సన్‌రైజర్స్ హైదరాబాద్: ఈసారి పక్కా ప్రణాళికతో..

2026 ఐపీల్ సీజన్ కోసం అన్ని ప్రాంచైజీలు తమ తమ ట్రేడ్ అండ్ రిటెన్షన్ వివరాలు బయటపెట్టాయి. ఇందులో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాంచైజీ తనకు అవసరం లేని చాలామంది ఆటగాళ్ళని వేలంలోకి వదిలేసింది. బౌలర్ మహమ్మద్ షమీని ట్రేడ్ ద్వారా 10 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్‌కి ఇచ్చేసింది. ఇతను ఎస్‌ఆర్‌హెచ్‌కు అనుకున్నంత పెర్ఫార్మన్స్ ఇవ్వలేకపోవడం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అనిపిస్తుంది. అయితే మిగిలిన ఆటగాళ్లందరిని ఆక్షన్‌లోకి వదిలింది.

జాబితా ఇలా..

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎనిమిది మందిని ఆటగాళ్ళని విడిచిపెట్టింది. జాబితాలో ఆడమ్ జంపా, సచిన్ బేబీ, అభినవ్ మనోహర్, అథర్వ్ టైడే, వివాన్ ముల్డర్, సీమార్జీత్ సింగ్, రాహుల్ చాహర్, మహమ్మద్ షమీ ఉన్నారు.

ఎనిమిది మందిని తొలగించిన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో మిగిలినవారు ”ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, కమిందు మెండీస్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కట్, జీషాన్ అన్సారీ, ఇషాన్ మలింగ, హర్ష్ దూబే, అనికేత్ వర్మ, బ్రడోన్ కార్శే, ఆర్. స్మారన్” లాంటి కోర్ టీమ్ మాత్రమే.

కెప్టెన్‌గా ప్యాట్ కమిన్స్

దీంతో క్లాసెన్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళని సన్ రైజర్స్ హైదరాబాద్ వదులుకుంటుంది అనే ఊహగానాలకు పులస్టాప్ పెట్టినట్టు అయింది. అయితే అందుకు కారణం అతని ధర రూ. 23 కోట్లుగా ఉండటమే అని చెప్పొచ్చు. క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పినప్పటికి అతనిని కొనసాగించడానికే మొగ్గు చూపింది.

అయితే ఇప్పుడు ఎనిమిది మందిని విడిచిపెట్టిన తర్వాత సన్‌రైజర్స్ ఖాతాలో 25 కోట్ల రూపాయలు మిగిలాయి. ఈ డబ్బులతో దాదాపు పది మంది ఆటగాళ్లను కొనాల్సి ఉంది. మరి ఇప్పటికి అయితే బ్యాటింగ్ విభాగం ముందు ఉన్నదే అలాగే ఉంది. కాబట్టి బ్యాటర్లపై పోకస్ పెట్టే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఆల్ రౌండర్స్ కూడా అంతే ఉన్నారు. నితీష్ కుమార్ రెడ్డి, కామిందు మెండీస్, హర్ష దూబే, అనికేత్ వర్మ, జీషాన్ మలింగ లాంటి వాళ్లు ఉండనే ఉన్నారు. బ్యాటింగ్ లైనప్ బలంగానే ఉంది. ముందు ఉన్న వారినే నమ్ముకుని మళ్లీ రిటైన్ చేసుకుంది. కెప్టెన్‌గా ప్యాట్ కమిన్స్ కొనసాగనున్నాడు.

కప్ గెలవడమే లక్ష్యం!

సన్‌రైజర్స్ 2024లో ఫైనల్ వరకు వెళ్లి కేకేఆర్ చేతిలో దారుణంగా ఓటమిపాలయింది. అయితే మళ్ళీ కొన్ని చిన్న మార్పులతో అదే టీమ్‌తో 2025లో ఆడినప్పటికి ప్లేఆఫ్స్ కూడా వెళ్లలేకపోయింది. కానీ లెక్కలేనన్ని రికార్డులు మాత్రం నెలకొలిపింది. దీంతో ఐపీఎల్‌లో హైయస్ట్ స్కోర్ చేసిన టీమ్‌గా చరిత్ర సృష్టించింది. మొదట నాలుగు 277, 278, 286, 287 స్థానాల్లో కూడా సన్‌రైజర్స్ జట్టే నిలిచింది. దీంతో అభిమానులు 300 టార్గెట్ అనేది ఎక్కువ ప్రచారం చేశారు. మరి ఈ సారి కాటేరమ్మ కొడుకులు ఎలా ఆడుతారో చూడాలి. వికెట్స్ ఒక వైపు దూకుడుగా ఆడి ప్రత్యర్థి బౌలర్లను బయపెట్టడం వీరి నైజం. ఆ దూకుడే సన్‌రైజర్స్‌కు ఎప్పుడు లేనంతగా అభిమానులని సంపాధించి పెట్టింది. అయితే ఇప్పుడు ఎలాగైనా ఫైనల్‌కు వెళ్లి కప్ గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగబోతున్నది.