అక్కినేని నాగేశ్వర్ రావు మనువడు, కింగ్ నాగార్జున కుమారుడు.. సినిమా రంగంలోకి అడుగుపెట్టిన యువ సామ్రాట్ అక్కినేని ”నాగ చైతన్య” ఇటీవల తన మనసులోని మాటలు చెప్పారు. తన మొదటి సినిమా జోష్.. 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
నా మొదటి సినిమా జోష్.. మొన్న మొన్న తెరమీదకు వచ్చినట్లు ఉంది. కానీ 16 ఏళ్లు పూర్తయిపోయాయి. ఇన్నేళ్ళలో అనేక ఆటుపోట్లను చూశాను. మొదట్లో నచ్చినట్లు ఉందామనుకుని సినిమాలు చేశాను. ఈ ప్రయాణంలో జయాపజయాలను చూశాను. ప్రస్తుతం నా జీవితం సినిమాకు మాత్రమే అని అర్థమైపోయింది. నా ప్రయాణంలో ఓసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. చాలా సంతృప్తిగా ఉంది. ఈ సినిమా జీవితంలో నాన్న అందించిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను.
పేరుతెచ్చింది ప్రేమ కథలే
జోష్ సినిమా అంతంత మాత్రంగా అనిపించినా.. ఏమాయ చేసావే సినిమా, నిజంగా మాయ చేసింది. నాకు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తరువాత వచ్చిన మజిలీ, మనం, ప్రేమమ్ వంటి సినిమాలు మంచి విజయం సాధించాయి. ఇవన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలే మంచి సక్సెస్ సాధిస్తాయి. ఇటీవల వచ్చిన తండేల్ సినిమా కూడా గొప్ప విజయం సాధించింది. నిజానికి అక్కినేని ఫ్యామిలీ అంటేనే ప్రేమమయం. తాతగారికి, నాన్నగారిని, నాకు కూడా మంచి పేరు తెచ్చిన సినిమాలన్నీ ప్రేమ కథలే. నిజ జీవితంలో కూడా నాకు ప్రేమ కథలంటేనే ఇష్టం. మా డైరెక్టర్లను కూడా ప్రేమ కథల గురించే అడుగుతూ ఉంటాను అని నాగ చైతన్య చెప్పారు.
మజిలీ, లవ్స్టోరీ వంటి సినిమాల్లో నటించిన తరువాత నా విధానం మొత్తం మారిపోయింది. కోవిడ్ తరువాత చాలామంది యాక్షన్ వంటివాటిపైకి వెళ్లిపోయారు. అయితే ప్రేమ కథలకు మంచి ఆదరణ ఉందని నేను నమ్ముతాను. ఒకప్పుడు మాదిరిగా కాకుండా కొత్తగా ఆలోచిస్తున్నాను. ఏడాది రెండు సినిమాలు అవసరం లేదు. ఓ ఆరు నెలలు ఆలస్యమైనా.. ఓ మంచి సినిమాలో నటించాలని ఎదురు చూస్తాను. ఒక సినిమా సక్సెస్ అయితే.. మమ్మల్ని ప్రేక్షకులు ఎక్కడో కూర్చోబెడుతున్నారు. అలాంటప్పుడు మాకు కూడా అలోచించి సినిమాలు ఎంచుకోవాల్సి బాధ్యత ఉందని నాగ చైతన్య చెప్పారు.
అక్కడే మన గురించి తెలుసుకోవచ్చు
సోషల్ మీడియా అంటేనే.. చాలామంది భయపడతారు. నిజం చెప్పాలంటే.. అక్కడే మన గురించి మనం తెలుసుకోగలుగుతాము అని నాగ చైతన్య పేర్కొన్నారు. ఎందుకంటే ఒక హీరోగా మనల్ని ప్రేమించేవాళ్ళు, మన బాగు కోసం విమర్శించేవాళ్లు అక్కడే ఉంటారు. అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల సలహాలను పరిగణలోకి తీసుకునే.. ఏదైనా నిర్ణయం తీసుకుంటాను అని ఆయన అన్నారు. నా భార్య (శోభిత) సినిమా చూసి ఓ ప్రేక్షకురాలిగా తన అభిప్రాయం చెబుతుందని, తన విశ్లేషణ బాగుంటుందని అన్నారు.
నాగ చైతన్య సినిమాలు
జోష్ సినిమాతో తెలుగు చలన చిత్ర రంగంలో అడుగుపెట్టిన నాగ చైతన్య.. ఆ తరువాత ఏమాయ చేసావే, 100% లవ్, దడ, బెజవాడ, తడాఖా, మనం, ఆటో నగర్ సూర్య, ఒక లైలా కోసం, దోచేయ్, రారండోయ్ వేడుక చూద్దాం, సవ్యసాచి, మజిలీ, వెంకీ మామ, తండేల్ వంటి సినిమాల్లో నటించి.. తమదైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తనకంటూ కొంతమంది అభిమానులను సొంతం చేసుకోగలిగారు. కాగా ప్రస్తుతం ఎన్సీ24 సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.