YouTube Unskippable Ads on TV: భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా టీవీ వినియోగదారులకు యూట్యూబ్ కీలక మార్పులతో షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. టీవీల్లో వీడియోలు చూస్తున్నప్పుడు ఇకపై 90 సెకన్లపాటు స్కిప్ చేయలేని యాడ్స్ (Unskippable Ads) చూపించే అవకాశముందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఫీచర్ను యూట్యూబ్ టెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. యూజర్లను ప్రీమియం సబ్స్క్రిప్షన్ వైపు మళ్లించడం మరియు ఆదాయాన్ని పెంచడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
గత కొన్ని సంవత్సరాల్లో యూట్యూబ్ వినియోగం భారీగా పెరిగింది. ముఖ్యంగా స్మార్ట్ టీవీల్లో యూట్యూబ్ కంటెంట్ చూసే యూజర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీ తన వ్యాపార మోడల్ను మరింత బలోపేతం చేసేందుకు కొత్త మార్పులు తీసుకువస్తోంది. ఇప్పటివరకు 15 నుంచి 30 సెకన్ల వరకు ఉండే యాడ్స్ను యూజర్లు స్కిప్ చేసే అవకాశం ఉండేది. కానీ కొత్తగా ప్రవేశపెట్టే 90 సెకన్ల యాడ్స్తో ఈ అనుభవం పూర్తిగా మారే అవకాశం ఉంది.
ఈ నిర్ణయం టీవీ యూజర్లపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫ్రీగా యూట్యూబ్ చూస్తున్న వారికి ఇది అసౌకర్యంగా మారొచ్చు. ఒక వీడియో చూడాలంటే ముందుగా 90 సెకన్ల యాడ్ పూర్తిగా చూడాల్సి రావడం వల్ల వినియోగదారులు అసహనానికి గురయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో యూట్యూబ్ ప్రీమియం తీసుకోవాలనే ఆలోచన పెరగవచ్చు.
యూట్యూబ్ కొత్త వ్యూహం ఏమిటి?
టెక్ నిపుణుల ప్రకారం యూట్యూబ్ ఈ కొత్త యాడ్ విధానాన్ని రెవెన్యూ పెంపు కోసం తీసుకొస్తోంది. ప్రస్తుతం యాడ్ ఆదాయం యూట్యూబ్కు ప్రధాన వనరు. అయితే యూజర్లు యాడ్స్ను స్కిప్ చేయడం వల్ల ఆదాయం తగ్గే పరిస్థితి ఏర్పడుతోంది.
దీంతో యూట్యూబ్ ఇప్పుడు Unskippable Ads వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా టీవీ యూజర్లను లక్ష్యంగా చేసుకుని ఈ మార్పులు అమలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే టీవీల్లో కంటెంట్ చూసే సమయంలో యూజర్లు ఎక్కువసేపు వీడియోలను చూస్తుంటారు.
OTT యాప్స్ కూడా ఇదే దారిలో
ఇక యూట్యూబ్ మాత్రమే కాదు, ఇతర OTT ప్లాట్ఫారమ్లు కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నాయి. ముఖ్యంగా జియో హాట్ స్టార్ వంటి యాప్స్ కూడా ఎక్కువ యాడ్స్ చూపించే విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఫ్రీ కంటెంట్ అందించే ప్లాట్ఫారమ్లు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు యాడ్స్పై ఆధారపడుతున్నాయి. దీంతో యూజర్లకు యాడ్స్ తప్పనిసరి అవుతున్నాయి. భవిష్యత్తులో ఈ ట్రెండ్ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
యూజర్లపై ప్రభావం!
ఈ కొత్త మార్పులతో టీవీ యూజర్ల అనుభవం మారే అవకాశం ఉంది. ముఖ్యంగా యూట్యూబ్ షాక్ అనే విధంగా 90 సెకన్ల యాడ్స్ వినియోగదారుల సహనాన్ని పరీక్షించవచ్చు.
యాడ్స్ను తప్పించుకోవాలంటే యూజర్లు ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి రావచ్చు. ఇది యూట్యూబ్ వ్యూహంలో భాగమేనని నిపుణులు చెబుతున్నారు. అయితే యూజర్ల నుంచి ఎలా స్పందన వస్తుందో అనేది కీలకంగా మారనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉండగా, పూర్తిస్థాయిలో అమలు ఎప్పుడు ప్రారంభమవుతుందన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
Also Read:
US – Iran Ceasefire: వార్ బ్రేక్ వెనుక పాకిస్తాన్.. అమెరికా, ఇరాన్ ఎందుకు నమ్మాయి?

గిరిబాబు – నేను MarthaTelugu వెబ్సైట్లో డిజిటల్ కంటెంట్ రైటర్గా పనిచేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. నాకు రైటర్గా మూడేళ్ల అనుభవం ఉంది. నాకు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు రాయడంలో ప్రావీణ్యం ఉంది. వార్తలు మాత్రమే కాకుండా పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుణ్ణి.
