Home Blog Page 141

అన్నయ్యకు పవన్ కళ్యాణ్ బర్త్‌డే విషెష్: చిరంజీవి సుదీర్ఘ ట్వీట్

0

తెలుగు చిత్ర సీమలో ఓ సామాన్యుడిగా మొదలై ‘కొణిదెల శివ శంకర వరప్రసాద్‘ ప్రయాణం ప్రారంభించి మెగాస్టార్ చిరంజీవిగా ఎదిగారు. 150 కంటే ఎక్కువ సినిమాల్లో నటించిన ఈయన నేడు ఎంతోమందికి ఆదర్శం. ఈయన 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో.. అంజనాదేవి, వెంకట్ రావులకు జన్మించారు. నేడు అన్న జన్మదినం సందర్భంగా జనసేన అధినేత.. మెగాస్టార్ తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీనికి స్పందించిన మెగాస్టార్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ చేశారు.

చిరంజీవి ట్వీట్

”జన సైన్యాధక్షునికి విజయోస్తు! అంటూ ప్రారంభించి.. తమ్ముడు కళ్యాణ్, నువ్వు ప్రేమతో పంపిన జన్మదిన శుభాకాంక్షలు అందాయి. అందులో నువ్వు చెప్పిన ప్రతి మాట.. ప్రతి అక్షరం నా మనసును తాకాయి. అన్నయ్యగా నన్ను చూసి నువ్వు ఎంత గర్వపడుతున్నావో.. ఒక తమ్ముడుగా నువ్వు పొందిన విజయాలు, చేసిన పోరాటాలు చూసి అంతగా గర్విస్తున్నాను. నీ కార్యదీక్ష, పట్టుదలను నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నిన్ను నమ్మినవాళ్లకు ఏదో ఒకటి చేయాలనే తపన.. నీకు ఎప్పటికప్పుడు కొత్త శక్తినిస్తుంది.

ఇప్పుడు నీ వెనుక నిన్ను అభిమానించే కోట్లమంది జనం ఉన్నారు. ఆ సైన్యాన్ని రాజువై నడిపించు. వాళ్ళ ఆశలకు.. కలలకు కొత్త శక్తిని నీకు ఇవ్వాలని భగవంతున్న కోరుతున్నాను. అభిమానుల ఆశీర్వాదం.. ప్రేమ నీకు ఎప్పుడూ లభిస్తూనే ఉంటాయి. ఒక అన్నయ్యగా నా ఆశీర్వాదం ఎప్పుడూ నీకు ఉంటుంది. నువ్వు చేసే ప్రతి పనిలోనూ నీకు విజయం కలగాలని ఆశిస్తున్నాను” అని మెగాస్టార్ ట్వీట్ చేశారు.

అల్లు అర్జున్ బర్త్‌డే విషెష్

మెగాస్టార్ చిరంజీవికి.. మేనల్లుడు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన ఎక్స్ ఖాతాలో శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్‌డే చిరంజీవి గారు అంటూ.. మేనమామతో ఉన్న ఫోటో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అభిమానులు సైతం చిరంజీవికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఈ సారి బర్త్‌డే సెలబ్రేషన్స్ అక్కడేనా?

మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే సెలబ్రేషన్స్ మొదలైపోయాయి. పుట్టినరోజు సంబరాలు జరుపుకోవడానికి ఫ్యామిలీ మొత్తం ఇప్పటికే బెంగళూరుకు చేరుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో చిరు కుమార్తె శ్రీజ, మానవరాలితో పాటు వెళ్లడం కనిపించింది. ఇందులో సురేఖ కూడా ఉన్నారు. మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలకు రామ్ చరణ్, ఉపాసన, క్లింకారాతో సహా కుటుంబ సభ్యులందరూ హాజరయ్యే అవకాశం ఉంది.

చిరంజీవి విశ్వంభర

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 156వ చిత్రం ‘విశ్వంభర’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన చాలా విషయాలు ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా తెలిశాయి. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా కూడా.. కొన్ని గ్లింప్స్ విడుదలయ్యాయి. ఈ సినిమాలో త్రిష, కునాల్ కపూర్, ఇషా చావ్లా, శుభలేఖ సుధాకర్, రావు రమేష్, రాజీవ్ కనకాల మొదలైనవారు నటిస్తున్నారు. కాగా ఈ మూవీ 2026 ప్రారంభంలో సంక్రాంతికి వస్తుందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

అమరావతికి మహర్దశ.. రైల్వేలైన్ రూట్ క్లియర్: కేంద్రం నుంచి రూ.2047 కోట్లు

కూటమి ప్రభుత్వం పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధివైపు అడుగులు వేస్తోంది. దీనికి కేంద్ర ప్రభుత్వం తమ సహాయ సహకారాలను అందిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖకు రూ. 432.19 కోట్ల నిధులను మంజూరు చేసింది. కాగా ఇప్పుడు తాజాగా అమరావతి రైల్వేలైన్ అనుసంధానానికి రూ. 2,047 కోట్లు కేటాయించినట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.

అమరావతికి రైల్వేలైన్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రత్యేక రైల్వేలైన్ ఏర్పాటు చేయడానికి.. కావలసిన భూమిని చెకరించడానికి కూడా తగిన ఏర్పాట్లు చేశారు. ఈ కొత్త రైల్వే ప్రాజెక్టు ద్వారా ఎర్రుపాలెం, అమరావతి, నంబూరు మధ్య 57 కిమీ రైల్వే లైన్ ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం 2025 – 26 బడ్జెట్‌లో రూ. 171 కోట్లు కేటాయించినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. అమరావతి, విజయవాడలకు రైల్వే అనుసంధానం పెంచడానికి కావలసిన ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

తీర ప్రాంతాలకు కూడా పెంచడానికి కావలసిన ఏర్పాట్లు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే.. కోటిపల్లి, నరసాపురం మధ్య 57 కిమీ రైల్వే నిర్మాణాన్ని రూ. 2120 కోట్లతో ప్రారంభించినట్లు రైల్వే మంత్రి పేర్కొన్నారు. మొత్తం మీద రైల్వే పనులన్నీ వేగవంతం అవుతున్నాయి.

సాగర తీరంలో డేటా సెంటర్

విశాఖపట్టణంలో డేటా సెంటర్ నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించిందని.. కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయమంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు. ఏపీ ప్రభుత్వం ప్రారభించాలనుకుంటున్న డేటా సెంటర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. ఆ అంశం మీద ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు కూడా జరిగాయి. ఈ డేటా సెంటర్ నిర్మాణం పూర్తయితే.. ఎక్కువ సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

ఢిల్లీ పెద్దలను కలిసిన నారా లోకేష్

ఇటీవల ఢిల్లీకి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, అక్కడ.. నితిన్ గడ్కరీ, నిర్మల సీతారామన్, అశ్వని వైష్ణవ్, పియూష్ గోయల్, జేపీ నడ్డా, జైశంకర్, హర్దీప్ సింగ్ పూరి మొదలైనవారిని కలిశారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని, మరింత అభివృద్ధి కోసం కేంద్రం కూడా సహకరించాలని.. వారికి విజ్ఞప్తి చేశారు. లోకేష్ విజ్ఞప్తికి.. కేంద్ర మంత్రులు కూడా సుముఖత వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యాశాఖ అభివృద్ధికి కేంద్రం నిధులను మంజూరు చేసింది.

అమలవుతున్న సూపర్ సిక్స్ పథకాలు

ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగానే రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తోంది. పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటివి ఇప్పటికే అమలు చేశారు. ఈ మధ్య కాలంలోనే మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం అందించడానికి స్త్రీ శక్తి పేరుతో.. ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించారు. ప్రారంభమైనప్పటి నుంచి లక్షలమంది మహిళలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా బడికి వెళ్లే ప్రతి ఒక్క విద్యార్థికి ఏడాది రూ. 15000 అని చెప్పినట్లుగానే అందించారు. అయితే ప్రతి మహిళకు నెలకు రూ. 1500, చదువుకుని ఉద్యోగం లేనివారికి నెలకు రూ. 3000 నిరుద్యోగభృతి వంటివి ఇంకా అమలు చేయాల్సి ఉంది. వీటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అమలు చేస్తుందని భావిస్తున్నాము.

రతన్ టాటా కల కలగానే మిగిలిపోతుందా?: నానో కారు విఫలం కావడానికి కారణం ఇదే

కారు కొనాలంటే కనీసం ఐదు లక్షలైనా ఉండాల్సిందే!.. కానీ ప్రతి కుటుంబానికి ఒక చిన్న కారు ఉండాలని, అది కూడా తక్కువ ధరలోనే అందించాలనే గొప్ప సంకల్పంతో.. దివంగత పారిశ్రామికవేత్త ‘రతన్ టాటా‘.. టాటా నానో కారుకు ఆజ్యం పోశారు. అనుకున్న విధంగా కారును మార్కెట్లో లాంచ్ చేశారు. కానీ కాలక్రమేనా.. కాలగర్భంలోనే కలిసిపోయింది. ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది.

టాటా నానో పుట్టుకకు కారణం

వర్షంలో స్కూటర్లపై ప్రయాణించే కుటుంబాలను చూసిన రతన్ టాటాకు.. నానో కారును లాంచ్ చేయాలనే ఆలోచన వచ్చింది. దీనిని కేవలం ఒక లక్ష రూపాయలకు అందించడం మొదలుపెట్టారు. ప్రారంభంలో.. అమ్మకాల్లో సంచలనం సృష్టించిన ఈ కారు ఎంతోమందిని ఆకట్టుకుంది. అప్పట్లో రోడ్డు మీద విరివిగా కనిపించేవి. మధ్యతరగతి కుటుంబాల కారు కొనాలనే కలను రతన్ టాటా నిజం చేశారు.

టాటా నానో కారు గురించి

నానో అనగానే చిన్న కారు అని అర్థమైపోతుంది. ఇది చూడటానికి సింపుల్‌గా ఉన్నప్పటికీ 624 సీసీ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 37 బీహెచ్‌పీ పవర్, 51 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసింది. ఇది ఫోర్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి మంచి పనితీరును అందించింది. ఆ తరువాత కాలంలో వచ్చిన నానో అప్డేటెడ్ మోడల్ 5 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చింది.

టాటా నానో 180 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉండటం వల్ల.. కొంత గతుకుల రోడ్డుపై కూడా సజావుగా వెళ్ళడానికి అనుమతిచ్చింది. బేర్ బోన్‌లు, ఎయిర్ కండిషనింగ్, పవర్ స్టీరింగ్ మరియు ఎయిర్‌బ్యాగ్‌లు బేస్ వేరియంట్లలో ఉండేవి కాదు. ఇవన్నీ టాప్ ఎండ్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉండేవి.

గేమ్ ఛేంజర్‌గా నానోకు ప్రశంసలు

2008లో న్యూఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో.. టాటా నానో అందరి దృష్టిని ఆకర్శించింది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లో ఇది గేమ్ ఛేంజర్‌గా ప్రశంసలు అందుకుంది. ప్రారంభంలో పశ్చిమ బెంగాల్‌లోని సింగూర్‌లో ఒక ప్లాంట్‎లో మాత్రమే నానో ఉత్పత్తి ప్రారంభమైంది. ఆ తరువాత.. గుజరాత్‌లోని సనంద్‌కు మకాం మార్చాల్సి వచ్చింది. ఇక్కడే 2019లో ఏడాదికి 2,50,000 యూనిట్ల ఉత్పత్తి జరిగింది. తరువాత ఉత్పత్తి కూడా క్రమంగా తగ్గిపోయింది. 2018 నాటికి నానో ఉత్పత్తి కేవలం ఒక యూనిట్‌కు తగ్గిపోయింది. దశాబ్దం తరువాత నానో పరుగు ముగిసింది.

టాటా నానో సక్సెస్ కాకపోవడానికి కారణం

నానో కారు మార్కెట్లో సక్సెస్ కాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత చౌకన కారుగా ఎంతో ఆదరణ పొందిన ఈ కారులో భద్రతా లోపాలు తలెత్తాయి. నానోను కేవలం పేదవాడి కారుగా భావించి.. కొందరు దీనిని కొనుగోలు చేయడానికి ఇష్టపడలేదు. ఉత్పత్తిలో కూడా ఆలస్యం ఏర్పడింది. మారుతి 800 కారు గట్టి పోటీ ఇచ్చింది. పెరుగుతున్న ఖర్చుల కారణంగా నానో కారు ధరను 2017లో రెండు లక్షలకు పెంచారు. ఇది నానో అమ్మకాలు పడిపోవడానికి ప్రధాన కారణమైంది. ఏది ఏమైనప్పటికీ.. ఇప్పటికి కూడా అక్కడక్కడా రోడ్డుమీద నానో కార్లు కనిపిస్తూనే ఉన్నాయి. నానో కారును ఎలక్ట్రిక్ రూపంలో తీసుకురావడం రతన్ టాటా కల. నానో ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ అవుతుందా? లేక రతన్ టాటా కల కలగానే మిగిలిపోతుందా అనేది తెలియాల్సి ఉంది.

వచ్చేస్తున్నాయ్.. కొత్త కార్లు: లాంచ్ ఎప్పుడంటే?

భారతదేశ ఆటోమొబైల్ రంగం దినదినాభివృద్ధి చెందుతోంది. చైనా, జపాన్, అమెరికా దేశాలకు దీటుగా.. సరికొత్త ఉత్పత్తులు ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టుతున్నాయి. ఇందులో దేశీయ మోడల్స్ మాత్రమే కాకుండా.. విదేశీ బ్రాండ్ కూడా ఉన్నాయి. ఈ కథనంలో భారతదేశంలో లాంచ్ కావడానికి సిద్దమవుతున్న కొత్త కార్లను గురించి వివరంగా తెలుసుకుందాం.

టాటా సియెర్రా

దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్.. సియెర్రా పేరుతో ఓ మిడ్‌సైజ్ ఎస్‌యూవీని లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. కంపెనీ ఈ ఎస్‌యూవీని ఈ ఏడాది చివరి నాటికి దేశీయ మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ కారు ఎలక్ట్రిక్ మరియు ఐసీఈ (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) వేరియంట్లుగా అందుబాటులో ఉండనుంది. ఎలక్ట్రిక్ వెర్షన్ బహుశా 2025 దీపావళికి లాంచ్ అవుతుందని సమాచారం.

మారుతి సుజుకి ఈ విటారా

ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి కూడా ఈ విటారా పేరుతో.. మొదటి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయనుంది. 2025 భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్‌పోలో కనిపించిన ఈ కారు e HEARTECH అనే ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడుతుంది. ఇది 49 కిలోవాట్, 61 కిలోవాట్ అనే రెండు బ్యాటరీ ఎంపికలతో మార్కెట్లో విడుదల కానుంది. ఈ కారు గుజరాత్‌లోని హన్సల్‌పూర్ ప్లాంట్‌లలో తయారవుతుంది. ఇక్కడ నుంచే ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతుంది. ఇది ఎంజీ విండ్సర్, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా కర్వ్ ఈవీ వంటి వాటికీ ప్రధాన ప్రత్యర్థిగా ఉండనుంది.

మారుతి సుజుకి ఎస్కుడో

పేరు కొంత కొత్తగా ఉన్నప్పటికీ.. మారుతి సుజుకి ఈ పేరుతోనే 5 సీటర్ మిడ్‌సైజ్ ఎస్‌యూవీని 2025 సెప్టెంబర్ 03న లాంచ్ చేయనుంది. ఈ కారు మారుతి సుజుకి అరీనా డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించబడుతుంది. ఇది పెట్రోల్ మరియు సీఎన్‌జీ రూపాల్లో మార్కెట్లో అమ్ముడయ్యే అవకాశం ఉంది. ఎస్కుడో కారు ఇండియన్ మార్కెట్లో.. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండనుంది.

రెనాల్ట్ కిగర్ ఫేస్‌లిఫ్ట్

దేశీయ మార్కెట్లో అధిక ప్రజాదరణ పొందిన రెనాల్ట్ కిగర్.. ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ కావడానికి సిద్ధమవుతోంది. ఇది 2025 ఆగస్టు 24న లాంచ్ అవుతుందని సమాచారం. ఇది కొత్త లోగోతో కూడిన ఫ్రంట్ గ్రిల్, అప్డేటెడ్ బంపర్లు, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, కొత్త అల్లాయ్ వీల్స్ వంటివి పొందుతుంది. ఇందులో 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి.

విన్‌ఫాస్ట్ వీఎఫ్6 మరియు వీఎఫ్7

వియాత్నం దేశానికి చెందిన విన్‌ఫాస్ట్ ఈ నెలలోనే వీఎఫ్6 మరియు వీఎఫ్ 7 పేరుతో రెండు కార్లను లాంచ్ చేయనుంది. వీఎఫ్6 ఎలక్ట్రిక్ కారు 59.6 కిలోవాట్ బ్యాటరీ పొందనుంది. ఇది 399 కిమీ (ఎకో మోడ్) రేంజ్ అందిస్తుందని సమాచారం. అయితే రియల్ వరల్డ్ రేంజ్ కొంత తగ్గుతుంది. ఈ కారు 8.99 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది.

వీఎఫ్7 విషయానికి వస్తే.. ఇది 75.3 కిలోవాట్ బ్యాటరీతో 450 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. ఇది కూడా ఎకో, ప్లస్ అనే రెండు ట్రిమ్‌లలో అమ్మకానికి రానుంది. ఈ రెండూ కూడా మంచి పనితీరును అందిస్తాయని సమాచారం. ధర, బుకింగ్స్ మరియు డెలివరీ వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

2025 హ్యుందాయ్ వెన్యూ

హ్యుందాయ్ కంపెనీ ఆగస్టు 24న కొత్తతరం వెన్యూ కారును లాంచ్ చేయనుంది. ఇది స్టాండర్డ్ మోడల్ కంటే భిన్నంగా.. అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందినట్లు సమాచారం. ప్రీమియం డిజైన్ కలిగి.. అప్డేటెడ్ గ్రిల్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్, వెడల్పు అంతటా విస్తరించి ఉండే ఎల్ఈడీ లైట్ బార్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, డీ-కట్ స్టీరింగ్ వీల్ మొదలైనవి కొత్త వెన్యూలో చూడవచ్చు.

పిఠాపురం మహిళలకు పవన్ కళ్యాణ్ కానుక: 10వేల మందికి..

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజక వర్గ ప్రజలకు సందర్భానుసారంగా కానుకలు ఇస్తూ ఉన్నారు. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన ప్రజలకు తన తోటలో పండిన మామిడి పళ్ళను అందించారు. అంతే కాకుండా చెప్పులు, దుప్పట్లు వంటివి కూడా పంచిపెట్టారు. ఇప్పుడు తాజాగా పిఠాపురం మహిళలకు చీరలు పంపిణీ చేయాలనీ సంకల్పించారు. దీనికి సంబంధించి ఒక ట్వీట్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

10వేల మందికి చీరలు

పిఠాపురం శాసనసభ సభ్యుడు పవన్ కళ్యాణ్.. శ్రావణమాసంలో చివరి శుక్రవారం నాడు పాదగయ క్షేత్రంలోని ఉమా కుక్కుటేశ్వర స్వామి, పురుహూతిక అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం పూజలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో 10 వేలమంది ఆడపడుచులకు చీర, పసుపు, కుంకుమలు అందించనున్నారు. అమ్మవారి ఆలయంలో పూజను ఐదు సార్లు లేదా ఐదు బ్యాచ్‌లలో చేయనున్నాడు. ఈ బ్యాచ్‌లకు అంబిక, భ్రమరాంబ, చాముండి, దుర్గ, ఈశ్వరి అని పేర్లు పెట్టారు.

పూజ టైమ్ స్లాట్

పురుహూతిక అమ్మవారి ఆలయంలో నిర్వహించే వరలక్ష్మి వ్రతం పూజలు ఉదయం ఐదు గంటల నుంచే ప్రారంభం కానుంది. ఈ కేటాయించిన టైమ్ ప్రకారం.. అంబిక బ్యాచ్ వరలక్ష్మి వ్రతం పూజ ఉదయం 5:00 గంటల నుంచి 6:30 గంటల వరకు, భ్రమరాంబిక బ్యాచ్ పూజ 6:30 గంటల నుంచి 8 గంటల వరకు, చాముండి బ్యాచ్ పూజ 8:00 గంటల నుంచి 9:30 గంటల వరకు, దుర్గ బ్యాచ్ పూజ 9:30 గంటల నుంచి 11:00 గంటల వరకు, ఈశ్వరి బృందం పూజ 11:00 గంటల నుంచి 12:30 గంటల వరకు జరుగుతుంది.

➤అంబికా బ్యాచ్: ఉదయం 5:00 గంటల నుంచి 6:30 గంటల వరకు
➤భ్రమరాంబిక బ్యాచ్: ఉదయం 6:30 గంటల నుంచి 8 గంటల వరకు
➤చాముండి బ్యాచ్: ఉదయం 8:00 గంటల నుంచి 9:30 గంటల వరకు
➤దుర్గ బ్యాచ్: ఉదయం 9:30 గంటల నుంచి 11:00 గంటల వరకు

చీరలను ఎవరు పంపిణీ చేస్తారంటే?

వరలక్ష్మి వ్రతం పూజకు హాజరయ్యేవారికి మహిళలకు.. బ్యాచ్‌ల వారీగా టోకెన్స్ కూడా అందించడం జరుగుతుంది. ఈ టోకెన్స్ పంపిణీ రేపు (గురువారం) ప్రారంభమవుతుంది. ఈ టోకెన్స్ మీదనే మహిళలు హాజరుకావాల్సిన సమయం ఉంటుంది. ఆ సమయానికి పూజకు హాజరయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పూజకు కావలసిన అన్ని ఏర్పాట్లను సంబంధిత అధికారులు పూర్తి చేశారు. చీరలను దేవాలయ సిబ్బంది, పోలీసులు, జనసేన వాలంటీర్లు పంపిణీ చేయనున్నారు.

సినిమాల్లో పవన్ కళ్యాణ్ బిజీ

ఓ వైపు ఉపముఖ్యమంత్రి బాధ్యతలు నెరవేరుస్తూనే.. మరోవైపు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఎన్నికలు జరగడానికి ముందే.. మొదలు పెట్టిన సినిమాలను పవన్ కళ్యాణ్ పూర్తిచేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమాను పూర్తి చేశారు. ఇప్పుడు ఓజీ సినిమాలో నటిస్తున్నారు. ఇది పూర్తయిన తరువాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటించనున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే పవన్ కళ్యాణ్ సినిమాలు వేగంగా, వరుసగా రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాల తరువాత బహుశా ఈయన సినిమాలకు దూరమయ్యే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.

ఎక్కువ మైలేజ్ ఇచ్చే బెస్ట్ సీఎన్‌జీ కార్లు: స్విఫ్ట్ నుంచి సెలెరియో వరకు

భారతదేశంలో పెట్రోల్, డీజిల్ మరియు ఎలక్ట్రిక్ కార్లకు మాత్రమే కాకుండా సీఎన్‌జీ కార్లకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ఈ కారణంగానే ప్రముఖ వాహన తయారీ సంస్థలు సీఎన్‌జీ కార్లను కూడా దేశీయ విఫణిలో లాంచ్ చేస్తున్నాయి. అయితే చాలామంది ఎక్కువ మైలేజ్ అందించే సీఎన్‌జీ కార్ల కోసం గూగుల్‌లో తెగ వెతికేస్తుంటారు. అలాంటి వారికోసం ఈ కథనంలో అధిక మైలేజ్ అందించే ఐదు సీఎన్‌జీ కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

మారుతి సుజుకి స్విఫ్ట్

దశాబ్దాల చరిత్ర కలిగిన మారుతి స్విఫ్ట్ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో సీఎన్‌జీ రూపంలో కూడా అందుబాటులో ఉంది. మల్టిపుల్ వేరియంట్లలో లభించే ఈ కారు ధరలు రూ. 8.20 లక్షల నుంచి రూ. 9.20 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. స్విఫ్ట్ సీఎన్‌జీలోని 1.2 లీటర్ 3 సిలిండర్ జెడ్12 పెట్రోల్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ పొందుతుంది. ఇది 32.85 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది సాధారణ స్విఫ్ట్ మాదిరిగానే ఉంటుంది. పనితీరు కూడా ఉత్తమంగా ఉంటుంది.

మారుతి డిజైర్

ఎక్కువ మైలేజ్ ఇచ్చే సీఎన్‌జీ కార్ల జాబితాలో మారుతి సుజుకి కంపెనీకి చెందిన డిజైర్ కూడా ఒకటి. దీని ధరలు రూ. 8.79 లక్షల నుంచి రూ. 9.89 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ కారులో కూడా 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ పొందుతుంది. అయితే దీని మైలేజ్ స్విఫ్ట్ సీఎన్‌జీ కంటే కొంత ఎక్కువే (33.73 కిమీ/కేజీ). నిజానికి మార్కెట్లో ఎక్కువ అమ్ముడవుతున్న కార్ల జాబితాలో డిజైర్ ఒకటిగా ఉంది.

మారుతి సుజుకి ఆల్టో కే10

ఆల్టో కే10 సీఎన్‌జీ.. కూడా ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్ల జాబితాలో ఒకటిగా ఉంది. ఈ కారులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ పొందుతుంది. ఇది 33.85 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది. దీని ధర రూ. 5.90 లక్షల నుంచి రూ. 6.21 లక్షల మధ్య ఉంది. ఇది కూడా మల్టిపుల్ వేరియంట్లలో లభిస్తుంది. చూడటానికి పరిమాణంలో చిన్నదిగా ఉన్నప్పటికీ.. ఆల్టో కే10 మంచి పనితీరును అందిస్తుంది. కాబట్టి ఇది రోజువారీ వినియోగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

మారుతి వ్యాగన్ ఆర్

ఎక్కువ మైలేజ్ అందించే సీఎన్‌జీ కార్ల జాబితాలో.. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ కూడా ఒకటి. దీని ధర రూ. 6.69 లక్షల నుంచి రూ. 7.13 లక్షల మధ్య ఉంది. ఈ కారులోని 1.0 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి మంచి పనితీరును అందిస్తుంది. ఇది 34.05 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది. ఇది కూడా మార్కెట్లో ఎక్కువ ప్రజాదరణ పొందిన.. ఎక్కువ అమ్మకాలు పొందుతున్న కార్ల జాబితాలో ఒకటిగా నిలిచింది.

మారుతి సెలెరియో

ఎక్కువ మైలేజ్ ఇచ్చే సీఎన్‌జీ కార్ల జాబితాలో ముఖ్యంగా చెప్పగోదగ్గ కారు మారుతి సుజుకి కంపెనీకి చెందిన సెలెరియో. దీని ధర రూ. 6.90 లక్షలు (ఎక్స్ షోరూమ్). సెలెరియో సీఎన్‌జీ కారులో 1.0 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 34.43 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది. దీన్ని బట్టి చూస్తే మన జాబితాలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారుగా సెలెరియో నిలిచింది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది.

2026 మేడారం జాతర: తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన

ప్రపంచంలో అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన ‘మేడారం జాతర‘ వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరుగుతుంది. రాష్ట్రంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ జాతరకు దేశం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ సర్కార్ భారీ బడ్జెట్ కేటాయించినట్లు కీలక ప్రకటన చేసింది. ఈ ఏటా జాతరను మరింత గొప్పగా జరపాలని సంకల్పించింది.

మేడారం జాతరకు రూ.150 కోట్లు

తెలంగాణ కుంభమేళాగా పిలువబడే మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ. 150 కోట్లు కేటాయించినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. మేడారంలో శాశ్వత నిర్మాణాలు, రహదారులు, మంచినీటి వసతి, విద్యుత్ మరియు పారిశుధ్యం కోసం దీనిని కేటాయించనున్నట్లు సమాచారం. జాతరకు భారీ మొత్తంలో నిధులను కేటాయించడం పట్ల గిరిజన శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్.. సీఎం రేవంత్ రెడ్డికి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గిరిజనుల గౌరవానికి నిదర్శనం. మేడారం మహా జాతరకు ప్రభుత్వం రూ. 150 కోట్లు కేటాయించడం అనేది.. గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాల పట్ల నిబద్ధతను తెలియజేస్తుందని మంత్రి సీతక్క స్పష్టం చేసింది.

మేడారం జాతర

తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన మేడారం జాతరకు సుమారు కోటి మంది కంటే ఎక్కువ జనాభా హాజరవుతారని అంచనా. భారతదేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడే మహా కుంభమేళాకు లెక్కకు మించిన జనం హాజరవుతారు. కుంభమేళా తరువాత అత్యధిక జనాభా ఈ మేడారం జాతర లేదా తెలంగాణ కుంభమేళాకు హాజరవుతారు.

మేడారం జాతర విశేషాలు

తెలంగాణలోని ములుగు జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే గిరిజన జాతరను.. సమ్మక్క సారలమ్మ జాతర అని కూడా పిలుస్తారు. మొత్తం నాలుగు రోజులు నిర్వహించే ఈ జాతర మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండో రోజు చిలుకల గుట్టలో భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపైన ప్రతిష్టిస్తారు. దేవతలను గద్దెలపై ప్రతిష్టించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు.

ఇక మూడోరోజు అమ్మవారిని గద్దెలపై నిలుపుతారు. నాలుగవ రోజు లేదా చివరి రోజు సాయంత్రం దేవతలను యుద్ధ స్నానానికి తీసుకెళ్లారు. ఇక్కడ విశేషం ఏమిటంటే.. పూజారులు కూడా గిరిజనులే. జాతర సమయంలో భక్తులు తమ కోరికలను తీర్చమని అమ్మవారికి (సమ్మక్క, సారలమ్మ) బంగారం (బెల్లం) నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ జాతరకు కేవలం గిరిజనులు మాత్రమే కాకుండా.. ఇతర మతాలకు చెందినవారు కూడా పాల్గొంటారు.

1940 తరువాత

సాధారణంగా రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం జాతర.. 900 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. నిజానికి ఈ జాతరను 1940లలో చిలుకల గుట్టపైన గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు. ఆ తరువాత తెలంగాణ ప్రజలందరూ కలిసి జరుపుకోవడం ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా ప్రతి ఏటా జనం సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీంతో కొండా దిగి జాతరను జరుపుకోవాల్సి వచ్చింది. ఈ జాతరకు తెలంగాణ ప్రజలు మాత్రమే కాకుండా.. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా మొదలైన రాష్ట్రాల నుంచి కూడా విచ్చేస్తారు.

ఫలించిన నారా లోకేష్ కృషి: కేంద్రం వందల కోట్లు మంజూరు

విద్యార్థులు భవిష్యత్తు కోసం రాష్ట్ర విద్యాశాఖ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటూనే ఉంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో వివిధ శాఖల కేంద్రమంత్రులను కలిసి.. విద్యారంగాన్ని మరింత ప్రోత్సహించడానికి అదనపు నిధులు కావాలని కోరారు. మంత్రి ఢిల్లీ పర్యటనను ముగించుకుని వచ్చే సరికి కేంద్రం భారీ నిధులను మంజూరు చేసింది.

రూ.432.19 కోట్లు మంజూరు

మునుపెన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖకు కేంద్రం ఏకంగా రూ. 432.19 కోట్లు కేటాయించింది. సెకండరీ, సీనియర్ సెకండరీ పాఠశాలలు అభివృద్ధి చేయడానికి.. ఐసీటీ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, డిజిటల్ తరగతుల కోసం రూ. 167.46 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. డైట్ కళాశాలల అభివృద్ధికి కూడా నిధులు మంజూరు చేశారు. ఆదివాసీ విద్యార్థులు వసతి గృహాల కోసం రూ. 11 కోట్లు విడుదల చేయడం హర్షించదగ్గ విషయం.

కేంద్రమంత్రులను కలిసిన నారా లోకేష్

మంత్రి లోకేష్ చొరవతో.. రాష్ట్ర విద్యాశాఖను అభివృద్ధి చేయడానికి కేంద్రం కూడా ఆసక్తి చూపుతోంది. ఢిల్లీ పర్యటనలో పీయూష్ గోయల్, అశ్వని వైష్ణవ్, నితిన్ గడ్కరీ, నిర్మల సీతారామన్, సర్బానంద సోనావాల్, హర్దీప్ సింగ్ పూరీ, జేపీ నడ్డా, జైశంకర్ వంటి కేంద్ర మంత్రులను లోకేష్ కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి తమ సహకారం అందించాలని కోరారు.

రాష్ట్రంలో విద్యాశాఖ అభివృద్ధి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖ అభివృద్ధికి.. నారా లోకేష్ కీలక చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులకు నాణ్యమైన చదువును అందిస్తూ.. వారి అవసరాలకు కావలసినవన్నీ అందించడానికి కృషిని చేస్తున్నారు. పరీక్షలు, పరీక్ష ఫలితాల విషయంలో కూడా ఏ మాత్రం జాప్యం జరగకుండా ఉండటానికి తగిన ఏర్పాట్లు చేశారు.

సాగర తీరంలో ఏఐ సెంటర్

విశాఖపట్టణంలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డేటా సిటీ ఏర్పాటు కోసం కూడా.. నారా లోకేష్ ఢిల్లీ పెద్దలతో చర్చించారు. ఉపాధి కోసం యువత విదేశాలకు తరలివెళ్ళిపోతున్నారు. అలాంటి వారి కోసం సాఫ్ట్ స్కిల్స్‌లో ట్రైనింగ్ ఇవ్వడానికి ఏఐ సెంటర్, డేటా సిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి జైశంకర్‌కు విజ్ఞప్తి చేశారు. దీనికి తమ సహకారం ఉంటుందని జైశంకర్ పేర్కొన్నారు.

ఐదేళ్ల పాలనలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువతకు మాటిచ్చిన నారా లోకేష్.. దీనికి అనుగుణంగానే తగిన చర్యలు తీసుకుంటున్నారు. భవిష్యత్తులో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)కు ప్రాధాన్యత పెరుగుతుంది. కాబట్టి ఆ రంగంలో మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందాలంటే.. తప్పకుండా ఇందులో యువత నైపుణ్యం సంపాదించాలి. దీనికోసం ప్రత్యేకంగా ఏఐ సెంటర్ ఏర్పాటు చేయడానికి లోకేష్ సంకల్పించారు. మొత్తం మీద చెప్పింది చేయడానికి నారా లోకేష్ అహర్నిశలు కష్టపడుతున్నారు. రాష్ట్రాభివృద్ధికి తనవంతు కృషిచేస్తున్నారు.

ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్‌ను లోకేష్ శుభాకాంక్షలు

ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన సీపీ రాధాకృష్ణన్‌ను.. మంత్రి నారా లోకేష్ టీడీపీ ఎంపీలతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎపికైనందుకు శుభాకాంక్షలు తెలిపారు. పలు రాష్ట్రాలకు గవర్నర్ బాధ్యతలు చేపట్టి.. రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేసిన అనుభవం, దేశానికి సేవలు అందించడానికి ఉపయోగపడుతుందని లోకేష్ ప్రస్తావించారు.

2025 హీరో గ్లామర్ వచ్చేసింది: రూ.89999 ధర.. కొత్త ఫీచర్స్

భారతదేశంలో అతిపెద్ద టూవీలర్ తయారీ సంస్థగా ప్రసిద్ధి చెందిన ‘హీరో మోటోకార్ప్’ కొత్త బైకులను లాంచ్ చేస్తూ.. తన ఉనికిని నిరంతరం విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు తాజాగా 125 సీసీ కమ్యూటర్ మోటార్ సైకిల్ విభాగాన్ని కొత్త ‘గ్లామర్ ఎక్స్‘ బైకును విడుదల చేయడంతో ముందుకు కదిలించింది. ఈ బైక్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా?, అయితే ఈ కథనం మీకోసమే..

ధర & వేరియంట్స్

ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త ‘హీరో గ్లామర్ ఎక్స్’ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి డ్రమ్ వేరియంట్, డిస్క్ వేరియంట్. వీటి ధరలు వరుసగా రూ. 89,999 & రూ. 99,999 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). అయితే కంపెనీ ఈ బైకులో మొదటిసారిగా క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఇది బైకులో చెప్పుకోదగ్గ పెద్ద అప్డేట్.

➤హీరో గ్లామర్ ఎక్స్ డ్రమ్ వేరియంట్: రూ. 89,999
➤హీరో గ్లామర్ ఎక్స్ డిస్క్ వేరియంట్: రూ. 99,999

క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ అనేది టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310, కేటీఎమ్ 390 డ్యూక్ లేదా పెద్ద ప్రీమియం బైకులలో మాత్రమే కనిపించేది. కానీ హీరో మోటోకార్ప్ మొదటిసారిగా ఈ ఫీచర్‌ను తన ‘గ్లామర్ ఎక్స్’లో అందిస్తోంది. ఈ ఫీచర్ టోగుల్ వేగాన్ని సెట్ చేయడానికి, రీసెట్ చేయడానికి ఉపయోగపడుతుంది.

డిజైన్, ఫీచర్స్ & కలర్ ఆప్షన్స్

గ్లామర్ ఎక్స్ బైక్ ముందు, వెనుక భాగంలో ఎల్ఈడీ సెటప్ ఉంటుంది. ఇందులో హెచ్ షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్ ఉండటం గమనించవచ్చు. సింపుల్ అండ్ షార్ప్ ట్యాంక్ ష్రౌడ్‌లు.. బాడీ ప్యానెల్స్ ఉన్నాయి.

కొత్త గ్లామర్ ఎక్స్ బైకు కలర్ ఎల్‌సీడీ డాష్ బోర్డు పొందుతుంది. ఇందులో గేర్ షిఫ్ట్ ఇండికేటర్లు, బ్లూటూత్ కనెక్టివిటీ, బ్రైట్‌నెస్ అడ్జస్ట్‌మెంట్, టర్న్ బై టర్న్ న్యావిగేషన్ వంటి ఫీచర్స్ చూడవచ్చు. యూఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇందులో లభిస్తుంది. ఎకో, రోడ్, పవర్ అనే మూడు రైడింగ్ మోడ్స్ కలిగిన ఈ బైక్.. హీరో పానిక్ బ్రేక్ అలర్ట్ అనే ఫీచర్ కూడా పొందుతుంది. ఇది ఎమర్జెన్సీ బ్రేకింగ్ పరిస్థితుల్లో రియర్ ఇండికేటర్లను ప్లాష్ చేస్తుంది.

హీరో గ్లామర్ ఎక్స్ మొత్తం ఐదు రంగులలో లభిస్తుంది. డ్రమ్ వేరియంట్ మాట్టే మాగ్నెటిక్ సిల్వర్, కంది బ్లేజింగ్ రెడ్ అనే రంగులలో.. డిస్క్ వేరియంట్ మెటాలిక్ నెక్సస్ బ్లూ, బ్లాక్ టెల్ బ్లూ, బ్లాక్ పెర్ల్ రెడ్ రంగులలో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయని స్పష్టమవుతోంది.

ఇంజిన్ ఆప్షన్

హీరో గ్లామర్ ఎక్స్ 124.7 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 8250 rpm వద్ద 11.40 Bhp పవర్, 6500 rpm వద్ద 10.5 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో 5 స్టెప్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్స్ ఉన్నాయి. 18 ఇంచెస్ ట్యూబ్‌లెస్ వీల్స్ కలిగిన ఈ గ్లామర్ ఎక్స్ 170 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. మొత్తం మీద ఈ బైక్ దాని మునుపటి స్టాండర్డ్ వేరియంట్ కంటే కూడా చాలా అప్డేట్స్ పొందింది. అయితే ధర కూడా కొంత ఎక్కువే. పర్ఫామెన్స్ కూడా ఉత్తమంగా ఉంటుందని భావిస్తున్నాము.

రాహుల్ సిప్లిగంజ్‌కు కాబోయే భార్య: హరిణ్య రెడ్డి బ్యాగ్రౌండ్ తెలుసా?

0

కష్టపడితే ఎవరైనా సక్సెస్ సాధించవచ్చు. నిజానికి ఈ మాట చెప్పడానికి చాలా సులభంగా ఉన్నప్పటికీ సాధించడం చాలా కష్టంతో కూడుకున్న పని. అహర్నిశలు శ్రమపడాలి. అప్పుడే విజయం వరిస్తుంది. ఇలాంటి కోవకు చెందినవారిలో పాటల రచయిత, ప్లేబ్యాక్ సింగర్ ‘రాహుల్ సిప్లిగంజ్‘ ఒకరు. ఈయన ఇటీవలే తన ప్రేయసితో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో అధికారికంగా వెల్లడించారు. అయితే నెటిజన్లు మాత్రం రాహుల్ నిశ్చితార్థం చేసుకున్న యువతి ఎవరనే విషయం తెలుసుకోవడానికి అంతర్జాలంలో (ఇంటర్నెట్) తెగ వెతికేస్తున్నారు.

ఎవరీ హరిణ్య రెడ్డి?

రాహుల్ సిప్లిగంజ్ పెళ్లిచేసుకోబోయే యువతి పేరు.. ‘హరిణ్య రెడ్డి‘. ఈమె తెలుగుదేశం పార్టీ నేత, నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (నుడా) చైర్మన్ కోటంరెడ్డి శ్రేనివాసులు రెడ్డి అన్న కుమార్తె. అయితే రాజకీయాలకు దూరంగా ఉన్న.. హరిణ్య బిగ్‌బాస్ నిర్వహించే ఎండేమోల్ షైన్ ఇండియా అనే కంపెనీలో ప్రొడ్యూసర్ అని తెలుస్తోంది. హైదరాబాద్‌లో పుట్టిన ఈమె బీఏ మాస్ కమ్యూనికేషన్ ఇన్ జర్నలిజం పూర్తి చేసినట్లు సమాచారం. చదువు పూర్తయిన తరువాత ప్రొడ్యూసర్‌గా పనిచేస్తూ.. రాహుల్ సిప్లిగంజ్ రాసే పాటలకు నిర్మాతగా కూడా వ్యవరించినట్లు తెలుస్తోంది. అయితే వీరి ప్రేమ 2020 నుంచి మొదలైనట్లు.. ఎట్టకేలకు ఈ నెల 17న (2025 ఆగస్టు 17) కొంతమంది సన్నిహితులతో నిశ్చితార్థం చేసుకున్నారు.

రాహుల్ సిప్లిగంజ్ గురించి

రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాత ఎంత ప్రాచుర్యం పొందిందో అందరికీ తెలుసు. ఈ పాట రాసింది రాహుల్ సిప్లిగంజ్. ఈ పాటకు ఆస్కార్ అవార్డు దక్కడంతో.. సిప్లిగంజ్ పేరు మారుమ్రోగిపోయింది. ఈ ఘనతకు మెచ్చిన 2025 ఆగస్టు 15న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోటి రూపాయల చెక్కును అందించారు.

అక్కినేని నాగ చైతన్య నటించిన జోష్ సినిమాలో.. కాలేజీ బొల్లోడా పాటను అందించిన రాహుల్ సిప్లిగంజ్ అంచెలంచెలుగా ఎదిగారు. ఇటీవల విడుదలైన పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లుకు రాహుల్ సిప్లిగంజ్ ఏకంగా నాలుగు పాటలు అందించారు. పాటలు రాస్తూ, ప్లేబ్యాక్ సింగర్‌గా వ్యవరిస్తూ.. రంగ మార్తాండ వంటి సినిమాల్లో కూడా నటించారు. దీన్నిబట్టి చూస్తుంటే.. రాహుల్ ఏ స్థాయికి ఎదిగారో స్పష్టంగా అర్థమవుతోంది.

పెళ్లి ఎప్పుడు?

టాలీవుడ్ చిత్రసీమలో తనకంటూ.. ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ సిప్లిగంజ్ మొత్తానికి ఓ ఇంటివాడు కాబోతున్నాడు. త్వరలోనే హరిణ్య రెడ్డితో ఏడడుగులు నడువబోతున్నాడు. అయితే వీరి పెళ్లి ఎప్పుడు అనే మాట మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కానీ త్వరలోనే ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

రాహుల్ సిప్లిగంజ్ సోషల్ మీడియా పోస్ట్

నిశ్చితార్థం చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్ హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన వ్యక్తి. కాబోయే భార్య హరిణ్య రెడ్డితో ఉన్న ఫొటోలు షేర్ చేశారు. మా కొత్త ప్రయాణం ప్రారంభమవుతుందని చెబుతూ.. హరిణ్య చేతికి ఉంగరం తొడిగి, ముద్దాడిన ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక పెళ్లి కోసం వేచి చూస్తున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు.