ఆశా భోస్లే వార్తల ప్రచారం.. ప్రముఖ న్యూస్ ఛానల్‌పై చర్యలు!

పాకిస్తాన్‌లో మీడియా నియంత్రణ సంస్థగా పనిచేస్తున్న Pakistan Electronic Media Regulatory Authority తాజాగా ఒక ప్రముఖ న్యూస్ ఛానల్‌పై చర్యలు ప్రారంభించింది. భారతీయ గాయని Asha Bhosle మరణంపై వార్తలు ప్రసారం చేస్తూ భారతీయ పాటలు, సినిమాల విజువల్స్ ఉపయోగించారని ఆరోపిస్తూ Geo News కు షోకాజ్ నోటీసు జారీ చేసింది.

ఈ చర్య పాకిస్తాన్‌లో 2018 నుంచి అమల్లో ఉన్న భారతీయ కంటెంట్ నిషేధాన్ని ఉల్లంఘించిందనే కారణంతో తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించినట్టుగా ఈ ప్రసారం ఉందని PEMRA అభిప్రాయపడింది.

నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణ

PEMRA ప్రకారం, ఈ ప్రసారం 2009 PEMRA రూల్స్‌లోని రూల్ 15(1), 2012 టెలివిజన్ బ్రాడ్‌కాస్ట్ నియమావళిలోని కొన్ని సెక్షన్లు, అలాగే 2015 మీడియా కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినట్లు పేర్కొంది.

ఈ నేపథ్యంలో.. Geo News యాజమాన్య సంస్థ అయిన ఇండిపెండెంట్ మీడియా కార్పొరేషన్ CEOను ఏప్రిల్ 27న హాజరు కావాలని ఆదేశించింది. అదేవిధంగా 14 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది. తగిన సమాధానం రాకపోతే జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్ లేదా రద్దు వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది.

Geo News స్పందన!

ఈ నోటీసుపై Azhar Abbas స్పందిస్తూ తమ ఎడిటోరియల్ నిర్ణయాన్ని సమర్థించాడు. ఒక కళాకారుడి జీవితాన్ని చూపించే సమయంలో అతని లేదా ఆమె కృతులను ప్రదర్శించడం సహజమేనని పేర్కొన్నాడు.

అశా భోంస్లే వంటి గొప్ప సిగ్నర్ గురించి చెప్పేటప్పుడు ఆమె పాటలను చూపించడం చాలా అవసరం. నిజానికి ఇంకా ఎక్కువ చూపాల్సిన అవసరం ఉంది” అని ఆయన వ్యాఖ్యానించారు. అదే సమయంలో కళలు, సాహిత్యం దేశాల మధ్య సరిహద్దులు తెలియని సామూహిక వారసత్వమని అన్నారు. కళాకారులను రాజకీయ పరిమితుల్లో బంధించడం సరైంది కాదని స్పష్టం చేశారు.

సాంస్కృతిక కోణంలో చర్చ

Azhar Abbas తన ప్రకటనలో Asha Bhosle మరియు పాకిస్తాన్ గాయని Noor Jehan మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుచేశారు. ఆమె నూర్ జహాన్‌ను “అక్క”గా పిలిచేదని తెలిపారు. అదేవిధంగా Nusrat Fateh Ali Khan తో కలిసి పనిచేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఉర్దూ కవుల రచనలకు ఆమె స్వరం ఇచ్చిందని గుర్తుచేశారు.

రాజకీయ వర్గాల విమర్శలు

ఈ ఘటనపై రాజకీయ వర్గాల నుంచి కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సెనేటర్ Sherry Rehman PEMRA చర్యలను ప్రశ్నించారు. “సాంస్కృతిక అంశాలను నియంత్రించడం అవసరమా?” అని ఆమె వ్యాఖ్యానించారు.

మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్

ఇదిలా ఉండగా Asha Bhosle ఏప్రిల్ 12న మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ కారణంగా మరణించారు. 92 ఏళ్ల వయసులో ఆమె కన్నుమూశారు. Mumbai లోని Shivaji Park Crematorium లో పూర్తి ప్రభుత్వ గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె కుమారుడు Anand Bhosle చివరి కర్మలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి Aamir Khan, Vicky Kaushal, Jackie Shroff, Padmini Kolhapure తదితరులు హాజరయ్యారు.

ఆశా భోంస్లే – సంగీత ప్రయాణం

Asha Bhosle భారతీయ సినీ సంగీత రంగంలో చిరస్మరణీయ స్థానం సంపాదించారు. పండిట్ దీనానాథ్ మంగేష్కర్ కుమార్తెగా జన్మించిన ఆమె చిన్న వయసులోనే సంగీతంలో ప్రవేశించారు. “పియా తు అబ్ తో ఆజా”, “దమ్ మారో దమ్”, “దిల్ చీజ్ క్యా హై”, “చురా లియా హై తుమ్నే” వంటి ఎన్నో పాటలతో ఆమె విశేష ఖ్యాతి పొందారు. ఆమెకు రెండు జాతీయ అవార్డులు, 2000లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2008లో పద్మ విభూషణ్ లభించాయి.

Also read: Ranveer Deepika New House: రణవీర్ – దీపికల రూ.199 కోట్ల కొత్త ఇల్లు!