్లో ఖరీదైన మరియు ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన బైకులు. ఇటీవల కంపెనీ హయబుసా స్పెషల్ ఎడిషన్ కూడా మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది.

Don’t Miss: కేవలం రూ. 69999లకే ఎలక్ట్రిక్ స్కూటర్.. డోంట్ మిస్

ఆధునిక కాలంలో కంపెనీ తన కస్టమర్లకు ఇష్టమైన ఫీచర్స్ మరియు డిజైన్ కలిగిన వాహనాలను అందించాలనే ఉద్దేశ్యంతో అప్డేటెడ్ వాహనాలను దేశీయ విఫణిలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే సుజుకి హయబుసా స్పెషల్ ఎడిషన్ కూడా లాంచ్ చేసింది. రాబోయే రోజుల్లో కూడా కంపెనీ కొత్త ఉత్పత్తులను మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నాము. అంతే కాకుండా ఉత్పత్తిలో మాత్రమే కాకుండా అమ్మకాల్లో కూడా సంస్థ అరుదైన రికార్డ్ చేరుకుంటుందని భావిస్తున్నాము.

Ola Electric: కేవలం రూ. 69999లకే ఎలక్ట్రిక్ స్కూటర్.. డోంట్ మిస్

0

Ola S1 X Price Starting At Rs.69999: భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన ప్రారంభం ఉంచి మంచి ప్రజాదరణ పొందుతూ.. ఎలక్ట్రిక్ టూ వీలర్ రంగంలో దూసుకెళ్తున్న ‘ఓలా ఎలక్ట్రిక్’ (Ola Electric) ఇప్పుడు అతి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్ అందించనున్నట్లు ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం.

గత కొంత కాలంగా చాలా కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుకుంటూ పోతూ ఉంటే.. ఓలా ఎలక్ట్రిక్ మాత్రం వినియోగదారులకు అందుబాటులో ఉండాలనే నెపంతో తన ‘ఎస్1 ఎక్స్’ (S1 X) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కేవలం 69,999 రూపాయల ప్రారంభ ధర వద్ద అందించడం మొదలుపెట్టింది. బుక్ చేసుకున్న వారికి కంపెనీ డెలివరీలు త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.

ధరలు

నిజానికి ఓలా ఎస్1 ఎక్స్ 2kWh వేరియంట్ ధర రూ. 79999. ఇప్పుడు కంపెనీ దీనిని రూ. 69999లకు అందిస్తోంది. అంటే ఈ వేరియంట్ కొనుగోలు మీద కస్టమర్ రూ. 10000 ఆదా చేసుకోవచ్చు. అదే విధంగా ఎస్1 ఎక్స్ 3kWh వేరియంట్ ధర 89,999 రూపాయలు. దీనిని కంపెనీ రూ. 84999లకు అందించడం మొదలు పెట్టింది. ఈ స్కూటర్ కొనుగోలు మీద రూ. 5000 తగ్గించింది.

కంపెనీ టాప్ మోడల్ ఎస్1 ఎక్స్ 4kWh వేరియంట్ ధర రూ. 1.10 లక్షలు. ఇప్పుడు కంపెనీ దీనిని రూ. 99,999లకు అందించడం ప్రారంభించింది. ఈ ధరలు ఎప్పటి వరకు అందుబాటులో ఉంటాయో స్పష్టంగా తెలియదు. కానీ బుక్ చేసుకున్న కస్టమర్లకు మాత్రం డెలివరీలు వచ్చే వారంలో జరుగుతాయని కంపెనీ స్పష్టం చేసింది.

తక్కువ ధరలో అందుబాటులో ఉన్న ఓలా ఎస్1 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే కస్టమర్లు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ లేదా మీకు సమీపంలో ఉన్న డీలర్‌షిప్‌ను సందర్శించి బుక్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్ యొక్క డిజైన్ మరియు ఫీచర్లలో ఎటువంటి మార్పులు జరగలేదు. ఈ విషయాన్ని కస్టమర్లు గమనించాలి. ధర తగ్గించడం వల్ల ఏదైనా ఫీచర్స్ కోల్పోయి ఉంటాయనే అనుమానం అవసరం లేదు.

ఓలా ఎస్1 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ 5 ఇంచెస్ స్క్రీన్ పొందుతుంది. ఇందులో స్కూటర్ గురించి కావాల్సిన సమాచారం తెలుసుకోవచ్చు. ఇందులో 34 లీటర్ బూట్ స్పేస్ ఉంటుంది. హెడ్‌ల్యాంప్ మరియు గ్రాబ్ రైల్ మరియు టెయిల్ లైట్స్ వంటివి కూడా ఇందులో లభిస్తాయి. ఇవన్నీ స్కూటర్ రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

రేంజ్

ఓలా ఎస్1 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క 4 kWh మోడల్ ఒక ఫుల్ ఛార్జ్ మీద 190 కిమీ రేంజ్ అందిస్తుందని ధృవీకరించబడింది. అయితే ఎస్1 ఎక్స్ 2 kWh మోడల్ 95 కిమీ రేంజ్ అందిస్తుంది. చివరగా 3 kWh మోడల్ ఒక సింగిల్ చార్జితో ఏకంగా 143 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే రేంజ్ కూడా అద్భుతంగానే ఉందని తెలుస్తోంది.

ఇతర వేరియంట్స్ ధరలు

ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ విక్రయిస్తున్న ఎస్1 ఎయిర్, ఎస్1 ప్రో మరియు ఎస్1 ఎక్స్ ప్లస్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. వీటి ధరలు రూ. 84999 (ఎస్1 ఎక్స్ ప్లస్), రూ. 1.05 లక్షలు (ఎస్1 ఎయిర్) మరియు రూ. 1.30 లక్షలు (ఎస్1 ప్రో). అయితే ఈ స్కూటర్ల కొనుగోలుపైన కస్టమర్ 8 సంవత్సరాల వారంటీని పొందవచ్చని తెలుస్తోంది.

Don’t Miss: దేశీయ మార్కెట్లో Yamaha Aerox కొత్త వెర్షన్ లాంచ్.. ఇది చాలా స్మార్ట్ గురూ!!

దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో చాలామంది కొత్త వాహనాలను కొనుగోలు చేయాలనుకుంటున్న కస్టమర్లు కూడా ఎలక్ట్రిక్ వాహనాలనే కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతున్నారు. అందులో కూడా ఎక్కువ రేంజ్ అందించే వాహనాలను లేదా తక్కువ ధర వద్ద లభించే వాహనాలను కొనుగోలు చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు కేవలం 69999 రూపాయల వద్ద ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లభించడంతో.. తప్పకుండా ఈ స్కూటర్ మంచి అమ్మకాలను పొందే అవకాశం ఉందని భావిస్తున్నాము.

తక్కువ ధరలో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ఎదురు చూస్తున్న వారికి ఓలా అందిస్తున్న ఈ ఆఫర్ పండగలాంటిదే అవుతుంది. కాబట్టి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారు ఓలా యొక్క ఎస్1 ఎక్స్ స్కూటర్ కూడా పరిశీలించవచ్చు. అయితే కొనుగోలు చేయడం అనేది మొత్తం మీ ఇష్టం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది.

దేశీయ మార్కెట్లో Yamaha Aerox కొత్త వెర్షన్ లాంచ్.. ఇది చాలా స్మార్ట్ గురూ!!

0

Yamaha Aerox Version S Launched in India: ఆటోమొబైల్ మార్కెట్ రోజు రోజుకి మూడు పువ్వులు.. ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో గ్లోబల్ మార్కెట్లో ప్రతి రోజు ఏదో ఒక మూల ఓ కొత్త వెహికల్ లాంచ్ అవుతూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు భారతీయ విఫణిలో జపనీస్ కంపెనీ ఓ సరికొత్త స్కూటర్ లాంచ్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన జపాన్ బ్రాండ్ ‘యమహా’ (Yamaha) ఎట్టకేలకు ”ఏరోక్స్” (Aerox) కొత్త వేరియంట్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త వేరియంట్ పేరు ‘ఏరోక్స్ వెర్షన్ ఎస్’ (Aerox Version S). ఇది చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు.

ధర (Yamaha Aerox Version S Price)

దేశీయ విఫణిలో లాంచ్ అయిన కొత్త ‘యమహా ఏరోక్స్ వెర్షన్ ఎస్’ ధర రూ. 150600 (ఎక్స్ షోరూమ్). ఈ కొత్త వెర్షన్ ధర దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రూ. 3000 ఎక్కువని తెలుస్తోంది. అయితే ఈ స్కూటర్ కీలెస్ ఇగ్నిషన్‌ను పొందుతుంది. ఇది చెప్పుకోదగ్గ అప్డేట్.

కీలెస్ ఇగ్నిషన్ (Keyless Ignition)

యమహా ఏరోక్స్ వెర్షన్ ఎస్ అనేది ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కీలెస్ ఇగ్నిషన్ పొందుతున్న అతి కొన్ని స్కూటర్లలో ఒకటి. ఈ ఫీచర్ వల్ల మీరు స్కూటర్ దగ్గరగా ఉన్నప్పుడు స్టార్ట్ లేదా స్టాప్ చేయవచ్చు. ఇమ్మొబిలైజర్ ఫీచర్ కూడా పొందుతుంది. ఈ స్కూటర్ యమహా ఆర్15 మరియు MT 15 బైకులు రూపొందించబడిన అదే ప్లాట్‌ఫారమ్‌ ఆధారంగా తయారైంది. ఇప్పటికే హోండా మోటార్‌సైకిల్ కంపెనీ హెచ్ స్మార్ట్ వేరియంట్ లాంచ్ చేసింది.

కలర్ ఆప్షన్స్ (Yamaha Aerox Version S Colour Option)

కొత్త యమహా ఏరోక్స్ వెర్షన్ ఎస్ స్కూటర్ కేవలం రెండు కలర్ ఆప్షన్లలో మాత్రమే లభిస్తుంది. అవి సిల్వర్ కలర్ మరియు రేసింగ్ బ్లూ కలర్ ఆప్షన్స్. ఇవి రెండూ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ స్కూటర్ మీద యమహా, ఏరోక్స్ బ్యాడ్జింగ్స్ కూడా గమనించవచ్చు. ఈ స్కూటర్ దాని మోటోజీపీ కలర్ స్కీమ్ స్కూటర్ కంటే ఎక్కువ కావడం గమనార్హం.

డిజైన్ మరియు ఫీచర్స్ (Yamaha Aerox Version S Design & Features)

డిజైన్ పరంగా కొత్త యమహా ఏరోక్స్ వెర్షన్ ఎస్ చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. హెడ్‌లాంప్, టెయిల్ లాంప్, సింగిల్ పీస్ స్టెప్ అప్ సీటు, గ్రాబ్ రైల్, ముందు భాగంలో షార్ప్ నోస్ మరియు ఇండికేటర్స్ అన్నీ కూడా మునుపటి మోడల్ మాదిరిగానే ఉండటం చూడవచ్చు.

ఫీచర్స్ పరంగా కూడా స్టాండర్డ్ మోడల్‌కు సమానంగా ఉంటుంది. కాబట్టి కొత్త యమహా ఏరోక్స్ స్కూటర్ కూడా అదే ఫీచర్స్ పొందుతుంది. ఇవన్నీ స్కూటర్ రైడర్లకు చాలా అనుకూలంగా, రైడింగ్ సమయంలో బైక్ గురించి చాలా సమాచారం అందిస్తుంది. కాబట్టి ఇందులో కొత్త ఫీచర్స్ లేవని స్పష్టంగా తెలుస్తోంది.

ఇంజిన్ (Yamaha Aerox Version S Engine)

ఇక ఇంజిన్ విషయానికి వస్తే.. యమహా ఏరోక్స్ వెర్షన్ ఎస్ స్కూటర్ అదే 155 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8000 rpm వద్ద 14.75 Bhp పవర్ మరియు 6500 rpm వద్ద 13.9 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మొత్తానికి ఈ స్కూటర్ యాంత్రికంగా కూడా ఎలాంటి అప్డేట్స్ పొందలేదని తెలుస్తోంది. ఈ స్కూటర్ 50.3 కిమీ/లీ (సిటీ) మరియు 57.2 కిమీ/లీ (హైవే) మైలేజ్ అందిస్తుందని సమాచారం.

Don’t Miss: భారత్‌లో మొబైల్ నెంబర్ ముందు +91 ఎందుకు ఉంటుందంటే..

దేశీయ విఫణిలో ఇప్పటికే విడుదలైన యమహా ఏరోక్స్ 155 స్కూటర్ మంచి అమ్మకాలను పొందుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఈ స్కూటర్ దాని మునుపటి మోడల్స్ కంటే చాలా భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువమంది యువ కస్టమర్లను ఈ స్కూటర్ ఆకర్శించగలిగింది. కాబట్టి ఇప్పుడు మరో వేరియంట్ రూపంలో లాంచ్ అయిన ఏరోక్స్ తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము. అయితే ఈ బైక్ ఎలాంటి అమ్మకాలు పొందుతుందనేది తెలియాల్సి ఉంది.

Country Code: భారత్‌లో మొబైల్ నెంబర్ ముందు +91 ఎందుకు ఉంటుందంటే..

0

Reason Behind India Country Code 91 Before Mobile Number: భారతదేశంలో ఏ మొబైల్ నెంబర్ అయినా +91 అనే కోడ్‌తోనే స్టార్ట్ అవుతుందని అందరికి తెలుసు. అయితే ఇదే నెంబర్ కోడ్‌తో ఎందుకు స్టార్ట్ అవుతుంది. ఈ కోడ్ మన దేశానికి ఎవరు నిర్ణయించారు. కోడ్ అనేది ఎవరు నిర్ణయిస్తారు అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

మనం రోజు ఉపయోగించే మొబైల్ ఫోన్‌కు ఏదైనా కాల్ వచ్చినప్పుడు.. అంకెల ముందు +91 లేదా ఇతర కోడ్స్ వంటివి రావడం గమనించవచ్చు. అయితే మన దేశానికి మాత్రం +91 కోడ్ నిర్థారించారు. నిజానికి కంట్రీ కాలింగ్ కోడ్ లేదా కంట్రీ డయల్ ఇన్ కోడ్స్ టెలిఫోన్ నెంబర్లకు ప్రీఫిక్స్‌లుగా ఉపయోగిస్తారు. దీని సాయంతోనే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) సభ్యులు లేదా టెలిఫోన్ సబ్‌స్క్రైబర్లకు కనెక్ట్ చేయవచ్చు.

కంట్రీ డయల్ కోడ్ ఎవరు నిర్ణయిస్తారు?

మనదేశానికి +91 కోడ్ ఉన్నట్లుగానే.. దాయాది దేశమైన పాకిస్తాన్ కోసం +92 అనే కోడ్ నిర్థారించారు. వీటినే ఇంటర్నేషనల్ సబ్‌స్క్రైబర్ దయిలింగ్ అని పిలుస్తారు. ఈ కోడ్స్ అన్నింటిని ఆయా దేశాలకు ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటనేషనల్ తిలికమ్యూనికేషన్ యూనియన్ కేటాయిస్తుంది. కోడ్ +91 అనేది 1960లలో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ద్వారా భారతదేశానికి కేటాయించబడింది.

 

ITU ఎప్పుడు ఏర్పడింది?

ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అనేది ఐక్యరాజ్యసమితిలో భాగంగా ఉన్న ఒక ప్రత్యేకమైన ఏజన్సీ. ఇది ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన సమస్యల నివారణపై పనిచేస్తుంది. ఇది 1865 వ సంవత్సరం మే 17న ఇంటర్నేషనల్ టెలిగ్రాఫిక్ యూనియన్‌గా స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. ఈ యూనియన్‌లో మొత్తం 193 దేశాలు ఉన్నట్లు సమాచారం.

ప్రపంచం మొత్తం 9 జోన్లుగా..

ఒక దేశానికీ కంట్రీ కోడ్ ఇవ్వడం కూడా ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్‌లో ఒక భాగం. ఐటీయూకు చెందిన కన్సల్టేటివ్ కమిటీ ప్రపంచంలోని అన్ని దేశాలను మొత్తం 9 జోన్లుగా విభజించింది. ఈ జోన్ ఆధారంగానే కంట్రీ డయల్ కోడ్ రూపొందించడం జరుగుతుంది.

తొమ్మిదవ జోన్ కింద ఉన్న దేశాలు

దేశ జనాభా.. ఆర్ధిక వ్యవస్థ, కమ్యూనికేషన్ సంబంధిత అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ కోడ్‌లను ఐటీయూ నిర్థారిస్తుంది. సౌత్, మిడిల్ మరియు పశ్చిమాసియాతో పాటు.. మధ్య ప్రాచ్య దేశాలన్నీ తొమ్మిదో జోన్ కిందికి వస్తాయి. తొమ్మిదో జోన్ కింద ఉన్న అన్ని దేశాల కోడ్స్ 9తోనే ప్రారంభమవుతాయి. కాబట్టి భారతదేశానికి +91, పాకిస్తాన్‌కు +92, ఆప్ఘనిస్తాన్ +93 మరియు శ్రీలంక +94 కోడ్స్ పొందాయి.

దేశానికి కేటాయించబడిన కోడ్స్.. ఒక దేశం నుంచి మరో దేశానికి కాల్ చేసినప్పుడు ఉపయోగించబడతాయి. అయితే దేశంలోని మొబైల్ నెంబర్లకు కాల్ చేసే సమయంలో వీటిని ఉపయోగించడం తప్పనిసరి కాదు. ఎందుకంటే కాల్ చేసినప్పుడు కంట్రీ కోడ్ ఆటోమాటిక్‌గా వచ్చేస్తుంది. ఈ కోడ్ ఆధారంగా ఏ కాల్ ఏ దేశం నుంచి వస్తోంది అనే విషయాన్ని తెలుసుకోవచ్చు.

Don’t Miss: బైకులు డీజిల్ ఇంజిన్‌తో ఎందుకు రావో తెలుసా? ఆసక్తికర విషయాలు!

ఇప్పటి వరకు చాలామంది మొబైల్ ఫోనుకు కాల్ వచ్చినప్పుడు +91 గమనించినప్పటికీ.. దాని గురించి పెద్దగా పట్టించుకుని ఉండకపోవచ్చు.. లేదా దాని గురించి తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఈ కథనం జదివిన తరువాత +91 ఎందుకు వస్తుంది. ఇది ఎప్పుడు ఉపయోగించబడుతుంది. ఎవరు నిర్థారిస్తారు అనే ప్రశ్నలకు సమాధానం దొరికి ఉంటుంది. ఇలాంటి విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. లేకుంటే ఎప్పటికి సమాధానం లభించని ప్రశ్న మాదిరిగానే మిగిలిపోతుంది.

దేశంలోని ప్రధాన నగరాలకు కోడ్స్..

కొంత సేపు కంట్రీ కోడ్ విషయాన్ని పక్కన పెడితే.. మన దేశంలో కొన్ని ప్రధాన నగరాల నుంచి కాల్ వచ్చినప్పుడు కూడా వాటికి సిమిలర్ నెంబర్ ఒకటి వస్తుంది. వీటిని ల్యాండ్ లైన్ కోడ్స్ అంటారు. ఉదాహరణ మనకు హైదరాబాద్ నుంచి ఫోన్ వస్తే.. నెంబర్ ముందు 040 అనే సంఖ్య చూడవచ్చు. అదే విధంగా ఢిల్లీ నుంచి కాల్ వస్తే 011 అని కోడ్ కనిపిస్తుంది. ఇవన్నీ దేశంలోని వివిధ ప్రాంతాలను తెలియజేయడానికి ఉపయోగపడతాయి. కానీ +91 అనేది దేశం మొత్తానికి కేటాయించబడి ఉంటుంది.

Electric Bikes: భారత్‌లో బెస్ట్ ఎలక్ట్రిక్ బైకులు ఇవే!.. ఓ లుక్కేసుకోండి

0

Top 5 Best Electric Motorcycles in India: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజురోజుకి పెరుగుతున్న తరుణంలో.. కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను దేశీయ విఫణిలో లాంచ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఈ కథనంలో ఇండియన్ మార్కెట్లో ఉన్న అత్యుత్తమ ఎలక్ట్రిక్ బైకుల గురించి మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం.

దేశీయ మార్కెట్లో ఇప్పటి వరకు లెక్కకు మించిన ఎలక్ట్రిక్ బైకులు లాంచ్ అయ్యాయి. డిజైన్, ఫీచర్స్, ఛార్జింగ్ మరియు రేంజ్ వంటి విషయాల్లో అద్భుతమైన బైకులుగా ఆల్ట్రావయొలెట్ ఎఫ్77, రివోల్ట్ ఆర్‌వీ400, మ్యాటర్ ఎరా 5000, టార్క్ క్రటోస్ ఆర్ మరియు ఓబెన్ రోర్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ బైక్ రైడర్లకు అద్భుతమైన రైడింగ్ అనుభూతిని తప్పకుండా అందిస్తాయి.

ఆల్ట్రావయొలెట్ ఎఫ్77 (Ultraviolette F77)

ప్రారంభం నుంచి మంచి అమ్మకాలు పొందుతున్న ‘ఆల్ట్రావయొలెట్ ఎఫ్77’ మన జాబితాలో చెప్పుకోదగ్గ సూపర్.. స్టైలిష్ ఎలక్ట్రిక్ బైక్. ఆల్ట్రావయొలెట్ ఎఫ్77 యొక్క టాప్ ఎండ్ మోడల్ ‘రీకాన్’ 10.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి 27 kW మోటరుతో వస్తుంది. ఇది 36.2 Bhp పవర్ మరియు 95 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క టాప్ స్పీడ్ 147 కిమీ/గం కావడం గమనార్హం.

ఆల్ట్రావయొలెట్ ఎఫ్77 యొక్క పరిధి 307 కిమీ వరకు ఉంటుందని ధ్రువీకరించారు. ఈ బైక్ చూడగానే ఆకర్శించబడే డిజైన్ కలిగి ఉంటుంది. పెద్ద బ్యాటరీ ప్యాక్ కలిగి ఉండటం వల్ల ఎక్కువ రేంజ్ అందిస్తుంది. భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ బైక్ విదేశీ మార్కెట్లో కూడా అడుగుపెట్టడానికి సిద్ధమైంది. దీన్నిబట్టి చూస్తే ఈ ఎలక్ట్రిక్ బైకుకి మార్కెట్లో ఎలాంటి డిమాండ్ ఉందనేది ఇట్టే అర్థమవుతుంది.

రివోల్ట్ ఆర్‌వీ400 (Revolt RV400)

రివోల్ట్ కంపెనీ యొక్క ఆర్‌వీ400 ఎలక్ట్రిక్ బైక్ కూడా అత్యుత్తమ ఎలక్ట్రిక్ బైకులలో ఒకటి. ఇది రోజువారీ వినియోగానికి చాలా ఉపయోగపడుతుంది. 3.24 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగిన ఈ బైక్ 150 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. కానీ వాస్తవ ప్రపంచంలో.. వివిధ వాతావరణ పరిస్థితుల మధ్య ఈ బైక్ ఒక సింగిల్ చార్జితో 100కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది. ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

మ్యాటర్ ఎరా 5000 (Matter Aera 5000)

మనజాబితాలో చెప్పుకోదగ్గ మరో స్టైలిష్ ఎలక్ట్రిక్ బైక్ మ్యాటర్ ఎరా 5000. ఇది చాలా సింపుల్ డిజైన్ కలిగి, ఒక్క చూపుతోనే ఆకర్షిస్తుంది. ఈ బైక్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడిన శక్తివంతమైన 10 kW మోటరుతో వస్తుంది. ఇది 13.4 Bhp పవర్ మరియు 520 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్ మూడు రైడింగ్ మోడ్స్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటివి పొందుతుంది.

టార్క్ క్రటోస్ ఆర్ (Tork Kratos R)

టార్క్ క్రటోస్ ఆర్ విషయానికి వస్తే.. ఈ ఎలక్ట్రిక్ బైక్ 4 kW ఎలక్ట్రిక్ మోటరుతో నడిచే రీజనరేటివ్ బ్రేకింగ్ మరియు వివిధ రైడింగ్ మోడ్స్ వంటివి పొందుతుంది. క్రటోస్ ఆర్ బైక్ ఒక సింగిల్ చార్జితో గంటకు 70 కిమీ వేగంతో.. 180 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఈ బైక్ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. కాబట్టి ఎక్కువ మంది బైక్ ప్రేమికులు ఈ బైకుని ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు.

ఒబెన్ రోర్ (Oben Rorr)

ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ 4.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి 10kW మోటరుతో వస్తుంది. ఈ బైక్ 13.4 Bhp పవర్ మరియు 62 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 200 కిమీ పరిధిని అందిస్తుంది IDC ద్వారా ధృవీకరించబడింది. వాస్తవ ప్రపంచంలో రేంజ్ తగ్గే అవకాశం ఉంటుంది. ఈ బైక్ ఎల్ఈడీ లైట్స్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి అధునాతన ఫీచర్స్ ఉంటాయి.

Don’t Miss: భారత్‌లో అడుగెట్టిన BMW కొత్త కారు – ధర తెలిస్తే షాకవుతారు!

పెట్రోల్ బైకులకు ప్రత్యామ్నాయంగా మాత్రమే కాకుండా.. వాతావరణంలో కాలుష్య కారకాలను తగ్గించడంలో కూడా ఎలక్ట్రిక్ బైకులు ఉపయోగపడతాయి. ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంపొందించడానికి సబ్సిడీలు కూడా అందిస్తున్నాయి. ఇవన్నీ ఎలక్ట్రిక్ బైకుల వినియోగాన్ని పెంచడంలో సహాయపడ్డాయి. రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త ఎలక్ట్రిక్ బైకులు మార్కెట్లో అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నాయి.

భారత్‌లో అడుగెట్టిన BMW కొత్త కారు – ధర తెలిస్తే షాకవుతారు!

0

BMW iX xDrive50 Launched in India: భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) దేశీయ విఫణిలో మరో కొత్త కారును లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఆ కొత్త కారు ఏది? ధర ఎంత, ఫీచర్స్ ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ధర (Price)

బీఎండబ్ల్యూ లాంచ్ చేసిన కొత్త కారు ‘ఎక్స్‌డ్రైవ్50’ (xDrive50). ఇది ఐఎక్స్ యొక్క హై-స్పెక్ వేరియంట్. కంపెనీ యొక్క ఈ కొత్త కారు ధర రూ. 1.40 కోట్లు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న ‘ఎక్స్‌డ్రైవ్40’ (రూ. 1.21 కోట్లు) వేరియంట్ కంటే ఇది ఎక్కువ ధర వద్ద లాంచ్ అయింది. ఈ కొత్త ఎక్స్‌డ్రైవ్50 మోడల్ చిన్న ఎక్స్టీరియర్ అప్డేట్స్ మరియు ఇంటీరియర్ అప్డేట్స్ పొందుతుంది.

డిజైన్ అండ్ ఫీచర్స్ (Design and Features)

చూడటానికి ఎక్స్‌డ్రైవ్50 మరియు ఎక్స్‌డ్రైవ్40 ఎలక్ట్రిక్ కార్లు రెండూ ఒకేలా కనిపించినప్పటికీ కొన్ని చిన్న అప్డేట్స్ పొందుతాయి. అయితే ఫీచర్స్ మరియు సేఫ్టీ పరంగా రెండూ దాదాపు సమానంగా ఉంటాయి. ఎక్స్‌డ్రైవ్50 కారు 22 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మరియు అడాప్టివ్ సస్పెన్షన్‌ వంటి వాటిని పొందుతుంది. అంతే కాకుండా లేజర్‌లైట్ హైలెట్స్, టైటానియం బ్రాంజ్ ఎక్స్‌టీరియర్ ఫినిషింగ్ మరియు యాక్టివ్ సీట్ వెంటిలేషన్ వంటివి పొందుతాయి.

రేంజ్ అండ్ బ్యాటరీ (Range and Battery)

కంపెనీ యొక్క కొత్త ఎక్స్‌డ్రైవ్50 కారు పెద్ద 111.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 635 కిమీ రేంజ్ అందిస్తుంది సర్టిఫైడ్ చేయబడింది. వాస్తవ ప్రపంచంల.. వివిధ వాతావరణ పరిస్థితుల్లో రేంజ్ కొంత మారవచ్చు. ఈ కారులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కలిగిన ఈ కారు 523 హార్స్ పవర్ మరియు 765 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 4.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. కాగా ఎక్స్‌డ్రైవ్40 మోడల్ 76.6 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఒక ఫుల్ చార్జితో 425 కిమీ రేంజ్ అందిస్తుంది.

బీఎండబ్ల్యూ ఎక్స్‌డ్రైవ్50 ఎలక్ట్రిక్ కారు 195 kW డీసీ ఛార్జర్ ద్వారా కేవలం 30 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం చేసుకోగలదు. అదే విధంగా 50 kW డీసీ ఛార్జర్ సాయంతో 97 నిముషాలు, 22 kW ఏసీ ఛార్జర్ ద్వారా 5.5 గంటలు మరియు 11 kW AC ఛార్జర్ ద్వారా 11 గంటల సమయం పడుతుంది.

వారంటీ (Warranty)

ఇక చివరగా వారంటీ విషయానికి వస్తే.. బీఎండబ్ల్యూ ఎక్స్‌డ్రైవ్50 స్టాండర్డ్ 2 ఇయర్స్ / అన్‌లిమిటెడ్ కిమీ వారంటీ మరియు 5 సంవత్సరాల రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌ వంటివి పొందుతుంది. అంతే కాకుండా బ్యాటరీ మీద 8 సంవత్సరాలు / 1.6 లక్షల కిమీ వారంటీ లభిస్తుంది.

ప్రత్యర్థులు (Rivals)

బీఎండబ్ల్యూ ఎక్స్‌డ్రైవ్50 ఎలక్ట్రిక్ కారు దేశీయ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఈ SUV (రూ. 1.39 కోట్లు), జాగ్వార్ ఐ-పేస్ (రూ. 1.26 కోట్లు) మరియు ఆడి క్యూ8 ఈ-ట్రాన్ (రూ. 1.14 కోట్లు) వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఇది అమ్మకాల పరంగా కొంత పోటీ ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్నాము.

Don’t Miss: దేశీయ మార్కెట్లో BMW కొత్త కారు లాంచ్.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

బీఎండబ్ల్యూ కంపెనీ దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను లాంచ్ చేస్తూ దాని ఉనికిని నిరంతరం విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ తాగాజా మరో కొత్త కారు ఎక్స్‌డ్రైవ్50 లాంచ్ చేసింది. ఈ కొత్త కారు ఇండియన్ మార్కెట్లో తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము. కంపెనీ రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త కార్లను లాంచ్ చేస్తుందని ఆశిస్తున్నాము.

దేశీయ మార్కెట్లో BMW కొత్త కారు లాంచ్.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

0

BMW 620d M Sport Signature Launched In India: భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ’ (BMW) ఎట్టకేలకు దేశీయ విఫణిలో సరికొత్త ‘620డీ ఎం స్పోర్ట్ సిగ్నేచర్’ (620d M Sport Signature) కారును లాంచ్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త బీఎండబ్ల్యూ 620డీ ఎం స్పోర్ట్ సిగ్నేచర్ కారు ధర రూ. 78,90,000 (ఎక్స్ షోరూమ్). ఇది దాని స్టాండర్డ్ జీటీ స్పోర్ట్ వేరియంట్ కంటే రూ.3.4 లక్షలు ఎక్కువ.

ఇది చూడటానికి దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ఇందులో కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ గమనించవచ్చు. ఇందులో సాఫ్ట్ క్లోజ్ డోర్స్, ఫుల్లీ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఫ్రంట్ కంఫర్ట్ సీట్లు, మెమొరీ ఫంక్షన్ మరియు లంబార్ సపోర్ట్.. వెనుక సీట్ల కోసం స్పెషల్ బ్యాక్‌రెస్ట్ కుషన్‌లు ఉన్నాయి. కంఫర్ట్ సీట్లు డకోటా లెదర్‌లో ప్రత్యేకమైన స్టిచ్చింగ్ మరియు కాంట్రాస్ట్ పైపింగ్‌తో నలుపు రంగులో చూడచక్కగా ఉంటాయి.

ఫీచర్స్ (Features)

కొత్త బీఎండబ్ల్యూ 620డీ ఎం స్పోర్ట్ సిగ్నేచర్ కారు యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో రిమోట్ కంట్రోల్ పార్కింగ్, కీలెస్ ఎంట్రీ, ఆటోమాటిక్ లాకింగ్, పవర్డ్ టెయిల్‌గేట్ వంటి వాటితోపాటు 10.25 ఇంచెస్ స్క్రీన్‌లతో కూడిన రియర్ సీట్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొఫెషనల్‌తో కూడిన బీఎండబ్ల్యూ డిస్ప్లే కీ ఉన్నాయి.

ఇవి మాత్రమే కాకుండా ఇందులో ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, హర్మాన్ కార్డాన్ 16 స్పీకర్ సౌండ్ సిస్టమ్, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సన్‌బ్లైండ్‌ వంటివి ఉన్నాయి.

ఇంజిన్ (Engine)

ఇంజిన్ విషయానికి వస్తే.. ఇందులో 2.0 లీటర్ 4 సిలిండర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 190 హార్స్ పవర్ మరియు 400 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది కేవలం జీటీ 7.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

సేఫ్టీ ఫీచర్స్ (Safety Features)

ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ కంట్రోల్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, ఇసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు వంటివి ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

ప్రత్యర్థులు (Rivals)

దేశీయ మార్కెట్లో ‘బీఎండబ్ల్యూ 620డీ ఎం స్పోర్ట్’ పెట్రోల్ వేరియంట్ల ధర రూ. 73.50 లక్షల నుంచి రూ. 76.90 లక్షలు కాగా.. డీజిల్ వేరియంట్‌ల ధర రూ. 75.50 లక్షల నుంచి రూ. 78.90 లక్షల వరకు ఉంటుంది. ఇది మెర్సిడెస్ బెంజ్ ఈ క్లాస్ మరియు ఆడి ఏ6 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

Don’t Miss: ఒకప్పుడు సైకిల్.. ఇప్పుడు కోట్లు ఖరీదైన లగ్జరీ కార్లు – ఎవరీ అనురాగ్..

భారతీయ మార్కెట్లో బీఎండబ్ల్యూ కార్లకు మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే సంస్థ తాజాగా బీఎండబ్ల్యూ 620డీ ఎం స్పోర్ట్ లాంచ్ చేసింది. ఇది కూడా తప్పకుండా దేశీయ విఫణిలో మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము. కంపెనీ రానున్న రోజుల్లో మరిన్ని కొత్త ఉత్పత్తులను లాంచ్ చేస్తుందని భావిస్తున్నాము.

నిజానికి బీఎండబ్ల్యూ కంపెనీ దాని ప్రత్యర్థులకు కూడా గట్టిపోటీ ఇస్తూ.. అమ్మకాల్లో దూసుకెల్తూ ఉంటుంది. అమ్మకాల్లో బీఎండబ్ల్యూ కంపెనీ దూసుకెళ్లడానికి ప్రధాన కారణం.. కార్ల యొక్క డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా.. పనితీరు పరంగా కూడా అద్భుతంగా ఉండటమనే తెలుస్తుంది. రాబోయే రోజుల్లో కూడా కంపెనీ ఇంతకు మించిన అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము.