Blog

  • లాంచ్ కానేలేదు.. అప్పుడే బుకింగ్స్ క్లోజ్: ఈ కారుకు బలే డిమాండ్!

    లాంచ్ కానేలేదు.. అప్పుడే బుకింగ్స్ క్లోజ్: ఈ కారుకు బలే డిమాండ్!

    Volkswagen Golf GTI: భారతదేశంలో ఎప్పటికప్పుడు కొత్త కార్లను కొనుగోలు చేసేవారి సంఖ్య పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా.. దేశీయ విఫణిలో సరికొత్త కారు గోల్ఫ్ జీటీఐ (Golf GTI) లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. కాగా అంతకంటే ముందు కంపెనీ అధికారికంగా బుకింగ్స్ స్వీకరించడం (మే 5) ప్రారంభించింది. అయితే బుకింగ్స్ ప్రారంభమైన కేవలం ఐదు రోజుల్లోనే.. ఇక బుకింగ్స్ తీసికోవడం లేదని, బుకింగ్స్ క్లోజ్ చేసినట్లు సంస్థ అధికారికంగా వెల్లడించింది.

    ఇండియాలో బుకింగ్స్ జోరు, వేగంగా ముగింపు!

    ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ భారతదేశానికి జీటీఐ బ్యాడ్జ్‌ను తీసుకుని రావడం ఇది రెండోసారి. మొదటిసారి 2016లో పోలో జీటీఐ పేరుతో.. లాంచ్ చేసింది. ఇప్పుడు గోల్ఫ్ జీటీఐ పేరుతో తీసుకురావడానికి రెడీ అయిపోయింది. అయితే కంపెనీ దీనిని సీబీయూ (CBU – Completely Built Unit) మార్గం ద్వారా దిగుమతి చేసుకోనుంది. కాబట్టి దీని ధర కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

    బుకింగ్స్ నిలిపివేయడానికి కారణం ఏంటి?

    కంపెనీ తన గోల్ఫ్ జీటీఐ యొక్క బుకింగ్స్ నిలిపివేయడానికి ప్రధాన కారణం.. ఈ కారును భారతదేశానికి పరిమిత సంఖ్యలో కేటాయించడమే అని తెలుస్తోంది. అంటే ఈ కారును కొంతమంది మాత్రమే కొనుగోలు చేయగలరన్నమాట. మొదట్లో ఈ కారును ఇండియన్ మార్కెట్ కోసం 250 యూనిట్లను కేటాయించిన ఫోక్స్‌వ్యాగన్ ఇండియా.. ఆ తరువాత 150 యూనిట్లకు మాత్రమే సరిపెట్టింది. ఫోక్స్‌వ్యాగన్ లాంచ్ చేయనున్న గ్లోఫ్ జీటీఐ కారును 150 మంది మాత్రమే కొనుగోలు చేయగలరు.

    జీటీఐ చరిత్ర మరియు ప్రత్యేకతలు

    ఫోక్స్‌వ్యాగన్ విడుదల చేయనున్న సరికొత్త గోల్ఫ్ జీటీఐ ఆధునిక హంగులతో మార్కెట్లో అడుగుపెట్టనుంది. నిజానికి ఇది గోల్ఫ్ నేమ్ ప్లేట్ కలిగిం ఎనిమిదవ తరం అని తెలుస్తోంది. గోల్ఫ్ పేరు 1974లో ప్రముఖ ఇటాలియన్ డిజైనర్ జార్జెట్టో గియుగియారో రోపొందించిన మొదటి హ్యాచ్‌బ్యాక్‌తో ప్రారంభమైనట్లు తెలుస్తోంది. 1976లో మొదటి తరం జీటీఐ వచ్చింది. ఆ తరువాత కాలంలో దీని వారసత్వంగా అనేక మోడల్స్ వచ్చాయి.

    ఇంజిన్ మరియు పనితీరు

    సరికొత్త ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ 2.0 లీటర్ టీఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 265 Bhp పవర్ మరియు 370 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డైరెక్ట్ షిఫ్ట్ గేర్‌బాక్స్ (DSG) కలిగి ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్ కూడా పొందుతుంది. ఇది గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం కావడానికి 5.9 సెకన్ల సమయం పడుతుందని సమాచారం.

    ఆధునిక ఫీచర్లు మరియు భద్రత

    ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ అనేక ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 12.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్, 10.25 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 30 కలర్ యాంబియంట్ లైటింగ్, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు పనోరమిక్ సన్‌రూప్ వంటి వాటితో పాటు.. ఏడు ఎయిర్‌బ్యాగులు మరియు ఏడీఏఎస్ (ADAS – Advanced Driver Assistance Systems) ఫంక్షన్స్ మొదలైనవి ఉన్నాయి. కాబట్టి ఇది వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుందని భావిస్తున్నాము.

  • కాణిపాకం ఆలయంలో కొత్త నియమాలు: వారికి టికెట్లు తప్పనిసరి

    కాణిపాకం ఆలయంలో కొత్త నియమాలు: వారికి టికెట్లు తప్పనిసరి

    Kanipakam Temple Rules: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఒకటైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనానికి ప్రతిరోజూ లెక్కకు మించిన భక్తులు వెళ్తూనే ఉంటారు. అయితే దేవాలయ అధికారులు తాజాగా కొన్ని కీలక నియమాలను వెల్లడించారు. ఈ కొత్త నిబంధనలను కాణిపాకం సందర్శనకు విచ్చేసే భక్తులు తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది.

    కాణిపాకం ఆలయంలో కొత్త దర్శన నియమాలు

    శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ఈవో ‘పెంచల కిశోర్’ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇకపై కాణిపాకం వచ్చే ప్రోటోకాల్, ఉభయదారులు, వారి కుటుంబ సభ్యులు మినహా సిఫార్సులపై వచ్చే ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శనానికి టికెట్స్ తీసుకోవాల్సిందే. ఇదివరకు సిఫార్సు లేఖలపై వచ్చే భక్తులు స్వామివారి దర్శనానికి ఉచితంగా వెళ్లే వెసులుబాటు ఉండేది, కానీ ఆ విధానానికి స్వస్తి పలికారు.

    ఆలయ సిబ్బంది బంధువులకూ టికెట్ తప్పనిసరి

    ఆలయ ఉద్యోగులకు సంబంధించినవారు ఎవరైనా దర్శనానికి వచ్చినా, వారు కూడా తప్పనిసరిగా టికెట్ కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. వేసవి సెలవులు కావడంతో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కొత్త నియమాలను ప్రవేశపెట్టారు.

    8 మంది ఆలయ ఉద్యోగుల తొలగింపు

    ఇదిలా ఉండగా, కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో పనిచేసే ఎనిమిదిమంది ఉద్యోగులను తొలగించినట్లు దేవాదాయ శాఖ అధికారికంగా ప్రకటించింది. 2021 ఫిబ్రవరి 6న అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఆలయంలో తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో కొందరు ఉద్యోగులు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు, లెక్కకు మించి ఎక్కువ డబ్బులు తమ వద్ద ఉంచుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

    ఈ అవినీతి ఆరోపణల నేపథ్యంలోనే సదరు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలగించబడిన వారిలో ఆలయ అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ మరియు తాత్కాలిక బ్యాంక్ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం.

    కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయ విశిష్టత

    కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి గొప్ప చారిత్రక నేపథ్యం ఉంది. ఇక్కడ వెలసిన స్వామివారు స్వయంభువుగా వెలిసినట్లు పురాణాలు మరియు స్థల గ్రంధాలు వెల్లడిస్తున్నాయి. కాణిపాకంలో భక్తులు తమ కోరికలను స్వామివారికి విన్నవించుకుంటే అవి తప్పక నెరవేరతాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు. అంతే కాకుండా, ఈ పవిత్ర స్థలంలో ఎవరైనా అసత్య ప్రమాణాలు చేస్తే, దానికి తగిన పరిణామాలను వారు ఎదుర్కొంటారని కూడా స్థానికులు మరియు భక్తులు చెప్పుకుంటారు. ఈ కారణంగానే ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తూ ఉంటారు.

    వార్షిక బ్రహ్మోత్సవాలు

    ప్రతి ఏటా వినాయక చవితి సందర్భంగా కాణిపాకంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. సుమారు ఇరవై ఒక్క రోజులకు పైగా ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ సమయంలో స్వామివారు మూషికాది వివిధ వాహనాలపై కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తారు. విఘ్నాధిపతి అయిన వినాయకుడిని కొలిచేవారికి సకల శుభాలు కలుగుతాయని, ఆటంకాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.

  • విజయవాడ హైవేపై శాటిలైట్ టోల్ కలెక్షన్ షురూ!

    విజయవాడ హైవేపై శాటిలైట్ టోల్ కలెక్షన్ షురూ!

    Satellite Toll Collection: భారతదేశంలో రోడ్డు రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నేషనల్ హైవేల నిర్మాణాలను వేగవంతం చేయడమే కాకుండా, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి, టోల్ వసూళ్ల ప్రక్రియను సులభతరం చేయడానికి ఎప్పటికప్పుడు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలో, 2019 డిసెంబర్ 15న ప్రవేశపెట్టిన ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) విధానం టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని గణనీయంగా తగ్గించింది. ఇప్పుడు, ఈ ఫాస్ట్‌ట్యాగ్ స్థానంలో మరింత ఆధునికమైన శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు విధానం అమలులోకి రానుంది.

    శాటిలైట్ టోల్ విధానం అంటే ఏమిటి?

    శాటిలైట్ టోల్ విధానం అనేది గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (GPS) ఆధారంగా పనిచేస్తుంది. ఈ విధానం ద్వారా వాహనదారులు టోల్ చెల్లించడానికి ప్రత్యేకంగా టోల్ ప్లాజా దగ్గర ఆగాల్సిన అవసరం ఉండదు. వాహనం ప్రయాణించిన దూరం ఆధారంగా ఆటోమేటిక్‌గా టోల్ రుసుము వసూలు చేయబడుతుంది.

    తెలుగు రాష్ట్రాల్లో శాటిలైట్ టోల్ ట్రయల్స్

    కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇప్పటికే పలుమార్లు వెల్లడించినట్లుగా, దేశంలోని పలు ప్రధాన నగరాల్లోని జాతీయ రహదారులపై శాటిలైట్ టోల్ కలెక్షన్ విధానం టెస్టింగ్ దశలో ఉంది. తాజాగా ఈ ప్రయోగాత్మక విధానం మన తెలుగు రాష్ట్రాల్లోకి కూడా ప్రవేశించింది. ముఖ్యంగా, హైదరాబాద్ – విజయవాడ నేషనల్ హైవే మీద పంతంగి, కొర్లపహాడ్ (తెలంగాణ) మరియు చిల్లకల్లు (ఆంధ్రప్రదేశ్) టోల్ ప్లాజాల వద్ద శాటిలైట్ విధానంతో టోల్ వసూలు చేయడం ప్రారంభించారు.

    టోల్ ఫీజు ఎలా కట్ అవుతుంది? ప్రయోజనాలేంటి?

    టోల్ ప్లాజా వద్ద వాహనం ఆగకపోయినా టోల్ ఫీజు ఎలా వసూలు అవుతుందనే సందేహం చాలా మంది వాహనదారులలో తలెత్తింది. అయితే, శాటిలైట్ టోల్ విధానంలో, వాహనం యొక్క విండ్‌షీల్డ్‌పై ఉన్న ఫాస్ట్‌ట్యాగ్ స్టిక్కర్‌ను ఉపయోగించి, GPS ద్వారా వాహనం ప్రయాణించిన దూరాన్ని లెక్కిస్తారు. దీని ఆధారంగా నిర్దిష్ట రుసుము వాహనదారుడి ఖాతా నుండి ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది.

    • సమయం ఆదా: టోల్ గేట్ల వద్ద ఆగాల్సిన పనిలేకపోవడంతో ప్రయాణ సమయం ఆదా అవుతుంది.
    • డబ్బు ఆదా: ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ చెల్లించాల్సి రావడం వలన అనవసరపు ఖర్చు తగ్గుతుంది.
    • ట్రాఫిక్ రద్దీ తగ్గుదల: టోల్ ప్లాజాల వద్ద వాహనాలు నిలిచిపోవడం తగ్గుతుంది, తద్వారా ట్రాఫిక్ జామ్‌లు తగ్గుముఖం పడతాయి.

    భవిష్యత్ ప్రణాళికలు మరియు ప్రభుత్వ కృషి

    ప్రస్తుతం ఈ శాటిలైట్ టోల్ కలెక్షన్ విధానం దేశంలోని కొన్ని ప్రధాన మార్గాల్లో ట్రయల్ రన్‌లో ఉంది. ఈ ప్రయోగాలు విజయవంతమైతే, దేశవ్యాప్తంగా ఈ నూతన విధానాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. అయితే, దేశం మొత్తం మీద ఇది ఎప్పుడు పూర్తిస్థాయిలో అమలులోకి వస్తుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

    పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ, టోల్ వసూలు ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి ప్రభుత్వం ఈ GPS ఆధారిత టోల్ సేకరణను ప్రవేశపెట్టింది. దీనితో పాటు, రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి కూడా కేంద్రం అనేక చర్యలు తీసుకుంటోంది. నాణ్యమైన రోడ్ల నిర్మాణం ద్వారా ప్రమాదాల నివారణకు పెద్దపీట వేస్తూ, కోట్ల రూపాయల నిధులను వెచ్చిస్తోంది.

  • విడుదలైన మూడో రోజే భారీగా పెరిగిన ‘విండ్సర్ ఈవీ ప్రో’ ధరలు: అయినా ఎగబడుతున్న జనం!

    విడుదలైన మూడో రోజే భారీగా పెరిగిన ‘విండ్సర్ ఈవీ ప్రో’ ధరలు: అయినా ఎగబడుతున్న జనం!

    MG Windsor EV Pro Price Hike: ఎంజీ మోటార్ పెద్ద బ్యాటరీతో ‘విండ్సర్ ఈవీ ప్రో’ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కంపెనీ ఈ కారును లాంచ్ చేసిన మూడో రోజే ధరలను అమాంతం పెంచేసింది. దీంతో విండ్సర్ ఈవీ ప్రో కొత్త ధరల వద్ద అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ కారు ధర ఎంత పెరిగింది, ఎంతమంది ఈ కారును బుక్ చేసుకున్నారు అనే ఆసక్తికరమైన వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

    ధరల పెంపు వివరాలు

    ఎంజీ మోటార్ విండ్సర్ ఈవీ ప్రోను లాంచ్ చేసినప్పుడు, దీని ధర రూ. 17.49 లక్షలు మాత్రమే. అయితే ఇప్పుడు ఈ కారు ప్రారంభ ధర రూ. 18.10 లక్షలకు చేరింది. అంటే దీని ధర రూ. 60,000 పెరిగినట్లు స్పష్టమవుతోంది. విండ్సర్ ఈవీ ప్రో ఎలక్ట్రిక్ కారును కంపెనీ లాంచ్ చేసిన సమయంలో.. ప్రారంభ ధర మొదటి 8000 బుకింగ్లకు మాత్రమే అని సంస్థ స్పష్టం చేసింది. చెప్పినట్లుగానే 8000 బుకింగ్స్ పూర్తి కాగానే.. ధరలను పెంచేసింది.

    రికార్డు స్థాయిలో బుకింగ్స్

    విండ్సర్ ఈవీ ప్రో కోసం కంపెనీ మే 8 నుంచి అధికారికంగా బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 24 గంటలలోనే 8000 మంది ఈ కారును బుక్ చేసుకున్నారు. దీన్ని బట్టి చూస్తే.. ఈ కారుకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చూడటానికి స్టాండర్డ్ విండ్సర్ ఈవీ మాదిరిగా ఉన్నప్పటికీ.. విండ్సర్ ఈవీ ప్రో పెద్ద బ్యాటరీ కలిగి, ఎక్కువ రేంజ్ అందించేలా రూపొందించబడింది. ఈ కారణంగానే చాలామంది ఈ కారును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

    పెద్ద బ్యాటరీ

    కొత్త ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో.. ఇప్పుడు 52.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ లేదా సింగిల్ ఛార్జితో 449 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. రేంజ్ అనేది.. వాస్తవ ప్రపంచంలో, వివిధ వాతావరణ పరిస్థితిల్లో కొంత తగ్గే అవకాశం ఉంటుందని మేము భావిస్తున్నాము. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 136 హార్స్ పవర్, 200 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ కారును కంపెనీ ప్రారంభంలో 38 కిలోవాట్ బ్యాటరీతో (332 కిమీ రేంజ్) లాంచ్ చేసింది.

    ఆకర్షణీయమైన ఫీచర్స్

    కొత్త ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో.. సాధారణ విండ్సర్ కంటే కూడా ఎక్కువ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో పవర్డ్ టెయిల్‌గేట్, వెహికల్ టు లోడ్ (V2L), వెహికల్ టు వెహికల్ (V2V) ఛార్జింగ్ కెపాసిటీ వంటివి ఉన్నాయి. అదనంగా, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. ADAS లోని కొన్ని ముఖ్యమైన ఫీచర్లు:

    • అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్
    • లేన్ కీప్ అసిస్ట్
    • లేన్ డిపార్చర్ వార్ణింగ్
    • అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్
    • ఫ్రంట్ కొలిషన్ వార్ణింగ్
    • ఇంటెలిజెంట్ హెడ్‌ల్యాంప్ కంట్రోల్

    ఈ కారు స్టాండర్డ్ విండ్సర్‌లోని ఫుల్ బ్లాక్ కలర్ అపోల్స్ట్రేకి భిన్నంగా.. కొత్త డ్యూయెల్ టోన్ బ్లాక్ సీట్ అపోల్స్ట్రే పొందుతుంది. ఈ కారు కింది కొత్త కలర్ ఆప్షన్లలో కూడా అందుబాటులో ఉంటుంది:

    • సెలాడాన్ బ్లూ
    • అరోరా సిల్వర్
    • గ్లేజ్ సిల్వర్
    • గ్లేజ్ రెడ్

    బుకింగ్స్ జోరు మరియు అమ్మకాల అంచనాలు

    ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో.. 24 గంటల్లో 8000 బుకింగ్స్ పొందింది. నిజానికి ఎంజీ మోటార్ యొక్క విండ్సర్ ఈవీ ప్రారంభం నుంచే మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తోంది. దాని ప్రత్యర్థులతో పోలిస్తే విండ్సర్ ఈవీ సేల్స్ కొంత ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారు సేల్స్ నెలకు 2700 యూనిట్ల కంటే ఎక్కువ నమోదయ్యాయి. కాగా ఇప్పుడు పెద్ద బ్యాటరీ కలిగిన ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో కూడా ఉత్తమ అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము.

  • ఊహకందని రీతిలో భారీగా తగ్గిన గోల్డ్ రేటు: బంగారం కొనడానికి ఇదే రైట్ టైమ్!

    ఊహకందని రీతిలో భారీగా తగ్గిన గోల్డ్ రేటు: బంగారం కొనడానికి ఇదే రైట్ టైమ్!

    Gold Price Drop India: దాదాపు ఆరు రోజుల నిరంతర పెరుగుదల తరువాత, భారతదేశంలో బంగారం ధరలు ఈరోజు (మే 9) అమాంతం తగ్గుముఖం పట్టాయి. గరిష్టంగా ₹1250 వరకు ధర తగ్గడంతో, దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి రేట్లలో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ కథనంలో వివిధ నగరాల్లో బంగారం మరియు వెండి ధరల తాజా వివరాలను స్పష్టంగా తెలుసుకుందాం.

    ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (Gold Prices Today in Major Cities)

    హైదరాబాద్, విజయవాడ మరియు ఇతర దక్షిణ భారత నగరాలు

    హైదరాబాద్ మరియు విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,150 తగ్గి, ₹90,150 వద్ద స్థిరపడింది. అదేవిధంగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,250 తగ్గి, ₹98,350 వద్ద నిలిచింది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు చాలా వరకు తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇదే విధమైన ధరల సరళి గుంటూరు, ప్రొద్దుటూరు, విజయనగరం వంటి నగరాలతో పాటు చెన్నై, ముంబై, బెంగుళూరులలో కూడా కొనసాగుతోంది.

    ఢిల్లీలో బంగారం ధరలు (Gold Prices in Delhi)

    దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కూడా బంగారం ధరలు ఊహించని రీతిలో తగ్గాయి. ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర ₹1,150 తగ్గి ₹90,300 వద్దకు చేరింది. అలాగే, 24 క్యారెట్ల బంగారం ధర ₹1,250 తగ్గి ₹98,500 వద్ద నిలిచింది. వరుసగా పెరుగుతూ వచ్చిన ధరలు ఈ రోజు తగ్గుముఖం పట్టడం గమనార్హం. ఈ తగ్గుదల కొనసాగుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

    వెండి ధరల పరిస్థితి (Silver Price Status)

    బంగారం ధరలు తగ్గినప్పటికీ, ఈ రోజు (శుక్రవారం, మే 9) వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. సిల్వర్ రేటు స్థిరంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ముంబై, బెంగళూరు మరియు చెన్నైలలో కూడా వెండి రేటులో ఎటువంటి మార్పు లేదు. ఇక్కడ కిలో వెండి ధర ₹1,11,000 వద్ద ఉంది. అయితే, ఢిల్లీలో కిలో వెండి ధర ₹99,000 వద్ద ఉంది, ఇది ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే కొంత తక్కువ అని చెప్పవచ్చు.

    బంగారం ధరల తగ్గుదలకు కారణాలు

    స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్న తరుణంలో బంగారం ధరలు అమాంతం తగ్గడం వినియోగదారులకు శుభవార్త. బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం కొనుగోలుదారుల సంఖ్య తక్కువగా ఉండటమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే, గోల్డ్ రేటు మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా.

    బంగారం కొనుగోలుకు ఇదే సరైన సమయమా? (Is this the right time to buy gold?)

    ప్రస్తుత ధరల తగ్గుదల నేపథ్యంలో, బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి అవకాశమని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, భవిష్యత్తులో భారత్ మరియు పాక్ మధ్య ఉద్రిక్తతలు (యుద్ధం) ముగిసిన తరువాత బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని అంచనాలున్నాయి. కాబట్టి, కొనుగోలుదారులు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిదని సలహా.

  • పెళ్ళైనా దూరం దూరంగానే.. ‘LAT’పై పూరి జగన్నాథ్ వివరణ

    పెళ్ళైనా దూరం దూరంగానే.. ‘LAT’పై పూరి జగన్నాథ్ వివరణ

    Puri Jagannadh LAT Relationship: లెజెండరీ డైరెక్టర్‌గా కీర్తించబడిన ‘రామ్ గోపాల్ వర్మ’ సినిమా రంగంలోనే కాదు.. జీవన విధానంలో కూడా ఓ ప్రత్యేకమైన బాణీ. డిఫరెంట్ ఆలోచనలు, డిఫరెంట్ విధానాల వల్ల ఆయన్ను అభిమానించేవారికంటే.. దూషించేవాళ్లు, విమర్శించే వాళ్లే ఎక్కువ. అలాంటి వ్యక్తికి శిష్యుడైన ‘పూరి జగన్నాథ్’ గురువు మాదిరిగానే ఆలోచిస్తూ.. గొప్ప సినిమాలతో సక్సెస్ సాధించారు. ఎప్పటికప్పుడు తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు.

    పూరీ జగన్నాథ్ ‘ల్యాట్’ (లివింగ్ అపార్ట్ టుగెదర్) పై ఆసక్తికర వ్యాఖ్యలు

    ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తన యూట్యూబ్ ఛానల్ వేదికగా.. పూరీ మ్యూజింగ్స్ అనే లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఈ ల్యాట్ (లివింగ్ అపార్ట్ టుగెదర్) గురించి ప్రస్తావించారు. ఆధునిక సంబంధాలలో వస్తున్న మార్పులు, విడాకుల సమస్యకు ఇదొక పరిష్కార మార్గంగా ఆయన అభిప్రాయపడ్డారు.

    ‘ల్యాట్’ ఆవశ్యకత

    ఒకప్పుడు పెళ్లి అంటే.. ఓ పవిత్రమైన బంధం అని చెప్పుకునేవాళ్ళు. అయితే నేడు కాలం మారింది. పద్ధతులు కూడా మారిపోతున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉంటే.. గొడవలు వచ్చేస్తున్నాయి. ఈ కారణాల వల్లనే తొందరగా విడాకులు తీసుకుంటున్నారు. దీనికి చరమగీతం పాడాలంటే.. ఈ ల్యాట్ పద్ధతినే అనుసరించాలంటాడు మన పూరీ జగన్నాథ్.

    ఇద్దరు కలిసి బతకడం కష్టమైన రోజుల్లో.. విడివిడిగా ఉంటూ ఎప్పుడో ఒకసారి కలుసుకుంటే, వారి మధ్య ప్రేమ బలంగా ఉంటుంది. అంతే కాకుండా విడిపోకుండా కూడా ఉంటారనియు పూరీ జగన్నాథ్ చెబుతున్నారు. ఎలా అంటే.. చాలామంది పర్సనల్ స్పేస్ కోరుకుంటారు. అలాంటి సమయంలోనే వేరువేరు ఇళ్లలో ఉంటారు. ఇలా దూరంగా ఉండటం వల్లనే ప్రేమ, అనుబంధం పెరుగుతుంది. కొంతమంది ఇప్పటికి కూడా పెళ్ళైన తరువాత ఒక్కో దేశంలో నివసిస్తున్నారు. వేర్వేరు ఉద్యోగాలు చేస్తున్నారు.

    ‘ల్యాట్’ – బంధాలు బలపడటానికి ఒక మార్గం

    జీవితంలో బ్రేకప్స్, విడాకులు వంటివి చూసిన తరువాత చాలామంది.. దూరంగా ఉంటేనే బంధంబలపడుతుందని పూరీ జగన్నాథ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. విడాకులు తీసుకోకుండా.. పిల్లల భవిష్యత్తు కోసం తల్లితండ్రులు దూరంగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి ఎంత దూరం వెళ్తుంతో అంచనా వేయడం కూడా కొంత కష్టమే.

    ప్రపంచవ్యాప్తంగా ‘ల్యాట్’ ధోరణి

    ప్రస్తుతం యూరప్, జపాన్ వంటి దేశాల్లో ల్యాట్ రిలేషన్‌షిప్స్ ఎక్కువవుతున్నాయి. ఈ విధానంలో భారతదేశంలో కూడా అవలంబించే రోజులు దగ్గరలోనే ఉన్నట్లు కొన్ని సంఘటనలు, సన్నివేశాలు చూస్తుంటే అర్థమవుతోంది.

    ‘ల్యాట్’ విజయానికి కావలసినవి

    పెళ్ళైన తరువాత ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండాలని సమాజం చెబుతుంది. కానీ నేటి తరం మాత్రం స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ.. దూరంగా ఉంటేనే ప్రేమ, అనుబంధం పెరుగుతుందని దూరంగా ఉంటున్నారు. ల్యాట్ రిలేషన్‌లో ఉండాలంటే మానసిక పరిణతి అవసరం, ఒకరిపై ఒకరికి నమ్మకం మరియు గౌరవం వంటివి ఉండాలి. అంతే కాకుండా ఎవరి కాళ్లమీద వారు నిలబడి ఉండాలి. కలిసి ఉండకపోయినా.. కలిసి ఎదుగుతామనేది వాళ్ళ ఫిలాసఫీ.

    పూరీ జగన్నాథ్ వ్యక్తిగత అనుభవం

    కొన్నేళ్ల క్రితం నేను విమానంలో ప్రయాణిస్తూ.. ఒక వివాహితతో మాట్లాడాను. ఆమె భర్త గోవాలో ఒక రెస్టారెంట్‌లో గిటారిస్ట్. అతను అక్కడే పనిచేస్తూ ఉంటాడు. ఆమె ప్రపంచ దేశాలు తిరుగుతూ ఉంటుంది. అయితే వారిద్దరూ ఏడాదిలో ఒక నెల రోజులు మాత్రం కలిసి ఉంటారు. తరువాత ఎవరిదారి వారిదే అని ఆమె చెప్పింది. ఆమె తన భర్తను కలిసే క్రమంలోనే నాతో మాట్లాడింది. ఆ మాటల్లో తన భర్త గురించి చాలా గొప్పగా చెప్పింది. అపరిమితమైన గౌరవం మరియు నమ్మకం ఉన్నవారు మాత్రమే ఆలా ఉండగలుగుతారు.

    ముగింపు: ‘ల్యాట్’ అందరికీ సరిపోతుందా?

    అందరూ ల్యాట్ పద్ధతినే అవలంభించాలని లేదు. అన్యోన్యంగా ఉండి.. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగిపోతే ఎలాంటి ఇబ్బందులు లేదు. అయితే చిన్న చిన్న సమస్యల వల్లనే విడిపోవాలనే సమయం వచ్చినప్పుడు ఈ ల్యాట్ విధానం ఓ మంచి మార్గం. ఇందులో ఎవరికీ వారు ప్రైవసీ పొందుతారు.

  • మార్కెట్లో విడుదలైన సరికొత్త కియా క్లావిస్ ఇదే: రేపటి నుంచే బుకింగ్స్..

    మార్కెట్లో విడుదలైన సరికొత్త కియా క్లావిస్ ఇదే: రేపటి నుంచే బుకింగ్స్..

    Kia Clavis: భారతదేశంలో అనేక మార్లు టెస్టింగ్ దశలో కనిపించిన సరికొత్త ‘కియా కారెన్స్ క్లావిస్’ (Kia Carens Clavis) ఎట్టకేలకు దేశీయ విఫణిలో విడుదలైంది. మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న కియా బ్రాండ్ యొక్క ఇతర వేరియంట్ల కంటే ఈ క్లావిస్ మోడల్ చాలా కొత్తగా, ఆకర్షణీయంగా ఉండనుంది. కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త ఎంపీవీ (MPV) గురించి మరిన్ని కీలక వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

    లాంచ్ & బుకింగ్స్

    కియా మోటార్స్ విడుదల చేయనున్న కియా క్లావిస్ ధరలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే, లాంచ్ సమయంలో (బహుశా 2025 జూన్ 2) ధరలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అంతకంటే ముందుగా, రేపటి నుంచే (మే 9) ఈ కారు బుకింగ్స్ స్వీకరించనున్నట్లు సమాచారం. బుకింగ్ ధర కూడా ఇప్పటి వరకు వెల్లడి కాలేదు, కానీ సుమారు రూ. 25,000 ఉండొచ్చని అంచనా. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ కారును కియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా అధీకృత డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని తెలుస్తోంది.

    డిజైన్ & కలర్ ఆప్షన్స్

    కొత్త కియా కారెన్స్ క్లావిస్ ప్రత్యేకమైన మరియు ఆకర్షణీయమైన డిజైన్‌ను పొందుతుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, కియా సిగ్నేచర్ డిజిటల్ టైగర్ ఫేస్ గ్రిల్, మరియు స్టార్ మ్యాప్ ఎల్ఈడీ కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ వంటివి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. అంతే కాకుండా, 17-అంగుళాల డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్ మరియు ఐవరీ సిల్వర్ పెయింట్ వంటి అంశాలు దీనికి మరింత కొత్తదనాన్ని అందిస్తాయి. మొత్తం మీద, ఈ కారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది.

    కియా క్లావిస్ కారు 6 ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి..

    • ఐవరీ సిల్వర్ గ్లోస్
    • గ్రావిటీ గ్రే
    • స్పార్కింగ్ సిల్వర్
    • అరోరా బ్లాక్
    • ప్యూటర్ ఆలివ్
    • ఇంపీరియర్ బ్లూ
    • అరోరా బ్లాక్ పెర్ల్
    • క్లియర్ వైట్
    • గ్లేసియర్ వైట్ పెర్ల్

    ఈ మల్టిపుల్ కలర్ ఆప్షన్ల వల్ల కొనుగోలుదారులు వారికి నచ్చిన రంగు కారును ఎంచుకోవడానికి వీలుంటుంది.

    ఇంటీరియర్ మరియు కీలక ఫీచర్లు

    కియా కారెన్స్ క్లావిస్ ఇంటీరియర్‌లో అధునాతన ఫీచర్లు అమర్చారు. ఇందులో ప్రధానంగా 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, 64-కలర్ యాంబియంట్ లైటింగ్, ఐదు USB-C ఛార్జింగ్ పోర్ట్‌లు, సీట్ మౌంటెడ్ ఎయిర్ ప్యూరిఫైయర్, మరియు 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టం వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ప్రయాణికుల భద్రత కోసం ఏడీఏఎస్ (ADAS – అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) ఫీచర్లు కూడా అందించబడ్డాయి. ఇవన్నీ సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభూతిని అందించడమే కాకుండా, ప్రయాణ భద్రతను కూడా పెంచుతాయి.

    కియా క్లావిస్ ఇంజిన్ ఆప్షన్స్

    కియా క్లావిస్ మూడు విభిన్న ఇంజిన్ ఆప్షన్స్‌తో రానుంది. అవి:

    • 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్
    • 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్
    • 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్

    ఈ ఇంజిన్లు మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో లభిస్తాయి. ఇవి మంచి పనితీరును మరియు మైలేజ్‌ను అందిస్తాయని అంచనా వేయవచ్చు.

    కియా క్లావిస్ ప్రత్యర్థులు (భారత మార్కెట్లో)

    భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కార్లు విడుదల అవుతూ పోటీని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో, దేశీయ విఫణిలో విడుదల కానున్న సరికొత్త కియా క్లావిస్ కారు, ఇప్పటికే మార్కెట్లో విజయవంతంగా అమ్ముడవుతున్న కొన్ని ప్రముఖ మోడళ్లకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా, మారుతి ఎర్టిగా, మారుతి ఎక్స్ఎల్6, టయోటా రూమియన్, మరియు టయోటా ఇన్నోవా హైక్రాస్ వంటి ఎంపీవీలకు ఇది ప్రధాన ప్రత్యర్థిగా నిలవనుంది. కాబట్టి, అమ్మకాల పరంగా మార్కెట్లో కొంత తీవ్రమైన పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము.

  • తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు 2025: ఫీజు గడువు & టైమ్‌టేబుల్

    తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు 2025: ఫీజు గడువు & టైమ్‌టేబుల్

    Telangana Inter Supplementary Exams 2025: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, పరీక్షలలో ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం నిర్వహించే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను కూడా ప్రకటించింది. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నిర్దిష్ట ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

    ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

    అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయాలనుకునే విద్యార్థుల సౌలభ్యం కోసం, ఫీజు చెల్లింపు గడువును 2025 మే 8 (గురువారం) వరకు పొడిగించినట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. అంటే, విద్యార్థులు ఈ రోజులోగా ఫీజు చెల్లించి తమ దరఖాస్తులను పూర్తి చేయాలి. గడువు ముగిసిన తర్వాత, ఆలస్య రుసుము రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ తేదీలోగా ఫీజు చెల్లించని పక్షంలో, విద్యార్థులు పరీక్ష రాయడానికి అర్హత కోల్పోయి, మరో ఏడాది వేచి చూడాల్సి వస్తుంది.

    తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ 2025

    ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు (IPASE) మే 22, 2025 నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి మరియు రెండో సంవత్సరం విద్యార్థులకు ఈ పరీక్షలు ఒకే తేదీ నుంచి జరుగుతాయి. పూర్తి షెడ్యూల్ క్రింది విధంగా ఉంది:

    ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్‌టేబుల్ 2025

    • 2025 మే 22: సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1
    • 2025 మే 23: ఇంగ్లీష్ పేపర్ 1
    • 2025 మే 24: గణితం పేపర్ 1ఏ, వృక్షశాస్త్రం (బోటనీ) పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1
    • 2025 మే 25: గణితం పేపర్ 1బీ, జంతుశాస్త్రం (జువాలజీ) పేపర్ 1, హిస్టరీ పేపర్ 1
    • 2025 మే 26: భౌతిక శాస్త్రం (ఫిజిక్స్) పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1
    • 2025 మే 27: రసాయన శాస్త్రం (కెమిస్ట్రీ) పేపర్ 1, కామర్స్ పేపర్ 1
    • 2025 మే 28: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్ 1
    • 2025 మే 29: మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫీ పేపర్ 1

    ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్‌టేబుల్ 2025

    • 2025 మే 22: సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2
    • 2025 మే 23: ఇంగ్లీష్ పేపర్ 2
    • 2025 మే 24: గణితం పేపర్ 2ఏ, బోటనీ పేపర్ 2, పొలిటికల్ సైన్స్ పేపర్ 2
    • 2025 మే 25: గణితం పేపర్ 2బీ, జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2
    • 2025 మే 26: ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2
    • 2025 మే 27: కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2
    • 2025 మే 28: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్ 2
    • 2025 మే 29: మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 2, జియోగ్రఫీ పేపర్ 2

    తెలంగాణ ఇంటర్మీడియట్ 2025 రెగ్యులర్ ఫలితాల వివరాలు

    తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) మొదటి మరియు రెండవ సంవత్సరం రెగ్యులర్ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ 2025 ఏప్రిల్ 22న అధికారికంగా విడుదల చేసింది. ఈ పరీక్షలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,96,971 మంది విద్యార్థులు హాజరయ్యారు. 2025 మార్చి 5 నుంచి 2025 మార్చి 25 వరకు 1532 పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్షలు నిర్వహించబడ్డాయి. మొదటి సంవత్సరం విద్యార్థులలో 66.89% ఉత్తీర్ణత సాధించగా, రెండవ సంవత్సరం విద్యార్థులలో 71.37% ఉత్తీర్ణత సాధించారు.

  • భారత్‌లోకి బ్రిటన్ బ్రాండ్ బైకులు: 2025 చివరి నాటికి తయారీ ప్రారంభం!

    భారత్‌లోకి బ్రిటన్ బ్రాండ్ బైకులు: 2025 చివరి నాటికి తయారీ ప్రారంభం!

    Norton Motorcycles India Launch: భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, అనేక కొత్త కంపెనీలు భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలో, ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ, 2020లో బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత మోటార్‌సైకిల్ బ్రాండ్ ‘నార్టన్’ (Norton)ను సుమారు రూ. 153 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఉత్పత్తి ప్రారంభంపై అంచనాలు నెలకొనగా, తాజాగా 2025 నాటికి భారతదేశంలో నార్టన్ మోటార్‌సైకిళ్ల తయారీని ప్రారంభించనున్నట్లు టీవీఎస్ ఎండీ సుదర్శన్ వేణు ధ్రువీకరించారు.

    నార్టన్ ఇండియా అరంగేట్రం: టీవీఎస్ వ్యూహాత్మక అడుగులు

    ప్రస్తుతం యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) మార్కెట్లో నార్టన్ కమాండో 961 (Norton Commando 961) మరియు వీ4 (V4) మోడళ్లు అమ్మకానికి ఉన్నాయి. భారతదేశంలో కూడా టీవీఎస్ ఇదే మోడళ్లను ఉత్పత్తి చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, దీనిపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

    భారీ పెట్టుబడితో నాణ్యతకు పెద్దపీట

    టీవీఎస్, నార్టన్ బ్రాండ్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి సుమారు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. ఈ పెట్టుబడి ప్రధానంగా నార్టన్ మోటార్‌సైకిళ్లలో గతంలో ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించి, నాణ్యతను మెరుగుపరచడం కోసం వెచ్చించినట్లు తెలుస్తోంది.

    2027 నాటికి ఆరు కొత్త నార్టన్ బైక్‌లు

    టీవీఎస్ కంపెనీ 2027 నాటికి ఆరు విభిన్న నార్టన్ మోటార్‌సైకిళ్లను భారత మార్కెట్లోకి విడుదల చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఈ కొత్త నార్టన్ మోటార్‌సైకిళ్లు పూర్తిగా భారతదేశంలోనే తయారవుతాయని, ఇది “మేక్ ఇన్ ఇండియా” కార్యక్రమానికి మరింత ఊతమిస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఆటో ఎక్స్‌పోలలో నార్టన్ బైకులను ప్రదర్శనకు ఉంచారు. ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభం నాటికి వినియోగదారులు నార్టన్ బైకులను కొనుగోలు చేసే అవకాశం ఉందని అంచనా.

    టీవీఎస్ ఎండీ సుదర్శన్ వేణు కీలక ప్రకటన

    “మా బ్రిటీష్ బ్రాండ్ నార్టన్ ఈ ఏడాది చివరి నాటికి భారత మార్కెట్లో విడుదలవుతుందని, ఆ తర్వాత అమ్మకాలు ప్రారంభమవుతాయని” టీవీఎస్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ వేణు స్పష్టం చేశారు. “భారతదేశం అభివృద్ధి చెందడానికి (వికసిత్ భారత్) మా కంపెనీ కట్టుబడి ఉంది” అని ఆయన అన్నారు.

    నార్టన్ ప్రస్తుత కార్యకలాపాలు మరియు అంచనా ధరలు

    ప్రస్తుతం నార్టన్ యూకేలోని సోలిహుల్‌లో 73,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఆధునిక తయారీ కేంద్రంలో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇక్కడ కమాండో 961, వీ4ఎస్‌వీ (V4SV) సూపర్‌బైక్ మరియు వీ4సీఆర్ (V4CR) రోడ్‌స్టర్ వంటి ప్రీమియం బైకులను తయారు చేస్తున్నారు. ఈ బైకుల ధరలు అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ. 19 లక్షల నుంచి రూ. 50 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.

    భారత్‌లో అవే మోడళ్లు వస్తాయా, లేక కొత్తవా?

    భారతదేశంలో ఈ బైకులనే స్థానికంగా తయారు చేస్తారా, లేదా భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా ఏవైనా కొత్త మోడళ్లను లాంచ్ చేస్తారా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. స్థానిక తయారీ వల్ల ధరలు కొంతమేర తగ్గే అవకాశం ఉంది.

    మార్కెట్ పోటీ మరియు అంచనాలు

    2025 సెప్టెంబర్ చివరి నాటికి నార్టన్ బైకులు భారతీయ రోడ్లపైకి వస్తాయని ఆటోమొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత మార్కెట్లో నార్టన్ బైకులు ట్రయంఫ్ (Triumph) మరియు హార్లే డేవిడ్సన్ (Harley Davidson) వంటి ప్రీమియం బ్రాండ్ల సరసన నిలవనున్నాయి.

    రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు ప్రధాన ప్రత్యర్థిగా నార్టన్?

    అయితే, నార్టన్ బ్రాండ్ చరిత్ర మరియు క్లాసిక్ అప్పీల్ కారణంగా, ఇది ప్రధానంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) బ్రాండ్ యొక్క హై-ఎండ్ మోడళ్లకు గట్టి పోటీనిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా 650సీసీ మరియు అంతకంటే ఎక్కువ ఇంజన్ సామర్థ్యం గల విభాగంలో ఈ పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.

  • సినీతారలకు పోటీ ఇచ్చేందుకు సిద్దమవుతున్న సితార!.. సినిమా ఎంట్రీ ఎప్పుడంటే?

    సినీతారలకు పోటీ ఇచ్చేందుకు సిద్దమవుతున్న సితార!.. సినిమా ఎంట్రీ ఎప్పుడంటే?

    Sithara Ghattamaneni Film Debut: సినిమాల్లోకి వచ్చిన తరువాత ఫేమస్ అవ్వడం సర్వసాధారణమే. కానీ సినిమాల్లోకి రాకుండానే ఫేమస్ అయిపోయింది.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి ‘సితార‘. కేవలం సోషల్ మీడియా ద్వారానే ఎంతోమంది అభిమానుల సంపాదించుకున్న ఈ అమ్మడు.. తండ్రి బాటలోనే నడుస్తూ ఎంతోమందికి సేవచేయడంలో తనవంతు సాయం చేస్తోంది. ప్రస్తుతం సినీతారలకు పోటీ ఇవ్వడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.

    బహుముఖ ప్రజ్ఞతో దూసుకెళ్తున్న సితార

    శాస్త్రీయ నృత్యం మరియు సోషల్ మీడియా క్రేజ్

    శాస్త్రీయ నృత్యం నేర్చుకున్న సితార, తన డ్యాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. గతంలో ఎంతోమంది సెలబ్రిటీలను సైతం ఇంటర్వ్యూ చేసి తన ప్రతిభను చాటుకుంది.

    బ్రాండ్ అంబాసిడర్​గా సితార

    ఇది మాత్రమే కాకుండా.. అనేక ప్రముఖ కంపెనీలకు కూడా సితార బ్రాండ్ అంబాసిడర్​గా కూడా వ్యవహరిస్తోంది, చిన్న వయసులోనే వాణిజ్య ప్రకటనలలో తనదైన ముద్ర వేస్తోంది.

    చిన్నారి సితార సాధించిన విజయాలు

    “పెన్నీ” పాట నుండి “ఫ్రోజెన్ 2” వరకు

    2012 జులై 20న జన్మించిన సితార ఘట్టమనేని, ‘సర్కారు వారి పాట’ సినిమాలోని “పెన్నీ” పాటకు డ్యాన్స్ చేసి సంచలనం సృష్టించింది. ఆ తరువాత డిస్నీ యొక్క “ఫ్రోజెన్ 2” యొక్క తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లో బేబీ ఎల్సాగా తన గాత్రాన్ని అందించి మెప్పించింది.

    ఫ్యాషన్ సెన్స్ మరియు సేవా దృక్పథం

    12 ఏళ్ల వయసులోనే ఆమె ఫ్యాషన్ సెన్స్ మరియు దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొని ఎంతోమందిని ఆకట్టుకుంది. ఈ ఏడాది ప్రారభంలో ఓ ఛారిటీకి ఏకంగా రూ. 1 కోటి విరాళంగా ఇచ్చి తన పెద్ద మనసును చాటుకుంది.

    సితార సినీ అరంగేట్రంపై ఉత్కంఠ

    నమ్రత మాటలు, అభిమానుల ఆశలు

    సినిమా రంగంలోకి అడుగుపెట్టడానికి సితార చాలా ఆసక్తి చూపుతున్నట్లు తల్లి నమ్రత శిరోద్కర్ ఓ సందర్భంలో వెల్లడించారు. ఇప్పటికే పలు యాడ్లలో కనిపించిన ఈమె (సితార) ఎప్పుడు కథానాయకిగా సినిమాలో కనిపిస్తుందో అని చాలామంది సితార అభిమానులు ఆ రోజు కోసం ఆసక్తిగా వేచిచూస్తున్నారు.

    మహేష్ బాబు అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపు

    సితార సినిమా రంగ ప్రవేశానికి సంబంధించిన విషయాన్ని ప్రిన్స్ మహేష్ బాబు ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈమె మరికొన్ని రోజుల్లో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎప్పుడు, ఎలా.. సినిమాల్లో కనిపిస్తుందో తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే అని స్పష్టమవుతోంది.

    సేవా కార్యక్రమాలు మరియు భవిష్యత్ అంచనాలు

    సంపాదనతో సమాజ సేవ

    చిన్న వయసులోనే మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న సితార, ప్రస్తుతం కొన్ని బ్రాండ్లకు అంబాసిడర్​గా వ్యవహరించడం ద్వారా కొంత డబ్బు సంపాదిస్తోంది. విశేషం ఏమిటంటే, ఈ డబ్బును కూడా కొన్ని సేవా కార్యక్రమాల కోసం ఉపయోగిస్తోంది. చిన్న వయసులోనే సేవాదృక్పథాన్ని అలవాటు చేసుకోవడం చాలా గొప్ప విషయం అని ఎంతోమంది సితారను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

    గౌతమ్ సినీ ప్రవేశంపై కూడా చర్చ

    సితార మాత్రమే కాకుండా, ఆమె సోదరుడు గౌతమ్ ఘట్టమనేని కూడా సినీ రంగ అరంగేట్రం చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో ఘట్టమనేని కుటుంబం నుంచి మరో తరం నటీనటులు రాబోతున్నారని అభిమానులు ఆశిస్తున్నారు.