గత ఏడాది జరిగిన మహా కుంభమేళాలో ఎంతోమంది సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిపోయారు. ఇందులో మోనాలిసా భోంస్లే లేదా కుంభమేళా మోనాలిసా ఒకరు. పూసలు అమ్ముకోవడానికి కుంభమేళా వచ్చిన మోనాలీసాను సోషల్ మీడియా ఎంత ఫేమస్ చేసిందంటే.. ఇప్పుడు ఏకంగా సినిమాలోకి అడుగుపెట్టేసింది. ప్రస్తుతం ఆమె కనిపించనున్న సినిమాకు పూజా కార్యక్రమంలో కనిపించింది.
మోనాలిసా మొదటి సినిమా
కుంభమేళా మోనాలిసా.. ఇప్పుడు మలయాళ సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆమె మొదటి సినిమా ‘నాగమ్మ‘ తెలిసింది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం కొచ్చిలో జరిగింది. ఈ కార్యక్రమానికి మోనాలిసా కూడా హాజరైంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నాగమ్మ సినిమా గురించి
మొదటిసారి నాగమ్మ సినిమాతో సినిమా ప్రపంచంలోకి మోనాలిసా అడుగు పెట్టనుంది. ఈ సినిమాకు పీ. బిను వర్గీస్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా నటుడు కైలాష్ ఈ సినిమాలో నటించనున్నట్లు సమాచారం. మోనాలిసా కూడా ఓ ప్రముఖ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. షూటింగ్ సెప్టెంబర్ చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
నాగమ్మ సినిమా పూజ కార్యక్రమానికి ప్రముఖ చిత్ర నిర్మాత సీబీ మలైల్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన మోనాలిసా.. గులాబీ రంగు లెహంగాలో చూడచక్కగా కనిపించింది. సహజమైన అందంతో ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకున్న మోనాలిసా తెరపైన ఎలా ఆకట్టుకోబోతుందో తెలుసుకోవడానికి ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
ఎవరీ మోనాలిసా?, సినిమా అవకాశాలు ఎలా వచ్చాయి?
నిజానికి మోనాలిసా పెద్ద సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి లేదా బాగా డబ్బున్న కుటుంబం నుంచి వచ్చిన యువతి కాదు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఈమె పొట్ట కూటికోసం పూసలమ్ముకోవడానికి కుంభమేళాకు వెళ్లిన ఈమెను.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఫోటోలు తీసి రీల్స్ చేయడం చేశారు. దీంతో ఒక్క రోజులోనే ఈ అమ్మడు సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. నీలికళ్ళ మోనాలిసా.. ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది. దీంతో ఆమె పూజల వ్యాపారం కూడా ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఫోటోలు, రీల్స్ కొంతమంది డైరెక్టర్స్ దృష్టిని ఆకట్టుకున్నాయి. దీంతో ఆమెకు సినిమా పరిశ్రమ నుంచి ఆఫర్స్ వచ్చాయి. బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా దర్శకత్వం వహించిన ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ చిత్రంలో మోనాలిసాకు ఓ క్యారెక్టర్ ఇచ్చారు. ఇప్పుడు నాగమ్మ సినిమాతో మాలీవుడ్లోకి అడుగు పెట్టింది. కాగా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయం తెలియాల్సి ఉంది.
వ్యక్తులపై సోషల్ మీడియా ప్రభావం
ఎవరో కూడా ప్రపంచానికి తెలియనివారికి సైతం సోషల్ మీడియా సెలబ్రిటీలను చేస్తుంది. సెలబ్రిటీలను కూడా ఒక్కరోజులో సోషల్ మీడియా అధోపాతాళానికి చేరుస్తుంది. అలాంటి సోషల్ మీడియా ఈ రోజు ప్రపంచాన్ని ఏలుతోంది. సెలబ్రిటీలైనా.. పారిశ్రామికవేత్తలైనా.. రాజకీయనాయకులైనా ఈ సోషల్ మీడియా అంటే కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అలాంటి సోషల్ మీడియా మోనాలీసాను సెలబ్రిటీని చేసింది.
న్యూస్, మీడియా రంగంలో 12 సంవత్సరాల అనుభవం గల సీనియర్ ప్రొఫెషనల్. అనేక ప్రసిద్ధ తెలుగు టీవీ చానెల్స్లో పని చేశారు. ఇప్పటివరకు అనేక వ్యాసాలు, కథనాలు, అలాగే డిజిటల్ కంటెంట్ రచనలు చేయడంలో విశేష అనుభవం ఉంది. డిజిటల్ మార్కెటింగ్, తెలుగు కంటెంట్ సృష్టిలో నైపుణ్యం ఉన్న మహేష్, క్రియేటివ్, ఆకర్షణీయ, సమాచారపరమైన కంటెంట్ రూపకల్పనలో ప్రత్యేకత కలిగిన వ్యక్తి.