అప్పుడు బాహుబలి, ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు వారణాసి: జక్కన్న మనసులో ఏముంది?

దర్శక ధీరుడు, ఓటమి ఎరుగని డైరెక్టర్ పాన్ ఇండియా క్రియేటర్ ఎస్.ఎస్ రాజమౌళి గురించి సినిమా ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో మొదలైన నేటికీ నెంబర్ స్థానంలోనే కొనసాగుతున్న ఈయన 2025 నాటికి మొత్తం 13 సినిమాలు తెరకెక్కించారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబును ప్రధాన కథానాయకుడుగా (హీరో) చేసి ఒక సినిమా తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాకు వారణాసి అనే పేరు కూడా పెట్టేశారు. ఇప్పుడు చాలామంది మనసులో మెదులుతున్న ప్రశ్న, గూగుల్ తెలుసుకోవడానికి సెర్చ్ చేస్తున్న అంశం ఏమిటీ వారణాసి అని.

ఏమిటీ వారణాసి?

నిజానికి వారణాసి అనేది భారతదేశంలోని ఒక పుణ్యభూమి.. మహాశివుడు కొలువై ఉన్న కాశీనే వారణాసిగా పిలుస్తారు. సంస్కృతంలో వారణాసికి అర్థం ప్రకాశించే స్థలం అని అర్థం. ఇది దేవభూమి. అలాంటి పవిత్రమైన నగరం పేరును తెలుగు సినిమాకు పెట్టడం చాలా ఆనందించాల్సిన విషయం. పేరును బట్టి చూస్తే.. మహేష్ బాబు వారణాసి సినిమా, కాశీ పరిసర ప్రాంతాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తుందని తెలుస్తోంది. మొత్తం మీద వారణాసి గొప్పతనాన్ని చూపించడానికి.. రాజమౌళి కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోందని చాలామంది భావిస్తున్నారు. బహుశా ఆయన మనసులో ఇదే ఉందేమో?

2027లో రిలీజ్?

ఇప్పటికే రిలీజ్ అయిన కొన్ని వారణాసి గ్లింప్స్ చూస్తుంటే.. మహేష్ బాబు చేతిలో త్రిశూలం పట్టుకుని, నందిపై రావడం ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. నదులు, అందమైన ప్రకృతి దృశ్యాలు, అన్నీ కూడా కనువిందు చేస్తున్నాయి. ఈ సినిమా బహుశా 2027 విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే విడుదల తేదీకి సంబంధించిన విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా వెల్లడించలేదు.

మహేష్ బాబు విశ్వరూపం చూశా!

వారణాసి సినిమాకు సంబంధించిన కొంత షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. షూటింగ్ సమయంలో మహేష్ బాబు విశ్వరూపం చూశానని పేర్కొన్నారు. ఇది తప్పకుండా అందరికీ నచ్చుతుందని ఆయన అన్నారు. వారణాసి కథను ఆయనే రాసినప్పటికీ.. రాజమౌళి డైరెక్షన్ చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమా తప్పకుండా ఒక పెద్ద సంచలనం సృష్టిస్తుందని.. సినిమా రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు.

మహేష్ బాబుకు బ్లాక్ బస్టర్ ఖాయం!

నిజానికి పోకిరి సినిమాతో.. సినీ ఇండస్ట్రీలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన మహేష్ బాబు.. ఇప్పుడు వారణాసి సినిమాతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నట్లు అర్థమైపోతోంది. ఈ సినిమా మహేష్ బాబు జీవితంలో మరిచిపోలేని ఘట్టం అని తెలుస్తోంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలు ఒక లెక్క.. రాబోయే వారణాసి ఇంకో లెక్క అని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా కోసం చిత్ర బృందం ఏకంగా రూ. 1200 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.

రాజమౌళి సినిమాలు

2001లో స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో.. దర్శకుడిగా ప్రారంభమైన రాజమౌళి అడుగులు, ఇప్పుడు వారణాసి వరకు వచ్చాయి. ఈ మధ్యలో సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి, బాహుబలి2, బాహుబలి ది ఎపిక్ వంటి సినిమాలను తెరకెక్కించారు. కాగా ఇక వారణాసి సినిమాను తెరకెక్కించడానికి దర్శకధీరుడు సిద్ధమయ్యారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా.. రాజమౌళి ఫ్యాన్స్ కూడా వేచి చూస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన చాలా విషయాలు తెలియాల్సి ఉన్నాయి.