మొన్న హర్మన్‌ప్రీత్.. నేడు స్మృతి మందాన: నెటిజన్లు ఫిదా!

మహిళల ప్రపంచ కప్ 2025 సొంతం చేసుకున్న టీమిండియా ప్రస్తుతం సంబరాల్లో మునిగిపోయింది. విశ్వ విజేతగా నిలిచిన తరువాత.. ఉమెన్స్ టీమ్.. ట్రోఫీతో భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. టీమిండియా మహిళా వైస్ కెప్టెన్ స్మ్రితి మంధాన చేతిపై ఒక టాటూ కనిపించింది. ఇది నెటిజన్లను, క్రికెట్ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ముంజేయిపై టాటూ..

టీమిండియా వైస్ కెప్టెన్.. స్మృతి మందాన ట్రోఫీ గెలుచుకున్న తరువాత, వరల్డ్ కప్ ట్రోఫీని, దానికింద 2025 అనే అక్షరాలను తన ముంజేయిపై టాటూగా వేయించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన క్రికెట్ ప్రేమికులు.. చాలా సంబరపడిపోతున్నారు.

ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా.. సౌత్ ఆఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి, తమ తొలి ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. టీమిండియా ఉమెన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ కూడా వరల్డ్ కప్ టాటూను వేయించుకున్నారు. ఈమె తన టాటూలో.. వరల్డ్ కప్ ట్రోఫీ, దాని పక్కన 52, కింద 2025 అని వేయించుకుంది. కౌర్ ఈ ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ.. నా చర్మంపై, నా హృదయంలో ఇది ఎప్పటికీ ఉంటుందని పేర్కొంది. మొదటి రోజు నుంచి నీకోసం (వరల్డ్ కప్ కోసం) ఎదురు చూశాను. ఇప్పుడు ప్రతిరోజూ.. నిన్ను చూసి కృతజ్ఞతతో ఉంటాను అని వెల్లడించింది.

ప్రధాన మంత్రితో టీమిండియా

ఐసీసీ ట్రోఫీ గెలుచుకున్న టీమిండియా ఉమెన్స్ బృందం.. బుధవారం భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. అంతకంటే ముందు.. ముంబై నుంచి న్యూఢిల్లీ వరకు జట్టు ప్రయాణానికి సంబంధించిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) సోషల్ మీడియాలో షేర్ చేసింది. మోదీని కలిసిన టీమ్.. ఆయనకు బ్లూ కలర్ జెర్సీ బహూకరించారు.

నరేంద్ర మోదీ కూడా.. వరల్డ్ కప్ గెలిచిన మహిళా బృందంతో చాలాసేపు సరదాగా ముచ్చటించారు. ఆ తరువాత లడ్డులు పంచారు. ఏందో ఆప్యాయత చూపించిన మోదీ ప్రేమకు అందరూ ఫిదా అయ్యారు. మోదీ అందరిని ఎంతగానో అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో నరేంద్ర మోదీ ఎక్స్ ఖాతాలో వైరల్ అవుతోంది.

వరల్డ్ కప్ ట్రోఫీ..

కేవలం క్రికెట్ ఆడే ప్లేయర్స్ మాత్రమే కాదు.. యావత్ భారతదేశం టీమిండియా ట్రోఫీ గెలవాలని కలలు కంటుంది. ఈసారి టీమిండియా మహిళల బృందం ఆ కలను నిజం చేసింది. సౌత్ ఆఫ్రికా జట్టును 52 పరుగుల తేడాతో ఓడించి.. ట్రోఫీని గెలుచుకుంది. ఈ సంతోష క్షణాలను ఇండియమ్స్ అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తరువాత ట్రోఫీ గెలుచుకోవడం అందరికీ చాలా ఆనందాన్ని ఇస్తోంది.

మహిళా జట్టు.. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, చివరి వరకు పోరాడి ట్రోఫీని ముద్దాడింది. క్రికెట్ అంటే.. కేవలం పురుషులకు సంబంధించినదే అనే భావనను టీమిండియా మహిళా జట్టు చెరిపివేసింది. ఎంతోమంది యువతులకు ఆదర్శంగా నిలిచింది. క్రికెట్ ఆడాలనుకునే చాలామంది మహిళలకు వీరిప్పుడు మార్గదర్శకం అయ్యారు. ఇది చాలా గొప్ప విషయం టీమిండియాను అభినందించాల్సిన విషయం.