Home Blog Page 144

రాహుల్ సిప్లిగంజ్‌కు కాబోయే భార్య: హరిణ్య రెడ్డి బ్యాగ్రౌండ్ తెలుసా?

0

కష్టపడితే ఎవరైనా సక్సెస్ సాధించవచ్చు. నిజానికి ఈ మాట చెప్పడానికి చాలా సులభంగా ఉన్నప్పటికీ సాధించడం చాలా కష్టంతో కూడుకున్న పని. అహర్నిశలు శ్రమపడాలి. అప్పుడే విజయం వరిస్తుంది. ఇలాంటి కోవకు చెందినవారిలో పాటల రచయిత, ప్లేబ్యాక్ సింగర్ ‘రాహుల్ సిప్లిగంజ్‘ ఒకరు. ఈయన ఇటీవలే తన ప్రేయసితో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో అధికారికంగా వెల్లడించారు. అయితే నెటిజన్లు మాత్రం రాహుల్ నిశ్చితార్థం చేసుకున్న యువతి ఎవరనే విషయం తెలుసుకోవడానికి అంతర్జాలంలో (ఇంటర్నెట్) తెగ వెతికేస్తున్నారు.

ఎవరీ హరిణ్య రెడ్డి?

రాహుల్ సిప్లిగంజ్ పెళ్లిచేసుకోబోయే యువతి పేరు.. ‘హరిణ్య రెడ్డి‘. ఈమె తెలుగుదేశం పార్టీ నేత, నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (నుడా) చైర్మన్ కోటంరెడ్డి శ్రేనివాసులు రెడ్డి అన్న కుమార్తె. అయితే రాజకీయాలకు దూరంగా ఉన్న.. హరిణ్య బిగ్‌బాస్ నిర్వహించే ఎండేమోల్ షైన్ ఇండియా అనే కంపెనీలో ప్రొడ్యూసర్ అని తెలుస్తోంది. హైదరాబాద్‌లో పుట్టిన ఈమె బీఏ మాస్ కమ్యూనికేషన్ ఇన్ జర్నలిజం పూర్తి చేసినట్లు సమాచారం. చదువు పూర్తయిన తరువాత ప్రొడ్యూసర్‌గా పనిచేస్తూ.. రాహుల్ సిప్లిగంజ్ రాసే పాటలకు నిర్మాతగా కూడా వ్యవరించినట్లు తెలుస్తోంది. అయితే వీరి ప్రేమ 2020 నుంచి మొదలైనట్లు.. ఎట్టకేలకు ఈ నెల 17న (2025 ఆగస్టు 17) కొంతమంది సన్నిహితులతో నిశ్చితార్థం చేసుకున్నారు.

రాహుల్ సిప్లిగంజ్ గురించి

రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాత ఎంత ప్రాచుర్యం పొందిందో అందరికీ తెలుసు. ఈ పాట రాసింది రాహుల్ సిప్లిగంజ్. ఈ పాటకు ఆస్కార్ అవార్డు దక్కడంతో.. సిప్లిగంజ్ పేరు మారుమ్రోగిపోయింది. ఈ ఘనతకు మెచ్చిన 2025 ఆగస్టు 15న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోటి రూపాయల చెక్కును అందించారు.

అక్కినేని నాగ చైతన్య నటించిన జోష్ సినిమాలో.. కాలేజీ బొల్లోడా పాటను అందించిన రాహుల్ సిప్లిగంజ్ అంచెలంచెలుగా ఎదిగారు. ఇటీవల విడుదలైన పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లుకు రాహుల్ సిప్లిగంజ్ ఏకంగా నాలుగు పాటలు అందించారు. పాటలు రాస్తూ, ప్లేబ్యాక్ సింగర్‌గా వ్యవరిస్తూ.. రంగ మార్తాండ వంటి సినిమాల్లో కూడా నటించారు. దీన్నిబట్టి చూస్తుంటే.. రాహుల్ ఏ స్థాయికి ఎదిగారో స్పష్టంగా అర్థమవుతోంది.

పెళ్లి ఎప్పుడు?

టాలీవుడ్ చిత్రసీమలో తనకంటూ.. ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ సిప్లిగంజ్ మొత్తానికి ఓ ఇంటివాడు కాబోతున్నాడు. త్వరలోనే హరిణ్య రెడ్డితో ఏడడుగులు నడువబోతున్నాడు. అయితే వీరి పెళ్లి ఎప్పుడు అనే మాట మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కానీ త్వరలోనే ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

రాహుల్ సిప్లిగంజ్ సోషల్ మీడియా పోస్ట్

నిశ్చితార్థం చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్ హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన వ్యక్తి. కాబోయే భార్య హరిణ్య రెడ్డితో ఉన్న ఫొటోలు షేర్ చేశారు. మా కొత్త ప్రయాణం ప్రారంభమవుతుందని చెబుతూ.. హరిణ్య చేతికి ఉంగరం తొడిగి, ముద్దాడిన ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక పెళ్లి కోసం వేచి చూస్తున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు.

2025 గణేష్ చతుర్థి: పండుగ తేదీ.. పూజకు ముహూర్తం, పూజా విధానం ఇదే

భారతదేశంలో చాలామందికి ఇష్టమైన పండుగలలో ‘గణేష్ చతుర్థి‘ లేదా ‘వినాయక చవితి‘ ఒకటి. ఈ పండుగను కుల, మత బేధం లేకుండా.. ఎంతో సరదాగా ప్రజలంతా కలిసి జరుపుకుంటారు. యువత మొత్తం వినాయక ప్రతిమలను వీధుల్లో నిలిపి అంగరంగ వైభాగంగా ఉత్సవాలు నిర్వహిస్తుంటే.. కుటుంబంలో ఉన్నవారు చిన్న విగ్రహాలకు పూజలు చేసుకుని.. భక్తితో ప్రార్థనలు చేసి, నైవేద్యాలు సమర్పించి నిమజ్జనం చేస్తారు. ఇంతకీ ఈ పండుగ ఎప్పుడు?, పూజ ఎలా చేయాలి?, నిమజ్జనం ఎప్పుడు?, అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

2025 గణేష్ చతుర్థి (వినాయక చవితి) ఎప్పుడు?

వినాయక చవితి 2025 ఆగస్టు 17 బుధవారం (భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి) నాడు జరుపుకుంటారు. ఈ పండుగను 10 నుంచి 11 రోజులు జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఒక్కరోజు, మూడు రోజులు కూడా జరుపుకుంటారు. ప్రాంతాన్ని బట్టి ఈ రోజుల సంఖ్య అనేది మారుతుంది.

ఆగస్టు 26 మధ్యాహ్నం 1.54 గంటలకు చతుర్థి తిథి ప్రారంభమై.. ఆగస్టు 27 మధ్యాహ్నం 3.44 గంటలకు ముగుస్తుంది. అయితే వినాయకుడికి పూజ చేయడానికి మంచి ముహూర్తం ”ఆగస్టు 27 ఉదయం 11.12 నుంచి మధ్యాహ్నం 1.44 నిమిషాల” వరకు. అయితే చాలామంది సెప్టెంబర్ 6 శనివారం నిమజ్జనం చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో అంతంకంటే ముందుకు కూడా నిమజ్జనం చేసే అవకాశం ఉంది.

వినాయకుడి జనన కథ

హిందూ పురాణాల ప్రకారం.. పార్వతీదేవి స్నానం చేసే ముందు, తనకు కాపలాగా ఉంచడానికి పసుపుతో వినాయకుణ్ణి తయారుచేసి ప్రాణం పోసింది. కాపలా ఉన్న వినాయకుడు శివుని ప్రవేశానికి కూడా నిరాకరిస్తాడు. వీరిమధ్య జరిగిన చిన్నపాటి యుద్ధంలో పరమశివుడు వినాయకుని తల తీసేసాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీదేవి ఏడుస్తూ.. వినాయకుడిని బతికించమని కోరుతుంది. శివుడు తన గణాలకు చెప్పి, మీకు కనిపించిన మొదటి జీవి తలను తీసుకురావాలని ఆదేశిస్తాడు. గణాలు తమకు మొదట కనిపించిన ఏనుగు తలను తీసుకు వస్తారు. ఆ తలను వినాయకుడి మొండెం మీద పెట్టి, ప్రాణం పోసిన బోళాశంకరుడు.. అందరూ పూజించవలసిన మొదటి దేవుడు వినాయకుడు అని ప్రకటించాడు.

గణేష్ చతుర్థి ఆచారాలు & వేడుకలు

పండగ అంటేనే ఇంట్లో వాతావరణం మొత్తం చాలా ఆహ్లాదంగా.. ఉత్సాహంగా ఉంటుంది. పువ్వులతో అలంకారాలు, రంగులతో ముగ్గులు ఇలా చాలానే ఉంటాయి. వినాయక చవితి నాడు.. కుటుంబ సభ్యులంతా స్నానాలు ఆచరించి, ఉపవాసాలతో పూజా కార్యక్రమాలు చేస్తారు. పిండివంటలతో, కజ్జికాయలతో దేవునికి నైవేద్యం సమర్పించి ఆనందిస్తారు. 11 రోజులు.. రోజువారీ కార్యక్రమాలు కూడా ఇలాగే సాగిస్తారు. నిమజ్జనం రోజు మేళతాళాలతో.. దేవుణ్ణి ఊరేగింపు చేసి, మళ్లీ వచ్చే ఏడాది తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ నదులు, సముద్రాల్లో నిమజ్జనం చేసి వీడ్కోలు పలుకుతారు.

పూజా విధానం

వినాయక చవితి అంటేనే భక్తి శ్రద్దలతో పూజ. ఆ పూజ ఎలా చేయాలి అని చాలామంది కొంత కంగారుపడుతుంటారు. ముందుగా పూజా స్థలాన్ని రంగులు, పువ్వులతో.. ఇతర అలంకరణ వస్తువులతో అలంకరించుకోవాలి. గణేశుని విగ్రహాన్ని బలిపీఠం మీద నిలిపి.. దాని కింద పసుపు లేదా ఎరుపు వస్త్రాన్ని ఉంచాలి. విగ్రహానికి పాలు, పెరుగు, నెయ్యి, తేనే, చక్కర కలిపిన పంచామృత స్నానం చేయించాలి. విగ్రహాన్ని కొత్త బట్టలు, ఇతర అలంకరణ వస్తువులతో అలంకరించి.. కుడుములు లేదా కజ్జికాయలు, లడ్డూల వంటి స్వీట్లు సమర్పించాలి. చివరిగా దేవుని ముందు కొబ్బరికాయ కొట్టి, హారతి ఇచ్చి పూజను ముగించాలి.