బంగారం ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయా.. అన్నట్టు దూసుకెల్తూనే ఉన్నాయి. 2026 ప్రారంభం నుంచే అమాంతం పెరుగుతున్న రేట్లు ఇప్పుడు తాజాగా మరోమారు పైకి లేచాయి. దీంతో గోల్డ్ రేటు రూ. 16.5వేలు మార్క్ దాటేసింది. పసిడి కొనుగోలుదారుల్లో ఒకింత భయం మొదలైంది. ఈ కథనంలో నేటి (జనవరి 28) గోల్డ్ రేట్లు.. ఏ నగరం ఎలా ఉన్నాయి?, వెండి ధరల పరిస్థితి ఏమిటనే విషయాలను విపులంగా తెలుసుకుందాం.
బంగారం ధరలు ఇలా..
ముందుగా హైదరాబాద్ నగరం బంగారం ధరలు ఎలా ఉన్నాయనే విషయానికి వస్తే.. ఈ నగరంలో 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు అక్షరాలా రూ. 1,67,080 వద్ద ఉంది. అదే విధంగా 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ. 153150లకు చేరింది. 2025 జనవరి సుమారు రూ. 75వేలు వద్ద ఉన్న గోల్డ్ రేటు.. ఈ ఏడాది జనవరి చివరి రెట్టింపు పెరిగిపోయింది. ఈ ధరలు మున్ముందు.. ఇంకా ఎంత పెరుగుతాయో అని బంగారం కొనుగోలుదారులు ఉలిక్కిపడుతున్నారు. నిపుణుల అంచనా ప్రకారం.. త్వరలో పసిడి రేటు రూ. రెండు లక్షలకు చేరుతుందని తెలుస్తోంది.
హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో.. విజయవాడ, కర్నూలు, నెల్లూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు మరియు ముంబై ప్రాంతాల్లో కూడా అదే విధంగా ఉన్నాయి. చెన్నై, ఢిల్లీలో బంగారం ధరల్లో కొంత వ్యత్యాసం కనిపిస్తుంది.
తెలుగు రాష్ట్రాల విషయం పక్కన పెడితే.. చెన్నైలో బంగారం ధరలు చాలా పెరిగింది. 22 క్యారెట్ల రేటు 6500 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల రేటు 7090 రూపాయలు పెరిగింది. దీంతో తులం 22 క్యారెట్ల గోల్డ్ ధర 156100 రూపాయల వద్ద ఉండగా.. 24 క్యారెట్ల రేటు 170290 రూపాయల వద్ద నిలిచింది. భారతదేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే.. చెన్నైలోనే పసిడి రేటు చాలా ఎక్కువగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
ఇక ఢిల్లీ విషయానికి వస్తే.. ఈ నగరంలో 22 క్యారెట్ల బంగారం రేటు, 24 క్యారెట్ల పసిడి ధర వరుసగా.. 4700 రూపాయలు & 5130 రూపాయలు పెరిగింది. దీనివల్ల ఈ రోజు (బుధవారం) తులం గోల్డ్ రేటు వరుసగా రూ. 153300 (22 క్యారెట్స్), రూ. 167230 (24 క్యారెట్స్) వద్ద నిలిచాయి.
బంగారం ధరలు ఎందుకింతలా..
పసిడికి డిమాండ్ ఉందని అందరికీ తెలుసు. ఇతర దేశాలతో పోలిస్తే.. మన దేశంలోని మహిళలు ఎక్కువగా బంగారు ఆభరణాలు ధరిస్తారని కూడా తెలుసు. అయితే గోల్డ్ రేటు ఇంతలా పెరుగుతుందని ఎవరూ ఊహించలేదు, ఊహకు అందలేదు కూడా. ప్రస్తుత ధరలు చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ధరలు ఇంకా పెరుగుతాయా? తగ్గే అవకాశం లేదా?, అని కొంత గాబరా బడుతున్నారు.
నిజం చెప్పాలంటే.. బంగారం ధరలు ఒకసారి పెరిగితే, తగ్గడం అనేది దాదాపు అసాధ్యం అనే చెప్పాలి. ఊహించని పరిణాలు ఏర్పడితే.. అనుకోని ఏదైనా అద్భుతాలు జరిగితే తప్పా గోల్డ్ రేటు తగ్గే అవకాశం లేదు. బంగారం ధరలు భారీగా పడిపోవాలంటే కొనుగోలు చేయడం ఆపేయాలి. లేదా డిమాండుకు తగిన సరఫరా ఉండాలి. అప్పుడే గోల్డ్ రేటు తగ్గుతుంది. లేదంటే.. రాబోయే రోజుల్లో బంగారం కొనుగోలు కష్టమనే చెప్పాలి.
సిల్వర్ రేటు ఇలా..
బంగారం ధరలు ఒక ఎత్తైతే.. వెండి ధరలు మరో ఎత్తు అనే చెప్పాలి. ఎందుకంటే వెండి రేటు ఇది వరకు ఎప్పడూ పెరగనంత పెరిగింది. ఈ రోజు కేజీ వెండి రేటు రూ. 4 లక్షలకు చేరింది. అంటే ఒక గ్రామ్ వెండి ధర 400 రూపాయలన్నమాట. ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని ప్రముఖ రచయితా రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు.
హిమాన్షు కన్సల్టెంట్గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, సినీ రంగాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలను అందిస్తున్నారు. గతంలో ఆయన ఏపీ, తెలంగాణకు సంబంధించిన ఆసక్తికర వార్తలు, రాజకీయాలు, క్రికెట్ వార్తలు రాశారు. హైపర్ లోకల్ న్యూస్ రైటింగ్లో అనుభవం కలిగిన ఆయన వీడియో టీమ్తో కూడా పని చేసిన అనుభవం కలిగి ఉన్నారు. జర్నలిజం రంగంలో 14 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆయన ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించిన ఆర్టికల్స్ రాశారు.