జియో ఎలక్ట్రిక్ సైకిల్.. రూ. 15వేలు మాత్రమే!

దాదాపు అన్ని రంగాల్లోనూ తన హవా చూపిస్తున్న అంబానీ రిలయన్స్ కంపెనీ.. జియో ఎలక్ట్రిక్ సైకిల్ ప్రవేశపెట్టింది. తక్కువ ధరలో, కొంత ఎక్కువ దూరం ప్రయాణించడానికి అనుకూలమైన ఈ సైకిల్ గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

రూ.15,000 మాత్రమే!

రిలయన్స్ కంపెనీ ప్రవేశపెట్టిన జియో ఎలక్ట్రిక్ సైకిల్ ధర రూ. 15000 మాత్రమే. దీనిని 999 రూపాయల ఈఎంఐ చెల్లిస్తూ కూడా కొనుగోలు చేసుకోవచ్చు. ఇది ఒక ఫుల్ ఛార్జితో 100 కిమీ పరిధిని అందిస్తుంది. ఇది విద్యార్థులకు, రోజువారీ చిన్న దూరాలకు ప్రయాణించేవారికి చాలా అనుకూలంగా ఉంటుంది.

లైట్ వెయిట్..

జియో ఎలక్ట్రిక్ సైకిల్.. చూడటానికి చాలా స్టైలిష్ డిజైన్ పొందుతుంది. వెడల్పుగా ఉన్న టైర్లు ప్రయాణించేటప్పుడు.. పట్టును అందిస్తాయి. ఇందులో ఎల్ఈడీ లైట్ కనిపిస్తుంది. ఇది విద్యుత్ వినియోగాన్ని కూడా తక్కువగా ఉపయోగించుకుంటుంది. బిల్ట్ కూడా చాలా తేలికగా ఉండటం వల్ల.. ట్రాఫిక్‌లో కూడా సజావుగా ముందుకు వెళ్లడానికి సహాయపడుతుంది.

ఫీచర్స్..

ఈ కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ సౌకర్యవంతమైన సీటును కలిగి ఉంటుంది. కాబట్టి కనీసం 10 కిమీ నుంచి 25 కిమీ దూరం అలసట లేకుంటా రైడింగ్ చేయవచ్చు. సాడిల్ మెత్తగా ఉంటుంది. హ్యాండిల్ బార్ కూడా త్వరగా అలవాటు పడటానికి సహాయపడుతుంది. ఇందులోని కాంపాక్ట్ డిజిటల్ డిస్‌ప్లే.. సైకిల్ స్పీడ్, బ్యాటరీ లెవెల్, మిగిలిన పరిధి వంటి వాటిని చూపిస్తుంది. కాబట్టి బ్యాటరీ లెవెల్ ఆధారంగా.. ఎంత దూరం ప్రయాణించవచ్చని ముందుగానే అంచనా వేసుకోవచ్చు.

పరిధి.. స్పీడ్!

జియో ఎలక్ట్రిక్ సైకిల్.. 15 కిమీ వేగంతో, ఒక పూర్తి ఛార్జింగ్ ద్వారా 100 కిమీ దూరం ప్రయాణిస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. రేంజ్ అనేది రైడర్ బరువు, స్పీడ్, రోడ్డు, టైర్ ప్రెజర్, అసిస్ట్ లెవెల్ వంటి వాటిమీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి రేంజ్ విషయంలో కొంత వ్యత్యాసం కనిపిస్తుంది.

ఛార్జింగ్.. పర్ఫామెన్స్

జియో ఎలక్ట్రిక్ సైకిల్.. సాధారణ సాకెట్ హోమ్ ఛార్జింగ్ ద్వారా ఛార్జింగ్ చేసుకోగలదు. అయితే ఛార్జింగ్ సమయం అనేది.. బ్యాటరీ పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. రద్దీగా ఉన్న రోడ్డుపై కూడా సులభంగా ముందుకు సాగవచ్చు. బ్రేకింగ్, హ్యాండ్లింగ్ అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. ఇందులో బ్యాటరీ లాకింగ్, దొంగతనాల నుంచి బయటపడటానికి కావలసిన టెక్నాలజీ కూడా ఇందులో ఉంది.

ఈ ఎలక్ట్రిక్ సైకిల్ కోసం భారతదేశంలో ప్రారంభమయ్యాయి. దీని ధర రూ. 15వేలు. అందరూ కొనుగోలు చేయడానికి వీలుగా.. దీనిని కంపెనీ ఈఎంఐ రూపంలో కూడా విక్రయిస్తోంది. నెలకు రూ. 999 చెల్లించి కొనుగోలు చేయవచ్చు. కాబట్టి ఇది మన దేశంలో మంచి అమ్మకాలు పొందుతుందని తెలుస్తోంది.

ఎలక్ట్రిక్ కార్లు, బైకులకు మాదిరిగానే.. మన దేశంలో ఎలక్ట్రిక్ సైకిళ్లకు కూడా డిమాండ్ పెరుగుతోంది. కాబట్టి చాలా కంపెనీలు దీనిని దృష్టిలో ఉంచుకునే.. మార్కెట్లో ఎలక్ట్రిక్ సైకిల్స్ లాంచ్ చేస్తున్నాయి. ఈ జాబితాలోకి తాజాగా రిలయన్స్ జియో చేరింది. చాలా రంగాల్లో.. దూసుకెళ్తున్న రిలయన్స్ జియో.. ఎలక్ట్రిక్ సైకిల్స్ విభాగంలో కూడా తన ఉనికిని చాటుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు.