26.7 C
Hyderabad
Saturday, March 15, 2025
Home Blog Page 38

ఇవి కదా ఎలక్ట్రిక్ బైక్స్ అంటే!.. ఇండియాలో లాంచ్ ఎప్పుడో తెలుసా?

0

Ola Electric Motorcycles To Be Launched in 2025 At Indian Market: దేశీయ విఫణిలో ప్రారంభం నుంచి అధిక ప్రజాదరణ పొందుతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ (Ola Electric) మార్కెట్లో ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టనున్నట్లు గత కొన్ని సంవత్సరాలుగా చెబుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఎట్టకేలకు.. కంపెనీ లాంచ్ చేయనున్న ఎలక్ట్రిక్ బైకులను గురించి వెల్లడించింది. ఓలా ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ బైక్ విభాగంలోకి అడుగుపెట్టనున్నట్లు ధ్రువీకరించింది.

2025లో ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్..

ఓలా ఎలక్ట్రిక్ కొన్ని రోజులకు ముందు తన ఎలక్ట్రిక్ బైకులను ప్రదర్శించింది. కాగా.. ఇప్పుడు ఈ బైకులను ఎప్పుడు లాంచ్ చేస్తుందనే విషయాన్ని పేర్కొంది. ఈ నేపథ్యంలో.. సంస్థ తన మొదటి ఎలక్ట్రిక్ బైకును 2026 ఆర్ధిక సంవత్సరం ప్రథమార్థంలో షోరూమ్‌లకు చేరనున్నట్లు ప్రకటించింది. అంటే 2025 జూన్ – డిసెంబర్ మధ్యలో కంపెనీ తన ఫస్ట్ ఎలక్ట్రిక్ బైకును లాంచ్ చేసే అవకాశం ఉందని సమాచారం.

కంపెనీ లాంచ్ చేయనున్న బైకులు.. ఇప్పటి వరకు మార్కెట్లో విక్రయానికి ఉన్న లేదా వినియోగిస్తున్న బైకులకు భిన్నంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్లో లాంచ్ చేయనున్న నాలుగు ఎలక్ట్రిక్ బైకుల కాన్సెప్ట్‌లను గత సంవత్సరమే పరిచయం చేసింది. వీటి పేర్లు డైమండ్‌హెడ్, అడ్వెంచర్, రోడ్‌స్టర్ మరియు క్రూయిజర్. ఇవి ఇప్పటికే ఎంతోమంది బైక్ ప్రేమికులను ఆకర్శించడంలో సక్సెస్ సాధించాయి.

2026లో డెలివరీలు..

2025లో కంపెనీ ఈ బైకులను లాంచ్ చేసిన తరువాత 2026లో డెలివరీలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అంటే కంపెనీ ఈ బైకులను వచ్చే ఏడాదికి భారతీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో కొత్త చరిత్రను సృష్టించిన ఓలా ఎలక్ట్రిక్.. ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల విభాగంలో కూడా తన పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ.. కస్టమర్లకు చేరువవ్వడానికి సన్నద్ధమవుతోంది.

ఇప్పటికే కంపెనీ పరిచయం చేసిన నాలుగు ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ బైకులలో దేన్ని ముందుగా లాంచ్ చేస్తుందనే విషయం స్పష్టంగా తెలియడం లేదు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో 49 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్న ఓలా ఎలక్ట్రిక్.. ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగంలో కూడా ఆధిపత్యాన్ని చెలాయించే అవకాశం ఉంటుంది.

ధరలు ఎలా ఉండనున్నాయంటే?

ప్రస్తుతం మార్కెట్లో లక్ష రూపాయలకంటే తక్కువ ధర వద్ద కూడా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులోని ఉన్నాయి. కాబట్టి కంపెనీ లాంచ్ చేయనున్న ఎలక్ట్రిక్ బైకులు కూడా తప్పకుండా సరసమైన ధరల వద్ద అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు కూడా అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. ధరలకు సంబంధించిన వివరాలను కంపెనీ ఈ బైకును లాంచ్ చేసే సమయంలో వెల్లడిస్తుందని భావిస్తున్నాము.

ఓలా ఎలక్ట్రిక్ మాత్రమే కాకుండా.. ఏథర్ ఎనర్జీ, హీరో మోటోకార్ప్ వంటి కంపెనీలు కూడా దేశీయ విఫణిలో ఎలక్ట్రిక్ బైకులను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నాయి. ఈ కంపెనీలు కూడా 2026 నాటికి భారతదేశంలో ఎలక్ట్రిక్ బైకులను లాంచ్ చేయడానికి సర్వత్రా సిద్ధమవుతున్నాయి. ఈ కంపెనీలు రాబోయే ఎలక్ట్రిక్ బైకులకు సంబంధించిన కాన్సెప్ట్ మోడల్స్ కూడా ఇంకా పరిచయం చేయలేదు. కాబట్టి ఈ సంస్థలు ఎలక్ట్రిక్ బైకులను లాంచ్ చేస్తే.. ఎలాంటి డిజైన్‌లో లాంచ్ చేస్తుందని బైక్ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు.

ఎలక్ట్రిక్ బైకులకు డిమాండ్ పెరగటానికి కారణం?

నిజానికి ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ బైకులకు డిమాండ్ భారీగానే ఉంది. ఎలక్ట్రిక్ బైకులను ఎక్కువ మంది కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం.. మారుతున్న కాలానికి అనుగుణంగా మారటం, లేదా పెరిగుతున్న ఇంధన ధరల నుంచి తప్పించుకోవడం. ప్రస్తుతం దేశంలో దాదాపు అన్ని నగరాల్లోనే పెట్రోల్ ధరలు సెంచరీ దాటేశాయి. ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం ఒక్కసారిగా రూ. 3 పెంచుతూ ప్రకటించింది.

Don’t Miss: భారత్‌లో తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ కారు ఇదే!.. రేటు తెలిస్తే కొనేయాలనిపిస్తుంది

రోజు రోజుకి పెరుగుదల దిశగా అడుగులు వేస్తున్న పెట్రోల్ ధరలు సామాన్యులకు మాత్రమే కాకుండా మధ్యతరగతి ప్రజలకు షాకిస్తోంది. ఈ ధరల పెరుగుదల భూతం నుంచి తప్పించుకోవడానికి పెట్రోల్ బైకులకు ప్రత్యామ్నాయాలను వెతుక్కోవడం తప్పా.. వేరే మార్గం లేదని తెలుస్తోంది. అంతే కాకుండా పెట్రోల్ బైకులకు పెట్టే ఖర్చు కంటే.. ఎలక్ట్రిక్ వాహనాల మెయింటెనెన్స్‌కు ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. ఇవన్నీ ప్రజలను ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు చేసేలా చేస్తున్నాయి. అయితే మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్నాయి. ఇది కొంతమందిని ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే సమయంలో కొంత ఆలోచింపజేస్తోంది. కాబట్టి దేశంలో విరివిగా ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉంది.

భారత్‌లో తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ కారు ఇదే!.. రేటు తెలిస్తే కొనేయాలనిపిస్తుంది

0

Affordable Electric Car in India MG Comet EV: భారతదేశంలో రోజు రోజుకి కొత్త వాహనాల లాంచ్ పెరుగుతూనే ఉంది. పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ కార్లను ఎప్పటికప్పుడు ఆధునిక హంగులతో లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఎన్నెన్ని వాహనాలు లాంచ్ అయినా సరసమైన ధరలో లభించే వాహనాలకు డిమాండ్ ఎక్కువ ఉంటుందని. ఇది అందరికి తెలిసిన విషయమే. ఈ కథనంలో ఇండియన్ మార్కెట్లో సరసమైన ధర వద్ద లభిస్తున్న ఎలక్ట్రిక్ కారు గురించి వివరంగా తెలుసుకుందాం.

దేశీయ విఫణిలో టాటా టియాగో ఈవీ, టాటా టిగోర్ ఈవీ, టాటా పంచ్ ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా ఎక్స్‌యూవీ400, సిట్రోయెన్ ఈ-సీ3 మరియు ఎంజీ జెడ్ఎస్ ఈవీ వంటి కార్లు అందుబాటులో ఉన్నా వీటి ధరలు కొంత ఎక్కువగానే ఉన్నాయి. వీటన్నింటికంటే తక్కువ ధరలో లభించే కారు ఎంజీ మోటార్ కంపెనీకి చెందిన ‘కామెట్ ఈవీ’.

ఎంజీ కామెట్ ఈవీ

భారతదేశంలో విక్రయించబడుతున్న ‘ఎంజీ కామెట్ ఈవీ’ (MG Comet EV) ధరలు రూ. 6.99 లక్షల నుంచి రూ. 9.53 లక్షల మధ్య ఉన్నాయి. మార్కెట్లో లాంచ్ అయినప్పటి నుంచి అంటే.. 2024 జనవరి నుంచి మే 2024 వరకు 4493 యూనిట్లు అమ్ముడయ్యాయి. దీన్ని బట్టి చూస్తే ఈ కారుకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందొ అర్థం చేసుకోవచ్చు.

ఎంజీ కామెట్ ఎలక్ట్రిక్ కారును సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. మంచి డిజైన్ కలిగి చూడచక్కగా ఉన్న ఈ ఎలక్ట్రిక్ కారు అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌, టెయిల్‌ల్యాంప్‌ వంటి వాటితో పాటు ముందు భాగంలో బ్రాండ్ లోగో, వెనుక కనెక్టింగ్ లైట్స్ వంటివి ఉన్నాయి.

ఫీచర్స్ విషయానికి వస్తే.. ఎంజీ కామెట్ ఈవీ ఆధునిక కాలంలో వాహన వినియోగదారులకు అవసరమైన అన్ని ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం వంటి వాటితో పాటు లెదర్‌తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ వంటివి ఉన్నాయి. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌పప్లే, టూ స్పోక్ మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ వంటి కూడా ఇందులో ఉన్నాయి. ఇవన్నీ మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

వేరియంట్స్ & ధరలు

భారతదేశంలో విక్రయించబడుతున్న ఎంజీ కామెట్ ఈవీ ఐదు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఎగ్జిక్యూటివ్ (రూ. 6.99 లక్షలు), ఎక్సైట్ (రూ. 7.98 లక్షలు), ఎక్సైట్ ఎఫ్‌సీ (రూ. 8.45 లక్షలు), స్పెషల్ (రూ. 9 లక్షలు) మరియు స్పెషల్ ఎఫ్‌సీ (రూ. 9.37 లక్షలు) అన్ని ధరలు ఎక్స్ షోరూమ్). ఇవన్నీ ఒకే రకమైన డిజైన్ కలిగి ఉన్నప్పటికీ ఫీచర్లలో కొంత భిన్నంగా ఉంటాయి.

ఎంజీ మోటార్ కంపెనీ లాంచ్ చేసిన కొత్త కామెట్ ఈవీ డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా మాత్రమే కాకుండా మంచి రేంజ్ అందించేలా రూపొందించబడింది. ఇందులో పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటారు ఉంటుంది. ఇది 42 పీఎస్ పవర్ మరియు 110 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారులో 17.3 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఐపీ67 రేటెడ్.. కాబట్టి డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ మాదిరిగా పనిచేస్తుంది.

కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు ఒక సింగిల్ చార్జితో లేదా ఫుల్ చార్జితో ఏకంగా 230 కిమీ రేంజ్ అందిస్తుందని ధృవీకరించబడింది. అయితే ఈ రేంజ్ అనేది వివిధ వాతావరణ పరిస్థితులను బట్టి కొంత మారే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు 3.3 కిలోవాట్ ఛార్జర్ ద్వారా 0 నుంచి 100 శాతం ఛార్జ్ కావడానికి 7 గంటల సమయం పడుతుంది. అయితే 7.4 కిలోవాట్ ఛార్జర్ ద్వారా కేవలం 3.5 గంటల్లో 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేసుకుంటుంది.

Don’t Miss: స్వీడన్ బ్రాండ్ ఎలక్ట్రిక్ కారు కొన్న ప్రముఖ నటి – ఎవరో తెలుసా?

తక్కువ ధర, మంచి డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ మరియు అత్యధిక రేంజ్ అందిస్తున్న కారణంగా భారతదేశంలో ఈ కారును ఎక్కువమంది కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. ఇప్పటికే గొప్ప అమ్మకాలు పొందుతున్న ఈ కారు రాబోయే రోజుల్లో మరింత మంది కొత్త కస్టమర్లను ఆకర్షిస్తుందని భావిస్తున్నాము.

స్వీడన్ బ్రాండ్ ఎలక్ట్రిక్ కారు కొన్న ప్రముఖ నటి – ఎవరో తెలుసా?

0

Mandira Bedi Buys Volvo C40 Recharge EV: భారతదేశంలో ప్రముఖులు లేదా సెలబ్రిటీలు తమకు నచ్చిన బైకులను లేదా నచ్చిన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారన్న సంగతి అందరికి తెలియసిందే. ఇందులో భాగంగానే ప్రముఖ నటి ‘మందిరా బేడీ’ (Mandira Bedi) ఓ సరికొత్త స్వీడన్ బ్రాండ్ కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..

మందిరా బేడీ గురించి తెలుగువారికి పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు. కానీ ఈమె ప్రభాస్ నటించిన సాహో సినిమాలో నటించిందన్న విషయం బహుశా కొంతమందికే తెలిసి ఉంటుంది. ఈమె ఫ్యాషన్ డిజైనర్, టీవీ యాంకర్ మరియు నటి. మందిరా బేసి 1999లో దూరదర్శన్‌లో ప్రసారమైన శాంతి సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత హిందీ సినిమాల్లోకి అరంగేట్రం చేసింది.

వోల్వో సీ40 రీఛార్జ్ (Volvo C40 Recharge)

నటి మందిరా బేడీ కొనుగోలు చేసిన కారు వోల్వో కంపెనీకి చెందిన సీ40 రీఛార్జ్. ఫ్జోర్డ్ బ్లూ కలర్ ఆప్షన్ పొందిన ఈ కారు ఎలక్ట్రిక్ వెర్షన్. దీని ధర రూ. 62.95 లక్షలు (ఎక్స్ షోరూమ్). చూడగానే లగ్జరీ అనుభూతిని అందించే ఈ కారు మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది.

భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న వోల్వో సీ40 రీఛార్జ్ చూడటానికి దాని ఎక్స్‌సీ40 రీఛార్జ్ మాదిరిగా కనిపిస్తుంది. కానీ ఇందులో ఎల్ఈడీ డీఆర్ఎల్ మరియు క్లోజ్డ్ ఆప్ గ్రిల్ వంటివి దీన్ని ఎక్స్‌సీ40 రీఛార్జ్ నుంచి భిన్నంగా కనిపించేలా చేస్తాయి. ఈ కారును పరిశీలనగా గమనిస్తే బీ పిల్లర్ నుంచి రూఫ్‌లైన్ తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది. వెనుక భాగంలో రీడిజైన్ చేయబడిన టెయిల్‌గేట్ మరియు టైల్‌లైట్‌లు సన్నగా ఉండటం చూడవచ్చు. అంతే కాకుండా కొత్త రివర్స్ లైట్‌లతో ర్యాపరౌండ్ ఎఫెక్ట్‌ను కలిగి ఉంటాయి.

వోల్వో సీ40 రీఛార్జ్ ఫీచర్స్

ఫీచర్స్ విషయానికి వస్తే.. వోల్వో సీ40 రీఛార్జ్ కారు 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి వాటిని పొందుతుంది. అంతే కాకుండా ఈ ఎలక్ట్రిక్ కారు హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వేగన్ ఇంటీరియర్స్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి వాటిని పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

వోల్వో సీ40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ కారు 360 డిగ్రీ కెమెరా, అటానమస్ డ్రైవింగ్‌తో కూడిన ఏడిఏఎస్ టెక్నాలజీ, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు హర్మాన్ కర్తాన్ సౌండ్ సిస్టం కూడా పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారు బూట్ స్పీన్స్ 413 లీటర్లు వరకు ఉంటుంది. బూట్ స్పేస్ ఎక్స్‌సీ40 రీఛార్జ్ కంటే కొంత తక్కువగానే ఉంటుంది.

బ్యాటరీ మరియు రేంజ్

వోల్వో సీ40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ కారు 402 Bhp పవర్ మరియు 660 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేయడానికి అనుకూలంగా ఉండే రెండు ఎలక్ట్రిక్ మోటార్లను పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ కూపే 4.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 180 కిమీ కావడం గమనార్హం. ఆల్ వీల్ డ్రైవ్ (AWD) ద్వారా పవర్ నాలుగు చక్రాలకు సరఫరా చేయబడుతుంది.

Don’t Miss: లగ్జరీ కారు కొన్న జబర్దస్త్‌ బ్యూటీ.. కారు రేటు ఎంతంటే?

ఈ ఎలక్ట్రిక్ కారు 78 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక ఫుల్ చార్జితో ఏకంగా 530 కిమీ రేంజ్ అందిస్తుంది. బ్యాటరీ 11 kw ఏసీ ఛార్జర్ ద్వారా 8 గంటల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకుంటుంది. డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 10 నుంచి 80 శాతం ఛార్జ్ కావడానికి పట్టే సమయంలో కేవలం 27 నిమిషాలు మాత్రమే. మొత్తం మీద ఇది వాహన వినియోగదారులకు అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుందని స్పష్టంగా తెలుస్తోంది.

భారతీయ మార్కెట్లో అమ్మకానికి ఉన్న వోల్వో సీ40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ కారు ఇప్పటికే అమ్మకానికి ఉన్న బీఎండబ్ల్యూ ఐఎక్స్1, కియా ఈవీ6, హ్యుందాయ్ ఐయోనిక్ 5 మరియు మెర్సిడెస్ బెంజ్ ఈక్యూబీ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. మార్కెట్లో వోల్వో సీ40 ఎలక్ట్రిక్ కారు గట్టి పోటీని ఎదుర్కొంటూ మంచి అమ్మకాలతో దూసుకెళ్తోంది.

లగ్జరీ కారు కొన్న జబర్దస్త్‌ బ్యూటీ.. కారు రేటు ఎంతంటే?

0

Jabardasth Rithu Chowdary Buys New Toyota Innova Hycross: వెండితెర సెలబ్రటీలు, బుల్లితెర నటులు ఎప్పటికప్పుడు తమకు నచ్చిన కార్లను కొనుగోలు చేస్తుంటారని అందరికి తెలుసు. ఇందులో భాగంగానే ఇటీవల జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన ‘రీతూ చౌదరి’ (Rithu Chowdhary) తాజాగా ఖరీదైన కారును కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఈమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ రీతూ కొన్న కారు ఏది? దాని ధర ఎంత? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ నుంచి జబర్దస్త్ షో..

నిజానికి ఒకప్పుడు చిన్న ఇంటర్వ్యూల ద్వారా పరిచయమైనా రీతూ.. ఆ తరువాత సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఎదిగింది. చేతికి అందిన అన్ని అవకాశాలను అందిపుచ్చుకుని కస్టపడి ఎదిగిన రీతూ చౌదరికి జబర్దస్త్ షో మంచి ఫేమ్ ఇచ్చింది. ఆ తరువాత రీతూ అంటే అందరికి సుపరిచయమైంది. ఆ తరువాత అవకాశాలు ఈమెనే వెతుక్కుంటూ వచ్చాయి. చిన్న స్థాయి నుంచి ఎదిగి ఓ పాపులర్ నటిగా ఎంతోమందికి ఆదర్శమైన రీతూ చౌదరి ఇప్పుడు ఓ ఖరీదైన కారును కొనుగోలు చేసింది.

రీతూ చౌదరి కొత్త కారు

బుల్లితెర నటి రీతూ చౌదరి కొనుగోలు చేసిన కారు టయోటా కంపెనీకి చెందిన ‘ఇన్నోవా హైక్రాస్’. మల్టిపుల్ వేరియంట్లలో లభించే ఈ కారు ప్రారంభ ధర లాంచ్ సమయంలో రూ. 18.30 లక్షలు, టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 28.97 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). ఈ కారు యొక్క ఆన్ రోడ్ ధరలు నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అయితే రీతూ చౌదరి ఏ మోడల్ కొనుగోలు చేసిందనే విషయం స్పష్టంగా వెల్లడి కాలేదు.

ప్రస్తుతం రీతూ చౌదరి షేర్ చేసిన వీడియోలో గమనిస్తే.. ప్రారంభంలో కారు కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్ పూర్తి చేసి, ఆ తరువాత కారు మీద ఉన్న గుడ్డను తొలగిస్తారు. ఆ తరువాత హిందూ సంప్రదాయం ప్రకారం పూజలు చేసి.. డీలర్ నుంచి కారు కీ తీసుకుంటుంది. ఆ తరువాత కారును డ్రైవ్ చేస్తూ వెళ్లడం చూడవచ్చు.

రీతూ చౌదరి షేర్ చేసిన ఈ వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన చాలామంది నెటిజన్లు కొత్త కారు కోన్ రీతూకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇందులో ఫ్యాన్స్ మాత్రమే కూడా కొందరు సెలబ్రిటీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద కష్టపడి ఎదిగి ఓ మంచి కారుకు రీతూ చౌదరి ఓనర్ అయిపోయింది.

సోషల్ మీడియాలో పెద్ద ఫాలోయింగ్ ఉన్న రీతూ చౌదరికి.. ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌లోనే 1.1 మిలియన్ కంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సీరియల్స్‌లో నటిస్తూ.. సోషల్ మీడియాలో రీల్ పోస్ట్ చేస్తూ ఈ అమ్మడు బిజీగా కాలం గడిపేస్తోంది. రాబోయే రోజుల్లో రీతూ సినిమాల్లో కూడా కనిపించే అవకాశం ఉందని భావిస్తున్నాము. దీనికోసం అభిమానులు కూడా వేచి చూస్తున్నారు.

టయోటా ఇన్నోవా హైక్రాస్

ఇక టయోటా ఇన్నోవా హైక్రాస్ (Toyota Innova Hycross) విషయానికి వస్తే.. అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌, మాట సిల్వర్ ఇన్‌సర్ట్స్, డీఆర్ఎల్, టర్న్ ఇండికేటర్స్ మొదలైనవి పొందుతుంది. ఇన్నోవా కిస్టా మాదిరిగా కాకుండా ఈ కారు గ్లాస్‌హౌస్‌ పొందుతుంది. వెనుక రూప్ మోంటెడ్ స్పాయిలర్, ఛంకీ ఎల్ఈడీ టెయిల్ లైట్స్ మరియు బ్లాక్ అవుట్ రియర్ బంపర్ వంటివి ఉన్నాయి. మొత్తం మీద ఇది ఇన్నోవా క్రిష్టా కంటే కూడా ఆధునికంగా ఉంటుంది.

టయోటా హైక్రాస్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇందులో పెద్ద 10.1 ఇంచెస్ ప్లోటింగ్ టచ్‌స్క్రీన్, దీర్ఘచతురస్రాకారంలో ఉండే ఏసీ వెంట్స్ మరియు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మొదలైనవి ఉంటాయి. వీటితో పాటు మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఇందులో లభిస్తాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి.

ఇన్నోవా హైక్రాస్ రెండు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఒకటి పెట్రోల్ ఇంజిన్ కాగా, మరొకటి స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్. హైబ్రిడ్ వెర్షన్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ యూనిట్. ఇది 184 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ-డ్రైవ్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. నాన్ హైబ్రిడ్ వెర్షన్ 1987 సీసీ ఇంజిన్ ద్వారా 172 హార్స్ పవర్ మరియు 205 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ రెండు ఇంజిన్లు ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఆప్షన్ మాత్రమే పొందుతాయి. హైబ్రిడ్ వెర్షన్ 23.24 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వెర్షన్ 16.13 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.

Don’t Miss: హిందూపూర్ ఎంఎల్ఏ ‘బాలయ్య’ వాడే రూ.4 కోట్ల కారు గురించి తెలుసా!

దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న టయోటా యొక్క ఇన్నోవా హైక్రాస్.. ఇప్పటికే అమ్మకానికి ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ700, స్కార్పియో ఎన్, హ్యుందాయ్ అల్కజార్, ఎంజీ హెక్టర్ ప్లస్ మరియు టాటా సఫారీ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కానీ ఈ కారు దేశీయ మార్కెట్లో లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉత్తమ అమ్మకాలను పొందుతూ.. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తోంది.

రెనాల్ట్ కార్లపై కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్! మిస్ చేసుకుంటే మీకే నష్టం!

0

Renault India 2024 June Discounts: ఎప్పుడెప్పుడు డిస్కౌంట్స్ ప్రకటిస్తారా? ఎప్పుడెప్పుడు కొత్త కారు కొందామా అని ఎదురు చూసేవారికి రెనాల్ట్ ఇండియా (Renault India) ఎట్టకేలకు శుభవార్త చెప్పింది. జూన్ 2024లో కనీవినీ ఎరుగని రీతిలో డిస్కౌంట్స్ ప్రకటించింది. కంపెనీ అందించే ఈ డిస్కౌంట్స్ లభించాలంటే ఈ నెలలో కారు కొనాల్సిందే. అలాంటి వారికే రెనో అందించే డిస్కౌంట్స్ లభిస్తాయి. ఈ నెల 30 (జూన్ 30) తరువాత బహుశా ఈ డిస్కౌంట్స్ లభించకపోవచ్చు. కాబట్టి రెనాల్ట్ కారు కొనాలనుకునే వారి వెంటనే కారు కొనే ప్రయత్నాలు చేయవచ్చు. కొంత తక్కువ ధరకే రెనాల్ట్ కారును సొంతం చేసుకోవచ్చు.

రెనాల్ట్ కంపెనీ ఈ నెలలో ఎంపిక చేసిన కొన్ని కార్ల మీద మాత్రమే తగ్గింపులు (డిస్కౌంట్) అందిస్తోంది. ఇందులో కైగర్ కాంపాక్ట్ ఎస్‌మూవీ, క్విడ్ హ్యాచ్‌బ్యాక్ మరియు ట్రైబర్ సెవెన్ సీటర్ వంటివి ఉన్నాయి. ఈ నెలలో ఈ మూడు కార్ల మీద ఎక్స్చేంజ్ బెనిఫీట్స్, లాయల్టీ బోనస్ మరియు అదనపు రిఫరల్, కార్పొరేట్ మరియు లాయల్టీ ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

రెనాల్ట్ కైగర్ (Renault Kiger)

జూన్ 2024లో రెనాల్ట్ కంపెనీ యొక్క కైగర్ కాంపాక్ట్ ఎస్‌మూవీ కొనుగోలు మీద రూ. 40000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో రూ. 15000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15000 వరకు ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలు మరియు రూ. 10000 లాయల్టీ బోనస్ వంటివి ఉన్నాయి. ఈ ప్రయోజనాల్నీ కూడా ఈ నెల చివరి వరకు మాత్రమే లభిస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని కస్టమర్లు తప్పకుండా గుర్తుంచుకోవాలి.

రెనాల్ట్ కైగర్ రెండు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. అవి 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మరియు 1.0 లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్. ఈ రెండు వరుసగా 72 హార్స్ పవర్ మరియు 100 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తాయి. పెట్రోల్ మరియు టర్బో పెట్రోల్ ఇంజిన్లు రెండూ కూడా మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో జత చేయబడి ఉత్తమ పనితీరును అందిస్తాయి.

రెనాల్ట్ క్విడ్ (Renault Kwid)

భారతదేశంలో అతి తక్కువ ధరలో లభించే కార్ల జాబితాలో ఒకటైన రెనాల్ట్ క్విడ్ మీద కూడా కంపెనీ డిస్కౌంట్స్ అందిస్తోంది. ఈ కారు కొనుగోలుపైన కస్టమర్లు రూ. 40000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. రూ. 4.70 లక్షల నుంచి రూ. 6.45 లక్షల మధ్య ధరతో లభించే ఈ కారు 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 68 హార్స్ పవర్ మరియు 91 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఆప్షనల్ ఆటోమాటిక్ గేర్బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది.

రెనాల్ట్ ట్రైబర్ (Renault Triber)

ఈ నెలలో రెనాల్ట్ కంపెనీ యొక్క ట్రైబర్ కొనాలనుకునేవారు రూ. 45000 వరకు తగ్గింపులు పొందవచ్చు. రూ.6 లక్షల నుంచి రూ.8.97 లక్షల మధ్య లభించే ఈ కారు డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇది 72 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే 1.0-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది.

గమనిక: రెనాల్ట్ కంపెనీ అందించే ఈ డిస్కౌంట్స్ కేవలం ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ డిస్కౌంట్స్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా.. ఉన్న స్టాక్ మీద కూడా డిస్కౌంట్స్ ఆధారపడి ఉంటాయి. కాబట్టి కంపెనీ అందించే డిస్కౌంట్స్ గురించి ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి సమీపంలో ఉన్న డీలర్ను సంప్రదించడం మంచిది.

Don’t Miss: కేవలం 100మందికి మాత్రమే ‘ధోని స్పెషల్ ఎడిషన్’ – ధర కూడా తక్కువే!

రెనాల్ట్ కంపెనీ మాత్రమే కాకుండా.. దేశీయ విఫణిలో చాలా కంపెనీలు తమ ఉత్పత్తుల మీద అద్భుతమైన డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. ఈ జాబితాలో స్కోడా, టాటా మోటార్స్, ఎంజీ మోటార్స్, జీప్ మరియు ఫోక్స్‌వ్యాగన్ మొదలైనవి ఉన్నాయి. ఈ కంపెనీలు అందించే డిస్కౌంట్స్ మరియు ఆఫర్స్ అన్నీ కూడా ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. బహుశా ఈ ఆఫర్స్ జులైలో ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు.

కేవలం 100మందికి మాత్రమే ‘ధోని స్పెషల్ ఎడిషన్’ – ధర కూడా తక్కువే!

0

Citroen C3 Aircross Dhoni Special Edition Launched in India: భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అత్యధిక ప్రజాదరణ పొందిన ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ ‘సిట్రోయెన్’ (Citroen).. ఎట్టకేలకు దేశీయ విఫణిలో ‘సీ3 ఎయిర్‌క్రాస్ ధోని ఎడిషన్’ (C3 Aircross Dhoni Edition) లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు ధర ఎంత? డిజైన్ ఎలా ఉంది? ఫీచర్స్ ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..

ధర

ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ధోని ఎడిషన్ ప్రారంభ ధర రూ. 11.82 లక్షలు. కంపెనీ ఈ కారు కోసం ఈ రోజు (జూన్ 18) నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఇది లిమిటెడ్ ఎడిషన్ రూపంలో మార్కెట్లో విక్రయించబడుతుంది. ఈ కొత్త కారు కేవలం 100 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. అంటే దీన్ని కేవలం వందమంది మాత్రమే కొనుగోలు చేయగలరు.

డిజైన్

సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ధోని ఎడిషన్ అనేది ఇండియన్ మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని జెర్సీ ఆధారంగా.. కారు మీద 7 నెంబర్ చూడవచ్చు. అంటే ఇది 7 సీటర్ వేరియంట్. ఇది 5+2 సీటింగ్ కాన్ఫిగరేషన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ స్పెషల్ ఎడిషన్ కొనుగోలు చేసేవారికి ధోని సంతకం చేసిన కీపింగ్ గ్లోవ్ అందిస్తారు. ఇవి కారు యొక్క గ్లోవ్ బాక్సులో ఉంచి అందిస్తారు. ఇది చూడటానికి సాధారణ మోడల్ కంటే కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది.

కొత్త సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ధోని ఎడిషన్ ఇప్పుడు ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులో డాష్‌క్యామ్, కుషన్ ఎల్లో, సీట్ బెల్ట్ కుషన్ మరియు ఇల్యూమినేటెడ్ స్టెప్ బోర్డ్ మొదలైనవి ఉన్నాయి.ఈ మిడ్ సైజ్ ఎస్‌యూవీ డ్యూయెల్ టోన్ (వైట్ రూప్ మరియు బ్లూ బాడీ) కలర్ పొందుతుంది. సైడ్ ప్యానెల్‌లోని ఫ్రంట్ డోర్ మీద ధోని ఎడిషన్ స్టిక్కర్, వెనుక భాగం సెవెన్ (7) అనే నెంబర్ కనిపిస్తుంది.

ఫీచర్స్

సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ధోని ఎడిషన్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, స్టీరింగ్ వీల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్, ఏసీ వెంట్స్ మొదలైన ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. మొత్తం మీద ఇందులోని ఫీచర్స్ దాదాపు దాని స్టాండర్డ్ ఎడిషన్‌లోని ఫీచర్స్ మాదిరిగానే ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

ఇంజిన్

సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ధోని ఎడిషన్.. స్టాండర్డ్ సీ3 ఎయిర్‌క్రాస్‌లోని అదే ఇంజిన్ పొందుతుంది. కాబట్టి ఇందులో అదే 1.2 లీటర్ త్రి సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 110 హార్స్ పవర్ మరియు 190 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది. కాబట్టి ఇది ఉత్తమ పనితీరుని అందిస్తుంది.

కంపెనీ యొక్క సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ధోని ఎడిషన్ లాంచ్ సందర్భంగా.. సిట్రోయెన్ ఇండియా డైరెక్టర్ శిశిర్ మిశ్రా మాట్లాడుతూ.. ధోని పేరుతో స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అయితే ఇది 100 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడింది. ఇది మా బ్రాండ్ అంబాసిడర్ ధోని లీడర్షిప్, ఎక్సలెన్స్ వంటివి వాటిని చూపిస్తుంది. ఇది తప్పకుండా వాహన వినియోగదారులను ఆకర్శించడంలో విజయం సాధిస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

Don’t Miss: హిందూపూర్ ఎంఎల్ఏ ‘బాలయ్య’ వాడే రూ.4 కోట్ల కారు గురించి తెలుసా!

గతంలో సచిన్ టెండూల్కర్‌తో ఫియట్

నిజానికి వాహన తయారీ సంస్థలు క్రికెటర్లతో చేతులు కలపడం ఇదే మొదటిసారి కాదు. 2002లో ఫియట్ కంపెనీ సచిన్ టెండూల్కర్‌తో చేతులు కలిపి పాలియో ఎస్10ని విడుదల చేసింది. అప్పట్లో ఇది 500 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడిన లిమిటెడ్ ఎడిషన్. ఈ కారు సచిన్ గుర్తులకు దగ్గరగా ఉన్నట్లు డిజైన్ చేశారు. ప్రత్యేకమైన కలర్ ఆప్షన్, సచిన్ ఆటోగ్రాఫ్ మొదలైనవన్నీ ఉండేవి. ఆ తరువాత ఇప్పుడు సిట్రోయెన్ ధోనితో జత కట్టి సీ3 ఎయిర్‌క్రాస్ ధోని ఎడిషన్ అనే కొత్త ఎడిషన్ లాంచ్ చేసింది. ఇది మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము.

ఒక్కసారి భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు – షాకిస్తున్న కొత్త రేట్లు

0

Karnataka Govt Hike Petrol And Diesel Prices: భారతదేశంలో బంగారం ధరలు మాత్రమే కాకుండా పెట్రోల్ ధరలు కూడా అమాంతం పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పెట్రోల్ ధరలు సెంచరీ దాటేశాయి. మళ్ళీ ఇప్పుడు లీటరు పెట్రోల్ మీద ఏకంగా రూ. 3 పెరిగింది. ఇంతకీ ఈ ధర దేశం మొత్తం మీద అమలులోకి వచ్చిందా? లేక ఒక్క రాష్ట్రానికే (ఏ రాష్ట్రానికి) పరిమితమైందా? అనే వివరాలు క్షుణ్ణంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

అధికారిక ప్రకటన

నివేదికల ప్రకారం.. కర్ణాటక ప్రభుత్వం ఒకేసారి లీటరు పెట్రోల్ మరియు డీజిల్ ధరను ఒక్కసారిగా రూ. 3 పెంచింది. గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. పెట్రోల్ అమ్మకపు పన్నును 3.92 శాతం పెంచింది. దీంతో 25.92 శాతంగా ఉన్న పన్ను నుంచి 29.84 శాతానికి చేరింది. అదే సమయంలో డీజిల్ ధరలు 4.1 శాతం పాయింట్లు పెరిగాయి. 14.34 శాతం నుంచి 18.44 శాతానికి పెరిగింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొన్ని రోజుల తరువాత కర్ణాటక ప్రభుత్వం అందరికి షాకిచ్చింది.

కొత్త ధరలు

కర్ణాటకలో పెట్రోల్ ధర రూ. 3 పెరిగితే.. డీజిల్ ధరలు రూ. 3.5 పెరిగింది. ఈ ధరలు 2024 జూన్ 15 నుంచి అమల్లోకి వచ్చాయి. పెట్రోలియం ఉత్పత్తుల మీద విధించే అమ్మకపు పన్నును సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన కూడా చేసింది. ప్రస్తుతం కర్ణాటకలో పెట్రోల్ ధరలు రూ. 102.84 కాగా.. డీజిల్ ధర రూ. 88.95 వద్ద ఉంది.

సమర్ధించిన కర్ణాటక ప్రభుత్వం

పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగినప్పటికీ కర్ణాటక ప్రభుత్వం సమర్ధించింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి మరియు మరియు రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు.. రాష్ట్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్ వెల్లడించారు. కర్ణాటకలో ఇంధన పెరిగినప్పటికీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువే అని ఆయన అన్నారు.

వ్యతిరేకించిన బీజేపీ

కర్ణాటక రాష్ట్రంలో ఇంధన ధరల పెరుగుదలను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది ప్రజారవాణా మరియు నిత్యావరస ధరల పెరుగుదలకు కూడా కారణమవుతుందని వెల్లడించింది. దేశంలో మోదీ ప్రభుత్వం ధరల పెరుగుదలను నియంత్రించడానికి ప్రయత్నిస్తుంటే.. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఉన్నట్టుండి ధరలను పెంచడం సమంజసం కాదని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ధరల పెరుగుదల నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన అన్నారు.

ప్రతి రోజు వాహనాల కోసం పెట్రోల్ మరియు డీజిల్ అవసరం చాలా ఉంది. అలన్తి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాన్యుల మీద పెద్ద ప్రభావం చూపుతుందని ప్రహ్లాద్ జోషి అన్నారు. రోజువారీ అభివృద్ధి పనులకు మరియు ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి డబ్బులు లేకపోవడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన (ప్రహ్లాద్ జోషి) ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఐదు హామీలను నెరవేర్చడానికి ఎక్కువ డబ్బు అవసరం. ఇది ప్రభుత్వ ఖజానా మీద తీవ్ర ప్రభావం చూపించింది. గ్యారంటీలు, ఉచిత పథకాల వల్ల అభివృద్ధి పనులకు కూడా డబ్బులు లేవు. అయితే ఉచిత పథకాలను మేము వ్యతిరేకించడం లేదు, కానీ దాన్ని మళ్ళీ ప్రజలమీదే భారంగా చేయడం సమంజసం కాదని జగదీశ్ శెట్టర్ అన్నారు.

Don’t Miss: సన్నీలియోన్‌ గ్యారేజీలో ఇన్ని కార్లున్నాయా? ఒక్కో కార్‌ రేటు చూస్తే మతిపోవడం ఖాయం!

ధరల పెరుగుదల ప్రజల మీద భారాన్ని చూపెడతాయని, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని బీజీపీ కర్ణాటక అధ్యక్షుడు బీవై విజయేంద్ర అన్నారు. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దిగజారిందని, దీనికి చక్కని నిదర్శనం ఇంధన ధరల పెరుగుదల అని ఆయన అన్నారు. హామీల కారణంగా ప్రభుత్వం పరిపాలన చేయలేకపోతోందని.. వారు సరైన వనరులను పొందలేకపోతున్నారని విజయంద్ర అన్నారు.

పెరుగుతున్న ఎలక్ట్రిక్ కార్ల వినియోగం

పెట్రోల్ మరియు డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతున్న కారణంగా చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య క్రమంగా పెరిగింది. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం తీసుకున్న నిర్ణయం.. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత పెంచడానికి కారణం అవుతుంది. అంతే కాకుండా CNG వాహనాల వినియోగం కూడా పెరగనుంది. మొత్తం మీద ఏది ఏమైనా ప్రభుత్వాలు ఒక్కసారిగా ఇంధన ధరలను పెంచడం మంచిది కాదు, ఇది ప్రజలలో తీవ్రమైన అసంతృప్తిని రేకెత్తిస్తుంది.

నటుడు ‘దర్శన్’ గ్యారేజిలో ఇన్ని లగ్జరీ కార్లు ఉన్నాయా?.. ధరలు తెలిస్తే షాకవుతారు!

0

Famous Actor Darshan Car Collection: ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన శాండల్‌వుడ్ నటుడు ‘దర్శన్’ (Darshan) గురించి కేవలం కన్నడ ప్రజలకు మాత్రమే కాకుండా.. తెలుగు వారికి కూడా సుపరిచయమే. ఎందుకంటే తెలుగులో కూడా ఆప్తమిత్రులు, కురుక్షేత్రం మరియు ఏదైనా చేస్తా అనే సినిమాల్లో కూడా నటించారు.

ఇటీవల రేణుకాస్వామి హత్యకేసులో ‘దర్శన్’ అరెస్ట్ అయ్యారు. ఈయనతోపాటు పవిత్ర గౌడ, మరో 10 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇకపోతే కన్నడ చిత్ర సీమలో ఎంతో ప్రజాదరణ పొందిన ‘దర్శన్’కు కార్లంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే ఈయన గ్యారేజిలో ఖరీదైన అన్యదేశ్య కార్లు ఉన్నాయి. ఈ కథనంలో నటుడు దర్శన్ గ్యారేజిలోని కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నటుడు దర్శన్ గ్యారేజిలోని కార్ల జాబితాలో.. ల్యాండ్ రోవర్ డిఫెండర్, లంబోర్ఘిని ఉరుస్, లంబోర్గిన్ అవెంటడార్ ఎస్, టయోటా ల్యాండ్ క్రూయిజర్, టయోటా వెల్‍ఫైర్, జాగ్వార్ XK, ఫోర్డ్ మస్టాంగ్, పోర్స్చే కయెన్, రేంజ్ రోవర్ వోగ్, మినీ కూపర్ కంట్రీమ్యాన్, టయోటా ఫార్చ్యూనర్, జీప్ రాంగ్లర్, బీఎండబ్ల్యూ 520డీ మరియు ఆడి క్యూ7 వంటివి ఉన్నాయి.

ల్యాండ్ రోవర్ డిఫెండర్

భారతదేశంలో ఎక్కువ మంది సెలబ్రిటీలకు ఇష్టమైన కార్లలో ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన ‘డిఫెండర్’ ఒకటి. ఈ కారు ధర రూ. 1.2 కోట్లు. ఈ కారు అద్భుతమైన డిజైన్, కలిగి అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. పనితీరు పరంగా కూడా వాహన వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కారణంగానే ఎక్కువ మంది ఈ కారును కొనుగోలు చేస్తారు. ఈ కారు నటుడు దర్శన్ గ్యారేజిలో ఉంది.

లంబోర్ఘిని ఉరుస్

ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని యొక్క ఉరుస్ కూడా దర్శన్ కలిగి ఉన్నట్లు సమాచారం. దీని ధర రూ. 3 కోట్లు. దర్శన్ మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీల కూడా ఈ కారును ఇష్టపడి కొనుగోలు చేశారు. లంబోర్ఘిని ఉరుస్ కారును కలిగి ఉన్న సెలబ్రిటీల జాబితాలో జూనియర్ ఎన్ఠీఆర్, రజినీకాంత్, కార్తీక్ ఆర్యన్, రోహిత్ శెట్టి మాత్రమే కాకుండా.. ముఖేష్ అంబానీ కూడా కలిగి ఉన్నారు.

లంబోర్గిన్ అవెంటడార్ ఎస్

నటుడు దర్శన్ గ్యారేజిలోని మరో లంబోర్ఘిని కారు అవెంటడార్ ఎస్. దీని ధర రూ. 6.5 కోట్లు. ఈ సూపర్ కారులో 6498 సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 8400 rpm వద్ద 730 Bhp పవర్ మరియు 5500 rpm వద్ద 690 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 349 కిమీ వరకు ఉంటుందని సమాచారం.

టయోటా ల్యాండ్ క్రూయిజర్

ఎక్కువ మంది రాజకీయ నాయకులు మరియు పారిశ్రామికవేత్తలు ఇష్టపడే టయోటా ల్యాండ్ క్రూయిజర్ కూడా దర్శన్ గ్యారేజిలో ఉంది. సుమారు రూ. 2 కోట్ల కంటే ఎక్కువ ఖరీదైన ఈ కారు మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. ఇది కేవలం రోజు వారీ వినియోగానికి మాత్రమే కాకుండా కఠినమైన భూభాగంలో ఆఫ్ రోడింగ్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ కారు కలిగి ఉన్న సెలబ్రిటీల జాబితాలో సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి మొదలైన వారు ఉన్నారు.

టయోటా వెల్‍ఫైర్

కోటి రూపాయలకంటే ఎక్కువ ఖరీదైన ఈ కారును ఎక్కువగా రాజకీయ ప్రముఖులు కొనుగోలు చేస్తారు. కానీ నటుడు దర్శన్ కూడా తన గ్యారేజిలో ఈ కారును కలిగి ఉన్నారు. టయోటా కంపెనీ భారతీయ మార్కెట్లో అందిస్తున్న లగ్జరీ కార్లలో ల్యాండ్ క్రూయిజర్ తరువాత వెల్‍ఫైర్ ప్రధానంగా చెప్పుకోదగ్గది. ఈ కారును కలిగి ఉన్న సెలబిటీల జాబితాలో అనిల్ కపూర్, అజయ్ దేవగన్ మొదలైన వారు ఉన్నారు.

జాగ్వార్ XK

దర్శన్ గ్యారేజిలో ఉన్న కార్లలో చెప్పుకోదగ్గ మరో మోడల్ జాగ్వార్ XK. సుమారు రూ. 88 లక్షల ఖరీదైన ఈ కారు చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. ఇది కూడా ఎక్కువమంది సెలబ్రిటీలకు, ఇతర ప్రముఖులకు ఇష్టమైన కారు. ఈ కారును దర్శన్ పుట్టిన రోజు సందర్భంగా తల్లి నుంచి గిఫ్ట్‌గా పొందినట్లు తెలుస్తోంది. బహుశా ఈ కారు ఇప్పుడు ఉత్పత్తి దశలో లేదని తెలుస్తోంది.

Don’t Miss: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ‘పవన్ కళ్యాణ్’ వాహన ప్రపంచం చూశారా!.. ఓ లుక్కేసుకోండి

పైన చెప్పిన కార్లు మాత్రమే కాకుండా రూ. 75 లక్షల ఖరీదైన ఫోర్డ్ మస్టాంగ్, రూ. 1.5 కోట్ల విలువైన పోర్స్చే కయెన్, రూ. 2.75 కోట్ల విలువైన రేంజ్ రోవర్ వోగ్, రూ. 38 లక్షల విలువైన మినీ కంట్రీమ్యాన్, రూ. 38 లక్షల టయోటా ఫార్చ్యూనర్, రూ. 53 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన జీప్ రాంగ్లర్, రూ. 31 లక్షల విలువైన బీఎండబ్ల్యూ 520డీ మరియు రూ. 85.52 లక్షల ఆడి క్యూ7 వంటివి దర్శన్ గ్యారేజిలో ఉన్నట్లు సమాచారం.

వింతగా ఉన్నా అందరి మనసు దోచేస్తోంది!.. ఆనంద్ మహీంద్రా చెంతకు ‘బుజ్జి’

0

Anand Mahindra Drive Kalki 2898 AD Bujji: భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల్లోని ప్రభాస్ ఫ్యాన్స్ త్వరలో విడుదలకానున్న కల్కి 2898 ఏడీ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే చిత్ర బృందం ఈ సినిమాను విడుదల చేయడానికి ముందే మూవీలో ఉపయోగించి ఓ ప్రత్యేకమైన వాహనం ‘బుజ్జి’ని పరిచయం చేశారు. ఇది చూడటానికి చాలా వింతగా.. ఓ అడ్వెంచర్ మూవీలో వాడే వాహనం మాదిరిగా ఉంది. ఇప్పటికే ఈ బుజ్జి వెహికల్స్ గురించి తెలుసుకున్నాం..

ఆనంద్ మహీంద్రాను కలిసిన బుజ్జి

గత కొన్ని రోజులకు ముందు ప్రభాస్.. బుజ్జి వాహనాన్ని స్వయంగా డ్రైవ్ చేస్తూ అభిమానులను ఎంతగానో అలరించారు. ఆ తరువాత అక్కినేని నాగ చైతన్య కూడా ఈ బుజ్జి వెహికల్ డ్రైవ్ చేశారు. అయితే ఇప్పుడు ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం మరియు వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా బుజ్జిని డ్రైవ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనిస్తే.. ఆనంద్ మహీంద్రా రావడం, బుజ్జి వాహనంలో కూర్చోవడం మాత్రమే కాకుండా ముందుకు వెళ్లడం కూడా చూడవచ్చు. ఆ తరువాత బుజ్జి నుంచి బయటకు వచ్చిన ఆనంద్ మహీంద్రా.. మహీంద్రా కారు మరియు బుజ్జి వాహనం మధ్యలో నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ వీడియోను కల్కి టీమ్ తమ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసారు. ఇందులో బుజ్జి మీట్స్.. ఆనంద్ మహీంద్రా అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో ఆనంద్ మహీంద్రా అభిమానులను మాత్రమే కాకుండా.. ప్రభాస్ అభిమానులను కూడా ఫిదా చేస్తోంది.

కల్కి 2898 ఏడీ

ప్రభాస్ ప్రధాన పాత్రలో కనిపించే కల్కి 2898 ఏడీ సినిమాలో.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మరియు దీపికా పదుకొనే, దిశా పఠాని వంటి వారు కూడా నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగు భాషలో మాత్రమే కాకుండా.. కన్నడ, తమిళ్, మలయాళం, ఇంగ్లీష్ వంటి పలు భాషల్లో విడుదలకానుంది.

డార్లింగ్ ప్రభాస్ నటించిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతకాలంగానే వేచి చూస్తున్నారు. అయితే ఈ నెల 27 (జూన్ 27) ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలకానుంది. అంతకంటే ముందు ఈ సినిమాలో కనిపించిన బుజ్జి కారును అభిమానులకు పరిచయం చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఆనంద్ మహీంద్రా చెంతకు చేరింది.

బుజ్జి ఎక్కడ తయారైందంటే?

కల్కి 2898 ఏడీ సినిమాలో కనిపించే బుజ్జి సాధారణ వాహనాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఇది విదేశాల్లో తయారై ఉంటుందేమో అనుకుంటే.. పొరపాటు పడ్డట్లే. ఎందుకంటే ఈ వెహికల్ చెన్నై సమీపంలోని మహీంద్రా రీసర్చ్ వ్యాలీలో తయారైంది. వెనుక గుండ్రంగా కనిపించే ఒక చక్రం, ముందు భాగంలో రెండు చక్రాలతో ఈ వాహనం అమర్చబడి ఉంటుంది. ఇది చూడగానే ఓ సైన్స్ ఫిక్షన్ సినిమాలో కనిపించే వెహికల్ మాదిరిగా ఉందనే భావన కలుగుతుంది.

చూడటానికి విచిత్రంగా కనిపించే ఈ కారు పరిమాణం పరంగా భారీగా ఉన్నట్లు చూడవచ్చు. ఈ వాహనం పొడవు 6075 మిమీ, వెడల్పు 3380 మిమీ మరియు ఎత్తు 2186 మిమీ వరకు ఉంటుంది. దీని బరువు ఏకంగా ఆరు టన్నుల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ వాహనంలో 47 కిలోవాట్ బ్యాటరీని ఉపయోగించారు. దీని టాప్ స్పీడ్ గంటకు 45 కిమీ/గం కావడం గమనించదగ్గ విషయం.

Don’t Miss: 1933 రోల్స్ రాయిస్‌లో కనిపించిన మహారాష్ట్ర సీఎం.. ఈ కారు గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు!

బుజ్జి వాహనంలో ఒక క్లోజింగ్ గ్లాస్ వంటి పరికరం ఉంది. ఇది చాలా దృఢంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులోని కస్టమ్ బిల్ట్ టైర్లు ఆఫ్ రోడింగ్ చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వెహికల్ పవర్ మరియు టార్క్ కూడా అద్భుతంగా ఉండటం వల్ల పనితీరు కూడా చాలా అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ వీడియోల్లో బుజ్జి ఎలా పనిచేస్తుందో చూడవచ్చు.

ఇక ప్రభాస్ విషయానికి వస్తే.. ఇప్పటికే బాహుబలి, బాహుబలి 2 మరియు సలార్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఇప్పుడు ఈయన కల్కి 2898 డీ సినిమాతో మరోసారి అభిమానులను అలరించబోతున్నారు. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సాధిస్తుందని భావిస్తున్నాము.

1933 రోల్స్ రాయిస్‌లో కనిపించిన మహారాష్ట్ర సీఎం.. ఈ కారు గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు!

0

Interesting Facts About The 1933 Rolls Royce Car: జూన్ 11 (మంగళవారం) ధర్మవీర్ స్వరాజ్య రక్షక్ ఛత్రపతి శంభాజీ మహారాజ్ కోస్టల్ రోడ్ రెండో దశ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్ మరియు అజిత్ పవార్ పాల్గొన్నారు. అయితే వీరందరూ కలిసి 1933 రోల్స్ రాయిస్ 20/25 సాన్వర్టిబుల్ కారులో ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఈ కారు గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కథనంలో ఈ కారు ఓనర్ ఎవరు? ఈ కారు ప్రత్యేకత ఏమిటి అనే విషయాలు వివరంగా తెలుసుకుందాం.

నిజానికి ఇక్కడ కనిపిస్తున్న రోల్స్ రాయిస్ కారును దాదాపు ప్రత్యక్షంగా చూసి ఉండరు. ఒకవేలా చూసిన వారు బహుశా ఏ ఎగ్జిబిషన్‌లో చూసి ఉండవచ్చు. ఈ తరం పిల్లలు ఇది రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన కారు అంటే నమ్మకపోవచ్చు కూడా. ఎందుకంటే ఇప్పుడు రోల్స్ రాయిస్ కార్లకు.. ఇక్కడ కనిపించే కారుకు చాలా తేడా ఉంది.. కాబట్టి.

1933 రోల్స్ రాయిస్ 20/25

ఇక్కడ కనిపించే 1933 రోల్స్ రాయిస్ కారు ప్రముఖ వ్యాపారవేత్త మరియు బిలినీయర్ గౌతమ్ సింఘానియాకు చెందినదని తెలుస్తోంది. ఈ కారును రోల్స్ రాయిస్ కంపెనీ 1929 – 1936 మధ్య నిర్మించినట్లు సమాచారం. సంస్థ ఈ మోడల్ కార్లను 3827 యూనిట్లను మాత్రమే నిర్మించినట్లు తెలుస్తోంది. అప్పట్లో విపరీతమైన ప్రజాదరణ పొందిన ఈ కారు.. క్రమంగా కాలగర్భంలో కలిసిపోయింది. కానీ ఇప్పటికి కూడా 70 శాతం కార్లు అక్కడక్కడా ఉన్నట్లు పలువురు చెబుతున్నారు.

1933 రోల్స్ రాయిస్ 20/25 మోడల్ ఇన్-లైన్ 6 సిలిండర్ 3966 సీసీ ఓవర్ హెడ్ పుష్‌రోడ్ ఆపరేటేడ్ వాల్వ్ ఇంజన్ కలిగి ఉంది. ఇది 114 మిమీ స్ట్రోక్‌తో 82 మిమీ బోర్‌ను కలిగి ఉంది. ఇంజిన్ 4 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందింది. రైట్ హ్యాండ్ గేర్‌ఛేంజ్, సింగిల్ డ్రై ప్లేట్ క్లచ్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ కారు వైబ్రేషన్ డంపర్‌తో 7 బేరింగ్ క్రాంక్ షాఫ్ట్ పొందింది. వీటితో పాటు రిలీఫ్ వాల్వ్ ఫీడింగ్ రాకర్ షాఫ్ట్ మరియు టైమింగ్ గేర్‌లతో ఫ్రెషర్ ఫెడ్ లూబ్రికేషన్ వంటివి ఉన్నాయి.

చూడటానికి కొత్తగా.. చాలా సింపుల్ డిజైన్ కలిగి ఉన్న ఈ పాతకాలపు కారు బ్రాండ్ లోగో, హెడ్‌లైట్, విశాలమైన బంపర్ వంటి వాటిని పొందుతుంది. సైడ్ ప్రొఫైల్ మరియు రియర్ ప్రొఫైల్ వంటివి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సైడ్ ప్రొఫైల్‌ను ఒక స్టెప్ కూడా ఉండటం చూడవచ్చు. అన్ని విధాలా ఇది చాలా అద్భుతంగా కనిపిస్తుంది.

ప్రపంచ మార్కెట్లో ఇప్పటికి కూడా ఈ రోల్స్ రాయిస్ కార్లు అక్కడక్కగా ఉన్నాయి. పాతకాలపు క్లాసిక్ కార్ల మీద ఎక్కువ ఆసక్తి ఉన్నవారు మాత్రమే ఈ కార్లను ఇప్పటికీ తమ గ్యారేజీల్లో భద్రపడుచుకునికి అప్పుడప్పుడు వినియోగిస్తుంటారు. ఇలాంటి కోవకు చెందినవారిలో ప్రముఖ బిజినెస్ మ్యాన్, రేమండ్ వ్యవస్థాపకుడు గౌతమ్ సింఘానియా. ఈయనవద్ద ఈ కారు మాత్రమే కాకుండా అనేక స్పోర్ట్స్ కార్లు కూడా ఉన్నాయి.

ధర్మవీర్ స్వరాజ్య రక్షక్ ఛత్రపతి శంభాజీ మహారాజ్ కోస్టల్ రోడ్

ఇక మహారాష్ట్రలో ప్రారంభించిన రెండోదశ శంభాజీ కోస్టల్ రోడ్ విషయానికి వస్తే.. ఇది హాలీ నుంచి అమర్సన్స్ వరకు విస్తరించి ఉన్న 6.25 కిమీ సొరంగం. ఇది జులై నాటికి వర్లీ వరకు విస్తరించబడి ఉంటుంది. దీనిని ఆధునిక టెక్నాలజీతో నిర్మించబడుతుంది. ఈ సొరంగమార్గం నిర్మాణం వల్ల 40 నిమిషాల నుంచి 50 నిముషాలు జరిగే ప్రయాణం 8 నిమిషాలకు తగ్గించబడుతుందని, ముఖ్యమంత్రి షిండే ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు.

ఈ మార్గం వినియోగంలోకి వచ్చిన తరువాత ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. రాత్రి 11 తరువాత నుంచి ఉదయం 7 గంటల వరకు ఈ మార్గాన్ని మూసి ఉంచుతారు. ఇందులో ఆధునిక టెక్నాలజీలను ఉపయోగించడం వల్ల భద్రతకు కూడా ఎటువంటి లోటు లేదు.

Don’t Miss: నితిన్ గడ్కరీ కార్ కలెక్షన్.. ఇలాంటి కార్లు మరెవ్వరి దగ్గరా లేదు!

ముంబై కోస్టల్ రోడ్ ప్రాజెక్టు 10.58 కిమీ పొడవు ఉంటుంది. దీనిని ఎనిమిది కారిడార్లుగా విభజించారు. ఇది మూడు ఇంటర్‌ఛేంజ్‌లను కలిగి ఉంటుంది. ఇందులో సుమారు 1856 వాహనాలను పార్కింగ్ చేయవచ్చని సమాచారం. మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ. 13983 కోట్లుగా అంచనా వేశారు. ఇందులో నిర్మాణ వ్యయం రూ. 8429 కోట్లు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఈ ప్రాజెక్ట్ మొత్తం పూర్తవుతుంది. ఇది ప్రయాణికులకు చాలా అనుకూలంగా ఉంటుంది.