Home Blog Page 865

ఓజీ సినిమాకు ఊహించని దెబ్బ: షోలు రద్దు.. టికెట్ డబ్బు రీఫండ్!

0

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం ఓజీ. ఈ మూవీ ట్రైలర్, సాంగ్స్, మ్యూజిక్ అన్నీ కూడా సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. అభిమానులకు కొత్తదనాన్ని ఇవ్వడంలో భాగంగా ఈ సినిమా కోసం పవర్ స్టార్ ప్రత్యేకంగా జపనీస్ బాష నేర్చుకొని మరీ డైలాగ్ చెప్పారు. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు గానీ మ్యూజిక్ గానీ ఒక రేంజ్‌లో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తమన్ మ్యూజిక్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తోంది. ట్రైలర్ కూడా ఇప్పటికే భారీ అంచనాలను కలిగిస్తోంది. ఈ సారి పెద్ద పెద్ద రికార్డుడులను కూడా బద్దలు కొట్టే అవకాశం ఉన్నట్టుగా అభిమానులు ఊహించుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తరువాత విడుదలైన మొదటి సినిమా హరి హర వీరమల్లు భారీ అంచనాలతో విడుదలై.. అభిమానులకు తీవ్ర నిరాశను కలిగించింది. డిప్యూటీ సీఎం అవ్వడానికి ముందు చేసిన బ్రో సినిమా కూడా అంచనాలను అందుకోలేకపోయింది. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు అత్యంత నమ్మకం పెట్టుకున్న సినిమా ఓజీ. ఈ సినిమా తరువాత పీఎస్పీకే 29, ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కావడానికి సిద్ధమవుతోంది.

ఫ్రీ-రిలీజ్ వేడుకల్లో పవన్ జోష్

ఓజీ సినిమా ఈ నెల సెప్టెంబర్ 25న ప్రపంచం వ్యాప్తంగా విడుదలకు సిద్ధమయింది. ఈ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సెప్టెంబర్ 21న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో మునుపెన్నడు కనిపించని విధంగా పవన్ కళ్యాణ్ అత్యంత జోష్‌తో కనిపించడమే కాకుండా.. సినిమాలోని ఒరిజినల్ గెటప్‌లోనే కనిపించారు. భారీ వర్షం పడుతున్నప్పటికి కూడా అభిమానుల్లో ఏ మాత్రం ఉత్సాహం తగ్గకుండా ఉండేదుకు.. ”ఈ వర్షం మనల్ని ఆపుతుందా, ఈ వర్షం మనల్ని ఆపుతుందా” అని గట్టి గట్టిగా డైలాగ్ చెబుతా అభిమానుల్లో మరింత ఉత్సహన్ని రేకెత్తించాడు.

ఓవర్సీస్‌లో ఓజీ షోలు రద్దు!

ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దమవుతున్న ఓజీకి అనుకోని చిక్కోచ్చి పడింది. ఓవర్సీస్‌లో.. అంటే నార్త్ అమెరికాలో ఓజీ చిత్రాన్ని నిలిపివేస్తున్నట్లు యార్క్ సినిమాస్ సంస్థ ప్రకటించింది. మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్న దేశాల్లో అమెరికా కూడా ఒకటి. అందుకే ఎప్పుడు కూడా తెలుగు సినిమాలు అక్కడ రిలీజ్ చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యే సమయంలో థియేటర్స్ దగ్గర అభిమానులు ఇబ్బందులు కలిగిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే.. ఓజీ సినిమా రిలీజ్ చేయలేమని యార్క్ సినిమాస్ అధికారికంగా ప్రకటించింది. అంతే కాకుండా.. ఫ్రీ బుకింగ్స్ చేసుకున్నవారికి అమౌంట్ రిఫండ్ చేస్తామని కూడా స్పష్టం చేసింది. ఈ ప్రకటన పవన్ కళ్యాణ్ అభిమానులకు కొంత నిరాశ కలిగించింది. అయితే ఓజీ నిర్మాతకు, హీరోకు ఓ పెద్ద షాక్ అనే చెప్పాలి.

ఓజీ చిత్రంలోని నటులు

పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై.. డీవీవీ దానయ్య నిర్మించారు. డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. ఇందులో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినిమా నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించారు. ప్రియాంక అరుల్ మోహనన్ హీరోయిన్‌గా చేశారు. ప్రకాష్ రాజ్, ఇమ్రాన్ హష్మీ, అజయ్ గోష్, శ్యామ్, అభిమన్యూ సింగ్, శుభలేక సుధాకర్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్ తదితరులు ప్రధాన పాత్రలు చేసారు.

సరికొత్త ఆల్ట్రావయొలెట్ బైక్: సూపర్ టెక్నాలజీ & అంతకు మించిన ఫీచర్స్

0

బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ కంపెనీ ఆల్ట్రావయొలెట్ ఆటోమోటివ్.. దేశీయ విఫణిలో సరికొత్త బైక్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ పేరు ‘ఎక్స్-47 క్రాస్ఓవర్‘. దీని ప్రారంభ ధర రూ. 2.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఇంటిగ్రేటెడ్ రాడార్. కెమెరా సేఫ్టీ సిస్టం వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది.

బుకింగ్స్ & డెలివరీ

ఆల్ట్రావయొలెట్ లాంచ్ చేసిన ఎక్స్-47 క్రాస్ఓవర్ బైక్ కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. రూ. 999 చెల్లించి అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. భారతదేశంలో డెలివరీలు అక్టోబర్ 2025లో ప్రారంభమవుతాయి. గ్లోబల్ మార్కెట్లో డెలివరీలు 2026లో జరిగే అవకాశం ఉంది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. ప్రారంభ ధర అనేది మొదటి 1000 మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఆ తరువాత ధర పెరిగే అవకాశం ఉంటుంది. ఎంత పెరుగుతుంది అనే విషయం అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

డిజైన్ అండ్ ఫీచర్స్

ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన సరికొత్త ఆల్ట్రావయొలెట్ ఎక్స్-47 క్రాస్ఓవర్ బైక్.. ఇప్పటి వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న బ్రాండ్ యొక్క అన్ని బైకులకంటే భిన్నంగా ఉంది. కాబట్టి చూడగానే ఇది కొత్తదిగా అనిపిస్తుంది.

ఫీచర్స్ విషయానికి వస్తే.. ఎక్స్-47 క్రాస్ఓవర్ బైక్ 5 ఇంచెస్ టీఎఫ్‌టీ కన్సోల్ పొందుతుంది. వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, టైప్ సీ పోర్ట్స్, గ్రాబ్ హ్యాండిల్స్, హిల్ హోల్డ్ అసిస్ట్, డైనమిక్ రీజెనరేటివ్ బ్రేకింగ్, క్రాష్ అలర్ట్స్, టోయింగ్ నోటిఫికేషన్స్, మూవ్‌మెంట్ డిటెక్షన్, రిమోట్ లాక్‌డౌన్ అందించే ఆల్ట్రావయొలెట్ యొక్క యాజమాన్య వైలెట్ ఏఐ కనెక్ట్ చేయబడిన సూట్ వంటివి ఉన్నాయి.

గ్లైడ్, కంబాట్, బాలిస్టిక్ వంటి మల్టిపుల్ రైడింగ్ మోడ్స్ ఇందులో ఉన్నాయి. ఈ బైక్ రేడియల్ ఆల్ టెర్రైన్ టైర్స్ పొందుతుంది. అంతే కాకుండా 200 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ మరియు కమాండింగ్ రైడింగ్ పొజిషన్ కోసం ఫైటర్ జెట్ ప్రేరేపిత ఎర్గోనామిక్స్ వంటివి కూడా బైకులో ఉన్నాయి.

బ్యాటరీ వివరాలు

ఆల్ట్రావయొలెట్ ఎక్స్-47 క్రాస్ఓవర్ బైక్.. 10.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది 40.2 బీహెచ్‌పీ పవర్, 610 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్ 2.7 సెకన్లలో 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 145 కిమీ కావడం గమనార్హం. ఈ బైక్ ఒక ఫుల్ ఛార్జితో 323 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం.

ఇతర వివరాలు

కొత్త ఎక్స్-47 క్రాస్ఓవర్ బైక్ 41 మిమీ యూఎస్డీ ఫోర్క్స్, మోనోషాక్ పొందుతుంది. ఈ రెండూ కూడా ఫ్రీలోడ్ అడ్జస్టబుల్. బ్రేకింగ్ సిస్టం విషయానికి వస్తే.. ముందు భాగంలో ఫోర్ పిస్టన్ కాలిపర్‌తో 320 మిమీ ఫ్రంట్ డిస్క్, 230 మిమీ రియర్ డిస్క్ ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, మూడు ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్ కూడా ఉన్నాయి.

టెక్నాలజీ

ఇప్పటివరకు కార్లలో మాత్రమే ఏడీఏఎస్ ఫీచర్ ఉండేవి. కానీ మొదటిసారి ఆల్ట్రావయొలెట్.. తన ఎక్స్-47 క్రాస్ఓవర్ బైకులో అందించింది. కాబట్టి ఈ బైకులో బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, లేన్ చేంజ్ అసిస్ట్, ఓవర్‌టేక్ అలర్ట్స్ మొదలైనవన్నీ ఉన్నాయి. ఈ బైకులో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. కాబట్టి ఇది అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది.

తండ్రికి కారు గిఫ్ట్ ఇచ్చిన తిలక్ వర్మ: రేటెంతో తెలుసా?

0

ఒకప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు గిఫ్ట్స్ ఇవ్వడం సర్వసాధారణం. అయితే ఇప్పుడు పిల్లలు కూడా తమ తల్లిదండ్రులకు గిఫ్ట్స్ ఇచ్చి సంతోషపెడుతున్నారు. ఇందులో భాగంగానే ప్రముఖ క్రికెటర్ తిలక్ వర్మ.. తన తండ్రికి మహీంద్రా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కారును గిఫ్ట్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇండియా క్రికెట్ టీమ్, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఆడే క్రికెటర్ తిలక్ వర్మ ఇటీవల.. తన తండ్రికి మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ ఎలక్ట్రిక్ కారును గిఫ్ట్ ఇచ్చారు. ఈ కారును డెలివరీ తీసుకోవడానికి ఇతడు.. తన తల్లి, తండ్రి, అన్నయ్యతో కలిసి వచ్చాడు. వీరు స్టెల్త్ బ్లాక్ క్లాసీ షేడ్ కలర్ కారును కొనుగోలు చేశారు. అంతే కాకుండా ఇది 79 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఎంచుకున్నట్లు సమాచారం.

మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ

దేశీయ వాహన తయారీ సంస్థ అయిన మహీంద్రా అండ్ మహీంద్రా ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ కారు ఈ ”ఎక్స్ఈవీ 9ఈ”. దీని ధర రూ. 21.90 లక్షల నుంచి రూ. 31.25 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఈ కారు 59 కిలోవాట్, 79 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అప్షన్లలో లభిస్తుంది.

మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ ఎలక్ట్రిక్ కారు ఒక సింగిల్ ఛార్జితో 542 కిమీ (59 కిలోవాట్ బ్యాటరీ), 565 కిమీ (79 కిలోవాట్ బ్యాటరీ) రేంజ్ అందిస్తుంది. ఈ రేంజ్ అనేది వాస్తవ ప్రపంచ పరిస్థితుల మధ్య మారే అవకాశం ఉంటుంది. 59 కిలోవాట్ బ్యాటరీ కలిగిన వేరియంట్ 228 బీహెచ్‌పీ పవర్, 380 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కాగా 79 కిలోవాట్ బ్యాటరీ కలిగిన వేరియంట్ 282 బీహెచ్‌పీ పవర్, 380 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

ఫీచర్స్ విషయానికి వస్తే.. మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ మూడు పెద్ద 12.30 ఇంచెస్ స్క్రీన్‌లను పొందుతుంది. దీనిని మహీంద్రా సినిమాస్కోప్ కాక్‌పిట్ అని పిలుస్తుంది. అంతే కాకుండా వెనుక సీటులో ఉండే ప్రయాణికుల కోసం రెండు స్క్రీన్స్ ఉన్నాయి. ఈ కారులో ఏడు ఎయిర్‌బ్యాగులు, లెవెల్ 3 ఏడీఏఎస్, 360 డిగ్రీ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ కలిగిన సెలబ్రిటీలు

నిజానికి మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ.. కొనుగోలు చేసిన సెలబ్రిటీ తిలక్ వర్మ కాదు. ఇప్పటికే ఏఆర్ రెహమాన్ కూడా ఈ కారును కొనుగోలు చేశారు. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, నటి కుబ్రా సైట్, బాలీవుడ్ నటుడు జావేద్ జాఫేరి, టెలివిజన్ నటి ఆకాంక్ష సింగ్, బిలినీయర్ & పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ మొదలైనవారు కూడా ఈ మహీంద్రా ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారు.

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతూ ఉంది. ప్రస్తుతం సాధారణ పౌరులు మాత్రమే కాకుండా.. సెలబ్రిటీలు కూడా ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో దాదాపు చాలా కంపెనీలు దేశీయ విఫణిలో ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేస్తున్నాయి. మౌలిక సదుపాయాలను కూడా అందుబాటులోకి తెస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రస్తుత పరిస్థితులు చెప్పకనే చెప్పేస్తున్నాయి.

అమెరికా ఫీజు పెంచితే.. ఉన్నాయ్‌గా ఈ కంట్రీస్!

0

అమెరికా హెచ్-1బీ వీసాలపై లక్ష డాలర్లు లేదా సుమారు రూ. 88 లక్షల కొత్త ఫీజును నిర్ణయించింది. దీంతో ఈ వీసా ద్వారా యూఎస్ఏలో పనిచేయాకునేవారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది అమెరికా వెళ్లేవారి సంఖ్యను తప్పకుండా తగ్గించే అవకాశం ఉంది. నిజానికి డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ కూడా ఇదే. తమ దేశంలో నిరుద్యోగాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు టైలుస్తోంది. అమెరికా వద్దనుకుంటే.. ప్రపంచంలో చాలా దేశాలు ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి.

యునైటెడ్ కింగ్‌డమ్

అమెరికాకు ప్రత్యామ్నాయ దేశంగా ‘యునైటెడ్ కింగ్‌డమ్’ను భావిస్తారు. ఈ దేశం నిపుణులకు, నైపుణ్యం కలిగిన కార్మికులకు వీసా అందిస్తుంది. దీంతో ఐదేళ్లు హ్యాపీగా ఈ దేశంలో ఉండవచ్చు, గడువును పొడిగించుకుంటే.. అంతకంటే ఎక్కువ రోజులే ఇక్కడ ఉండవచ్చు. అయితే ఈ దేశంలో ఉండేవారు స్పాన్సర్‌షిప్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఇది యూకేలో మీ ఉద్యోగ పాత్రను తెలియజేస్తుంది. కాగా నర్సులు, డాక్టర్లు లేదా సామజిక సంరక్షకులు హెల్త్ అండ్ కేర్ వర్కర్ వీసా కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో స్టూడెంట్ వీసా కలిగిన అభ్యర్థులు.. గ్రాడ్యుయేట్ రూట్ వీసా కోసం అప్లై చేసుకోవాలి. ఇది అదనంగా రెండేళ్లు ఆ దేశంలో ఉండటానికి అనుమతిస్తుంది. వర్కర్ వీసాతో ఐదేళ్లు ఇక్కడే ఉన్న తరువాత.. శాశ్వత నివాసం కోసం అప్లై చేసుకోవచ్చు.

ఆస్ట్రేలియా

విదేశీ పౌరుల కోసం ఆస్ట్రేలియా కూడా తాత్కాలిక వర్క్ వీసా.. లేదా పర్మినెంట్ వర్క్ వీసా అందిస్తుంది. అయితే కొన్ని షరతులకు లోబడి ఉంటుంది. పర్మినెంట్ వర్క్ వీసా కలిగిన అభ్యర్థులు.. ఆస్ట్రేలియాలో ఎక్కడైనా నివసించవచ్చు, పనిచేసుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా వివిధ రంగాల వారిని దృష్టిలో ఉంచుకుని వివిధ రకాల వీసాలను ఆస్ట్రేలియా అందిస్తుంది. పర్మినెంట్ వర్క్ వీసాను.. శాశ్వత నివాస వీసాలుగా కూడా మార్చుకోవచ్చు.

కెనడా

ఈ దేశంలో పనిచేయాలనుకునే.. భారతీయులు నిర్దిష్ట వర్క్ పర్మిట్ లేదా ఓపెన్ వర్క్ పర్మిట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఓపెన్ వర్క్ పర్మిట్ ఎనేది కెనడాలో ఏ సంస్థలో పనిచేయడానికైనా అనుమతిస్తుంది. అయితే కొన్ని షరతులను పాటించాల్సి ఉంటుంది. అయితే నిర్దిష్ట వీసాలో ఎక్కడ, ఎంతకాలం పనిచేస్తావు అని వెల్లడించాల్సి ఉంటుంది.

జర్మనీ

ఈ దేశంలో జాబ్ ఆఫర్ పొందిన తరువాత.. జర్మనీ వర్క్ వీసా కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీసాతో ఉద్యోగులు చాలాకాలం పాటు అక్కడే పనిచేయడానికి అనుమతి లభిస్తుంది. ఆ తరువాత పర్మినెంట్ వీసా కోసం కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ వీసా కోసం అప్లై చేయాలంటే మాత్రం.. అక్కడ జాబ్ పొందినట్లు చూపించే డాక్యుమెంట్.. ఇతర కొన్ని అర్హత ప్రమాణాలను చూపించాల్సి ఉంటుంది.

ఐర్లాండ్

విదేశీ నిపుణులు, పెయిడ్ ఇంటర్న్‌లు, ఫిషింగ్ ఫ్లీట్‌లోని సిబ్బంది మొదలైనవారికి ఐర్లాండ్ వర్క్ వీసా అందిస్తుంది. నైపుణ్యం కలిగిన కార్మికులు.. ఏదైనా వృత్తిలో అర్హత సాధించినట్లయితే క్రిటికల్ స్కిల్స్ ఎంప్లాయ్‌మెంట్ పర్మిట్ కోసం అప్లై చేసుకోవచ్చు. అయితే లోకమ్ డాక్టర్, మిడ్‌వైఫరీ నర్స్, పెయిడ్ ఇంటర్న్‌లు, ఫిషింగ్ ఫ్లీట్‌లోని సిబ్బంది.. ఎటిపికల్ పర్మిషన్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఐర్లాండ్ దేశంలో శాశ్వత నివాసం కోడం కూడా ఉపయోగపడుతుంది.

యూకే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ, కెనడా దేశాలు.. విదేశీయులకు వర్క్ వీసాలను అందించడమే కాకుండా, మంచి పని పరిస్థితులను, కావలసిన మౌలిక సదుపాయాలను, జీవన శైలిని అందిస్తాయి. అయితే ఈ దేశాల వర్క్ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు.. అధికారిక వెబ్‌సైట్‌లోని అర్హతలను పరిశీలించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నిర్దిష్ట ప్రమాణాలు లేకపోతే.. వీసా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందనే విషయం మర్చిపోకూడదు.

ఐదేళ్లు పోగు చేసి.. తనకు నచ్చిన కారునే భర్తకు గిఫ్ట్‌‌గా ఇచ్చిన భార్య

0

ప్రియమైనవారికి గిఫ్ట్ ఇవ్వడంలో లభించే ఆనందమే వేరు. ఈ కారణంగానే చాలామంది భర్తలు వారి భార్యలకు, భార్యలు తమ భర్తలకు అప్పుడప్పుడు సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. ఇలాంటి ఘటనే ఇటీవల ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇందులో ఒక మహిళ తన భర్తకోసం ఐదేళ్లు కష్టపడి పోగుచేసిన డబ్బుతో కారు కొనిచ్చింది.

సొంతంగా కారు కొనాలని

”చిన్నప్పటి నుంచి.. ఇప్పటి వరకు నేను కోరుకున్న ప్రతిదీ చాలా సులభంగానే వచ్చింది. కానీ కారును మాత్రం సొంతంగా కొనాలనుకున్నాను. కారు కావాలని అమ్మానాన్నలను అడిగితే.. ఎప్పుడో కొనిచ్చే వారు. కానీ అలా వద్దనుకున్నాను. దీనికోసం డబ్బు పోగుచేయాలని, ఒక లక్ష రూపాయలతో సెకండ్ హ్యాండ్ కారు కొనాలని అనుకున్నాను. లక్ష రూపాయలు కూడబెట్టిన తరువాత.. రూ. రెండు లక్షలు, రూ. మూడు లక్షలు పోగు చేయాలనుకున్నాను.

డబ్బు కూడబెట్టే క్రమంలో సెకండ్ హ్యాండ్ కారును ఎందుకు కొనాలి?, కొత్తదే కొనేస్తే బాగుంటుందని నిర్ణయించుకున్నాను. దీనికోసం ఐదేళ్లు చిన్న చిన్న వస్తువులను, ఇష్టాలను త్యాగం చేసాను. మొత్తానికి రూ. 7 లక్షలు పోగుచేసాను. నేను సన్‌రూఫ్ ఉన్న కారును కొనాలి అనుకున్నాను. ఇంకా కొంత డబ్బు యాడ్.. కియా సిరోస్ కారును కొనేశాను. ఈ కారు కేవలం నా కల మాత్రమే కాదు. ఇది ఒక భావోద్వేగం. అయితే.. నా భర్త మొదటి నుంచి నా కలల కంటే ఎక్కువ ప్రేమను ఇచ్చారు. కాబట్టి నేను కొన్న కారును ప్రేమ లేఖగా.. మా మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా గిఫ్ట్ ఇస్తున్నా” అంటూ తన ఇన్‌స్టా ఖాతాలో పేర్కొంది.

కియా సిరోస్ డెలివరీ

ఐదేళ్లు పోగు చేసిన డబ్బుతో.. మహిళ కియా సిరోస్ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్ కూడా షేర్ చేసింది. ఇందులో డాక్యుమెంట్ వర్క్ పూర్తి చేయడం, కారు డెలివరీ తీసుకోవడం, కేక్ కట్ చేయడం వంటివి కనిపిస్తాయి. కష్టపడి పోగుచేసిన డబ్బుతో.. తన భర్తకు గిఫ్ట్ ఇవ్వడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

కియా సిరోస్ గురించి

దేశీయ మార్కెట్లోని సరసమైన కార్ల జాబితాలో.. కియా కంపెనీకి చెందిన సిరోస్ ఒకటి. దీని ధర రూ. 9.50 లక్షల నుంచి రూ. 17.80 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. సింపుల్ డిజైన్, అత్యాధునిక ఫీచర్స్ కలిగిన ఈ కారు.. మంచి మైలేజ్ కూడా అందిస్తుంది.

పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, 30 ఇంచెస్ ట్రినిటీ డిస్‌ప్లే, స్టార్ట్/స్టాప్ బటన్, వివిధ ఫంక్షన్స్ కోడం కావలసిన కంట్రోల్స్ కలిగిం టూ స్పోక్ స్టీరింగ్ వీల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, వైర్‌లెస్ ఛార్జర్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీటు వంటి ఫీచర్స్ సిరోస్ కారులో ఉంటాయి. అంతే కాకుండా.. 360 డిగ్రీ కెమెరా, లెవెల్ 2 ఏడీఏఎస్, ఏబీఎస్ విత్ ఈబీడీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం కూడా ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

బిగ్‌బాస్‌ రెండోవారం ఎలిమినేషన్ ట్విస్ట్.. బ్యాగ్ సర్దేసిన మరో కామన్‌మెన్!

0

బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడే.. బిగ్‌బాస్ సీజన్ 9 రియాలిటీ షో మొదలై రెండువారాలు గడుస్తోంది. మొదటివారంలోనే కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ బయటకు వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. అయితే ఇప్పటికి బయటకు వచ్చిన సమాచారం ప్రకారం.. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయే జాబితాలో ఇద్దరిపేర్లు వినిపిస్తున్నాయి.

భారీగా తగ్గిన టీఆర్పీ రేటింగ్!

కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ వెర్షన్‌లో సాగుతున్న గేమ్.. అనుకున్నంత ఆకట్టుకునే విధంగా లేదని ప్రేక్షకులు చెబుతున్నారు. దీంతో ఈ ఏడాది టీఆర్పీ రేటింగ్ కూడా బాగా తగ్గిపోయింది. ఈ రేటింగ్ అంతకు ముందు జరిగిన అన్ని సీజన్స్ కంటే చాలా తక్కువ కావడం గమనార్హం. బిగ్‌బాస్ రియాలిటీ షోకు.. ఒకప్పుడు ఉన్నంత ఆదరణ ఇప్పుడు లేదు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో జరుగుతున్నవన్నీ గమనించి.. హోస్ట్ నాగార్జున వారాంతంలో గట్టిగానే క్లాస్ తీసుకుంటున్నారు.

ముందుకు దూసుకెళ్తున్న సుమన్ శెట్టి

బిగ్‌బాస్ సీజన్ 9 రెండో వారంలో మొత్తం 7మంది హౌస్‌మేట్స్ నామినేషన్స్‌లో ఉన్నారు. సుమన్ శెట్టి, ఫ్లోరా షైనీ, హరిత హరీష్, డీమాన్ పవన్, భరణి, మర్యాద మనీష్ నామినేట్ అయినప్పటికీ.. ఓటింగ్ విషయంలో మాత్రం సుమన్ శెట్టి, భరణి ముందు వరుసలో ఉన్నారు. అమాయకత్వం, నిజాయితీ వంటివి సుమన్ శెట్టిని కాపాడుతున్నాయి. దీంతో ఇతడు ఓటింగ్ విషయంలో దూసుకెళ్తున్నాడు. మిగిలినవారికి కూడా కొంత పాజిటీవ్ ఓటింగ్ వచ్చింది.

మర్యాద మనీష్ అవుట్?

ఇక రెండోవారం ఎలిమినేషన్ విషయానికి వస్తే మాత్రం.. మర్యాద మనీష్, ప్రియా ఇద్దరు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికి సోషల్ మీడియా ద్వారా వెల్లడైన సమాచారం ప్రకారం.. ఈ ఇద్దరిలో మర్యాద మనీష్ రెండోవారం హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానప్పటికీ.. సోషల్ మీడియా టాక్ మాత్రం ఇదే. ఇదే జరిగితే ప్రియా సేఫ్ జోన్‌లోకి వెళ్లినట్లే అని తెలుస్తోంది.

మనీష్ ఎలిమినేటి అవ్వడానికి కారణాలు

నిజానికి కామన్ మెన్ కేటగిరిలో బిగ్‌బాస్ హౌస్‌లోకి మర్యాద మనీష్ శ్రీజ, ప్రియలకు అనుకూలంగా ఉండటం, ఇమ్మాన్యుయేల్ విషయంలో అతని వ్యతిరేఖ వైఖరి అనే తెలుస్తుంది. ఇది ఆడియన్స్‌కు నచ్చలేదు. దీంతో అతన్ని హౌస్ నుంచి బయటకు పంపించేయాలని ఫిక్స్ అయ్యారు. ఆడియన్స్ ఒకసారి అనుకుంటే.. అది జరగకుండా ఉంటుందా?, అదే మర్యాద మనీష్ కొంప ముంచిందని సమాచారం.

మర్యాద మనీష్ రెమ్యునరేషన్ ఎంతంటే?

ఇప్పటి వరకు సోషల్ మీడియా ద్వారా వెల్లడైన సమాచారం ప్రకారం.. మర్యాద మనీష్‌కు వారానికి రూ. 70వేలు ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇదే నిజమైతే ఇతడు రెండు వారాలకు రూ. 1.40 లక్షలు సంపాదించినట్లు అర్థమవుతుంది. అయితే ఏ రెమ్యునరేషన్ వివరాలు కేవలం అంచనా మాత్రమే. దీనికి సంబంధించిన విషయాలు అధికారికంగా వెల్లడికాలేదు. కాబట్టి రెమ్యునరేషన్ అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. దీని గురించి ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవాలంటే?.. మనీష్ స్పందించాల్సిందే!

గెలిచినోళ్లకు రూ.3 లక్షలు: కాన్సెప్ట్ చూసి.. ప్రైజ్ మనీ పట్టండి!

0

భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం.. సర్వమత సమ్మేళనం. కాబట్టి దేశంలోని ప్రతి రాష్ట్రానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతే.. ఆ ప్రాంతం చరిత్ర, సంస్కృతిని తెలియజేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ విషయానికి వస్తే.. ఇక్క బతుకమ్మ పండుగకు ఓ విశేషమైన ఆదరణ ఉంది. ఈ బతుకమ్మ పండుగ సెప్టెంబర్ 21న జరగనుంది. అంతకంటే ముందు తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ‘బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ 2025‘ పేరుతో షార్ట్ ఫిల్మ్, పాటలు పోటీ నిర్వహించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నేపథ్యం & చివరి తేదీ

తెలంగాణ పండుగలు, ప్రజాపాలన, చరిత్ర, సంస్కృతీ నేపధ్యాన్ని వివరించేలా కంటెంట్ ఉండాలని.. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు పేర్కొన్నారు. ఈ పోటీలో సృజన శీలులు 40 ఏళ్ల కంటే తక్కువ వయసున్న ఎవరైనా పాల్గొనవచ్చు. ఇందులో పాల్గొనడానికి లేదా ఎంట్రీలను పంపించడానికి చివరి తేదీ 2025 సెప్టెంబర్ 30 అని వెల్లడించారు.

వీడియో & పాట నిడివి

రాష్ట్రంలోని యువకుల సృజనాత్మకతను వెలికితీయడమే ధ్యేయంగా.. ఈ బతుకున్ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలంజ్ పేరిట పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనేవారు.. తెలంగాణ సీఎం రేవంత్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి.. లేదా తెలంగాణ చరిత్ర, పండుగలకు సంబంధించిన నేపథ్యంలో షార్ట్ ఫిల్మ్స్ లేదా పాటలు రూపొందించాల్సి ఉంటుంది. అయితే కంటెస్టెంట్స్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. షార్ట్ ఫిల్మ్ నిడివి 3 నిముషాలు.. పాట నిడివి ఐదు నిమిషాలు మాత్రమే ఉండేలా చూసుకోవాలి.

వీడియోలు 4కే రిజల్యూషన్ కలిగి ఉండాలి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. షార్ట్ ఫిల్మ్ లేదా పాటలు తప్పకుండా థీమ్ అనుసరించాల్సిందే. అంతే కాకుండా మీరు చేసిన వీడియో లేదా పాట ఇప్పటివరకు ప్రదర్శించి ఉండకూడదు లేదా రిలీజ్ చేసే ఉండకూడదు. ప్రత్యేకంగా బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ కోసమే చిత్రరేకరించి ఉండాలి.

ప్రైజ్ మనీ వివరాలు ఇలా..

బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ పోటీల్లో గెలుపొందినవారికి ప్రైజ్ మనీ అందిస్తారు. మొదటి బహుమతికి రూ. 3 లక్షలు, రెండో బహుమతికి రూ. 2 లక్షలు, మూడో బహుమతిగా రూ. 1 లక్ష ప్రైజ్ మనీ అందించడం జరుగుతుంది. కన్సోలేషన్ బహుమతిగా ఐదుగురికి రూ. 20వేలు ఇవ్వడం జరుగుతుంది. అంతే కాకుండా విజేతలందరికి కూడా ప్రశంసాపత్రంతో పాటు.. జ్ఞాపికను కూడా ప్రధానం చేస్తారు. నిర్దేశిత గడువు లోపల వచ్చిన ఎంట్రీలను నిపుణులతో కూడిన జ్యూరీ వీక్షించి.. కేటగిరీలుగా ఎంపిక చేస్తారు.

యూట్యూబ్ లేదా ఇతర సోషల్ మీడియాలలో వీడియోలు చేస్తున్నవారు మరింత గుర్తింపు తెచ్చుకోవడానికి లేదా తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇదొక మంచి అవకాశం. ఈ పోటీలో గెలుపొంచినవారికి భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి లేదా సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా కొన్ని అవకాశాలు లభించే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఓ మంచి కాన్సెప్ట్ తీసుకుని.. విజయం పొందాలని ఆశిస్తున్నాము.

అప్పుడు స్పిరిట్‌, ఇప్పుడు కల్కి.. ఆ కండీషనే దీపిక కొంపముంచింది!

0

సినిమా రంగం అనేది పాము నిచ్చెన ఆట లాంటిది. జాగ్రత్తగా నడుచుకుంటే సక్సెస్ వరిస్తుంది, లేకుంటే.. లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే పరిస్థితి ఇలా అయిందేమో అనిపిస్తుంది. దీనికి కారణాలేమిటో.. ఈ కథనంలో తెలుసుకుందాం.

కల్కి 2 సినిమాకు దీపికా పదుకొనే దూరం

దీపికా పదుకొనే.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే పాన్ ఇండియా సినిమాల్లో నటించి ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా ఇప్పుడు కల్కి 2 సినిమాలో కనిపించకుండా పోయింది. కల్కి 2898 ఏడీ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. అలాంటి సినిమా సీక్వెల్ కల్కి 2లో ఇప్పుడు దీపికా పదుకొనే లేకపోవడం కొంత విచారకరమే అయినప్పటికీ.. ఈమెను తప్పనిసరి పరిస్థితుల్లో చిత్ర బృందమే వదులుకుంది. దీనికి సంబంధించిన వైజయంతి మూవీస్ అధికారికంగా ట్వీట్ చేసింది.

నటి దీపికా పదుకొనే కల్కి 2898 ఏడీ సీక్వెల్‌లో ఉండదు. అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించి, ఆలోచించిన తరువాతనే ఈ నిర్ణయం తీసుకున్నాము. కల్కి 2898 ఏడీ సినిమా చేయడానికి మాతో సుదీర్ఘ ప్రయాణం చేసినప్పటికీ.. భాగస్వామ్యం కుదరలేదు. కల్కి వంటి సినిమాకు నిబద్దత చాలా అవసరం. కాగా దీపికా పదుకొనే భవిష్యత్తులో మరెన్నో సినిమాలు చేయాలనీ ఆశిస్తున్నట్లు వైజయంతీ మూవీస్ తన ఎక్స్ ఖాతాలో స్పష్టం చేసింది.

అసలు కారణాలు!

దీపికా పదుకొనేను తీసుకోకపోవడానికి అసలు కారణం రెమ్యునరేషన్ కాదు. ఎందుకంటే కల్కి 2898 ఏడీ భారీ విజయం సాధించి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1000 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. కాబట్టి కల్కి పార్ట్ 2లో నటించడానికి దీపికా పదుకొనే ఎంత అడిగినా చిత్ర బృందం ఇవ్వడానికి తప్పకుండా సిద్ధంగా ఉంటుంది. ఇది ప్రధాన కారణం కాదని తెలుస్తోంది.

కల్కి 2 సినిమాలో తాను రోజుకి ఎనిమిది గంటలే పనిచేస్తానని చెప్పినట్లు సమాచారం. నిజానికి కల్కి వంటి సినిమా తీయడానికి చాలా రోజులు సమయం పడుతుంది. సమయాన్ని చూసుకుంటే జరిగేపని కాదు. కాబట్టి కల్కి 2 సినిమాకు దీపికా దూరమవ్వడానికి ప్రధాన కారణం ఇదే అని తెలుస్తోంది. కొన్ని ఇబ్బందికరమైన సీన్స్ చేయనని కూడా దీపికా పాడుకొనే కండిషన్స్ పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈమె పెట్టిన కండిషన్స్ ఆమెను సినిమాలో లేకుండా చేశాయని స్పష్టమవుతోంది.

ఇలాంటి కండిషన్స్ కారణంగానే స్పిరిట్ సినిమాలో కూడా సందీప్ రెడ్డి వంగా.. దీపికా పదుకొనేను తీసుకోలేదని తెలుస్తోంది. కాగా ఇప్పుడు కల్కి సీక్వెల్ చేజారిపోయింది. లెక్కలేనన్ని బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి.. ఎంతోమంది ప్రేక్షకులను మెప్పించిన దీపికా పదుకొనే ప్రస్తుతం గొప్ప సినిమాల్లో నటించే అవకాశాన్ని చేజేతులా దూరం చేసుకుంటింది. ఇది ఇలాగే కొనసాగితే.. ముందు ముందు భారీ ప్రాజెక్టులలో దీపికా పదుకొనే నటించే అవకాశం బహుశా కోల్పోయే అవకాశం ఉందనిపిస్తోంది. ఎందుకంటే భారీ ప్రాజెక్ట్ సినిమాల కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేస్తుంటారు. అలాంటప్పుడు లేనిపోని కండిషన్స్ పెట్టడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. వీటిని దృష్టిలో ఉంచుకునే.. వారికి అనువైనవారిని ఎంచుకుంటారు.

‘టీవీఎస్ ఎక్స్ఎల్100’లో పెద్ద అప్డేట్: ఇప్పుడు ధర ఎంతంటే?

0

‘మన ఊరి బండి’గా పేరుపొందిన టీవీఎస్ ఎక్స్ఎల్100 హెచ్‌డీ ఇప్పుడు సరికొత్త అప్డేట్ పొందింది. భారతదేశంలో ఎక్కువమంది గ్రామీణ ప్రజలకు ఇష్టమైన ఈ మోపెడ్.. రోజువారీ ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ధర కూడా ఇతర టూవీలర్లతో పోలిస్తే కొంత తక్కువే కావడం గమనార్హం.

లేటేస్ట్ అప్డేట్ & ధరలు

టీవీఎస్ ఎక్స్ఎల్100 హెచ్‌డీ ఇప్పుడు.. అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఇదే ఇందులోని కొత్త అప్డేట్. దీని ధర రూ. 65,047 (ఎక్స్ షోరూమ్). ట్యూబ్‌లెస్ టైర్లతో.. 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందిన ఎక్స్ఎల్100 హెచ్‌డీ మెరుగైన మన్నికను అందించడం మాత్రమే కాకుండా.. భద్రతను కూడా అందిస్తుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ ఉండటం వల్ల దృశ్యమానత కూడా అద్భుతంగా ఉంటుంది. కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడం భాగంగా.. ఇది లేటెస్ట్ గ్రాఫిక్స్, రీ డిజైన్డ్ టెయిల్‌లైట్స్ బ్లాక్ మఫ్లర్ పొందుతాయి. కాబట్టి ఇది చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది.

డిజైన్

కొత్త టీవీఎస్ ఎక్స్ఎల్100 హెచ్‌డీ మోపెడ్.. 2 పీస్ సీటును కలిగి.. పెద్ద ఫ్లోర్‌బోర్డ్ స్పేస్, అదనపు సౌలభ్యం కోసం మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ వంటివి కూడా పొందుతుంది. సీటు రైడర్, పిలియన్ ఇద్దరికీ అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా డంపింగ్‌తో కూడిన ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, వేరియబుల్ రేటెడ్ స్ప్రింగ్‌లతో కూడిన స్వింగ్ ఆర్మ్ రియర్ సస్పెన్షన్ వంటివి కఠినమైన భూభాగాల్లో కూడా మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

టెక్నాలజీ విషయానికి వస్తే.. కొత్త ఎక్స్ఎల్100 హెచ్‌డీ అల్లాయ్.. ఎకో థ్రస్ట్ ఫ్యూయల్ ఇంజక్షన్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఇది సాధారణ మోపెడ్ కంటే కూడా 15 శాతం ఎక్కువ మైలేజ్ అందిస్తుంది. ఇంజిన్ ఆటోమేటిక్‌గా స్విచ్ ఆఫ్ చేసే టిల్ట్ సెన్సార్ పొందుతుంది.

ఇంజిన్ వివరాలు

టీవీఎస్ ఎక్స్ఎల్100 హెచ్‌డీ మోపెడ్ 99.7 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ ఇంజెక్టెడ్ ఇంజిన్ ద్వారా 6000 ఆర్‌పీఎమ్ వద్ద 4.3 బీహెచ్‌పీ పవర్.. 3500 ఆర్‌పీఎమ్ వద్ద 6.5 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ మోపెడ్ టాప్ స్పీడ్ గంటకు 58 కిమీ. ఇంజిన్ సెంట్రిఫ్యూగల్ వెట్ క్లచ్, చైన్ డ్రైవ్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి.. మంచి పనితీరును అందిస్తుంది. 89 కేజీల బరువున్న ఈ మోపెడ్ 150 కేజీల బరువును మోసే కెపాసిటీ కలిగి ఉంటుంది.

కలర్ ఆప్షన్స్ & వేరియంట్స్

కొత్త టీవీఎస్ ఎక్స్ఎల్100 హెచ్‌డీ మొత్తం మూడు రంగుల్లో లభిస్తుంది. అవి రెడ్, బ్లూ, గ్రే కలర్స్. ఎక్స్ఎల్100 హెచ్‌డీ మల్టిపుల్ వేరియంట్లలో లభిస్తుంది. ప్రారంభ ధర రూ. 47,754 కాగా.. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 65,047 (ఎక్స్ షోరూమ్)

➤హెవీ డ్యూటీ: రూ. 47,754
➤హెవీ డ్యూటీ ఐ-టచ్‌స్టార్ట్: రూ. 60,405
➤హెవీ డ్యూటీ ఐ- టచ్‌స్టార్ట్ విన్ ఎడిషన్: రూ. 63,347
➤కంఫర్ట్ ఐ-టచ్‌స్టార్ట్: రూ. 63,705
➤ఎక్స్ఎల్100 హెచ్‌డీ: రూ. 65047 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)

ఇండియన్ మార్కెట్లో టీవీఎస్ కంపెనీకి చెందిన మోపెడ్ టూవీలర్లకు డిమాండ్ ఎక్కువగానే ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్స్ లాంచ్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఎక్స్ఎల్100 హెచ్‌డీ లాంచ్ చేయడం జరిగింది. ఇది ప్-అండగా సమయంలో మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉందని భావిస్తున్నాము.

మిరాయ్ బ్లాక్ బ్లస్టర్.. తేజ సజ్జకు కారు గిఫ్ట్!

0

యువ నటుడు తేజ సజ్జ నటించిన మిరాయ్ బ్లాక్ బ్లాస్టర్ సాధించి.. కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది. ఈ సినిమా కేవలం 5 రోజుల్లో రూ. 100 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా గొప్ప సక్సెస్ సాధించిన సందర్భంగా.. మంగళవారం విజవాడలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హీరో, హీరోయిన్స్ మాత్రమే కాకుండా.. డైరెక్టర్ ఇతర చిత్ర బృందం, రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

కోరుకున్న కారు గిఫ్ట్

మిరాయ్ సక్సెస్ మీట్ కార్యక్రమంలో నిర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. సినిమా గొప్ప విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ సినిమా ఇంత గొప్ప హిట్ సాధించడానికి చిత్ర బృందం చాలా కష్టపడిందని అన్నారు. అంతే కాకుండా సినిమా సక్సెస్ సాధించిన సందర్భంగా.. హీరో తేజ సజ్జకు, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనికి.. వాళ్లు ఏ కారు కోరుకుంటే, ఆ కారును గిఫ్ట్ ఇస్తానని పేర్కొన్నారు.

రూ. 100 కోట్ల మార్క్..

హనుమాన్ సినిమా తరువాత తేజ సజ్జ నటించిన ఈ మిరాయ్.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. నటుడు మంచు మనోజ్ ఈ సినిమాకు అదనపు ఎనర్జీ అందించగా.. సీనియర్ నటి శ్రియ తన నటనతో ఆకట్టుకుంది. ఇక రితిక్ నాయక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం మీద తేజ సజ్జ ఖాతాలో మరో బ్లాక్ బ్లస్టర్ చేరిపోయింది. ఇప్పటికే రూ. 100 కోట్ల మార్కును చేరుకున్న ఈ సినిమా.. ఇంకా వసూళ్లు చేస్తుందని భావిస్తున్నారు. కాగా ఈ సినిమా కోసం రూ. 60 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం.

మిరాయ్ సినిమా గురించి

అశోకుడి కాలం నాటికి చెందిన కథగా ఇందులో చెప్పడం జరిగింది. కొన్ని అద్భుతమైన గ్రంధాలలో అతీతమైన శక్తులు ఉన్నాయని, వాటిని పొందితే మనిషి దేవుడవుతాడు. మహాబీర్ (మంచు మనోజ్) వీటిని దక్కించుకోవాలని ప్రయత్నం చేసి ఎనిమిది గ్రంధాలను సొంతం చేసుకుంటాడు. అయితే చివరి గ్రంధం పొందాలనుకుంటాడు. వేద ప్రజాపతి (తేజ సజ్జ) ఆ గ్రంధాన్ని కాపాడే దశలో మిరాయ్ సాధిస్తాడు. విభా (రితిక నాయక్) సాయంతో గతాన్ని తెలుసుకుని.. మహాబీర్ తొమ్మిదో గ్రంధం ద్వారా శక్తులను సొంతం చేసుకోకుండా అవుతాడు. జగపతి బాబు, శ్రియ కూడా తమదైన నటనతో అద్భుతం సృష్టించారు. మొత్తం మీద ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయం సాధించింది.

మిరాయ్ నటీనటుల రెమ్యునరేషన్

కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన మిరాయ్ సినిమా కోసం రూ. 60 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో నటించిన హీరో తేజ సజ్జ.. హనుమాన్ సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈయన హనుమాన్ సినిమాకు రూ. 2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అంటే ఇతడు మిరాయ్ సినిమాకు రెండు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా మంచు మనోజ్, శ్రియ కూడా ఒక్కొక్కరు రూ. 2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోగా.. జగపతి బాబు రూ. 1.5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే రితికా నాయక్ రెమ్యునరేషన్ రూ. 50 లక్షలు అని తెలుస్తోంది.