సైమా 2025 అవార్డు విజేతలు వీరే.. ఉత్తమ నటిగా రష్మిక మందన్న

దుబాయ్‌లో జరిగిన ‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025‘ (సైమా 2025) వేడుకలో తెలుగు చిత్రాలు ప్రభంజనం సృష్టించాయి. ఈ కార్యక్రమంలో తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలలో నటనఎం సంగీతం, సాంకేతిక విభాగాలకు చెందిన ప్రతిభావంతులను అవార్డులతో సత్కరించారు. ఇందులో ‘పుష్ప 2: ది రూల్‘ సినిమా ఎక్కువ అవార్డులతో జయజేతనం ఎగురవేసింది. అల్లు అర్జున్, రష్మిక మందన్న, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ ఆయా విభాగాల్లో అవార్డులు గెలుచుకున్నారు. నాగ్ అశ్విన్ కల్కి 2898 ఏడీ, గౌరీ (కన్నడ) సినిమాలు కూడా అనేక విభాగాల్లో అవార్డులను గెలుచుకున్నాయి.

సైమా 2025 విజేతలు (తెలుగు)

➤బెస్ట్ యాక్టర్: అల్లు అర్జున్ (పుష్ప 2: ది రూల్)
➤ఉత్తమ నటి: రష్మిక మందన్న (పుష్ప 2: ది రూల్)
➤బెస్ట్ డైరెక్టర్: సుకుమార్ (పుష్ప 2: ది రూల్)
➤బెస్ట్ మ్యూజిక్ కంపోజర్: దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప 2: ది రూల్)
➤బెస్ట్ ఫిల్మ్: కల్కి 2898 ఏడీ
➤బెస్ట్ విలన్: కమల్ హాసన్ (కల్కి 2898 ఏడీ)
➤బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్: అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 ఏడీ)
➤ఉత్తమ సహాయ నటి: అన్నా బెన్ (కల్కి 2898 ఏడీ)
➤బెస్ట్ కమిడియన్: సత్య (మత్తు వదలరా)
➤బెస్ట్ సినిమాటోగ్రఫీ: రత్నవేలు (దేవర)
➤బెస్ట్ లిరిక్ రైటర్: రామ జోగయ్య శాస్త్రి (చుట్టమల్లే చుట్టేసింది – దేవర)
➤బెస్ట్ సింగర్ (మేల్): కందుకూరి శంకర్ బాబు (వస్తున్నాయ్ ఫీలింగ్స్ – పుష్ప 2: ది రూల్)
➤బెస్ట్ సింగర్ (ఫీమేల్): శిల్పా రావు (చుట్టమల్లే చుట్టేసింది – దేవర)
➤బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్): తేజ సజ్జ (హను మాన్)
➤ఉత్తమ నటి (క్రిటిక్స్): మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్)
➤బెస్ట్ డైరెక్టర్ (క్రిటిక్స్): ప్రశాంత్ వర్మ (హను మాన్)
➤ఉత్తమ నూతన నటుడు: సందీప్ సరోజ్ (కమిటీ కుర్రోళ్ళు)
➤ఉత్తమ నూతన నటి: భాగ్యశ్రీ బోర్సే (మిస్టర్ బచ్చన్)
➤ఉత్తమ నూతన దర్శకుడు: నంద కిషోర్ యెమాని (35 ఒక చిన్న కథ)
➤ఉత్తమ నూతన నిర్మాత: నిహారిక కొణిదెల (కమిటీ కుర్రోళ్ళు)

తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల జాబితాలో పుష్ప 2, కల్కి 2898 ఏడీ ఉన్నాయి. పుష్ప 2 సినిమా రూ. 1500 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. కల్కి 2898 ఏడీ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1200 కోట్ల కలెక్షన్స్ రాబట్టగలిగింది. చిన్న సినిమా అయినప్పటికీ.. హను మాన్ మూవీ ఏకంగా రూ. 200 కోట్ల కలెక్షన్ మార్క్ దాటేసింది. అంతే కాకుండా నిహారిక నిర్మాతగా వ్యవహరించిన కమిటీ కుర్రోళ్ళ సినిమాకు రూ. 10 కోట్లు ఖర్చు పెడితే.. రూ. 25 కోట్లు వసూలు చేసింది.

సైమా అవార్డ్స్ గురించి

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ లేదా దక్షిణ భారత అంతర్జాతీయ సినిమా పురస్కారాలను 2012లో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ వ్యవస్థాపకుడు విష్ణువర్ధన్ ఇందూరి ప్రారంభించారు. దక్షిణ భారత చిత్ర పరిశ్రమ కళాత్మక, సాంకేతిక విజయాలకు గుర్తుగా ఈ అవార్డ్స్ అందిస్తారు. ఈ అవార్డులు రెండు రోజుల పాటు వేర్వేరు భాగాలలో ప్రదర్శించబడతాయి. మొదటిరోజు జనరేషన్ నెక్స్ట్ అవార్డులలో అత్యంత ఆశాజనకంగా రాబోయే దక్షిణ భారత చిత్ర కళాకారులను సత్కరిస్తారు. రెండో రోజు ప్రధాన సినిమాలకు అవార్డులకు కేటాయిస్తారు.

Leave a Comment