Home Blog Page 89

ఆ గ్రామంలో హనుమంతుణ్ణి పూజించరు, మారుతి కార్లు వాడరు: ఆశ్చర్యపరిచే విషయాలు

0

చిన్న, పెద్ద, ముసలి, ముతక ఇలా అందరికి ఇష్టమైన దేవుడు ఎవరైనా ఉన్నారంటే.. అది తప్పకుండా రామదూత ‘హనుమాన్‘ అని చెబుతారు. యావత్ భారతదేశంలో దాదాపు అన్ని గ్రామాల్లోనూ ఆంజనేయస్వామి విగ్రహం లేదా గుడి తప్పకుండా ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ మన దేశంలోనే ఒక గ్రామంలో హనుమంతుని ఆలయం గానీ.. మారుతి కార్లు గాని లేవు. వినడానికి ఇది వింతగా అనిపించినా.. ఇది నిజం. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉంది?, అక్కడి ప్రజలు హనుమంతుణ్ణి, మారుతి కార్లను వద్దనుకోవడానికి గల కారణం ఏమిటనే విషయాలు ఈ కథనంలో చూసేద్దాం..

హనుమంతుణ్ణి పూజించరు

ఉత్తరప్రదేశ్‌లోని బిస్రాఖ్ అనే గ్రామంలో స్థానికులు రావణుడిని.. తమ పూర్వీకునిగా భావించి పూజలు చేస్తారు. అదేవిధంగా.. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఉండే ”నండూర్ నింబా దైత్య లేదా దైత్య నండూర్” అనే గ్రామంలో హనుమంతుణ్ణి పూజించరు. హనుమాన్ ఆలయాలు అసలే లేవు. అక్కడ పుట్టే పిల్లలకు కూడా అలంటి పేర్లు పెట్టరు. ఇంకా విచిత్రం ఏమిటంటే.. మారుతి కార్లను కూడా ఉపయోగించరు. మారుత్ అంటే గాలి, హనుమంతుడు వాయుదేవుని కుమారుడు కావడంతో.. మారుతి కార్లను కూడా ఇక్కడి ప్రజలు వాడటానికి ఇష్టపడరు.

అక్కడి ప్రజల నమ్మకం వెనుక ఉన్న పురాణం

స్థానిక పురాణాల ప్రకారం.. నింబ దైత్యునికి.. హనుమంతుని ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. నింబ దైత్యుడు రాక్షసుడు అయినప్పటికీ.. రామ భక్తుడని చెబుతారు. నింబ దైత్యుడు రాముణ్ణి వేడుకోవడం వల్ల.. ఆ గ్రామంలో ప్రధాన దేవతను రాముడే ఇచ్చాడని చెబుతారు. ఇక్కడి దేవుడు రాక్షసుడే అయినప్పటికీ.. ఎలాంటి జంతుబలులు ఉండవు. భయంకరమైన ఆచారాలను పాటించరు. గ్రామస్థుల ప్రతి ఇంట్లోనూ నింబ దైత్యుని విగ్రహం ఉంటుందని చెబుతారు.

మారుతి ప్రభావం

2000వ సంవత్సరంలో డాక్టర్ సుభాష్ దేశ్‌ముఖ్.. నండూర్ నింబ దైత్య గ్రామంలో వైద్యం చేస్తూ ఉండేవాడు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రోగులకు రోజంతా ట్రీట్మెంట్ చేస్తుండే వాడు. ఇలా రోజూ తన క్లినిక్ ముందు పెద్ద క్యూ ఉండేది. ఒక రోజు క్లినిక్ ముందర హఠాత్తుగా క్యూ మాయమైంది. దీనికి కారణం అక్కడే ఉన్న మారుతి 800 కారు అని కనుక్కున్నాడు. ఈ కారును అమ్మేసి టాటా సుమో కొనుక్కున్న తరువాత యధావిధిగా పేషంట్స్ రావడం మొదలుపెట్టారు.

స్థానికుల నమ్మకాల ప్రకారం.. కొన్ని రోజుల క్రితం నండూర్ నింబ దైత్య గ్రామంలో కార్మికుల బృందం మకాం వేసింది. ఒక రోజు రాత్రి అందులో ఒక కార్మికుడు అరవడం, ఇతరులను కొట్టడం ప్రారంభించాడు. అప్పుడు అక్కడికి స్థానికులు వెళ్లి దైత్య దేవాలయానికి తీసుకెళ్లి, ప్రార్థనలు చేసి నయం చేసారు. ఆ తరువాత అతని పేరు మారుతి అని ఉండటం వల్లనే ఇలా జరిగిందని చెప్పారు. ఇది మాత్రమే కాకుండా.. అక్కడి ప్రభుత్వ పాఠశాలలో నియమించబడిన మారుతి అనే ఇద్దరు ఉపాధ్యాయుల కథ కూడా ఉంది. మొత్తం మీద వారి నమ్మకాల మీద విశ్వాసంతో.. అక్కడి ప్రజలు ఆచారాలను పాటిస్తున్నారు.

రతన్ టాటా కల కలగానే మిగిలిపోతుందా?: నానో కారు విఫలం కావడానికి కారణం ఇదే

0

కారు కొనాలంటే కనీసం ఐదు లక్షలైనా ఉండాల్సిందే!.. కానీ ప్రతి కుటుంబానికి ఒక చిన్న కారు ఉండాలని, అది కూడా తక్కువ ధరలోనే అందించాలనే గొప్ప సంకల్పంతో.. దివంగత పారిశ్రామికవేత్త ‘రతన్ టాటా‘.. టాటా నానో కారుకు ఆజ్యం పోశారు. అనుకున్న విధంగా కారును మార్కెట్లో లాంచ్ చేశారు. కానీ కాలక్రమేనా.. కాలగర్భంలోనే కలిసిపోయింది. ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది.

టాటా నానో పుట్టుకకు కారణం

వర్షంలో స్కూటర్లపై ప్రయాణించే కుటుంబాలను చూసిన రతన్ టాటాకు.. నానో కారును లాంచ్ చేయాలనే ఆలోచన వచ్చింది. దీనిని కేవలం ఒక లక్ష రూపాయలకు అందించడం మొదలుపెట్టారు. ప్రారంభంలో.. అమ్మకాల్లో సంచలనం సృష్టించిన ఈ కారు ఎంతోమందిని ఆకట్టుకుంది. అప్పట్లో రోడ్డు మీద విరివిగా కనిపించేవి. మధ్యతరగతి కుటుంబాల కారు కొనాలనే కలను రతన్ టాటా నిజం చేశారు.

టాటా నానో కారు గురించి

నానో అనగానే చిన్న కారు అని అర్థమైపోతుంది. ఇది చూడటానికి సింపుల్‌గా ఉన్నప్పటికీ 624 సీసీ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 37 బీహెచ్‌పీ పవర్, 51 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసింది. ఇది ఫోర్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి మంచి పనితీరును అందించింది. ఆ తరువాత కాలంలో వచ్చిన నానో అప్డేటెడ్ మోడల్ 5 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చింది.

టాటా నానో 180 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉండటం వల్ల.. కొంత గతుకుల రోడ్డుపై కూడా సజావుగా వెళ్ళడానికి అనుమతిచ్చింది. బేర్ బోన్‌లు, ఎయిర్ కండిషనింగ్, పవర్ స్టీరింగ్ మరియు ఎయిర్‌బ్యాగ్‌లు బేస్ వేరియంట్లలో ఉండేవి కాదు. ఇవన్నీ టాప్ ఎండ్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉండేవి.

గేమ్ ఛేంజర్‌గా నానోకు ప్రశంసలు

2008లో న్యూఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో.. టాటా నానో అందరి దృష్టిని ఆకర్శించింది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లో ఇది గేమ్ ఛేంజర్‌గా ప్రశంసలు అందుకుంది. ప్రారంభంలో పశ్చిమ బెంగాల్‌లోని సింగూర్‌లో ఒక ప్లాంట్‎లో మాత్రమే నానో ఉత్పత్తి ప్రారంభమైంది. ఆ తరువాత.. గుజరాత్‌లోని సనంద్‌కు మకాం మార్చాల్సి వచ్చింది. ఇక్కడే 2019లో ఏడాదికి 2,50,000 యూనిట్ల ఉత్పత్తి జరిగింది. తరువాత ఉత్పత్తి కూడా క్రమంగా తగ్గిపోయింది. 2018 నాటికి నానో ఉత్పత్తి కేవలం ఒక యూనిట్‌కు తగ్గిపోయింది. దశాబ్దం తరువాత నానో పరుగు ముగిసింది.

టాటా నానో సక్సెస్ కాకపోవడానికి కారణం

నానో కారు మార్కెట్లో సక్సెస్ కాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత చౌకన కారుగా ఎంతో ఆదరణ పొందిన ఈ కారులో భద్రతా లోపాలు తలెత్తాయి. నానోను కేవలం పేదవాడి కారుగా భావించి.. కొందరు దీనిని కొనుగోలు చేయడానికి ఇష్టపడలేదు. ఉత్పత్తిలో కూడా ఆలస్యం ఏర్పడింది. మారుతి 800 కారు గట్టి పోటీ ఇచ్చింది. పెరుగుతున్న ఖర్చుల కారణంగా నానో కారు ధరను 2017లో రెండు లక్షలకు పెంచారు. ఇది నానో అమ్మకాలు పడిపోవడానికి ప్రధాన కారణమైంది. ఏది ఏమైనప్పటికీ.. ఇప్పటికి కూడా అక్కడక్కడా రోడ్డుమీద నానో కార్లు కనిపిస్తూనే ఉన్నాయి. నానో కారును ఎలక్ట్రిక్ రూపంలో తీసుకురావడం రతన్ టాటా కల. నానో ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ అవుతుందా? లేక రతన్ టాటా కల కలగానే మిగిలిపోతుందా అనేది తెలియాల్సి ఉంది.

పిఠాపురం మహిళలకు పవన్ కళ్యాణ్ కానుక: 10వేల మందికి..

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజక వర్గ ప్రజలకు సందర్భానుసారంగా కానుకలు ఇస్తూ ఉన్నారు. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన ప్రజలకు తన తోటలో పండిన మామిడి పళ్ళను అందించారు. అంతే కాకుండా చెప్పులు, దుప్పట్లు వంటివి కూడా పంచిపెట్టారు. ఇప్పుడు తాజాగా పిఠాపురం మహిళలకు చీరలు పంపిణీ చేయాలనీ సంకల్పించారు. దీనికి సంబంధించి ఒక ట్వీట్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

10వేల మందికి చీరలు

పిఠాపురం శాసనసభ సభ్యుడు పవన్ కళ్యాణ్.. శ్రావణమాసంలో చివరి శుక్రవారం నాడు పాదగయ క్షేత్రంలోని ఉమా కుక్కుటేశ్వర స్వామి, పురుహూతిక అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం పూజలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో 10 వేలమంది ఆడపడుచులకు చీర, పసుపు, కుంకుమలు అందించనున్నారు. అమ్మవారి ఆలయంలో పూజను ఐదు సార్లు లేదా ఐదు బ్యాచ్‌లలో చేయనున్నాడు. ఈ బ్యాచ్‌లకు అంబిక, భ్రమరాంబ, చాముండి, దుర్గ, ఈశ్వరి అని పేర్లు పెట్టారు.

పూజ టైమ్ స్లాట్

పురుహూతిక అమ్మవారి ఆలయంలో నిర్వహించే వరలక్ష్మి వ్రతం పూజలు ఉదయం ఐదు గంటల నుంచే ప్రారంభం కానుంది. ఈ కేటాయించిన టైమ్ ప్రకారం.. అంబిక బ్యాచ్ వరలక్ష్మి వ్రతం పూజ ఉదయం 5:00 గంటల నుంచి 6:30 గంటల వరకు, భ్రమరాంబిక బ్యాచ్ పూజ 6:30 గంటల నుంచి 8 గంటల వరకు, చాముండి బ్యాచ్ పూజ 8:00 గంటల నుంచి 9:30 గంటల వరకు, దుర్గ బ్యాచ్ పూజ 9:30 గంటల నుంచి 11:00 గంటల వరకు, ఈశ్వరి బృందం పూజ 11:00 గంటల నుంచి 12:30 గంటల వరకు జరుగుతుంది.

➤అంబికా బ్యాచ్: ఉదయం 5:00 గంటల నుంచి 6:30 గంటల వరకు
➤భ్రమరాంబిక బ్యాచ్: ఉదయం 6:30 గంటల నుంచి 8 గంటల వరకు
➤చాముండి బ్యాచ్: ఉదయం 8:00 గంటల నుంచి 9:30 గంటల వరకు
➤దుర్గ బ్యాచ్: ఉదయం 9:30 గంటల నుంచి 11:00 గంటల వరకు

చీరలను ఎవరు పంపిణీ చేస్తారంటే?

వరలక్ష్మి వ్రతం పూజకు హాజరయ్యేవారికి మహిళలకు.. బ్యాచ్‌ల వారీగా టోకెన్స్ కూడా అందించడం జరుగుతుంది. ఈ టోకెన్స్ పంపిణీ రేపు (గురువారం) ప్రారంభమవుతుంది. ఈ టోకెన్స్ మీదనే మహిళలు హాజరుకావాల్సిన సమయం ఉంటుంది. ఆ సమయానికి పూజకు హాజరయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పూజకు కావలసిన అన్ని ఏర్పాట్లను సంబంధిత అధికారులు పూర్తి చేశారు. చీరలను దేవాలయ సిబ్బంది, పోలీసులు, జనసేన వాలంటీర్లు పంపిణీ చేయనున్నారు.

సినిమాల్లో పవన్ కళ్యాణ్ బిజీ

ఓ వైపు ఉపముఖ్యమంత్రి బాధ్యతలు నెరవేరుస్తూనే.. మరోవైపు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఎన్నికలు జరగడానికి ముందే.. మొదలు పెట్టిన సినిమాలను పవన్ కళ్యాణ్ పూర్తిచేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమాను పూర్తి చేశారు. ఇప్పుడు ఓజీ సినిమాలో నటిస్తున్నారు. ఇది పూర్తయిన తరువాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటించనున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే పవన్ కళ్యాణ్ సినిమాలు వేగంగా, వరుసగా రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాల తరువాత బహుశా ఈయన సినిమాలకు దూరమయ్యే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.

2026 మేడారం జాతర: తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన

0

ప్రపంచంలో అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన ‘మేడారం జాతర‘ వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరుగుతుంది. రాష్ట్రంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ జాతరకు దేశం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ సర్కార్ భారీ బడ్జెట్ కేటాయించినట్లు కీలక ప్రకటన చేసింది. ఈ ఏటా జాతరను మరింత గొప్పగా జరపాలని సంకల్పించింది.

మేడారం జాతరకు రూ.150 కోట్లు

తెలంగాణ కుంభమేళాగా పిలువబడే మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ. 150 కోట్లు కేటాయించినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. మేడారంలో శాశ్వత నిర్మాణాలు, రహదారులు, మంచినీటి వసతి, విద్యుత్ మరియు పారిశుధ్యం కోసం దీనిని కేటాయించనున్నట్లు సమాచారం. జాతరకు భారీ మొత్తంలో నిధులను కేటాయించడం పట్ల గిరిజన శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్.. సీఎం రేవంత్ రెడ్డికి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గిరిజనుల గౌరవానికి నిదర్శనం. మేడారం మహా జాతరకు ప్రభుత్వం రూ. 150 కోట్లు కేటాయించడం అనేది.. గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాల పట్ల నిబద్ధతను తెలియజేస్తుందని మంత్రి సీతక్క స్పష్టం చేసింది.

మేడారం జాతర

తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన మేడారం జాతరకు సుమారు కోటి మంది కంటే ఎక్కువ జనాభా హాజరవుతారని అంచనా. భారతదేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడే మహా కుంభమేళాకు లెక్కకు మించిన జనం హాజరవుతారు. కుంభమేళా తరువాత అత్యధిక జనాభా ఈ మేడారం జాతర లేదా తెలంగాణ కుంభమేళాకు హాజరవుతారు.

మేడారం జాతర విశేషాలు

తెలంగాణలోని ములుగు జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే గిరిజన జాతరను.. సమ్మక్క సారలమ్మ జాతర అని కూడా పిలుస్తారు. మొత్తం నాలుగు రోజులు నిర్వహించే ఈ జాతర మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండో రోజు చిలుకల గుట్టలో భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపైన ప్రతిష్టిస్తారు. దేవతలను గద్దెలపై ప్రతిష్టించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు.

ఇక మూడోరోజు అమ్మవారిని గద్దెలపై నిలుపుతారు. నాలుగవ రోజు లేదా చివరి రోజు సాయంత్రం దేవతలను యుద్ధ స్నానానికి తీసుకెళ్లారు. ఇక్కడ విశేషం ఏమిటంటే.. పూజారులు కూడా గిరిజనులే. జాతర సమయంలో భక్తులు తమ కోరికలను తీర్చమని అమ్మవారికి (సమ్మక్క, సారలమ్మ) బంగారం (బెల్లం) నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ జాతరకు కేవలం గిరిజనులు మాత్రమే కాకుండా.. ఇతర మతాలకు చెందినవారు కూడా పాల్గొంటారు.

1940 తరువాత

సాధారణంగా రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం జాతర.. 900 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. నిజానికి ఈ జాతరను 1940లలో చిలుకల గుట్టపైన గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు. ఆ తరువాత తెలంగాణ ప్రజలందరూ కలిసి జరుపుకోవడం ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా ప్రతి ఏటా జనం సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీంతో కొండా దిగి జాతరను జరుపుకోవాల్సి వచ్చింది. ఈ జాతరకు తెలంగాణ ప్రజలు మాత్రమే కాకుండా.. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా మొదలైన రాష్ట్రాల నుంచి కూడా విచ్చేస్తారు.

ఫలించిన నారా లోకేష్ కృషి: కేంద్రం వందల కోట్లు మంజూరు

విద్యార్థులు భవిష్యత్తు కోసం రాష్ట్ర విద్యాశాఖ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటూనే ఉంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో వివిధ శాఖల కేంద్రమంత్రులను కలిసి.. విద్యారంగాన్ని మరింత ప్రోత్సహించడానికి అదనపు నిధులు కావాలని కోరారు. మంత్రి ఢిల్లీ పర్యటనను ముగించుకుని వచ్చే సరికి కేంద్రం భారీ నిధులను మంజూరు చేసింది.

రూ.432.19 కోట్లు మంజూరు

మునుపెన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖకు కేంద్రం ఏకంగా రూ. 432.19 కోట్లు కేటాయించింది. సెకండరీ, సీనియర్ సెకండరీ పాఠశాలలు అభివృద్ధి చేయడానికి.. ఐసీటీ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, డిజిటల్ తరగతుల కోసం రూ. 167.46 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. డైట్ కళాశాలల అభివృద్ధికి కూడా నిధులు మంజూరు చేశారు. ఆదివాసీ విద్యార్థులు వసతి గృహాల కోసం రూ. 11 కోట్లు విడుదల చేయడం హర్షించదగ్గ విషయం.

కేంద్రమంత్రులను కలిసిన నారా లోకేష్

మంత్రి లోకేష్ చొరవతో.. రాష్ట్ర విద్యాశాఖను అభివృద్ధి చేయడానికి కేంద్రం కూడా ఆసక్తి చూపుతోంది. ఢిల్లీ పర్యటనలో పీయూష్ గోయల్, అశ్వని వైష్ణవ్, నితిన్ గడ్కరీ, నిర్మల సీతారామన్, సర్బానంద సోనావాల్, హర్దీప్ సింగ్ పూరీ, జేపీ నడ్డా, జైశంకర్ వంటి కేంద్ర మంత్రులను లోకేష్ కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి తమ సహకారం అందించాలని కోరారు.

రాష్ట్రంలో విద్యాశాఖ అభివృద్ధి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖ అభివృద్ధికి.. నారా లోకేష్ కీలక చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులకు నాణ్యమైన చదువును అందిస్తూ.. వారి అవసరాలకు కావలసినవన్నీ అందించడానికి కృషిని చేస్తున్నారు. పరీక్షలు, పరీక్ష ఫలితాల విషయంలో కూడా ఏ మాత్రం జాప్యం జరగకుండా ఉండటానికి తగిన ఏర్పాట్లు చేశారు.

సాగర తీరంలో ఏఐ సెంటర్

విశాఖపట్టణంలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డేటా సిటీ ఏర్పాటు కోసం కూడా.. నారా లోకేష్ ఢిల్లీ పెద్దలతో చర్చించారు. ఉపాధి కోసం యువత విదేశాలకు తరలివెళ్ళిపోతున్నారు. అలాంటి వారి కోసం సాఫ్ట్ స్కిల్స్‌లో ట్రైనింగ్ ఇవ్వడానికి ఏఐ సెంటర్, డేటా సిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి జైశంకర్‌కు విజ్ఞప్తి చేశారు. దీనికి తమ సహకారం ఉంటుందని జైశంకర్ పేర్కొన్నారు.

ఐదేళ్ల పాలనలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువతకు మాటిచ్చిన నారా లోకేష్.. దీనికి అనుగుణంగానే తగిన చర్యలు తీసుకుంటున్నారు. భవిష్యత్తులో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)కు ప్రాధాన్యత పెరుగుతుంది. కాబట్టి ఆ రంగంలో మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందాలంటే.. తప్పకుండా ఇందులో యువత నైపుణ్యం సంపాదించాలి. దీనికోసం ప్రత్యేకంగా ఏఐ సెంటర్ ఏర్పాటు చేయడానికి లోకేష్ సంకల్పించారు. మొత్తం మీద చెప్పింది చేయడానికి నారా లోకేష్ అహర్నిశలు కష్టపడుతున్నారు. రాష్ట్రాభివృద్ధికి తనవంతు కృషిచేస్తున్నారు.

ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్‌ను లోకేష్ శుభాకాంక్షలు

ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన సీపీ రాధాకృష్ణన్‌ను.. మంత్రి నారా లోకేష్ టీడీపీ ఎంపీలతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎపికైనందుకు శుభాకాంక్షలు తెలిపారు. పలు రాష్ట్రాలకు గవర్నర్ బాధ్యతలు చేపట్టి.. రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేసిన అనుభవం, దేశానికి సేవలు అందించడానికి ఉపయోగపడుతుందని లోకేష్ ప్రస్తావించారు.

2025 హీరో గ్లామర్ వచ్చేసింది: రూ.89999 ధర.. కొత్త ఫీచర్స్

0

భారతదేశంలో అతిపెద్ద టూవీలర్ తయారీ సంస్థగా ప్రసిద్ధి చెందిన ‘హీరో మోటోకార్ప్’ కొత్త బైకులను లాంచ్ చేస్తూ.. తన ఉనికిని నిరంతరం విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు తాజాగా 125 సీసీ కమ్యూటర్ మోటార్ సైకిల్ విభాగాన్ని కొత్త ‘గ్లామర్ ఎక్స్‘ బైకును విడుదల చేయడంతో ముందుకు కదిలించింది. ఈ బైక్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా?, అయితే ఈ కథనం మీకోసమే..

ధర & వేరియంట్స్

ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త ‘హీరో గ్లామర్ ఎక్స్’ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి డ్రమ్ వేరియంట్, డిస్క్ వేరియంట్. వీటి ధరలు వరుసగా రూ. 89,999 & రూ. 99,999 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). అయితే కంపెనీ ఈ బైకులో మొదటిసారిగా క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఇది బైకులో చెప్పుకోదగ్గ పెద్ద అప్డేట్.

➤హీరో గ్లామర్ ఎక్స్ డ్రమ్ వేరియంట్: రూ. 89,999
➤హీరో గ్లామర్ ఎక్స్ డిస్క్ వేరియంట్: రూ. 99,999

క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ అనేది టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310, కేటీఎమ్ 390 డ్యూక్ లేదా పెద్ద ప్రీమియం బైకులలో మాత్రమే కనిపించేది. కానీ హీరో మోటోకార్ప్ మొదటిసారిగా ఈ ఫీచర్‌ను తన ‘గ్లామర్ ఎక్స్’లో అందిస్తోంది. ఈ ఫీచర్ టోగుల్ వేగాన్ని సెట్ చేయడానికి, రీసెట్ చేయడానికి ఉపయోగపడుతుంది.

డిజైన్, ఫీచర్స్ & కలర్ ఆప్షన్స్

గ్లామర్ ఎక్స్ బైక్ ముందు, వెనుక భాగంలో ఎల్ఈడీ సెటప్ ఉంటుంది. ఇందులో హెచ్ షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్ ఉండటం గమనించవచ్చు. సింపుల్ అండ్ షార్ప్ ట్యాంక్ ష్రౌడ్‌లు.. బాడీ ప్యానెల్స్ ఉన్నాయి.

కొత్త గ్లామర్ ఎక్స్ బైకు కలర్ ఎల్‌సీడీ డాష్ బోర్డు పొందుతుంది. ఇందులో గేర్ షిఫ్ట్ ఇండికేటర్లు, బ్లూటూత్ కనెక్టివిటీ, బ్రైట్‌నెస్ అడ్జస్ట్‌మెంట్, టర్న్ బై టర్న్ న్యావిగేషన్ వంటి ఫీచర్స్ చూడవచ్చు. యూఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇందులో లభిస్తుంది. ఎకో, రోడ్, పవర్ అనే మూడు రైడింగ్ మోడ్స్ కలిగిన ఈ బైక్.. హీరో పానిక్ బ్రేక్ అలర్ట్ అనే ఫీచర్ కూడా పొందుతుంది. ఇది ఎమర్జెన్సీ బ్రేకింగ్ పరిస్థితుల్లో రియర్ ఇండికేటర్లను ప్లాష్ చేస్తుంది.

హీరో గ్లామర్ ఎక్స్ మొత్తం ఐదు రంగులలో లభిస్తుంది. డ్రమ్ వేరియంట్ మాట్టే మాగ్నెటిక్ సిల్వర్, కంది బ్లేజింగ్ రెడ్ అనే రంగులలో.. డిస్క్ వేరియంట్ మెటాలిక్ నెక్సస్ బ్లూ, బ్లాక్ టెల్ బ్లూ, బ్లాక్ పెర్ల్ రెడ్ రంగులలో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయని స్పష్టమవుతోంది.

ఇంజిన్ ఆప్షన్

హీరో గ్లామర్ ఎక్స్ 124.7 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 8250 rpm వద్ద 11.40 Bhp పవర్, 6500 rpm వద్ద 10.5 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో 5 స్టెప్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్స్ ఉన్నాయి. 18 ఇంచెస్ ట్యూబ్‌లెస్ వీల్స్ కలిగిన ఈ గ్లామర్ ఎక్స్ 170 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. మొత్తం మీద ఈ బైక్ దాని మునుపటి స్టాండర్డ్ వేరియంట్ కంటే కూడా చాలా అప్డేట్స్ పొందింది. అయితే ధర కూడా కొంత ఎక్కువే. పర్ఫామెన్స్ కూడా ఉత్తమంగా ఉంటుందని భావిస్తున్నాము.