Wednesday, February 4, 2026

ప్లష్ డోర్ హ్యాండిల్స్ నిషేధం.. ఎందుకో తెలుసా?

ఇటీవల కాలంలో మార్కెట్లో అందుబాటులో ఉన్న చాలా కార్లలో.. ప్లష్ డోర్ హ్యాండిల్స్ కనిపిస్తూ ఉంటాయి. అయితే అలాంటి డోర్ హ్యాండిల్స్ మీద చైనా నిషేధం విధించింది. చైనా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి?, భారతదేశంలో కూడా ఇది అమలులోకి వస్తుందా? అనే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో మీ కోసం..

ప్లష్ డోర్ హ్యాండిల్స్ నిషేధం!

ఒకప్పుడు లేదా ఇప్పుడు కూడా చాలా కార్లలో కార్ డోర్ హ్యాండిల్స్ బయటవైపు ఉంటాయి. వాటిని డ్రైవర్ లేదా వాహనదారుడే మాన్యువల్‌గా ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే కాలక్రమంలో.. టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో కొన్ని కంపెనీలు ప్లష్ టైప్ డోర్స్ పరిచయం చేశాయి. అయితే ఇలాంటి డోర్స్ వల్ల భద్రతా సమస్యలు తలెత్తుతాయని భావించిన చైనా.. వాటిపై నిషేధం విధించింది.

ప్లష్ డోర్ హ్యాండిల్స్ చూడటానికి ఆకట్టుకునేలా ఉంటాయి. కానీ వీటిలో సమస్యలు తలెత్తుతాయని చైనా వీటిపై పూర్తిగా నిషేధం విధిస్తూ.. 2027 జనవరి 1 నుంచి అన్ని వాహనాలలోనూ సాధారణ డోర్ హ్యాండిల్స్ ఉండాలని వెల్లడించింది. నిజానికి ఈ నిషేధం గతేడాది సెప్టెంబర్ నెలలో మొదలైంది.

జనవరి 1, 2027 నాటికి..

2027 జనవరి 1 నుంచి అమలులోకి రానున్న కొత్త ప్రతిపాదనలు కూడా చైనా వెల్లడించింది. 3.5 టన్నుల కంటే తక్కువ బరువున్న అన్ని వాహనాల డోర్స్ హ్యాండిల్స్ కలిగి ఉండాలి. ఎలక్ట్రిక్ డోర్ హ్యాండిల్స్ డోర్ మధ్యలో కలిసిపోయి ఉంటాయి. ఇవి బయటకు కూడా పెద్దగా కనిపించవు. ఒకవేళా కారు ప్రమాదానికి గురైనప్పుడు.. ఎలక్ట్రిక్ డోర్స్ ఉండటం వల్ల బయట నుంచి ఎవరు ఓపెన్ చేయలేరు.

చైనా మాత్రమే..

2025 అక్టోబర్‌లో చైనాలో ఒక ఎలక్ట్రిక్ కారు ప్రమాదానికి గురైంది. కొంతసేపటికి అది మంటల్లో చిక్కుకుంది. అటుగా వెళ్తున్న వ్యక్తులు ఈ ప్రమాదాన్ని గమనించినప్పటికీ.. కారులోని ప్లష్ డోర్ హ్యాండిల్స్ ఓపెన్ చేయలేకపోయారు. ఈ ప్రమాదంలో బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి సంఘటనలు ప్రపంచ వ్యాప్తంగా చాలానే వెలుగులోకి వచ్చాయి. కానీ ప్లష్ డోర్ హ్యాండిల్స్ నిషేధాన్ని చైనా మాత్రమే అమలు చేయడానికి సంకల్పించింది.

అన్ని కార్లకు సేమ్ రూల్

చైనా కొత్త ప్రతిపాదన ప్రకారం.. 2029 నాటికి అన్ని కంపెనీల వాహనాలు తప్పకుండా సాధారణ డోర్ హ్యాండిల్స్ కలిగి ఉండాలి. దీనికి తగిన విధంగా డిజైన్ చేసుకోవడం కంపెనీ బాధ్యత. ప్లష్ డోర్ హ్యాండిల్స్ కేవలం ఎలక్ట్రిక్ కార్లకు మాత్రమే కాకుండా.. పెట్రోల్, డీజిల్ కార్లకు ఉన్నాయి. కాబట్టి చైనా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ఏ కారులోనూ ఇలాంటి డోర్స్ కనిపించకూడదు.

భారతదేశంలో నిషేధం!

ప్రస్తుతం ఇండియాలో కూడా ప్లష్ డోర్స్ కలిగిన కార్లు ఉన్నాయి. అయితే.. భారత ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిషేధం విధించలేదు. బహుశా భవిష్యత్తులో దీనిపై నిషేధం విధిస్తుందా?, లేదా? అనేది తెలియాల్సి ఉంది. భద్రతను దృష్టిలో ఉంచుకుని.. చైనా తీసుకున్న నిర్ణయం సమర్ధనీయమే. ఇది ఇండియాలో కూడా అమలులోకి వస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే వస్తుందా?, రాదా? అనేది ప్రశ్నార్ధకమే..

Uma Siri
Uma Sirihttps://marthatelugu.com/
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.