మూడు నెలల ముందే స్థానిక ఎన్నికలు: ఎలక్షన్ నోటిఫికేషన్ & రిజల్ట్స్ వివరాలు

అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి, టీడీపీ ప్రభుత్వం పాలన కూడా సాగుతోంది. కాగా ఇప్పుడు స్థానిక ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ సిద్దమైపోతోంది. 2026 జనవరిలో ఈ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే ఓటర్ల జాబితాకు సంబంధించిన పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.

ఎన్నికల కమిషనర్ లేఖ

గ్రామ పంచాయితీలకు సంబంధించిన సర్పంచ్ ఎన్నికలు 2026 జనవరిలోనూ.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 2026 జులైలో జరగనున్నట్లు సమాచారం. ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు తమదైన వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. ప్రస్తుతం పదవిలో ఉన్న పాలకుల పదవీకాలం ముగియడానికి మూడు నెలల ముందే ఎన్నికలు నిర్వహించడానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని.. పంచాయతీ రాజ్ & పురపాలక శాఖ కమీషనర్లకు లేఖ పంపింది. ఇందులో ఎన్నికలకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని సూచించారు.

నిజానికి ఏప్రిల్ 2026లో సర్పంచుల పదవీకాలం ముగుస్తుంది. కాగా అంత కంటే ముందు 2026 మార్చిలో నగరపాలక, పురపాలక కార్పొరేటర్స్, కౌన్సిలర్ల పదవీకాలం ముగుస్తుంది. వీరి పదవి ముగియడానికి ముందే.. ఎన్నికల సంఘం ఎలక్షన్స్ నిర్వహించనుంది. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 ప్రకారం.. అధికారుల పదవీ కాలం ముగియడానికి మూడు నెలల ముందే స్థానిక ఎన్నికలను నిర్వహించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. ఈ చట్టం ప్రకారమే.. తొందరగా ఎన్నికలు నిర్వహించడానికి సన్నద్ధమవుతోంది. ఎలక్షన్ కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధిత అధికారులు సుముఖత చూపిస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఎలక్షన్ షెడ్యూల్ ఇలా..

➤రాష్ట్రంలో వార్డులను విభజించడం, రిజర్వేషన్ల ప్రక్రియ వంటివి 2025 అక్టోబర్ 15 నాటికి పూర్తి చేయాలి.
➤2025 అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15లోపల వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలి.
➤2025 నవంబర్ 1 నుంచి 30 లోపల ఎన్నికల అధికారుల నియామకం పూర్తి కావలి.
➤2025 నవంబర్ 16 నుంచి 30 లోపల పోలింగ్ కేంద్రాలను ఖరారు చేయడం, ఈవీఎంలను సిద్ధం చేయడం వంటివి చేయాలి.
➤2025 డిసెంబర్ 15లోపల రిజర్వేషన్లను ఖరారు చేయాలి.
➤2025 డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలి.
➤2026 జనవరిలో ఎన్నికలకు నోటిఫికేషన్.. ఇదే నెలలో ఫలితాలు వెల్లడించేలా ఎన్నికల కమిషన్ ప్లాన్ చేసింది.

పదవీ కాలం పూర్తయిన తరువాత జరగాల్సిన ఎన్నికలు.. మూడు నెలల ముందే జరుపుతుండటం కొంతమందిలో అసంతృప్తిని రేకెత్తించే అవకాశం ఉంది. అయితే అమలులో ఉన్న చట్టాల ప్రకారం.. ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయానికి తప్పకుండా కట్టుబడి ఉండాల్సిందే. మొత్తం మీద ఎలక్షన్ కమిషన్ జనవరిలో సర్పంచుల ఎలక్షన్స్.. జులైలో ఎంపీటీసీ & జెడ్పీటీసీ ఎలక్షన్స్ నిర్వహించాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. దీన్నిబట్టి చూస్తే.. అభ్యర్థులు కూడా ఎన్నికలకు సిద్ధం కావలి.. గ్రామాల్లో ఎన్నికల నగారా మోగించాలి. జనవరిలోనే కొత్త సర్పంచులు ఎవరు?, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఎవరనేది తెలిసిపోతుంది. కాబట్టి పోటీదారులు కూడా తమ మద్దతును పెంచుకోడానికి.. అవసరమైన సమావేశాలను న్యాయపరంగా, చట్టం పరిధికి లోబడి నిర్వహించుకోవాలి. ఎలాంటి అన్యాయాలకు చోటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అభ్యర్థులకు కూడా ఉంది.

Leave a Comment