31.2 C
Hyderabad
Monday, March 17, 2025
Home Blog Page 17

రూ.2.30 లక్షల డిస్కౌంట్: తక్కువ ధరలో థార్ ప్రత్యర్థిని పట్టుకెళ్లండి

0

Maruti Jimny Rs.2.30 Lakh Discount in This Festive Season: పండుగ సీజన్‌లో ఓ మంచి ఆఫ్-రోడర్ కొనుగోలు చేయాలనుకునే వారికి పెద్ద శుభవార్త. ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో మహీంద్రా థార్, ఫోర్స్ గూర్ఖా వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ‘మారుతి సుజుకి జిమ్నీ’ (Maruti Suzuki Jimny) కొనుగోలుపై ఏకంగా రూ. 2.30 లక్షల ఆఫర్ అందుబాటులో ఉంది. దీపావళికి ఈ కారు కొనాలని చూసేవారు ఇక త్వరపడే సమయం ఆసన్నమైంది.

భారతీయ విఫణిలో మారుతి జిమ్నీ ఆల్పా మరియు జీటా అనే రెండు ట్రిమ్‌లలో లభిస్తుంది. చూడటానికి థార్ కంటే కొంత చిన్నదిగా ఉన్నప్పటికీ మంచి పనితీరును అందిస్తుంది. ఈ కారణంగానే మారుతి జిమ్నీ ప్రారంభంలో మంచి అమ్మకాలను పొందగలిగింది.

ఆఫర్ వివరాలు

దీపావళి పండుగ సీజన్‌లో మారుతి జిమ్నీ జీటా, ఆల్పా ట్రిమ్‌ల మీద రూ. 80000 తగ్గింపు లభిస్తుంది. అంతే కాకుండా జీటాపై రూ. 95000, ఆల్పా ట్రిమ్ మీద రూ. 1.50 లక్షల స్పెషల్ మారుతి సుజుకి స్మార్ట్ ఫైనాన్స్ ఆఫర్ కూడా ఉంది. ఈ ఆఫర్ బహుశా అక్టోబర్ చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.

మారుతి సుజుకి జిమ్నీ కారులో కే15బీ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 105 పీఎస్ పవర్, 134 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్, 4 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలను పొందుతుంది. ల్యాడర్ ఫ్రేమ్ చాసిస్ ఆధారంగా నిర్మితమైన ఈ ఆఫ్ రోడర్ అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

జిమ్నీ డిజైన్ & ఫీచర్స్

మారుతి జిమ్నీ సింపుల్ డిజైన్ కలిగి అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, 15 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రికల్లీ అడ్జసబుల్ అండ్ ఫోల్డబుల్ ఓఆర్వీఎమ్, ఆటోమేటెడ్ హెడ్‌ల్యాంప్, ఫాగ్ ల్యాంప్స్ వంటి వాటితో పాటు హార్డ్ టాప్, డ్రిప్ రైల్స్, క్లామ్‌షెల్ బానెట్ మరియు టెయిల్‌గేట్ మౌంటెడ్ స్పేర్ వీల్ వంటివి ఉన్నాయి.

ఫీచర్స్ విషయానికి వస్తే.. మారుతి జిమ్నీ హెచ్‌డీ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, ఆర్కమిస్ సరౌండ్ సౌండ్ సిస్టం, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు క్రూయిజ్ కంట్రోల్‌తో కూడిన 9 ఇంచెస్ స్మార్ట్‌ప్లే ప్రో+ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం పొందుతుంది.

సేఫ్టీ ఫీచర్స్

డిజైన్ మరియు ఇంటీరియర్ ఫీచర్స్ మాత్రమే కాకుండా.. మారుతి జిమ్నీ అత్యాధునిక మరియు వాహన వినియోగదారులకు ఎంతగానో అవసరమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందింది. ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్స్, బ్రేక్ లిమిటెడ్ డిఫరెన్షియల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం, హిల్ హోల్డ్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, రియర్ వ్యూ కెమెరా, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్, ఏబీఎస్ విత్ ఈబీడీ వంటివెన్నో ఉన్నాయి.

నిజానికి భారతదేశంలో మారుతి జిమ్నీ గొప్ప అంచనాల మధ్య లాంచ్ అయింది. అయితే ప్రారంభంలో కొంత ఆశాజనక అమ్మకాలను నమోదు చేసినప్పటికీ.. ప్రస్తుతం దీని అమ్మకాలు అంత గొప్పగా లేకపోవడం గమనార్హం. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. జిమ్నీ పరిమాణంలో థార్ కంటే చిన్నదిగా ఉండటమే కాకుండా.. ధర కూడా థార్ కంటే ఎక్కువే. పనితీరు మంచిగానే ఉన్నప్పటికీ.. థార్ దీని కంటే ఉత్తమ పనితీరును అందిస్తుందని ధృవీకరించబడింది.

జిమ్నీలో అందరికీ ఇష్టమైనది కలర్ ఆప్షన్స్ అనే చెప్పాలి. కంపెనీ దీనిని మల్టీ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేసింది. కాబట్టి కస్టమర్లకు తమకు నచ్చిన రంగు జిమ్నీని ఎంచుకోగలుగుతున్నారు. ధర కొంత ఎక్కువే అయినప్పటికీ.. దీనికి తగిన ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.

Don’t Miss: ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్!.. 650 సీసీ విభాగంలో మరో బైక్ ఇదే..

ప్రస్తుతం కంపెనీ పండుగ సమయంలో మరింత మంచి కస్టమర్లను ఆకర్శించడానికి ఆఫర్ తీసుకువచ్చింది. ఈ ఆఫర్ కారణంగా జిమ్నీ మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము. జిమ్నీ ప్రారంభ ధర దేశీయ మార్కెట్లో రూ. 12.74 లక్షలు కాగా, టాప్ మోడల్ ధరలు రూ. 14.95 లక్షల (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఇండియా) వరకు ఉన్నాయి.

ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్!.. 650 సీసీ విభాగంలో మరో బైక్ ఇదే..

0

Royal Enfield Interceptor Bear 650 unveiled in India: భారతీయ మార్కెట్లో ఎన్ని బైకులున్నా.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులుకున్న క్రేజే వేరు అని చాలా సార్లు చెప్పుకున్నాం. ఇది ముమ్మాటికీ నిజం. ఎందుకంటే దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ కంపెనీ ఇప్పటికి కూడా ఎంతోమంది బైక్ ప్రేమికులను ఆకట్టుకుంటోందంటే.. అది చాలా గొప్ప విషయం. ఇప్పటికే పలు బైకులను దేశీయ విఫణిలో లాంచ్ చేసిన కంపెనీ ఇప్పుడు మరో కొత్త బైక్ ఆవిష్కరించింది. దానిపేరే ‘ఇంటర్‌సెప్టర్ బేర్ 650’. దీని గురించి పూర్తి వివరాలు వివరంగా తెలుసుకుందాం.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ బేర్ 650

ఇప్పటికే 650 సీసీ విభాగంలో కూడా తిరుగులేని అమ్మకాలను పొందుతూ.. దూసుకెళ్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ ఇప్పుడు ఇంటర్‌సెప్టర్ బేర్ 650 పేరుతో మరో బైక్ ఆవిష్కరించింది. ఇప్పటికే అనేక సందర్భాల్లో టెస్టింగ్ సమయంలో కనిపించిన ఈ బైక్ అధికారికంగా మార్కెట్లో అడుగుపెట్టింది. అయితే కంపెనీ బైక్ ధరలను వెల్లడించాల్సి ఉంది.

కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ బేర్ 650 బైక్.. ఇప్పటికే మార్కెట్లో విక్రయించబడుతున్న స్టాండర్డ్ ఇంటర్‌సెప్టర్ 650 ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే ఇది కంపెనీ యొక్క స్క్రాంబ్లర్ బైక్ స్వభావానికి అనుగుణంగా అనేక మార్పులను పొందినట్లు తెలుస్తోంది. డిజైన్ పరంగా ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది. పెయింట్ స్కీమ్ మరియు ఎగ్జాస్ట్ సిస్టం అన్నీ కూడా కొంత భిన్నంగా ఉంటాయి.

ఇంటర్‌సెప్టర్ బేర్ 650 బైక్ సైడ్ ప్యానెల్స్ కొత్తగా అనిపిస్తాయి. సీటు స్క్రాంబ్లర్ మాదిరిగా ఉంటుంది. ఈ బైకుపై నెంబర్ బోర్డు కూడా చూడవచ్చు. ఇందులోని అన్నీ లైట్స్ ఎల్ఈడీ. అయితే వీల్ సైజ్ ఇప్పుడు భిన్నంగా స్పోక్ వీల్ కలిగి కొత్త ఎంఆర్ఎఫ్ నైలోరెక్స్ ఆఫ్ రోడ్ టైర్లను పొందుతుంది. అయితే ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ బైక్ ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్ పొందదు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్‌లో కనిపించే విధంగా బేర్ 650 బైక్ షోవా యూఎస్‌డీ పోర్క్స్ పొందుతుంది. సస్పెన్షన్ అనేది సాధారణ ఇంటర్‌సెప్టర్ కంటే కూడా కొంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సీటు కొంత ఎత్తుగా ఉంటుంది. బ్రేక్స్ అన్నీ కూడా ఇంటర్‌సెప్టర్ నుంచి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఫ్రంట్ బ్రేక్ డిస్క్ పరిమాణం కొంత పెద్దదిగా ఉంటుంది. డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ స్టాండర్డ్‌గా లభిస్తుంది. రియర్ ఏబీఎస్ ఆఫ్-రోడ్ ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు.

ఈ కొత్త ఇంటర్‌సెప్టర్ బేర్ 650 బైక్ అంతర్నిర్మిత న్యావిగేషన్ సిస్టం కలిగి కలర్ టీఎఫ్టీ స్క్రీన్ పొందుతుంది. ఇది మంచి దృశ్యమానతను అందిస్తుంది. బైక్ స్పీడ్ మరియు ఫ్యూయెల్ వంటి వాటిని గురించి వెల్లడించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ బైక్ మొత్తం ఐదు రంగులలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఎంచుకునే రంగును బట్టి ధరలు ఉండొచ్చని సమాచారం.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ బేర్ 650 బైక్ 650 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ పొందుతుంది. ఇది 47 Bhp పవర్ మరియు 57 Nm టార్క్ అందిస్తుంది. అంటే టార్క్ అనేది స్టాండర్డ్ ఇంటర్‌సెప్టర్ బైకు కంటే 5 Nm ఎక్కువని తెలుస్తోంది. ఈ బైక్ టూ-ఇన్‌-టూ ఎగ్జాస్ట్ సిస్టం పొందుతుంది. కాబట్టి ఇది యువ రైడర్లను తప్పకుండా ఆకర్షిస్తుంది.

లాంచ్ డేట్ మరియు అంచనా ధరలు

దేశీయ మార్కెట్లో సరికొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ బేర్ 650 బైక్ వచ్చే నెల 5న (2024 నవంబర్ 5) అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ధరలు కూడా అప్పుడే అధికారికంగా వెల్లడవుతాయి. అయితే ఈ బైక్ ధర రూ. 3.35 లక్షల నుంచి రూ. 3.40 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్యలో ఉండే అవకాశం ఉంది.

Don’t Miss: ఈ కారు కావాలంటే 3 నెలలు వేచి ఉండాల్సిందే!.. ఎందుకో ఇప్పుడే తెలుసుకోండి

రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ తన కొత్త ఇంటర్‌సెప్టర్ బేర్ 650 బైకును లాంచ్ చేసిన తరువాత మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము. ఎందుకంటే ఇప్పటికే.. 650 సీసీ విభాగంలో కంపెనీ ఇప్పటికే బైక్స్ లాంచ్ చేసిన మంచి అమ్మకాలను పొందుతోంది. కాబట్టి రాబోయే 650 సీసీ బైక్ కూడా కస్టమర్లను ఆకర్శించడంలో సక్సెస్ సాధిస్తుందని భావిస్తున్నాము.

ఈ కారు కావాలంటే 3 నెలలు వేచి ఉండాల్సిందే!.. ఎందుకో ఇప్పుడే తెలుసుకోండి

0
Mahindra Thar Waiting Period Reduced: మహీంద్రా థార్.. ఇది కేవలం ఓ కారు పేరు అనుకుంటే పొరపాటే. ఆఫ్ రోడింగ్ ప్రియుల ఎమోషన్. వాహన ప్రేమికుల డ్రీమ్ కారు. ఇది దేశీయ మార్కెట్లో లాంచ్ అయినప్పటినుంచి.. ఇప్పటి వరకు విపరీతమైన అమ్మకాలు పొందుతూ.. భారతీయ విఫణిలో తిరుగులేని ఆఫ్-రోడ్ ఎస్‌యూవీగా సరికొత్త చరిత్రను సృష్టించింది. ఇటీవల రోక్స్ పేరుతో 5 డోర్స్ థార్ లాంచ్ అయినప్పటికీ.. 3 డోర్స్ థార్ కారుకున్న డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ కారు బుక్ చేసుకుంటే.. డెలివరీ కోసం కొన్ని రోజులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది.

భారీ డిమాండ్

2020లో లాంచ్ అయిన మహీంద్రా థార్ డెలివరీ కోసం గతంలో ఒక సంవత్సరం రోజులు వేచి ఉండాల్సి వచ్చిన సందర్భం కూడా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ కూడా కస్టమర్లకు త్వరితగతిన డెలివరీ చేయాలనే ఉద్దేశ్యంతో.. ఉత్పత్తిని కూడా వేగవంతం చేసింది. దీంతో వెయిటింగ్ పీరియడ్ కూడా గణనీయంగా తగ్గింది.

వెయిటింగ్ పీరియడ్

ప్రస్తుతం మహీంద్రా థార్ 4×4 వేరియంట్ కోసం 3 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉన్నట్లు తెలుస్తోంది. 4×2 వేరియంట్ కోసం కూడా రెండు నెలల కంటే ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉన్నట్లు సమాచారం. డీజిల్ మరియు పెట్రోల్ వేరియంట్లకు దాదాపు మూడు నెలల వెయిటింగ్ పీరియడ్ ఉన్నట్లు స్పష్టమవుతోంది.

మహీంద్రా థార్ 4×4 వెయిటింగ్ పీరియడ్

థార్ యొక్క 4×4 వేరియంట్లలో.. హార్డ్ టాప్ పెట్రోల్ మరియు కన్వర్టిబుల్ వేరియంట్స్ కోసం మూడు నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది. హార్డ్ టాప్ డీజిల్ వేరియంట్ల కోసం 2 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉందని సమాచారం. థార్ 4×4 పెట్రోల్ మోడల్ ధరలు రూ. 14.30 లక్షల నుంచి రూ. 17 లక్షల మధ్య ఉన్నాయి. డీజిల్ వేరియంట్ ధరలు రూ. 14.85 లక్షల నుంచి రూ. 17.60 లక్షల (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఇండియా) మధ్య ఉన్నాయి.

మహీంద్రా థార్ 4×4 వెర్షన్ రెండు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అవి 152 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే 2.0 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 132 హార్స్ పవర్ అందించే 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్. ఈ రెండూ కూడా 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమాటిక్ ఎంపికలను పొందుతాయి.

థార్ 4×2 వెయిటింగ్ పీరియర్

ఇక మహీంద్రా థార్ 4×2 మోడల్ వెయిటింగ్ పీరియడ్ విషయానికి వస్తే.. డీజిల్ మరియు పెట్రోల్ వెర్షన్ కోసం రెండు నెలలు వేచి ఉండాల్సి ఉంది. ఈ మోడల్ 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగి 118 హార్స్ పవర్ మరియు 300 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ పొందుతుంది. దీని ధరలు రూ. 11.35 లక్షల నుంచి రూ. 14.10 లక్షల (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఇండియా) మధ్య ఉన్నాయి.

థార్ రోక్స్

మహీంద్రా థార్ 5 డోర్ ఇప్పుడు రోక్స్ పేరుతో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇప్పటికే కంపెనీ ఈ కారు కోసం మంచి బుకింగ్స్ పొందింది. అంతే కాకుండా డెలివెరీలు కూడా ప్రారంభమయ్యాయి. మహీంద్రా థార్ రోక్స్ కారును డెలివెరీ చేసుకోసుకోవడానికి కూడా ఇంకా కొన్ని నెలలు వేచి ఉండాల్సి వస్తోంది. ఆరు వేరియంట్లలో లభిస్తున్న మహీంద్రా థార్ రోక్స్ మొత్తం ఏడు కలర్ ఆప్షన్లలో లభిస్తోంది.

Don’t Miss: ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా.. ఈ బ్రాండ్ కారు ఉండాల్సిందే!

థార్ రోక్స్ 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మరియు 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్స్ పొందుతుంది. ఇవి రెండూ.. 6 స్పీడ్ ఆటోమాటిక్ మరియు మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతాయి. ఈ కారు 4×4 మరియు 4×2 వెర్షన్లలో లభిస్తుంది. ఇవి రెండూ మంచి పనితీరుని అందిస్తాయి. పరిమాణంలో సాధారణ థార్ కంటే పెద్దదిగా ఉన్న రోక్స్ మంచి ఆఫ్ రోడింగ్ అనుభవాన్ని ఇస్తుంది. ఈ కారణంగానే చాలామంది థార్ రోక్స్ లేదా థార్ 5 డోర్ వెర్షన్ ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు.

ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా.. ఈ బ్రాండ్ కారు ఉండాల్సిందే!

0

Super Rich And Famous People Favorite Tata Cars: ధనవంతులు లేదా సినీ ప్రముఖులు అనగానే.. వీరంతా ఖరీదైన కార్లను వినియోగిస్తారని అనుకుంటారు. ఎవరెన్ని కార్లను ఉపయోగించినా టాటా కార్లకు కూడా ఓ ప్రత్యేకమైన గుర్తింపు, ఓ ఆదరణ ఉంది. ఈ కారణంగానే చాలామంది తమ గ్యారేజిలో లేదా రోజువారీ వినియోగానికి మేడ్ ఇన్ ఇండియా టాటా కార్లను ఉపయోగిస్తున్నారు. ఇంతకీ టాటా కార్లను ఉపయోగిస్తున్న ప్రముఖులెవరు? వారు ఉపయోగిస్తున్న కార్లు ఏవి అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

రాజేష్ హీరానందని

బిలినీయర్ రాజేష్ రాజేష్ హీరానందని ఉపయోగించే టాటా బ్రాండ్ కారు ‘నానో’ అని తెలిస్తే.. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోయినా మీరు విన్నది నిజమే. ఎరుపు రంగులో కనిపించే టాటా నానో కారులో రాజేష్ హీరానందని చాలాసార్లు కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మోతీలాల్ ఓస్వాల్

ప్రముఖ బిలినీయర్ మరియు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ లిమిటెడ్ బాస్.. మోతీలాల్ ఓస్వాల్ ఉపయోగించే టాటా కారు సఫారీ డార్క్ ఎడిషన్. దీని ధర రూ. 27.24 లక్షలు. ఈ కారును డీలర్షిప్ అధికారులు నేరుగా ఆయన నివాసానికి డెలివరీ చేశారు. మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న ఈ కారు 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ హెడ్‌లైట్స్, టైల్‌లైట్స్ మరియు 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ పొందుతుంది.

కిమ్ శర్మ

టాటా కారును కలిగి ఉన్న సినీ తారలతో ఒకరు కిమ్ శర్మ. ఈమె కూడా టాటా నానో కారును కలిగి ఉంది. ఉదయం జిమ్‌కు వెళ్లే సమయంలో ఈమె తరచుగా నానో కారులోనే కనిపిస్తుంటారు. భారతదేశంలో అత్యంత చౌకైన కారుగా, రతన్ టాటా ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన ఈ కారు ఒకప్పుడు ఎంతోమంది మనసు దోచింది. ఈ కారు కాకుండా కిమ్ శర్మ రూ. 2 కోట్ల ఖరీదైన బీఎండబ్ల్యూ ఐ7 ఎలక్ట్రిక్ సెడాన్‌ను కూడా కలిగి ఉంది.

ఎన్ చంద్రశేఖరన్

టాటా సన్స్ మరియు టాటా మోటార్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ కూడా రెండు టాటా నెక్సాన్ ఈవీ కారును కలిగి ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే ఈయనకు టాటా కార్ల మీద ఎంత మక్కువ ఉందో అర్థం చేసుకోవచ్చు. 2020లో టాటా మోటార్స్ 50,000 ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేసిన సందర్భంగా రెండో నెక్సాన్ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారు. నెక్సాన్ ఈవీ మార్కెట్లో అత్యుత్తమ అమ్మకాలు పొందుతున్న ఎలక్ట్రిక్ కారు. దీని ధర రూ. 12.49 లక్షల నుంచి రూ. 17.19 లక్షల మధ్య ఉంది.

శ్రీధర్ వెంబు

జోహో కార్పొరేషన్ ఫౌండర్ అండ్ సీఈఓ శ్రీధర్ వెంబు 2022లో టాటా నెక్సాన్ ఈవీ కొనుగోలు చేశారు. వైట్ రూఫ్, టీల్ బ్లూ కలర్ ఆప్షన్ కలిగిన ఈ కారు చూడగానే ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు మాత్రమే కాకుండా.. ఈయనకు ఎలక్ట్రిక్ ఆటో రిక్షా కూడా ఉంది. చిన్న దూరాలకు ప్రయాణించడానికి ఈ ఎలక్ట్రిక్ ఆటో ఉపయోగిస్తారని సమాచారం. ఈయనకు ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడం మీద మక్కువ ఎక్కువ.

మాధురీ దీక్షిత్

ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ కూడా టాటా మోటార్స్ యొక్క నెక్సాన్ ఈవీ కొనుగోలు చేసింది. మాధురీ దీక్షిత్ మాత్రమే కాకుండా.. ఈమె భర్త శ్రీరామ్ నేనే కూడా టాటా నెక్సాన్ ఈవీ కొనుగోలు చేసినట్లు సమాచారం. వీరు 2022లో నెక్సాన్ ఈవీ డార్క్ ఎడిషన్ కొనుగోలు చేశారు. ఈ కారును శ్రీరామ్ నేనే ఆఫీసుకే డెలివరీ చేశారు. మాధురీ దీక్షిత్ కార్ల గ్యారేజిలో నెక్సాన్ మాత్రమే కాకుండా.. ఖరీదైన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎల్డబ్ల్యుబీ హెచ్ఎస్ఈ కూడా ఉంది.

ఫాతిమా సనా షేక్

టాటా బ్రాండ్ కారును కలిగి ఉన్న మరో బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్. దంగల్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు టాటా హారియార్ ఫ్రీ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ యొక్క డార్క్ ఎడిషన్ కొనుగోలు చేసింది. ఈ కారు మాత్రమే కాకుండా.. ఈమె గ్యారేజిలో రూ. 1.15 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ కారు కూడా ఉంది.

పంకజ్ త్రిపాఠి

ప్రముఖ నటుడు పంకజ్ తివారీ గ్యారేజిలో టాటా మోటార్స్ యొక్క నెక్సాన్ ఈవీ ఉంది. చాలా సందర్భాల్లో ఈమె ఈ కారును డ్రైవ్ చేస్తూ కనిపించారు.ఈయన వద్ద ఉన్న టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎడిషన్. ఇది ఒక ఫుల్ చార్జితో 465 కిమీ రేంజ్ అందిస్తుంది. చూడటానికి సాధారణ నెక్సాన్ ఈవీ మాదిరిగా ఉన్నప్పటికీ.. దీనిని కంపెనీ ఎక్కువ రేంజ్ అందించేలా రూపొందించింది.

Don’t Miss: రూ.4.5 లక్షల స్కూటర్ కొన్న మొదటి వ్యక్తి ఇతడే..

పైన చెప్పుకున్న ప్రముఖులతో పాటు.. దేశీయ పారిశ్రామిక దిగ్గజం, భారత మాత ముద్దుబిడ్డ రతన్ టాటా కూడా టాటా నానో కారునే ఎక్కువగా ఉపయోగించేవారు. బుల్లితెర నటి ఉల్కా గుప్తా (టాటా నెక్సాన్ ఈవీ), సినీ నటి మందిరా బేడీ (టాటా నెక్సాన్ ఈవీ), అనిల్ కపూర్ (టాటా సఫారీ), జాయ్ లెనో (టాటా నానో) వంటి వారు కూడా టాటా కార్లను కూడా కలిగి ఉన్నారు.

రూ.4.5 లక్షల స్కూటర్ కొన్న మొదటి వ్యక్తి ఇతడే..

0

BMW CE 02 Electric Scooter First Unit Delivery: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) యొక్క టూ-వీలర్ విభాగం ‘బీఎండబ్ల్యూ మోటొరాడ్’ (BMW Motorrad) ఇటీవలే ఖరీదైన సీఈ-02 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. కాగా ఎట్టకేలకు కంపెనీ డెలివరీలను ప్రారంభించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో స్కూటర్ డెలివరీకి సంబంధించిన సన్నివేశాలను చూడవచ్చు.

ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త సీఈ-02 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.4.5 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ స్కూటర్ యొక్క మొదటి యూనిట్ను కేరళకు చెందిన వ్యక్తికి డెలివరీ చేసినట్లు సమాచారం. షోరూమ్ సిబ్బంది మొదటి కస్టమర్‌కు ఘానా స్వాగతం పలికి డెలివరీ చేశారు. కస్టమర్ కేక్ కట్ చేసిన తరువాత స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి స్కూటర్ సొంతం చేసుకుంటారు.

బీఎండబ్ల్యూ సీఈ-02 ఎలక్ట్రిక్ స్కూటర్

దేశీయ మార్కెట్లో ఇప్పటికే బీఎండబ్ల్యూ మోటోరాడ్ రూ. 14.90 లక్షల ఖరీదైన స్కూటర్ లాంచ్ చేసింది. దీని తరువాత కొంత తక్కువ ధరలో ఓ స్కూటర్ లాంచ్ చేయాలనే ఉద్దేశ్యంతో సీఈ-02 పేరుతో మరో స్కూటర్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 4.5 లక్షలు. ఇది బ్రాండ్ యొక్క తక్కువ ధర కలిగిన స్కూటర్ అయినప్పటికీ.. ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో ఇది చాలా ఖరీదైన స్కూటర్ అని తెలుస్తోంది.

రూ. 1 లక్ష కంటే తక్కువ ధర వద్ద లభించే స్కూటర్లు కావలసినన్ని ఉన్న సమయంలో బీఎండబ్ల్యూ సీఈ-02 విక్రయాలు మన దేశంలో కష్టమనే చెప్పాలి. ధర ఎక్కువే.. కానీ ఇది ఇప్పటికి మార్కెట్లో ఉన్న దాదాపు అన్ని స్కూటర్ల కంటే కూడా భిన్నంగా ఉంటుంది. ఇది అటు స్కూటర్ / బైక్ మాదిరిగా ఉంటుంది.

చూడటానికి భిన్నంగా ఉండే ఈ బీఎండబ్ల్యూ సీఈ-02 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ముందు భాగంలో విండ్‌స్క్రీన్‌తో కూడిన దీర్ఘచతురస్రాకార ఎల్ఈడీ హెడ్‌లైట్ పొందుతుంది. హ్యాండిల్ బార్ కూడా కొంత పెరిగి ఉండటం చూడవచ్చు. ఇది రైడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

కొత్త బీఎండబ్ల్యూ సీఈ-02 ఉక్కుతో తయారైన డబుల్ లూప్ ప్రేమ్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ స్కూటర్ బరువు 142 కేజీలు. ఇది భారతదేశంలోనే తయారైనట్లు సమాచారం. కాబట్టి భారతీయ రోడ్లకు అనుకూలంగా ఉండేలా డిజైన్ చేయబడింది. చూడటానికి సింపుల్ డిజైన్ పొందినప్పటికీ.. రైడర్లకు కావలసినన్ని ఫీచర్స్ పొందింది.

బీఎండబ్ల్యూ సీఈ-02 ఎలక్ట్రిక్ బైక్ 3.5 ఇంచెస్ టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ పొందుతుంది. అంతే కాకుండా ఇది బ్లూటూత్ ఇంటర్‌ఫేస్, ఎస్పీ కనెక్ట్ స్మార్ట్‌ఫోన్ హోల్డర్ వంటివి పొందుతుంది. యూఎస్‌బీ సీ ఛార్జర్ సాకేట్, కీలెస్ రైడ్, రివర్స్ మోడ్ మరియు పవర్ సేవింగ్ మోడ్ వంటివి కూడా ఇందులో పొందవచ్చు. ఈ స్కూటర్ మూడు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. ఇందులో ఏబీఎస్, స్టెబిలిటీ కంట్రోల్ మరియు స్టెబిలిటీ కంట్రోల్ వంటివి కూడా ఉన్నాయి.

సీఈ-02 ఎలక్ట్రిక్ స్కూటర్ 11 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటారు పొందుతుంది. ఇది 3 సెకన్లలో గంటకు 0 నుంచి 50 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 95 కిమీ కావడం గమనార్హం. ఇందులో 3.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 108 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. వాస్తవ ప్రపంచంలో ఈ రేంజ్ కొంత తగ్గే అవకాశం ఉంది.

Don’t Miss: ఈ కారు కావాలంటే సంవత్సరం ఆగాల్సిందే!.. ఫస్ట్ ఎవరు కొన్నారో తెలుసా?

బీఎండబ్ల్యూ సీఈ-04

ఇక బీఎండబ్ల్యూ-సీఈ02 విషయం పక్కన పెడితే.. ఇంతకంటే ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్ బీఎండబ్ల్యూ సీఈ-04. ప్రారంభంలో చెప్పుకున్నట్లు దీని ధర రూ. 14.90 లక్షలు. ఇది 31 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటరుతో 41 Bhp పవర్ మరియు 61 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. 2.6 సెకన్లలో గంటకు 0 నుంచి 50 కిమీ వరకు వేగవంతం అయ్యే ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 120 కిమీ కావడం గమనార్హం. ఇది కూడా భిన్నమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది.

ఈ కారు కావాలంటే సంవత్సరం ఆగాల్సిందే!.. ఫస్ట్ ఎవరు కొన్నారో తెలుసా?

0

New Kia Carnival Sold Out And Suresh Raina Buys First Car: ఒకప్పుడు ఇండియన్ మార్కెట్లో గొప్ప అమ్మకాలు పొంది తరువాత ఉత్పత్తికి నోచుకోని కియా కార్నివాల్.. ఈ మధ్య కాలంలో మళ్ళీ దేశీయ మార్కెట్లో అప్డేటెడ్ మోడల్ రూపంలో లాంచ్ అయింది. భారతీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త కియా కార్నివాల్ ఇప్పటికే 3,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందింది. కాగా ఈ కారు డెలివరీ కోసం ఏకంగా ఒక సంవత్సరం ఎదురు చూడాల్సి ఉంది.

రూ. 63.9 లక్షల (ఎక్స్ షోరూమ్) ఖరీదైన 2024 కియా కార్నివాల్ అతి తక్కువ కాలంలోనే ఎక్కువమంది వాహన ప్రేమికులను ఆకర్శించింది. కేవలం ఒక వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ కారు బ్లాక్ మరియు వైట్ అనే రెండు రంగులలో మాత్రమే లభిస్తోంది. బుక్ చేసుకున్న కస్టమర్లకు తొందరగా డెలివరీ చేయడానికి కంపెనీ ఈ కార్ల ఉత్పత్తిని వేగవంతం చేయాలని.. ఉత్పత్తిని కూడా పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం.

భారతదేశంలో కొత్త కార్నివాల్‌కు ఉన్న డిమాండ్ చూసి కియా ఇండియా ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ప్రారంభంలో అమ్మకాలు అంతంత మాత్రమే అనుకున్న కంపెనీ ఊహ తప్పని తెలిసింది. కియా కార్నివాల్ కారును ఇష్టపడే ప్రజలు చాలామందే ఉన్నట్లు స్పష్టంగా తెలిసిపోయింది.

కొత్త కియా కార్నివాల్ ధర దాని అవుట్ గోయింగ్ మోడల్ కంటే కొంత ఎక్కువగానే ఉన్నప్పటికీ.. కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ కొత్త కార్నివాల్ ‘సెమీ నాక్డ్ డౌన్’ (SKD) కిట్‌ల నుంచి ఆంధ్రప్రదేశ్ అనంతపురంలోని కియా ఇండియా ప్లాంట్‌లో అసెంబుల్ చేయబడుతోంది. కంపెనీ ఇక్కడ నెలకు ప్రస్తుతం 300 యూనిట్లను మాత్రమే అసెంబుల్ చేయగలదు. కాబట్టి డెలివరీలు కొంత ఆలస్యమవుతాయి.

ప్రస్తుతం కియా కార్నివాల్ పొందిన బుకింగ్లను బట్టి చూస్తే ఈ కార్ల మరింత ఎక్కువ సంఖ్యలో అసెంబుల్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కూడా ఈ కారుకు ప్రత్యక్ష ప్రత్యర్థులు లేదు. కానీ అమ్మకాల పరంగా టయోటా ఇన్నోవా హైక్రాస్, టయోటా వెల్‌ఫైర్ వంటి వాటితో పోటీ పడాల్సి ఉంది.

మొదలైన కియా కార్నివాల్ డెలివరీలు

ఇటీవల దేశీయ విఫణిలో లాంచ్ అయిన 2024 కియా కార్నివాల్ డెలివరీలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. కియా కార్నివాల్ మొదటి కారును క్రికెటర్ ‘సురేష్ రైనా’ సొంతం చేసుకున్నారు. ఈయన ఫుల్లీ లోడెడ్ లిమోసిన్ ప్లస్ వేరియంట్ కొనుగోలు సీగేసారు. ఇది డ్యూయెల్ సన్‌రూఫ్, లెవెల్ 2 ఏడీఏఎస్ టెక్నాలజీ, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా, రెండవ వరుసలో పవర్ డోర్స్ వంటి ఫీచర్స్ పొందుతుంది.

పరిమాణంలో విశాలంగా ఉన్న కియా కార్నివాల్ ఎల్ఈడీ లైటింగ్, కొత్త ఫ్రంట్ అండ్ రియర్ బంపర్, 18 ఇంచెస్ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్, కాంట్రాస్టింగ్ స్కిడ్ ప్లేట్స్, వెనుక వైపు ఎల్ఈడీ లైట్ బార్ వంటివి పొందుతుంది. ఈ కారులో అత్యుత్తమ ఇంటీరియర్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

కియా కార్నివాల్ 12.3 ఇంచెస్ డ్రైవర్ డిస్‌ప్లే, 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, 11 ఇంచెస్ హెడ్స్ ఆఫ్ డిస్‌ప్లే, 12 స్పీకర్ బోస్ సిస్టం, 12 వే పవర్ డ్రైవర్ సీటు, ముందు వరుస సీట్ల కోసం వెంటిలేషన్ మరియు హీటింగ్ వంటి వాటితో 8 వే పవర్డ్ ప్యాసింజర్ సీటు. షిఫ్ట్ బై వైర్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ మరియు పుష్ బటన్ స్టార్ట్ / స్టాప్ వంటివి పొందుతుంది. ఇందులో ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

Don’t Miss: తండ్రికి రూ.80 లక్షల గిఫ్ట్ ఇచ్చిన కూతురు: సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్

2024 కియా కార్నివాల్ 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగి 190 Bhp పవర్ మరియు 441 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కాబట్టి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ కారు 14.85 కిమీ / లీ మైలేజ్ అందిస్తుందని సమాచారం.

తండ్రికి రూ.80 లక్షల గిఫ్ట్ ఇచ్చిన కూతురు: సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్

0

Woman Influencer Gift Her Father: ఎక్కడైనా సాధారణంగా తల్లిదండ్రులే పిల్లల ఇష్టాలను తెలుసుకుని.. వారికి నచ్చినవి గిఫ్ట్‌గా ఇస్తుంటారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. పిల్లలు కూడా తమ తల్లిదండ్రులకు గిఫ్ట్స్ ఇచ్చి సంతోషపెడుతున్నారు. ఇలాంటి సంఘటనలు ఇప్పటికే చాలా వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఇలాంటి కోవకు చెందిన మరో ఘటన తెర మీదకు వచ్చింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనిస్తే.. ఒక యువతి తన తండ్రికి ఖరీదైన ‘జీప్ రాంగ్లర్ రూబీకాన్’ గిఫ్ట్ ఇచ్చింది. కుమార్తె ఇచ్చిన గిఫ్ట్ చూసి తండ్రి ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈమె ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అని తెలుస్తోంది. ఈమె తన తండ్రికోసం కొనుగోలు చేసిన జీప్ రాంగ్లర్ రూబీకాన్ కారు మీద 1962 అనే స్టిక్కర్ కూడా ఉంది. తెలుపు రంగులో ఉన్న ఈ కారును డెలివరీ చేసుకోవడం కూడా వీడియోలో చూడవచ్చు.

కారు మీద కనిపించే 1962 అనే స్టిక్కర్, ఆమె తండ్రి పుట్టిన సంవత్సరాన్ని సూచిస్తుంది. కారును డెలివరీ చేసుకున్న తరువాత సిమ్లాలో నివసించే తన తండ్రి వద్దకు తీసుకెళ్లింది. కారుతో ఆ యువతి ఇంటికి చేరుకోగానే.. తన తండ్రికి చిన్న పెట్టెను అందిస్తుంది. దానిని ఓపెన్ చేసి చూస్తే.. అందులో జీప్ కారు కీ ఉండటం చూస్తాడు. తండ్రి మొదట దీనిని సాధారణ కీ చైన్ అని భావిస్తాడు. ఆ తరువాత కారును చూసి ఆశ్చర్యపోతాడు.

కారు చూసిన తరువాత.. ఆయన తన కుటుంబంతో కలిసి డ్రైవింగ్ చేస్తూ ముందుకు వెళ్తాడు. అక్కడి ప్రకృతి దృశ్యాలను చూడటానికి ముందు భాగంలో ఉండే రూఫ్ ఫ్యానెల్ కూడా తీసేస్తారు. ప్రస్తుతం ఈ ఘటన ఎంతోమంది నెటిజన్లను ఆకర్షిస్తోంది. తండ్రికి ఖరీదైన కారును గిఫ్ట్ ఇచ్చిన కుమార్తెను పలువురు ప్రశంసిస్తున్నారు.

జీప్ రాంగ్లర్ రూబీకాన్ (Jeep Wrangler Rubicon)

2024 ఏప్రిల్ నెలలో జీప్ ఇండియా తన అప్డేటెడ్ రాంగ్లర్ రూబీకాన్ లాంచ్ చేసింది. ఇది అన్‌లిమిటెడ్ మరియు రూబీకాన్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ధరలు వరుసగా రూ. 67.65 లక్షలు మరియు రూ. 71.62 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఆన్ రోడ్ ధరలు నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి.

కొత్త జీప్ రాంగ్లర్ అనేది చూడగానే ఆకర్శించే డిజైన్ పొందుతుంది. ఇందులో ఐకానిక్ గ్రిల్, బ్లాక్ సరౌండ్ వంటివి మాత్రమే కాకుండా రౌండ్ ఎల్ఈడీ హెడ్‌లైట్, 17 ఇంచెస్ మరియు 18 ఇంచెస్ వీల్స్ ఉన్నాయి. లోపలి భాగంలో 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, నప్పా లెదర్ మరియు 7 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఉన్నాయి. అన్‌లిమిటెడ్ వేరియంట్ 8 స్పీకర్ సౌండ్ సిస్టం, ప్రీమియం వేరియంట్ 9 స్పీకర్ ఆడియో సిస్టం పొందుతాయి.

ఇంజిన్ విషయానికి వస్తే.. ఇందులో 2.0 లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ 268 పీఎస్ పవర్, 400 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్‌తో జతచేయబడి ఉంటుంది. మొత్తం మీద ఇది అత్యుత్తమ పనితీరును అందిస్తుందని తెలుస్తోంది.

ఏప్రిలియా ఆర్ఎస్457 (Aprilia RS457)

జీప్ రాంగ్లర్ రూబీకాన్ కారు కొనుగోలు చేయడానికి ముందు మహిళా ఇన్‌ఫ్లుయెన్సర్.. సరికొత్త ఏప్రిలియా ఆర్ఎస్457 సూపర్ బైక్ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఈమె తన సోషల్ మీడియా పేజీలో షేర్ చేసింది. ఇందులో బైక్ డెలివరీ తీసుకోవచ్చు చూడవచ్చు.

Don’t Miss: ప్రమాదంలో ప్రాణాలు కాపాడే టాటా కార్లు ఇవే: సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్

తెలుపు మరియు ఎరుపు రంగులో ఉన్న ఈ కొత్త ఏప్రిలియా ఆర్ఎస్457 బైక్ 457 సీసీ ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 47 Bhp పవర్ మరియు 48 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ బైక్ ధర రూ. 4.10 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ మాత్రమే కాకుండా ఈమె వద్ద ఫోర్డ్ మ స్టాంగ్ మజిల్ కారు కూడా ఉన్నట్లు సమాచారం.

ప్రమాదంలో ప్రాణాలు కాపాడే టాటా కార్లు ఇవే: సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్

0

Safest Tata Cars in India From Punch EV To Safari: ఆధునిక కాలంలో కార్లను కొనుగోలు చేసేవారిలో చాలామందికి మైలేజ్ మాత్రమే కాకుండా.. సేఫ్టీ ఎక్కువగా ఉన్న కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప;యూ కార్ల తయారీ సంస్థలు.. తమ కార్లలో కట్టుదిట్టమైన భద్రతా ఫీచర్స్ అందిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగ్గ బ్రాండ్ టాటా మోటార్స్. టాటా మోటార్స్ అంటే నమ్మకానికి అమ్మ వంటిదని అందరికి తెలుసు. క్రాష్ టెస్టులో ఏకంగా 5 స్టార్ రేటింగ్ పొందిన మరియు మెరుగైన పనితీరును అందించే టాటా కార్లను గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించిన టాటా కార్ల జాబితాలో ప్రధానంగా చెప్పుకోదగ్గవి టాటా పంచ్ ఈవీ, టాటా కర్వ్ ఈవీ, టాటా నెక్సాన్, టాటా హారియార్, టాటా సఫారీ మరియు టాటా ఆల్ట్రోజ్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా చైల్డ్ సేఫ్టీలో, అడల్ట్ సేఫ్టీలో ఉత్తమ స్కోర్ సాధించాయి. కాబట్టి దేశీయ మార్కెట్లో అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఇవి అగ్రస్థానంలో ఉన్నాయి.

టాటా పంచ్ ఈవీ (Tata Punch EV)

దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ యొక్క ఎంట్రీ లెవెల్ మోడల్ పంచ్ ఈవీ.. అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా ఉంది. చైల్డ్ సేఫ్టీలో 49 పాయింట్లకు గానూ.. 45 పాయింట్లు సాధించింది. అడల్ట్ సేఫ్టీలో 32 పాయింట్లకు 31.46 పాయింట్లు సాధించింది. ఇలా సేఫ్టీలో మొత్తం మీద 5 స్టార్ రేటింగ్ కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు జరిగిన క్రాష్ టెస్టులో అత్యధిక స్కోర్ సాధించిన కారుగా టాటా పంచ్ రికార్డ్ క్రియేట్ చేసింది.

టాటా పంచ్ ఈవీ అనేది ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ప్రత్యేక ప్లాట్‌ఫారమ్ అయిన టాటా యాక్టి.ఈవీ ప్లాట్‌ఫారమ్ మీద ఆధారపడి రూపొందించబడిన కారు. ఇది ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, త్రీ పాయింట్ సీట్‌బెల్ట్ వంటివి పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోహాదారులకు మంచి రక్షణ అందిస్తాయి. ఈ ఎలక్ట్రిక్ కారు స్మార్ట్, స్మార్ట్ ప్లస్, అడ్వెంచర్. ఎంపవర్డ్ మరియు ఎంపవర్డ్ ప్లస్ వంటి ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

పంచ్ ఈవీ యొక్క స్టాండర్డ్ వేరియంట్ 25 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 315 కిమీ రేంజ్ అందిస్తుంది. లాంగ్ రేంజ్ వేరియంట్ 35 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఇది 421 కిమీ రేంజ్ అందిస్తుంది. బేస్ వేరియంట్స్ అయిన స్మార్ట్ మరియు స్మార్ట్ ప్లస్ వేరియంట్స్ మినహా మిగిలిన అన్ని వేరియంట్లు రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో లభిస్తాయి. ఈ కారు ధరలు రూ. 9.99 లక్షల నుంచి రూ. 14.29 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉన్నాయి.

టాటా కర్వ్ ఈవీ (Tata Curvv EV)

ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన కొత్త టాటా కర్వ్ ఈవీ కూడా సేఫ్టీలో ఉత్తమ స్కోరింగ్ సాధించి.. అత్యంత సురక్షితమైన కారుగా నిలిచింది. భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్టులో ఈ కారు 5 స్టార్ రేటింగ్ సాధించింది. అడల్ట్ సేఫ్టీలో 32 పాయింట్లకు 30.81 పాయింట్లు, చైల్డ్ సేఫ్టీలో 49 పాయింట్లకు 44.83 పాయింట్లు సాధించి బెస్ట్ సేఫ్టీ కార్లలో ఒకటిగా నిలిచింది.

టాటా కర్వ్ ఈవీ.. క్రియేటివ్, అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్ ప్లస్ ఎస్, ఎంపవర్డ్ ప్లస్ మరియు ఎంపవర్డ్ ప్లస్ ఏ అనే వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది 45 కిలోవాట్ మరియు 55 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్స్ పొందుతుంది. 45 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ క్రియేటివ్, అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్ ప్లస్ ఎస్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. 55 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్ ప్లస్ ఎస్ మరియు ఎంపవర్డ్ ప్లస్, ఎంపవర్డ్ ఏ వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ధరలు దేశీయ మార్కెట్లో రూ. 17.49 లక్షల నుంచి రూ. 21.99 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి.

టాటా హారియార్ / సఫారీ (Tata Harrier / Safari)

అత్యుత్తమ సేఫ్టీ కార్ల జాబితాలో టాటా సఫారీ మరియు హారియార్ రెండూ ఉన్నాయి. ఈ కార్లు అడల్ట్ సేఫ్టీలో 32 పాయింట్లకు 30.08 పాయింట్లు, పిల్లల సేఫ్టీలో 4 పాయింట్లకు 44.54 పాయింట్లు సాధించాయి. ఈ రెండు కార్లు గత ఏడాది ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ అయ్యాయి. 2.0 లీటర్ టర్బోఛార్జ్డ్ డీజిల్ ఇంజిన్ ద్వారా 170 పీఎస్ పవర్ మరియు 350 న్యూటన్ మీటర్ టార్క్ అందించే ఈ మోడల్స్ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ పొందుతాయి.

టాటా హారియార్ మొత్తం 25 వేరియంట్లలో లభిస్తుంది. సఫారీ కారు.. డార్క్ ఎడిషన్‌తో కలిపి 29 వేరియంట్లలో లభిస్తుంది. హారియార్ ధరలు రూ. 14.99 లక్షల నుంచి రూ. 25.89 లక్షల మధ్య ఉన్నాయి. సఫారీ ధరలు రూ. 15.49 లక్షల నుంచి రూ. 26.89 లక్షల (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి.

పవన్ కళ్యాణ్‌ ఫేవరెట్ కారు.. ఇప్పుడు సరికొత్త రూపంలో: ధర ఎంతంటే?

0

Mercedes AMG G 63 facelift launched in India: భారతీయ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ కార్లకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అనేక కార్లను దేశీయ విఫణిలో లాంచ్ చేసిన బెంజ్ ఇప్పుడు మరో ఖరీదైన కారును అధికారికంగా లాంచ్ చేసింది. ఈ కారు ధర అక్షరాలా రూ. 3.60 కోట్లు (ఎక్స్ షోరూమ్)

2024 మార్చిలో గ్లోబల్ మార్కెట్లో అడుగుపెట్టయిన జీ-క్లాస్ లాంచ్ తరువాత, మెర్సిడెస్ బెంజ్ ‘ఫేస్‌లిఫ్టెడ్ ఏఎంజీ జీ 63’ లాంచ్ చేసింది. కంపెనీ ఇండియన్ మార్కెట్లో తన పోర్ట్‌ఫోలియోను విస్తరించడంలో భాగంగానే ఎప్పటికప్పుడు కొత్త కార్లను లాంచ్ చేస్తూనే ఉంది. ఇప్పుడు బెంజ్ కంపెనీ లాంచ్ చేసిన అప్డేటెడ్ జీ-క్లాస్ చాలా వరకు కాస్మొటిక్ అప్డేట్స్ పొందింది.

బుకింగ్స్

కంపెనీ ఇప్పటికే మొదటి బ్యాచ్ కార్లను విక్రయించేసింది. అయితే రెండో బ్యాచ్ కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కాబట్టి ఆసక్తికలిగిన కస్టమర్లు బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు 2025 మొదటి త్రైమాసికంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ జీ63 ఫేస్‌లిఫ్ట్ నిటారుగా ఉన్న ఫ్రంట్ గ్రిల్, వర్టికల్ స్లాట్స్, రేడియేటర్ గ్రిల్ మీద డార్క్ క్రోమ్ ఫినిషింగ్, ఏ చిన్నగా.. గుండ్రంగా ఉన్నాయి. విండ్‌స్క్రీన్ కూడా కొత్తదిగా ఉండటం చూడవచ్చు. వెనుకవైపు ఆప్షనల్ కార్బన్ ఫినిష్డ్ స్పేర్ వీల్ కవర్ ఉంది. కొత్త ఏఎంజీ జీ63 ఇప్పుడు కీ-లెస్ ఎంట్రీ కూడా పొందుతుంది.

ఏఎంజీ జీ63 లోపలి భాగంలో గమనించదగ్గ పెద్ద అప్‌గ్రేడ్ ఏబీయూఎక్స్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం. ఇది 12.3 ఇంచెస్ స్క్రీన్స్ పొందుతుంది. ఇందులో డ్రైవర్ డిస్‌ప్లే మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ రెండూ ఉన్నాయి. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం ఇప్పుడు టచ్‌స్క్రీన్. ఇది వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటివి పొందుతుంది. అంతే కాకుండా.. 18 స్పీకర్, 760 వాట్ బర్మెస్టర్ సౌండ్ సిస్టం.. కొత్త త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్ కూడా ఇందులో ఉన్నాయి.

ఇంజిన్ వివరాలు

కొత్త మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ జీ 63 ఫేస్‌లిఫ్ట్ ఇప్పుడు మైల్డ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ పొందుతుంది. ఇందులోని 3982 సీసీ వీ8 ఇంజిన్‌ 585 హార్స్ పవర్, 850 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులోని 48 వోల్ట్స్ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ ద్వారా 22 హార్స్ పవర్ విడుదలవుతుంది. ఇది పాడిల్ షిఫ్టర్‌లతో 9 స్పీడ్ డీసీటీ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఈ కారు టాప్ స్పీడ్ 240 కిమీ కాగా.. 4.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

డైమెన్షన్స్ (కొలతలు)

కొత్త మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ జీ 63 ఫేస్‌లిఫ్ట్ ఆఫ్-రోడింగ్ కెపాసిటీ ఏ మాత్రం మారలేదు. కాబట్టి ఈ కారు గ్రౌండ్ క్లియరెన్స్ 229 మీమీ వరకు ఉంది. వాటర్ వాడింగ్ కెపాసిటీ 700 మిమీ. ఆప్షనల్ 22 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగిన ఈ కారు సెంటర్ లాకింగ్ మెకానిజం కూడా పొందుతుంది. కాబట్టి ఇది అన్ని విధాలా మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

Don’t Miss: రూ. 94707లకే Bajaj Pulsar N125: కొత్త డిజైన్ & బోలెడన్ని కలర్ ఆప్షన్స్

భారతదేశంలో మెర్సిడెస్ బెంజ్ కార్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. చాలా మంది సెలబ్రిటీల మొదటి ఎంపిక మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్ కావడం గమనార్హం. ఇప్పటికే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి అంబానీ దగ్గర వరకు చాలామంది గ్యారేజిలో ఈ బెంజ్ కార్లు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే.. మార్కెట్లో ఈ కార్లకు ఎంత ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు కంపెనీ ఆధునిక హంగులతో.. చూడగానే ఆకట్టుకునే మరో బెంజ్ కారును లాంచ్ చేసింది. ఇప్పటికే మొదటి బ్యాచ్ పూర్తిగా అమ్ముడైపోయింది. రెండవ బ్యాచ్ కోసం బుకింగ్స్ కూడా స్వీకరించబడుతున్నాయి. డెలివరీలు మాత్రం వచ్చే ఏడాదిలోనే జారుతాయి.

రూ. 94707లకే బజాజ్ పల్సర్ ఎన్125: కొత్త డిజైన్ & బోలెడన్ని కలర్ ఆప్షన్స్

0

Bajaj Pulsar N125 Launched in India: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సరికొత్త బజాజ్ యొక్క ‘పల్సర్ ఎన్125’ మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయింది. ఇప్పటికే ఈ విభాగంలో మూడు బైకులు అందుబాటులో ఉండగా.. కంపెనీ మరో బైకును లాంచ్ లాంచ్ చేసింది. ఈ బైక్ ధర, ఫీచర్స్, కలర్ ఆప్షన్స్ మరియు ఇంజిన్ వివరాలను అధికారికంగా ఇక్కడ తెలుసుకుందాం.

కొత్త బజాజ్ పల్సర్ ఎన్125 బైక్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి బేస్ ఎల్ఈడీ డిస్క్ వేరియంట్ మరియు ఎల్ఈడీ డిస్క్ బ్లూటూత్ వేరియంట్. వీటి ధరలు వరుసగా రూ. 94,707 మరియు రూ. 98,707 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ బైక్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా అద్భుతమైన డిజైన్ పొందుతుంది.

ఇంజిన్ వివరాలు

బజాజ్ పల్సర్ ఎన్125 బైక్.. సరికొత్త ఎయిర్ కూల్డ్ 124.58 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8500 rpm వద్ద 12 హార్స్ పవర్ మరియు 6000 rpm వద్ద 11 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కాబట్టి ఇది అత్యుత్తమ పనితీరును అందిస్తుందని భావిస్తున్నాము.

పల్సర్ ఎన్125 బైకులో బజాజ్ కంపెనీ టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు మోనోషాక్ వంటి వాటితో పాటు సింగిల్ క్రెడిల్ ఫ్రేమ్ అండర్‌పిన్నింగ్‌లను అందిస్తుంది. ఈ బైక్ యొక్క ముందు భాగంలో 240 మిమీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో 130 మిమీ డ్రమ్ బ్రేక్ ఉన్నాయి. ఇవన్నీ బైక్ రైడర్లకు ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందించేలా చేస్తాయి.

కలర్ ఆప్షన్స్

కొత్త బజాజ్ పల్సర్ ఎన్125 బైకు షార్ప్ డిజైన్ కలిగి.. కొత్త పెయింటింగ్ స్కీమ్ పొందుతుంది. బేస్ వేరియంట్ అయిన పల్సర్ ఎన్125 బైక్ వైట్, బ్లాక్, రెడ్ మరియు బ్లూ అనే నాలుగు రంగుల్లో లభిస్తుంది. బ్లూటూత్ వేరియంట్ బ్లాక్/రెడ్, బ్లాక్/ఎల్లో మరియి బ్లాక్/గ్రే వంటి డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ బైక్ స్ప్లిట్ సీట్ కాన్ఫిగరేషన్ పొందుతుంది. కాబట్టి రైడర్ మరియు పిలియన్ మంచి రైడింగ్ అనుభూతిని పొందవచ్చు.

లేటెస్ట్ ఫీచర్స్

ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ బైకులో కలర్ కోడెడ్ ప్లాటిక్ చుట్టూ ఉన్న ఎల్ఈడీ హెడ్‌లైట్ ఉండటం చూడవచ్చు. అయితే మీరు ఎంచుకునే వేరియంట్‌ను బట్టి ఎల్‌సీడీ డిస్‌ప్లేతో బ్లూటూత్ లభిస్తుంది. ఈ బ్లూటూత్ వేరియంట్‌లో పెద్ద డాష్, సైలెంట్ స్టార్ట్ వంటివి లభిస్తాయి. సుమారు 9.5 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ ఉన్న ఈ బైక్ బరువు 125 కేజీలు మాత్రమే. సీటు ఎత్తు 795 మిమీ వరకు ఉంటుంది. అండర్‌బెల్లీ ఎగ్జాస్ట్ ఉన్నప్పటికీ.. గ్రౌండ్ క్లియరెన్స్ 198 మిమీ వరకు ఉంటుంది.

Don’t Miss: హోండా ఫ్లెక్స్ ఫ్యూయెల్ బైక్ లాంచ్: ధర & పూర్తి వివరాలు ఇక్కడ చూడండి

ప్రత్యర్థులు

భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త బజాజ్ పల్సర్ ఎన్125 బైక్.. ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న టీవీఎస్ రైడర్, హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా కొంత పోటీ ఉంటుందని సమాచారం. అయినప్పటికీ బజాజ్ యొక్క ఇతర వేరియంట్స్ మాదిరిగానే మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము.