Home Blog Page 124

శ్రియాతో.. రామ్ చరణ్ ఫస్ట్ సీన్: అప్పుడెలా చేసారో తెలుసా?

ఈ రోజు గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్ గురించి అందరికి తెలుసు. అయితే ఒకప్పుడు యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న.. డైలాగ్స్ చెప్పడంలో ఇబ్బంది పడిన రామ్ చరణ్ గురించి బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు. అయితే దీనికి సంబంధించిన వీడియోను సదరు ఆ యాక్టింగ్ స్కూల్ యాజమాన్యం రిలీజ్ చేసింది.

శ్రియాతో లవ్ సీన్!

నిజం చెప్పాలంటే.. మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ్ 2007లో చిరుత సినిమాలో తెరమీదకు వచ్చారు. అంతకంటే ముందు.. సినిమాల్లోకి అడుగుపెట్టడానికి.. యాక్టింగ్ బాగా నేర్చుకోవడానికి ముంబైలోని కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు. ఇక్కడ చాలామంది బాలీవుడ్ ప్రముఖులు కూడా యాక్టింగ్ నేర్చుకున్నారు. అయితే ఆ యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నప్పుడు.. నటి శ్రియాతో ఒక లవ్ సీన్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో రామ్ చరణ్ చాలా కొంత ఇబ్బందిపడినట్లు.. ఇన్‌స్టిట్యూట్ కోచ్ పేర్కొన్నారు. దీనికి కారణం చరణ్ కెమెరా ముందు నటించడం అదే మొదటిసారి.

వీడియోలో నటి శ్రియ కూడా కనిపించారు. ఆమెలో ఎలాంటి బిడియం లేదు. ఎందుకంటే అప్పటికే ఆమె సౌత్ ఇండియన్ పాపులర్ హీరోయిన్లలో ఒకరుగా ఉన్నారు. ఈమె 2001లోనే ఇష్టం అనే సినిమాతో సినిమా అరంగేట్రం చేసింది. అయినప్పటికీ యాక్టింగ్ఇంకా మెరుగుపరచుకోవాలనే ఉద్దేశ్యంతో శ్రియ కూడా యాక్టింగ్ స్కూల్లో చేరారు. అలాంటి సమయంలో శ్రియ, రామ్ చరణ్ మధ్య ఈ సన్నివేశం చిత్రీకరించారు.

హార్స్ రైడింగ్ & డ్యాన్స్

ఇకపోతే రామ్ చరణ్ కేవలం యాక్టింగ్ మాత్రమే కాకుండా.. హార్స్ రైడింగ్, డ్యాన్స్ వంటి వాటిలో కూడా ప్రత్యేక శిక్షణ పొందారు. ఇవన్నీ కూడా తన సినిమా కెరియర్‌లో చాలా ఉపయోగపడ్డాయి. మొదటి సినిమా తరువాత చాలామంది.. రామ్ చరణ్ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలడా అని అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఈ రోజు గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. కష్టపడితే.. తప్పకుండా గుర్తింపు వస్తుంది అని చెప్పడానికి రామ్ చరణ్ నిదర్శనం.

రామ్ చరణ్ సినిమా ప్రయాణం

నటుడు రామ్ చరణ్.. చిరుత సినిమాతో తెరమీదకు వచ్చినప్పటికీ, మగధీర సినిమాతో తన జీవితంలోనే అతిపెద్ద సక్సెస్ చూసేసారు. ఆ తరువాత వచ్చిన సినిమాల్లో కూడా తనదైన రీతిలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. కాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో మరింత క్రేజ్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం పెద్ది సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు, గ్లిమ్స్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

రామ్ చరణ్, శ్రియ జంటగా నటించిన సినిమాలు లేదు, కానీ ఆర్ఆర్ఆర్ సినిమాలో మాత్రం చరణ్ తల్లిగా నటించారు. యాక్టింగ్ నేర్చుకుంటున్న సమయంలో చరణ్ జుట్టు పెంచి ఉండటం, గెడ్డం స్టైల్ అంత ఎలా ఉందో.. వీడియోలో చూడవచ్చు. అయితే ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ.. తండ్రికి తగ్గ తనయుడిగా ఎదిగారు. ఉపాసనను పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు క్లింకార అనే పాప కూడా ఉంది.

హైరైడర్ ఏరో ఎడిషన్.. దీపావళికి ముందే టయోటా స్పెషల్ కారు

దీపావళి పండుగ వచ్చేస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు కొత్త వాహనాలను లాంచ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే టయోటా కిర్లోస్కర్ మోటార్ కూడా.. అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఏరో పేరుతో ఓ స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఇది స్టాండర్డ్ మోడల్ కంటే కూడా కొంత భిన్నంగా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ధర వివరాలు

టయోటా లాంచ్ చేసిన కొత్త అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఏరో ఎడిషన్ ధర రూ. 10.94 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది సాధారణ కారుకు కొంత భిన్నంగా ఉంటుంది. దీనికోసం ఇది అనేక కాస్మొటిక్ అప్డేట్స్ పొందింది. దీని కోసం కంపెనీ 66 స్పెషల్ యాక్ససరీస్ కూడా అందిస్తోంది. అంతే కాకుండా కంపెనీ ఈ కారుపై 3 సంవత్సరాలు లేదా 1,00,000 కిమీ వారంటీ అందిస్తుంది. హైబ్రిడ్ బ్యాటరీపై 8 ఏళ్లు లేదా 1,60,000 వారంటీ అందిస్తుంది.

డిజైన్ వివరాలు & కలర్ ఆప్షన్స్

పేరుకు తగిన విధంగానే.. టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఏరో ఎడిషన్.. స్పెషల్ స్టైలింగ్ ప్యాకేజీతో ఫ్రంట్ స్పాయిలర్, రియర్ స్పాయిలర్, సైడ్ స్కర్ట్‌లు పొందుతుంది. కంపెనీ ఈ కారు కోసం అందించే యాక్ససరీస్ కోసం అదనంగా రూ. 31999 వెచ్చించాల్సి ఉంటుంది. కాగా ఇది వైట్, సిల్వర్, బ్లాక్, రెడ్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఫీచర్స్ గురించి

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఏరో ఎడిషన్.. క్రిస్టల్ యాక్రిలిక్ గ్రిల్, సిగ్నేచర్ ట్విన్ ఎల్ఈడీ డీఆర్ఎల్, స్టైలిష్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ వంటివి పొందుతుంది. లోపలి భాగంలో.. వెంటిలేటెడ్ లెదర్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్, 360 డిగ్రీ కెమెరా వంటి వాటితో పాటు.. రిక్లైనింగ్ సీట్లు, ఏసీ వెంట్స్, యూఎస్బీ ఛార్జింగ్, ఫ్లెక్సిబుల్ 60:40 స్ప్లిట్ రియర్ సీటు వంటివన్నీ కూడా ఉన్నాయి.

ఇంజిన్ డీటైల్స్

హైరైడర్ సెల్ఫ్ ఛార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో వస్తుంది. ఈ కారు 27.97 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇందులోని 1.5 లీటర్ కే సిరీస్ ఇంజిన్.. ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఇది 2 వీల్ డ్రైవ్, 4 వీల్ డ్రైవ్ అనే ఆప్షన్స్ పొందటం మాత్రమే కాకుండా 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో వస్తుంది.

టయోటా హైరైడర్ గురించి

నిజానికి భారతదేశంలో 2022లో ప్రారంభమైన అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ప్రారంభం నుంచి మంచి అమ్మకాలను పొందుతోంది. ఇది ఇటీవలే 1,68,000 యూనిట్లను అధిగమించింది. అంటే అంతమంది ఈ కారును కొనుగోలు చేశారన్నమాట. అయితే ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త ఏరో ఎడిషన్.. స్టాండర్డ్ మోడల్ కంటే కూడా అద్భుతంగా ఉండటం చేత.. పండుగ సమయంలో మరిన్ని గొప్ప అమ్మకాలు పొందే అవకాశం ఉందని భావిస్తున్నాము. ఈ కారు రోజువారీ వినియోగానికి, నగర ప్రయాణానికి, లాంగ్ డ్రైవ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద ఈ కొత్త ఎడిషన్.. టయోటా అమ్మకాలను తప్పకుండా మెరుగు పరుస్తుందని భావిస్తున్నాము.

ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్.. 2570 పోస్టులు: ఇదిగో పూర్తి వివరాలు

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ).. 2,570 జూనియర్ ఇంజినీర్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే ఈ ఉద్యోగానికి కావలసిన అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, జీతం వివరాలు మొదలైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ & వయోపరిమితి

ఆర్ఆర్‌బీ విడుదల చేసిన.. జూనియర్ ఇంజినీర్ పోస్టులకు ఈ నెల 31 నుంచి (2025 అక్టోబర్ 31) నుంచి అప్లై చేసుకోవచ్చు. అయితే అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 2025 నవంబర్ 30 అని తెలుస్తోంది. అంటే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి.. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఏకంగా నెల రోజుల సమయం కల్పించిందన్నమాట.

వయోపరిమితి విషయానికి వస్తే.. కనిష్ట వయసు 18 సంవత్సరాలు, గరిష్టంగా 33 సంవత్సరాలు అన్నట్లు ఆర్ఆర్‌బీ స్పష్టం చేసింది. 2026 జనవరి 1 నాటికి 33 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉండకూడదు. ఈ విషయాన్ని దరఖాస్తుదారులు తప్పకుండా గుర్తుంచుకోవాలి.

విద్యార్హత వివరాలు & ఎంపిక విధానం

సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో బీఈ లేదా బీటెక్, డిప్లొమో వంటివి పూర్తి చేసి ఉండాలి. ఆర్ఆర్‌బీ జూనియర్ ఇంజినీర్స్ ఉద్యోగాల భర్తీ నాలుగు దశలలో జరుగుతుంది. అవి ఫస్ట్ స్టేజి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (స్క్రీనింగ్ టెస్ట్), సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (మెరిట్ టెస్ట్), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ చెకింగ్. ఇలా నాలుగు దశల్లో పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.

పరీక్ష విధానం

ఆర్ఆర్‌బీ జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలకు రెండు దశల్లో (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) పరీక్షలు జరుగుతాయి. నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పుకు 1/3 నెగెటివ్ మార్కులు ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు ఖచ్చితంగా సమాధానం తెలిసిన ప్రశ్నలకు మాత్రమే ఆన్సర్ ఇవ్వడం మంచిది.

ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ స్క్రీనింగ్ టెస్ట్: ఈ పరీక్షకు 90 నిమిషాల వ్యవధి ఉంటుంది. 100 ప్రశ్నలు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో గణితం నుంచి 30 ప్రశ్నలు (30 మార్కులు), జనరల్ సైన్స్ నుంచి 30 ప్రశ్నలు (30 మార్కులు), జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలు (25 మార్కులు), జనరల్ అవేర్నెస్ నుంచి 15 ప్రశ్నలు (15 మార్కులు) ఇలా మొత్తం 100 ప్రశ్నలు.. 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.

సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్: రెండో దశలో పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. వ్యవధి 120 నిమిషాలు. దివ్యాంగులకు 160 నిమిషాల వ్యవధి కల్పిస్తారు. ఇందులో టెక్నికల్ ఎబిలిటీస్ నుంచి 100 ప్రశ్నలు, బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్ నుంచి 10 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్ నుంచి 15 ప్రశ్నలు, భౌతిక & రసాయన శాస్త్రాల నుంచి 15 ప్రశ్నలు, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ నుంచి 10 ప్రశ్నలు.. ఇలా మొత్తం 150 ప్రశ్నలు (150 మార్కులు) ఉంటాయి.

ఇలా సిద్ధమవ్వండి

ఆర్ఆర్‌బీ ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుందా.. అని ఎదురు చూసేవారికి ఇది ఒక మంచి శుభవార్త. ఈసారి 2570 పోస్టులు ఉన్నాయి, కాబట్టి కొంచెం పట్టుదలతో ప్రిపేర్ అయితే.. తప్పకుండా ఉద్యోగం మీ సొంతం అవుతుంది. అయితే సిలబస్ చూసుకుంటూ.. ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి, దీనికి ఎక్కువ సమయం కేటాయించాలి అనే విషయం తెలుసుకుని పరీక్షకు సిద్ధమవ్వాలి. అభ్యర్థులు ఈ విషయాన్ని తప్పకుండా గమనించాలి. అప్పుడే ఉద్యోగం సంపాదించుకోగలరు.

మొన్న తండ్రికి కారు గిఫ్ట్: ఇప్పుడు కొత్తింట్లో అడుగుపెట్టిన యాంకర్ లాస్య

0

మనిషి బతకడానికి కూడు, గుడ్డ, గూడు ముఖ్యం అంటారు. చాలామంది తమ జీవితంలో సొంతిల్లు కలిగి ఉండాలని కలలు కంటారు. వాటిని కొందరు నిజం చేసుకుంటారు. మరికొందరికి ఆ కల.. కలగానే మిగిలిపోతుంది. అయితే తాజాగా యాంకర్ లాస్య కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

లాస్య గృహప్రవేశం

ప్రముఖ తెలుగు యాంకర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్.. లాస్య తన భర్త మంజునాథ్‌తో కలిసి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. ఈ గృహ ప్రవేశ వేడుకకు.. కొందరు సీరియల్ యాక్టర్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ హాజరయ్యారు. ఇందులో దేత్తడి హారిక, నయని పావని, గీతూ రాయల్, నోయల్, బంచిక్ బబ్లూ మొదలైనవారు ఉన్నారు.

నోయల్ ఇన్‌స్టా పోస్ట్ & లాస్య రిప్లై

లాస్య కొత్త ఇల్లు గృహ ప్రవేశానికి సంబంధించిన ఫోటోలను.. నోయెల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ.. ”నోయెల్, నా కొత్త ఇంటిని చూసి నువ్వు అసూయపడతావు! అని లాస్య చెప్పారు. నేను ఖచ్చితంగా జలసీగా ఫీల్ అవుతాను. దేవుడు మీకు అందమైన ఇల్లు కట్టుకునేలా ఆశీర్వదించారు. మీ జంటకు (లాస్య, మంజునాథ్) అభినందనలు అంటూ పేర్కొన్నారు. దీనికి లాస్య రిప్లై ఇస్తూ.. ”నువ్వు ఇలా అంటావని నాకు తెలుసు నోయెల్. కానీ నిజం చెప్పాలంటే.. నీ లాంటి స్నేహితులు ఉండటం అదృష్టం” అని పేర్కొన్నారు. ఇది చూసిన నెటిజన్లు లాస్య ఫ్యామిలీకి శుభాకాంక్షలు చెబుతున్నారు.

సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోవర్స్

తెలుగు టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా.. పరిచయమైన లాస్య తరువాత బాగా పాపులర్ అయింది. మంజునాథ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తరువాత కెరియర్‌కు కొంత గ్యాప్ ఇచ్చింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన జీవితంలో జరిగే.. దాదాపు అన్ని కార్యక్రమాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంది. ఈమెకు ఇన్‌స్టాలో 1.5 మిలియన్ కంటే ఎక్కువ ఫాలోవర్స్, కాగా యూట్యూబ్‌లో 1.9 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు.

యాంకర్ లాస్య బిగ్‌బాస్ సీజన్ 4లో పాల్గొంది. ఆ సమయంలో దేత్తడి హారిక, నోయల్ వంటి వారితో స్నేహం ఏర్పడింది. లాస్య బుల్లితెర మీద మాత్రమే కాకుండా.. రాజా మీరు కేక, ఎంమ్మెల్యే (మంచి లక్షణాలున్న అబ్బాయ్), స్వాతి ఐ లవ్ యూ వంటి సినిమాల్లో నటించి వెండి తెరపై కూడా కనిపించింది. అయితే ప్రస్తుతం భర్త.. తన ఇద్దరి పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతోంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరైంది.

తండ్రికి కారు గిఫ్ట్

గతంలో తన తల్లిదండ్రులకు కొత్త ఇల్లు కట్టించిన లాస్య.. నాలుగు నెలలకు ముందు ఫాదర్స్ డే సందర్భంగా, తన తండ్రికి టాటా ఆల్ట్రోజ్ కారును గిఫ్ట్ ఇచ్చింది. చిన్నప్పటి నుంచి నాన్న కారులో తిరిగితే చూడాలని కోరిక ఉండేదని, పెళ్లి తరువాత.. తాను (లాస్య) కొన్న కారుకి మా నన్నే ఈఎమ్ఐ కట్టారని చెప్పింది. ఇప్పుడు మా నాన్నకు కారు కొనివ్వడం నాకు చాలా ఆనందంగా ఉందని కూడా ఆమె పేర్కొన్నారు.

దీపావళి ఆఫర్.. కారు కొనుగోలుపై రూ.3 లక్షల డిస్కౌంట్: పూర్తి వివరాలు

విజయదశమి ముగిసింది.. దీపావళి వస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు ఎంపిక చేసిన కొన్ని కార్ల మీద భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. ఇందులో మహీంద్రా, స్కోడా, మారుతి సుజుకి, వోక్స్‌వ్యాగన్, కియా మోటార్స్, హోండా మొదలైన కంపెనీలు ఉన్నాయి. ఈ కథనంలో ఏ కంపెనీ.. ఏ కారుపై.. ఎంత డిస్కౌంట్ అందిస్తుందని విషయాన్ని వివరంగా తెలుసుకుందాం.

మహీంద్రా మరాజో, ఎక్స్‌యూవీ400

దేశీయ కార్ల తయారీ సంస్థ.. మహీంద్రా అండ్ మహీంద్రా తన మరాజో కారు కొనుగోలుపై గరిష్టంగా రూ. 3 లక్షల డిస్కౌంట్ అందిస్తోంది. ఈ కారు 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ ద్వారా.. 120 హార్స్ పవర్, 300 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ కారు ధర మార్కెట్లో 14.05 లక్షల నుంచి రూ. 16.37 లక్షల వరకు ఉంటుంది. ఇది 7 సీటర్ లేదా 8 సీటర్ ఎంపికలతో అందుబాటులో ఉంది.

ఇక ఎక్స్‌యూవీ400 విషయానికి వస్తే.. దీనిపై కంపెనీ రూ. 2.5 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తుంది. ఇది 34.5 కిలోవాట్, 39.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో అందుబాటులో ఉంది. ఇది వరుసగా 375 కిమీ రేంజ్, 456 కిమీ రేంజ్ అందిస్తాయి. ఈ ఎలక్ట్రిక్ కారు ధరలు రూ. 15.49 లక్షల నుంచి రూ. 17.49 లక్షల మధ్య ఉంటుంది.

స్కోడా కుషాక్, స్లావియా

చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ.. స్కోడా కూడా తన కుషాక్ కారుపైన రూ. 2.5 లక్షలు, స్లావియాపై రూ. 2.25 లక్షలు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ అఫర్ పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కుషాక్ ధరలు రూ. 10.61 లక్షల నుంచి రూ. 17.43 లక్షల మధ్య ఉన్నాయి. స్లావియా ధరలు రూ. 9.99 లక్షల నుంచి రూ. 17.69 లక్షల మధ్యలో ఉన్నాయి.

వోక్స్‌వ్యాగన్ టైగన్, వర్టస్

భారతదేశంలో అధిక ప్రజాదరణ పొందిన జర్మన్ కార్ల తయారీ సంస్థ.. వోక్స్‌వ్యాగన్ కూడా తన టైగన్, వర్టస్ కార్లపై వరుసగా రూ. 1.8 లక్షలు, రూ. 1.5 లక్షలు డిస్కౌంట్ ప్రకటించింది. ఇండియన్ మార్కెట్లో టైగన్ ధర రూ. 11.39 లక్షల నుంచి రూ. 19.14 లక్షల మధ్యలో ఉంది. ఇక వర్టస్ ధరలు రూ. 11.16 లక్షల నుంచి రూ. 18.73 లక్షల మధ్య ఉన్నాయి. ఇది 1.0 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఎంపికలతో అందుబాటులో ఉంది.

కియా సెల్టోస్, కారెన్స్ క్లావిస్, సిరోస్

సౌత్ కొరియన్ కార్ల తయారీ సంస్థ అయిన కియా మోటార్స్ కూడా ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్న తన సిరోస్ కారుపై రూ. 1.6 లక్షలు, సెల్టోస్ కారుపై రూ. 1.47 లక్షలు, కారెన్స్ క్లావిస్ కారుపై రూ. 1.41 లక్షలు తగ్గింపు ప్రకటించింది. నిజానికి ఈ కార్లు ధరలు దేశీయ విఫణిలో రూ. 11.07 లక్షల నుంచి రూ. 20.71 లక్షలు (కియా కారెన్స్ క్లావిస్), రూ. 10.79 లక్షల నుంచి రూ. 19.8 లక్షలు (కియా సెల్టోస్), రూ. 9.82 లక్షల నుంచి రూ. 15.93 లక్షల (కియా సిరోస్) మధ్య ఉన్నాయి.

డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ అనేవి నగరాన్ని బట్టి మారే అవకాశం ఉంటుంది. కాబట్టి కచ్చితమైన డిస్కౌంట్ గురించి తెలుసుకోబడానికి సమీపంలోని కంపెనీ అధీకృత డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవడం మంచిది.

30 ఏళ్ల వయసులో.. రూ.95 లక్షల కారుకొన్న హీరోయిన్

సెలబ్రిటీలు లగ్జరీ కార్లు కొనుగోలు చేయడం సర్వసాధారణం అయిపోయింది. మొన్నబాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు రూ. 2 కోట్ల కంటే ఎక్కువ ఖరీదైన లెక్సస్ కారును కొనుగోలు చేశారు. ఇప్పుడు మలయాళీ నటి ఆహానా కృష్ణ జర్మన్ లగ్జరీ కారును కొనుగోలు చేసింది. ఈ కారు ధర రూ. 95 లక్షల నుంచి రూ. 1 కోటి మధ్యలో ఉందని సమాచారం.

ఆహానా కృష్ణ కొత్త కారు

మలయాళీ నటి అహానా కృష్ణ కొనుగోలు చేసిన కారు బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన ఎక్స్5. దీని ధర ఇండియన్ మార్కెట్లో రూ. 95 లక్షల నుంచి రూ. 1 కోటి (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుందని సమాచారం. ఆన్ రోడ్ ధర ఇంకా కొంచెం ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా ఆమె ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేసింది.

అహానా ఇన్‌స్టా పోస్ట్

ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన కొత్త కారు ఫోటోలను షేర్ చేస్తూ.. 20 ఏళ్లు దాటి 30 ఏళ్లలోకి అడుగుపెడుతున్నాను. వయసు పెరుగుతుందని కొంత బాధగా ఉంది. అయితే పుట్టిన రోజు సందర్భంగా ఓ గిఫ్ట్ దొరికిందని అన్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ కారును అహానా తన పుట్టిన రోజు (అక్టోబర్ 13) సందర్భంగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

అంతే కాకుండా.. ఏమి చేయాలో, ఏమి చేయకూడదో ఎప్పుడూ చెబుతూ ఉండే నా తల్లిదండ్రులకు ధన్యవాదాలు. నా నిబంధనల ప్రకారం నా జీవితాన్ని అన్వేషించడానికి.. అనుభవించడానికి నన్ను అనుమతించినందుకు, స్వేచ్ఛగా జీవించడానికి అనుమతి ఇచ్చినందుకు.. ప్రతిదానికీ మీరే కారణం, అంటూ పోస్ట్ చేసింది. అయితే కారు కొనడానికంటే ముందు.. ఏ కారు కొనాలి అనే విషయంలో నటుడు దుల్కర్ సల్మాన్ సలహా ఇచ్చినట్లు, ఆ తరువాతనే అహానా ఈ బీఎండబ్ల్యూ ఎక్స్5 కారును కొనుగోలు చేసినట్లు సమాచారం.

గృహప్రవేశం అనే సీరియల్ ద్వారా బుల్లితెరపై కనిపించిన అహానా కృష్ణ.. 2014లో ఎన్‌జెన్ స్టీవ్ లోఫెజ్ అనే సినిమాతో వెండితెరపై కనిపించింది. 2025 నాన్సీ రాణి, లోక చాప్టర్-1 అనే సినిమాల్లో కనిపించింది. అయితే ప్రస్తుతం ఏ సినిమాల్లోనూ నటించడం లేదని తెలుస్తోంది. అయితే త్వరలోనే మళ్ళీ తెరమీద కనిపించే అవకాశం ఉంది.

బీఎండబ్ల్యూ ఎక్స్5 గురించి

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బీఎండబ్ల్యూ కంపెనీ.. మార్కెట్లో సుమారు 20 నుంచి 24 మోడల్స్ విక్రయిస్తోంది. ఇందులో ఒకటి ఎక్స్5. దీని ఎక్స్-షోరూమ్ రేటు మనం ప్రారంభంలో చెప్పుకున్నట్లు సుమారు రూ. 1కోటి వరకు ఉంటుంది. ఆకట్టుకునే డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగిన ఈ కారు 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ టర్బో డీజిల్, పెట్రోల్ ఇంజిన్ అనే ఎంపికలతో అందుబాటులో ఉంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ పొందుతుంది. ఇది ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం పొందుతుంది.

సుమారు 645 లీటర్ల బూట్ స్పేస్ కలిగిన బీఎండబ్ల్యూ ఎక్స్5 కారు 80 లీటర్ల ఇంధన సామర్థ్యం కలిగి ఉంటుంది. మైలేజ్ కూడా ఉత్తమాంగానే ఉంటుంది. అయితే ధర కొంత ఎక్కువగా ఉండటం చేత దీనిని ధనవంతులు మాత్రమే కొనుగోలు చేస్తుంటారు. ఈ మోడల్ కారు నటి సమంత, నటుడు ప్రభాస్ కూడా కలిగి ఉన్నట్లు సమాచారం.

దీపికా పదుకొనే వివాదం: స్పందించిన స్మృతి ఇరానీ

0

గతంలో పనిగంటలపై ఇన్ఫోసిస్ నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలో సోషల్ మీడియాలో సంచనలం సృష్టించాయి. కొందరు దీనిని సమర్థిస్తే.. మరికొందరు విమర్శించారు. అయితే ఇది ఉద్యోగ రంగానికి చెందినది. కాబట్టి దీనిని పక్కన పెడితే.. ఇప్పుడు సినిమా రంగంలో కూడా పనిగంటలపై వివాదం తలెత్తింది. దీనికి కారణం దీపికా పదుకొనే రెండు పెద్ద సినిమా ప్రాజెక్టులను కోల్పోవడమే అని తెలుస్తోంది. దీనిపై తాజాగా మాజీ కేంద్రమంత్రి ‘స్మృతి ఇరానీ‘ స్పందించారు.

అది వ్యక్తిగత సమస్య

ఒకప్పుడు తెరపై కనిపించిన స్మృతి ఇరానీ చాలా రోజుల తరువాత క్యుంకీ సాస్ భీ కభీ బహు థి 2లో కనిపించనున్నారు. చాలాకాలం రాజకీయ నాయకురాలుగా పనిచేసిన తరువాత.. మళ్ళీ తులసి పాత్రలో తెరమీద కనిపించనున్నట్లు పేర్కొన్నారు. అయితే పనిగంటలపై వస్తున్న విమర్శలు, దీపికా పదుకొనే కోల్పోయిన రెండు భారీ ప్రాజెక్టులు ఆమె వ్యక్తిగత సమస్య అని పేర్కొన్నారు. దీనిపై ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

అప్పుడు నాకు ఇద్దరు పిల్లలు

నా వరకు.. నేను మాత్రం సీరియల్స్ లేదా సినిమాల్లో నటించేటప్పుడు నిర్మాత కోణంలోనే ఆలోచిస్తాను. నిర్మాత లాభం పొందాలనే ఉద్దేశ్యంతో.. అంకిత భావంతో పనిచేస్తానని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. అంతే కాకుండా.. నేను సీరియల్లో నటించే సమయంలో నాకు ఇద్దరు పిల్లలు. అయినా నిర్మాతలకు నష్టం కలిగించకూడదనే ఉద్దేశ్యంతో కష్టపని పనిచేశాను. సినిమాల్లో నటించడం, రాజకీయాల్లోకి వెళ్లడం, పిల్లల ఆలనా.. పాలన అన్నీ కూడా నా ఎంపికలు మాత్రమే. కాబట్టి వీటన్నింటిమీద ఒకేవిధమైన బాధ్యత చూపించాలి. అది నా బాధ్యత కూడా అని స్మృతి ఇరానీ వెల్లడించారు.

ఒక సినిమా లేదా సీరియల్ తెరకెక్కించడానికి ఎంతోమంది కష్టపడతారు. నిర్మాతలు ఎంతో డబ్బును వెచ్చిస్తారు. నటీ, నటులు కూడా వారికి తప్పకుండా సహకరించాలి. నేను ఒక రోజు షూటింగ్ క్యాన్సిల్ చేసుకుంటే.. నా కారణంగా ఆ రోజు ఎంతోమంది కార్మికులకు పనిలేకుండా పోతుంది. ఇది నిర్మాతకు మాత్రమే కాకుండా.. సినీ కార్మికులకు కూడా నష్టాన్ని కలిగిస్తుందని స్మృతి ఇరానీ పేర్కొన్నారు.

దీపికా పదుకొనే కోల్పోయిన ప్రాజెక్టులు

సినిమా రంగంలో అగ్రతారలలో ఒకరైన దీపికా పదుకొనే.. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా, వైజయంతీ మూవీస్ వారి కల్కి 2898 ఏడీ పార్ట్ 2 మూవీలలో అవకాశాలను కోల్పోయారు. దీనికి కారణం ఆమె పెట్టిన కండిషన్స్ అని తెలుస్తోంది. ఇందులో పనిగంటలు ప్రధాన సమస్య అని దర్శక, నిర్మాతలు చెబుతున్నారు.

చర్చించుకుంటే సరిపోయేదేమో!

ఒకరకంగా చూస్తే.. ఒక సినిమాపై భారీ మొత్తంలో డబ్బుపెట్టే నిర్మాతలు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత తప్పకుండా చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరి బాధ్యత. కొన్నిసార్లు షూటింగ్ ముందుగా అయిపోవచ్చు, కొన్నిసార్లు ఆలస్యం కూడా అవ్వొచ్చు. ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు.. చిత్ర బృందాలకు చర్చించుకుంటే సరిపోతుంది. ఆలా కాకుండా నేను రోజుకు ఇన్ని గంటలు మాత్రమే పనిచేస్తాను, అని చెప్పడం మాత్రం సమంజసం కాదేమో అనిపిస్తుంది.

ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే.. మహిళ అనగానే తప్పకుండా కొన్ని సమస్యలు ఉంటాయి. వాటిని ఎవరైనా అర్థం చేసుకోవాల్సిందే. ఒక స్త్రీ రోజుకు ఇన్ని గంటలు మాత్రమే పనిచేస్తాను అని చెప్పిందంటే.. దాని వెనుక ఉన్న కారణాన్ని గుర్తించాలి. కొన్నేళ్లుగా సినిమా రంగం కోసం పనిచేసిన దీపికా పదుకొనే.. అంతటి కథానాయకిని కేవలం కొన్ని కండిషన్స్ చూపించి పెద్ద ప్రాజెక్టులకు దూరం చేయడం మంచిది కాదేమో అనేది కొందరి అభిప్రాయం.

పండక్కి ముందే.. కొత్త టీవీఎస్ అడ్వెంచర్ బైక్ వచ్చేసింది: పూర్తి వివరాలివే..

ప్రముఖ వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్.. వాహన ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అపాచీ ఆర్‌టీఎక్స్ 300 బైకును దేశీయ విఫణిలో అధికారికంగా లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్.. ఇప్పటి వరకు ఉన్న ఇతర బైకుల కంటే కూడా ఇది కొంత భిన్నంగా ఉండటం చూడవచ్చు. ఈ సరికొత్త బైక్ గురించి పూర్తి వివరాలు.. ఇక్కడ తెలుసుకుందాం.

ఈ బైక్ రేటు ఎంతంటే?

టీవీఎస్ లాంచ్ చేసిన కొత్త అపాచీ ఆర్‌టీఎక్స్ 300 ప్రారంభ ధర రూ. 1.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీనిని కంపెనీ అడ్వెంచర్ టూరర్ విభాగంలో లాంచ్ చేసింది. అయితే ఇది కొత్త ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడి.. కేటీఎమ్ 250 అడ్వెంచర్, యెజ్డీ అడ్వెంచర్, రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 440 వంటి బైకులకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

ఇంజిన్ వివరాలు ఇవే

2025 అపాచీ ఆర్‌టీఎక్స్ 300 బైక్.. 299 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా 9000 ఆర్పీఎమ్ వద్ద 35.5 హార్స్ పవర్, 7000 ఆర్పీఎమ్ వద్ద 28.5 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 6 స్పీడ్ గేర్‌బాక్స్ కలిగిన ఈ బైక్ బై డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ కూడా పొందుతుంది. కాగా స్లిప్పర్ క్లచ్ అసిస్ట్ కూడా ఇందులో ఉంటుంది. ఇవన్నీ రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుందని స్పష్టమవుతోంది.

కొత్త డిజైన్ ఇలా..

సరికొత్త టీవీఎస్ అపాచీ ఆర్‌టీఎక్స్ 300 బైక్ స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్ అండ్ అల్యూమినియం డైకాస్ట్ స్వింగార్మ్‌పై ఆధారపడి ఉంటుంది. ఫ్యూయెల్ ట్యాంక్ పరిమాణంలో కొంత పెద్దదిగా ఉండటం చూడవచ్చు. సైడ్ ఫెండర్‌లు.. విండ్‌స్క్రీన్ వరకు విస్తరించి అనుసంధానించబడి ఉండటం చూడవచ్చు. బైక్ ముందు భాగంలో కన్ను ఆకారంలో ఉండే ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్ కనిపిస్తాయి. ఇషీ స్ప్లిట్ రియర్ సీటును పొందటమే కాకుండా అదనపు లగేజ్ కోసం లగేజ్ ర్యాక్ కూడా పొందుతుంది.

కలర్ ఆప్షన్స్ & ఫీచర్లు

వైపర్ గ్రీన్, టార్న్ బ్రాంజ్, మెటాలిక్ బ్లూ, లైట్నింగ్ బ్లాక్, పెర్ల్ వైట్ అనే ఐదు రంగులలో లభించే ఈ బైక్.. ఫుల్లీ కలర్ టీఎఫ్‌టీ డిస్ప్లే కలిగి స్పీడ్, కాల్ అండ్ ఎస్ఎమ్ఎస్ అలర్ట్, సెగ్మెంట్ ఫస్ట్ మ్యాప్ మిర్రరింగ్, గోప్రో కంట్రోల్ వంటి వివరాలను చూపిస్తుంది. ఈ బైక్ టూర్, ర్యాలీ, అర్బన్, రెయిన్ అనే నాలుగు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఇందులో ఉంటాయి.

టీవీఎస్ కొత్త అడ్వెంచర్ బైక్ లాంచ్‌పై మా అభిప్రాయం

నిజానికి టీవీఎస్ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త బైకులు లాంచ్ చేస్తూనే ఉంది. దేశం మొత్తం మీద ఎక్కువమంది టీవీఎస్ బైకులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు లాంచ్ చేసిన టీవీఎస్ అపాచీ ఆర్‌టీఎక్స్ 300 ఇప్పుడున్న బ్రాండ్ బైకుల కంటే కూడా చాలా భిన్నంగా ఉంది. ఇది తప్పకుండా బైక్ కొనుగోలుదారులను లేదా అడ్వెంచర్ చేయడానికి ఇష్టపడే వారిని ఆకట్టుకుంటుందని భావిస్తున్నాము. అయితే ఇది మార్కెట్లో ఎలాంటి అమ్మకాలను పొందుతుందో తెలుసుకోవాలంటే.. ఇంకా కొంతకాలం వేచి చూడాల్సిందే.

బెస్ట్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న సీరియల్ నటుడు

0

ప్రేమించడం సంతోషం.. ప్రేమించబటడం అదృష్టం అంటారు. ఏదైతే ఏం.. ప్రేమించినవాళ్లను పెళ్లిచేసుకోవడం అదృష్టం అంటుంటారు. అయితే ఇది అందరి జీవితంలో సాధ్యం కాకపోవచ్చు, కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. ఇందులో భాగంగానే ప్రముఖ బుల్లితెర నటుడు దర్శన్ కే రాజు తన బెస్ట్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఇన్‌స్టా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దర్శన్ రాజు & కాశిన్ పెళ్లి

తమిళ్ సీరియన్ యాక్టర్ దర్శన్.. తన బెస్ట్‌ఫ్రెండ్ కాశిన్ను పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి అక్టోబర్ 13న.. అతి తక్కువ మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. వైవాహిక బంధంలో కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన ఈ జంటకు నెటిజన్లు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

బుల్లితెర నటుడు దర్శన్ రాజు గురించి బహుశా తెలుగు ప్రజలకు తెలియకపోవచ్చు. ఎందుకంటే ఈయన తమిళ సీరియల్‌లలో నటించించారు. కట్రుకెన్న వేలి అనే సీరియర్ ద్వారా బాగా పాపులర్ అయిన దర్శన్.. అరణ్మనై కిలి, అవను మాతే శ్రావణి వంటి సీరియల్‌లలో కూడా కనిపించారు. సౌత్ ఇండియన్ హీరో అనే కన్నడ సినిమాలో ఇతడు హీరోగా కనిపించారు. అయితే ఇప్పుడు తన బెస్ట్‌ఫ్రెండ్ అయిన కాశిన్తో ఏడడుగులు వేశారు.

నెట్టింట్లో శుభాకాంక్షల వెల్లువ

మా లవ్‌బుల్ రాక్‌స్టార్ గార్జియస్ కాశిన్ పెళ్లి చేసుకున్నారు. మీ గ్రాండ్ వెడ్డింగ్‌కి ఇద్దరికీ శుభాకాంక్షలు, మీ ఇద్దరి ప్రపంచంలో అన్నీ మంచి జరగాలని కోరుకుంటున్నాను అంటూ.. దర్శన రాజు, కాశిన్ పెళ్ళికి సంబంధించిన ఫోటోలను దర్శన్ రాజు ఎక్స్‌ప్రెషన్ కింగ్ అనే ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో అటు నెటిజన్లు, ఇటు అభిమానులు ఈ జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతూ.. అభినందనలు తెలియజేస్తున్నారు.

స్నేహితులను పెళ్లి చేసుకున్న ఇతర సెలబ్రిటీలు

నిజానికి ప్రేమ అనేది.. స్నేహం నుంచే పుడుతుంది. మొదట మంచి స్నేహితులై.. ఆ తరువాత ప్రేమించుకోవడం అనేది సర్వసాధారణం. ప్రస్తుత కాలంలో జరుగుతున్న విషయమే. అయితే ఫ్రెండును పెళ్లిచేసుకున్నవారు గతంలో కూడా చాలామందే ఉన్నారు.

కొంతమంది టాలీవుడ్ హీరోలు.. తమతో కలిసి నటించిన నటీమణులనే పెళ్లిచేసుకున్నారు. ఈ జాబితాలో వరుణ్ తేజ్ & లావణ్య త్రిపాఠి, మహేష్ బాబు & నమ్రత, నాగార్జున & అమల, వరుణ్ సందేశ్ & వితిక, పవన్ కళ్యాణ్ & రేణూ దేశాయ్ మొదలైనవారు ఉన్నారు. వీరు కాకుండా అల్లు అర్జున్.. స్నేహ రెడ్డి ప్రారంభంలో మంచి స్నేహితులే. ఆ తరువాత పెళ్లి చేసుకున్నారు. రామ్ చరణ్ తేజ్ & ఉపాసన కూడా ఈ కోవకు చెందినవారే.

రిలయన్స్ అధినేత.. భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ రెండో తనయుడు అనంత్ అంబానీ కూడా తన చిన్ననాటి స్నేహితురాలు రాధికా మర్చంట్‌ను పెళ్లి చేసుకున్నారు. క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా.. నటి అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే.. స్నేహం నుంచి ప్రేమ.. ప్రేమ తరువాత పెళ్లి సర్వ సాధారణం అని స్పష్టంగా అర్థమవుతోంది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక… వీసీకే అభ్యర్థిగా తెలంగాణ శ్యామ్

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూశాక, ఆయన శాసనసభ స్థానానికి ఖాళీ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ ఆ సీటుని భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా నోటిఫికేషన్ జారిచేసింది. నవంబర్ పదకొండో తేదీ రోజున పోలింగ్ జరుగనున్నది. 21న అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తారు. 24న నామినేషన్ ఉపసంహారణ ఉంటుంది. 14న కౌంటింగ్ పనులను ప్రారంభిస్తారు. 16వ తేదీన ఎన్నికలు ప్రక్రియ మొత్తం పూర్తి అవుతుందని కమిషన్ ఇదివరకే ప్రకటన విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే.

బరిలోకి అభ్యర్థులు

ఈ ఎన్నికకు సంబంధించి ఆయా రాజకీయ పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ లంకల దీపక్ రెడ్డిని ఖరారు చేశారు.  ఇప్పటి వరకు త్రిముఖ పోరు అనుకుంటున్న తరుణంలో ప్రస్తుతం ఈ స్థానానికి అనూహ్యంగా విముక్త చిరుతల కక్షి (వీసీకే) తమ అభ్యర్థిని బరిలోకి దింపింది. వీసీకే పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జిలుకర శ్రీనివాస్ తమ అభ్యర్థిగా తెలంగాణ శ్యామ్ పేరును ప్రకటించారు.

శ్యామ్‌కు ఎమ్మెల్యే టికెట్

తెలంగాణ శ్యామ్ వీసీకే పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. రాజకీయంగా మరియు సామాజికంగా తెలంగాణలోనే కాకుండా దేశంలో జరిగే ప్రతి సమస్య మీద ఆయన త్వరితగతిన స్పందిస్తూ ఉంటారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా గానీ శ్యామ్ ఎప్పుడూ బాధితుల తరుపున పోరాడుతుంటారు. వారికి అన్ని వేళల అందుబాటులో ఉంటూ అండగా నిలబడటం ఆయన యొక్క సహజ లక్షణంగా చెబుతుంటారు. నిరంతరం ప్రజల పక్షం వహించే సామాజిక ఉద్యమకారుడు మరియు నిత్యం జనం పడే బాధలపట్ల సరైన అవగాహన, మంచి జ్ఞానం ఉన్న రాజకీయ నాయకుడు అయిన తెలంగాణ శ్యామ్‌కు జూబ్లీహిల్స్ టికెట్ కేటాయించడం నిజంగా హర్షించదగినదిగా అందరూ భావిస్తున్నారు. ఇంతకు ముందు వీసీకె నుంచి ఎంపీగా పోటీచేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఏ మేరకు ఫలితాలు సాధిస్తారో చూడాలంటే నవంబర్ 14 వరకు వేచిచూడాలి.

మార్వాడీ గోబ్యాక్ ఉద్యమానికి రూపకర్త

తెలంగాణలో ఉన్న స్థానిక వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, తరతరాలుగా చేతివృత్తి చేసుకుని బతికే పేద చిన్న చిన్న వ్యాపారస్థులు తీవ్రంగా నష్టపోతున్నారని.. వాళ్ల అందరి తరపున ఆయన మార్వాడీ గోబ్యాక్ ఉద్యమానికి శ్యామ్ శ్రీకారం చుట్టారు. తెలంగాణ వాసుల కట్టు, బొట్టు, తిండి, పండగలు, ఆచారాలు, సాంప్రదాయాలు, మాట్లాడే బాష, సంస్కృతి మొత్తం గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలనుంచి వచ్చిన మార్వాడిల కారణంగా నాశనం అవుతున్నదని, స్థానికంగా ఉన్న ప్రజలపైన దాడులకు పాల్పడుతున్నారని, వాళ్ళు చేసే ఇల్లీగల్ దందా వల్ల స్థానిక వ్యాపారులు దుకాణాలు ముసివేసే పరిస్థితులు వచ్చాయని వీటి నుంచి మాకు విముక్తి కావాలని ఆయన పోరాటం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన్ని పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తరువాత ఏ కేసు లేకుండా పూచికత్తుపై విడుదల చేశారు. అయితే ఇప్పటికి శ్యామ్ ఆ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.

అంబేద్కర్ భావజాలం

బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మ జ్యోతిరావు పూలే, గౌతమ బుద్ధుడు, అశోకుడు లాంటి వారి భావజాలంతో పనిచేసే వ్యక్తి శ్యామ్. అతనికి తగినట్టుగానే ఆయన ఎంచుకున్న పార్టీ కూడా.. తోల్ తిరుమావళవన్ (చిదంబరం ఎంపీ, తమిళనాడు) అంబేద్కర్, పెరియార్, కమ్యూనిస్ట్ భావజాలంతో వీసీకే పార్టీని స్థాపించారు. దళిత్ పాంతర్ మూమెంట్ నుంచి ఈ పార్టీ పుట్టింది. దానికి తగిన విధంగానే ఆ పార్టీ పనిచేస్తోంది.