Home Blog Page 125

చుక్కలు చూపిస్తున్న బంగారం, వెండి ధరలు: ఎందుకిలా జరుగుతోందంటే?

బంగారం ధరలు అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పటికే రూ. 1.20 లక్షలు దాటేసిన గోల్డ్ రేటు.. మరో వారం రోజుల్లో రూ. 1.30 లక్షలు దాటేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వెండి రేటు కూడా ఏ మాత్రం తగ్గకుండా ఏకంగా రూ. 2 లక్షలకు చేరుకుంటోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. పసిడి కొనుగోలు చేయడం చాలా కష్టమవుతుంది. డబ్బున్నవారికి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుందని స్పష్టంగా అర్థమవుతోంది.

ముందున్న పండుగలు

ఇప్పటికే నవరాత్రులు, విజయదశమి వంటివి ముగిశాయి. ఇక ధనత్రయోదశి, దీపావళి ముందున్నాయి. ధనత్రయోదశి సందర్బంగా చాలామంది బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటారు. ఇది ఒకప్పటి నుంచి ప్రజలలో ఒక సెంటిమెంట్ అయిపోయింది. ఈ రోజు బంగారం కొనుగోలు చేయడం వల్ల లక్ష్మి కటాక్షం లభిస్తుందని గట్టిగా విశ్వసిస్తారు. దీంతో కనీసం ఒక చిన్న బంగారు వస్తువైనా కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు.

ఇక దీపావళి విషయానికి వస్తే.. ఈ పండుగను చాలామంది గౌరీ వ్రతంగా, లక్ష్మీదేవి పూజగా భావిస్తారు. కాబట్టి ఈ సమయంలో బంగారం కొనుగోలు చేయడం మంచిదని, శుభం జరుగుతుందని నమ్ముతారు. ఇలాంటి నమ్మకాల వల్లనే బంగారం కొనుగోలు చేయడానికి ఎగబడతారు. దీంతో పసిడికి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగిందంటే.. కచ్చితంగా ధరలు పెరుగుతాయి.

బంగారం & వెండి ధరలు

భారతదేశంలో బంగారం ధరలు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఒక నెలరోజుల వ్యవధిలోనే గోల్డ్ రేటు ఊహకందని విధంగా పెరిగిపోయింది. దీనికి కారణాలు చాలానే ఉన్నప్పటికీ.. ప్రధాన కారణం మాత్రమే పసిడి కొనుగోలు చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోవడమే అని స్పష్టంగా అర్థమవుతోంది.

హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు ప్రాంతాల్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 125000 కంటే ఎక్కువ ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 115000 దాటేసింది. చెన్నై, ఢిల్లీలలో కూడా ఇంచుమించు ఇదే ధరలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 2024 అక్టోబర్ నెలలో రూ. 78000 వద్ద ఉన్న గోల్డ్ రేటు.. ఒక్క ఏడాదిలోనే ఇంతలా పెరిగిందంటే, బంగారంకు ఉన్న డిమాండును స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

వెండి ధరలు

బంగారం ధరలు పెరుగుదల చాలా రోజుల నుంచి వింటూనే ఉన్నాం. కానీ వెండి రేటు మాత్రం జీవితకాల గరిష్టాలను తాకింది. రోజుకి రూ. 7000 పెరుగుతూ కొనుగోలుదారుల గుండెల్లో గుబులు పుట్టించింది. అక్టోబర్ 2025 ప్రారంభం నుంచి.. ఇప్పటి వరకు ఒక కేజీ వెండి ధర రూ. 30000 కంటే ఎక్కువ పెరిగిపోయింది. దీంతో సిల్వర్ రేటు రూ. 2 లక్షల వద్దకు చేరింది. ఈ ధరలు ఇలాగే కొనసాగితే.. తప్పకుండా రేటు మరింత పెరుగుతుందని మార్కెట్ నిపుణులు, విశ్లేషకులు చెబుతున్నారు.

ధరలు ఇంతలా పెరగడానికి కారణం

బంగారం, వెండి ధరలు పెరగడానికి ప్రధాన కారణం.. ఇంతకు ముందు చెప్పుకున్నట్లు డిమాండ్ పెరిగిపోవడమే. స్టాక్ మార్కెట్లలో పెట్టే పెట్టుబడులు లాభాలనే కాదు.. ఊహకందని నష్టాలను తెచ్చిపెడతాయి. దీంతో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. ఈ మధ్యకాలంలో వెండిపై పెట్టె పెట్టుబడులు సంఖ్య కూడా పెరిగింది. ప్రస్తుతం పెరుగుతున్న ధరల దృష్ట్యా.. బంగారం, వెండి వంటి విలువైన లోహాలపైనా పెట్టుబడి పెడితే.. భవిష్యత్తులో ధనవంతులు అవుతారని రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి చెబుతున్నారు. డబ్బు ఎక్కువగా ఉండి.. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలని అనుకునేవారికి గోల్డ్, సిల్వర్ మంచి ఎంపిక అని సూచిస్తున్నారు.

గుళిగ, పంజుర్లి మాత్రమే కాదు.. కొరగజ్జ దైవం గురించి తెలుసా!

భారతదేశం విభిన్న మతాలకు, జాతులకు నిలయం. కాబట్టి ఇక్కడ.. ప్రతి మతానికి/జాతికి ఒక దైవం ఉంటుంది. ఈ దైవాన్నే వారు పరమ పవిత్రంగా పూజిస్తారు. చాలామంది గ్రామీణ దేవతలైన గంగమ్మ, మారెమ్మ, పోలేరమ్మ, మైసమ్మ మొదలైన పేర్లను ఎదో ఒక సందర్భంలో వినే ఉంటారు. అయితే కాంతారా సినిమా రిలీజ్ అయిన తరువాత.. గుళిగ, పంజుర్లి అనే దైవాల పేర్లు వినిపించాయి. బహుశా ఈ పేర్లు.. కాంతారా సినిమా వచ్చేవరకు కూడా బహుశా చాలామందికి తెలియదు. రిషబ్ శెట్టి ఈ పాత్రలలో కనిపించేసరికి.. ఎవరీ దేవతలు అని చాలామంది నెట్టింట్లో సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. ఈ కథనంలో ఆ వివరాలను చూసేద్దాం..

నిజానికి కాంతారా సినిమా అనే ఒక ప్రాంతానికి చెందిన.. సంస్కృతి, సంప్రదాయాన్ని తెలియజేస్తుంది. ఈ సినిమాలో కనిపించే గుళిగ, పంజుర్లి దైవాలను.. దక్షిణ కన్నడ ప్రాంతమైన మంగళూరు, ఉడుపి తీర ప్రాంతాలలోని జిల్లాలలో అమితమైన భయం, భక్తితో పూజిస్తారు. ఈ దేవతలు లేదా దేవాలయాలు కేవలం భక్తి ప్రదేశాలు కాదు.. తుళునాడు (కర్ణాటక, కేరళలో కొంత భాగం) లోని ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడే సాంస్కృతిక కేంద్రాలు.

గుళిగ దైవం

నిజానికి గుళిగ సాధారణ దైవం కాదు. ఇది ఒక ప్రాంతానికి, సంస్కృతికి చెందిన ప్రధానమైన భూత దైవం. ”శివుడు.. త్రిపురాసులను సంహరించిన తరువాత ఆ సమయంలో ఆయన కోపం నుంచి అతీతమైన శక్తి సంపన్నుడు వీరభద్రుడు జన్మించాడు. అదే సమయంలో గుళిగ అనే శక్తి కూడా పుట్టిందని ఒక కథ ప్రచారంలో ఉంది”. గుళిగకు మంగళూరు సమీపంలో గుళిగ బన పేరుతో ఒక దేవాలయం ఉంది. అంతే కాకుండా కర్ణాటక ప్రాంతాల్లో అక్కడక్కడా కనిపిస్తాయి.

గుళిగను సంరక్షిచే ఆత్మగా పిలుస్తారు. మహా ఉగ్రరూపంలో గుళిగ ఉంటాడని సినిమాల్లో చెప్పడం కూడా వినే ఉంటారు. న్యాయం, ఇతర సంరక్షణ కోసం ప్రజలు ఈ దైవాన్ని ప్రార్థిస్తారు. మంగళూరు ప్రాంతంలో.. వార్షిక ఉత్సవాల సమయంలో గుళిగ కోలను సంప్రదాయంగా నిర్వహిస్తారు. ఇందులో చాలావరకు శైవ సాంప్రదాయం నిండి ఉండటం చూడవచ్చు. ఉడుపి ప్రాంతవాసులు ఇతర దైవాల మాదిరిగానే గుళిగను కూడా పూజిస్తారు. మాంసాహారం నైవేద్యంగా సమర్పించుకుంటారు.

పంజుర్లి దైవం

కాంతారా సినిమాలో వినిపించే మరో దైవం పేరు పంజుర్లి. నిజానికి పంజుర్లి శాంతియుత దేవతగా ప్రసిద్ధి. వన్యప్రాణులకు హాని కలిగినప్పుడు, ప్రజల సమస్యలను వినడానికి, న్యాయం చెప్పడానికి ఈ దేవతను నిష్ఠతో పూజించి వేడుకుంటారు. ఒక వ్యక్తిపై ఆవహించి ప్రజల సమస్యలను వింటుందని చెబుతారు. పంజుర్లి దైవాన్ని అడవి పంది ఆత్మగా చెబుతారు. పంట పొలాలకు, వన్య ప్రాణులకు ఈ దైవం రక్షణ కల్పిస్తుందని అక్కడి ప్రజల ప్రగాఢ నమ్మకం.

పంజుర్లి దైవానికి.. ఉడుపి, మంగళూరు ప్రాంతాల్లో దేవాలయాలు ఉన్నాయి. వార్షిక ఉత్సవాల సమయంలో పంజుర్లి కోలా అనే సంప్రదాయాన్ని నిర్వహిస్తారు. ఈ దైవారాధన ప్రధానంగా వైష్ణవ మత సంప్రదాయం కనిపిస్తుంది. నిష్ఠతో పూజలు చేసి, బెల్లం, కొబ్బరి ముక్కలు, సెనగపప్పు మొదలైనవి నైవేద్యంగా సమర్పించుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో మాంసాన్ని కూడా నైవేద్యంగా పెడాతారు.

కొరగజ్జ దైవం

బహుశా ఈ పేరును కాంతారా సినిమాలో కూడా ప్రస్తావించలేదు. కానీ కొరగజ్జ కూడా గుళిగ, పంజుర్లి కోవకు చెందిన దైవమే. అయితే ఈ దైవం ప్రత్యేకించి న్యాయం, రక్షణను అందిస్తుందని ప్రజల నమ్మకం. మంగళూరు పరిసర ప్రాంతాల్లో ఈ దైవానికి దేవాలయాలు ఉన్నాయి. వార్షిక ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. ఆ సమయంలో దైవానికి మద్యం, మాంసం వంటి వాటితో పాటూ బీడా వంటి వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు.

పవన్ కళ్యాణ్ ఫేవరెట్ కారు.. ఇప్పుడు కొత్త రూపంలో: ధర ఎంతో తెలుసా?

మెర్సిడెస్ బెంజ్ ఇండియా.. ఒక సంవత్సరం విరామం తరువాత జీ-క్లాస్ ఆఫ్ రోడర్ డీజిల్ వెర్షన్ లాంచ్ చేసింది. దీంతో ఈ కారు దేశంలో పెట్రోల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో మాత్రమే కాకుండా.. డీజిల్ వెర్షన్‌లో కూడా లభిస్తుంది. ఈ కొత్త కారు ధర ఎంత?, ఇతర వివరాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

ప్రైస్ వివరాలు

సరికొత్త మెర్సిడెస్ బెంజ్ జీ 450డీ ధర రూ. 2.90 కోట్లు (ఎక్స్ షోరూమ్, ఇండియా). అయితే కంపెనీ మొదటి కేటాయింపుగా కేవలం 50 యూనిట్లను మాత్రమే విక్రయించనున్నట్లు సమాచారం. దీని ధర ఎలక్ట్రిక్ జీ 580 కంటే రూ. 20 లక్షలు తక్కువ. ఈ కొత్త డీజిల్ వెర్షన్ ఇండియన్ మార్కెట్లోని ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 డీజిల్ కారుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ధర పరంగా ల్యాండ్ రోవర్ ధర రూ. 1.6 కోట్లు తక్కువ.

ఇంజిన్ వివరాలు

కొత్త మెర్సిడెస్ బెంజ్ జీ 450 డీ డీజిల్ వెర్షన్.. 3.0 లీటర్ 6 సిలిండర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 367 హార్స్ పవర్, 750 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంతే కాకుండా ఇది 48వీ మైల్డ్ హైబ్రిడ్ సిస్టం ద్వారా మరో 20 హార్స్ పవర్ అదనంగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ద్వారా.. నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ జీ 450 డీ డీజిల్ కారు.. టాప్ స్పీడ్ 210 కిమీ. ఇది 5.8 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు 241 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ పొందుతుంది. కాబట్టి మంచి ఆఫ్ రోడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. మొత్తం మీద ఇది అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుందని తెలుస్తోంది.

బయటి డిజైన్ వివరాలు

2025 మెర్సిడెస్ బెంజ్ జీ 450 డీ డీజిల్ కారు.. కొత్త గ్రిల్, బంపర్లు, అల్లాయ్ వీల్స్ పొందుతుంది. గ్రిల్ ఇప్పుడు క్రోమ్‌తో ఫినిష్ అయి 4 సమాంతరంగా ఉండే స్లాట్స్ కలిగి ఉంది. 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, కొత్తగా అప్డేట్ చేయబడిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లను కూడా ఇక్కడ చూడవచ్చు. డిజైన్ పరంగా చాలా ఆకర్షణీయంగా.. చూపరులను ఆకట్టుకునే విధంగా ఉంది.

ఇంటీరియర్ ఫీచర్స్

బెంజ్ జీ 450 డీ డీజిల్ కారు.. 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ వంటివి ఉన్నాయి. ఇవి కారుకు సంబంధించిన చాలా వివరాలను వెల్లడిస్తాయి. అంతే కాకుండా ఇందులో నప్పా లెదర్ అపోల్స్ట్రే, యాంబియంట్ లైటింగ్, డాల్ఫీ అట్మాస్‌తో కూడిన 18 స్పీకర్ బర్మెస్టర్ సౌండ్ సిస్టం, లెవెల్ 2 ఏడీఏఎస్ సూట్ (యాక్టివ్ బ్రేక్ అసిస్ట్, లైన్ కీపింగ్ అసిస్ట్, 360 డిగ్రీ కెమెరా) కూడా ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ ఫేవరెట్ కారు

ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫేవరెట్ కారు అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ఈయన ఒకప్పుడు మెర్సిడెస్ బెంజ్ జీ55 కారును కలిగి ఉండేవారు. అయితే ప్రస్తుతం ఈ కారు ఉందా? లేదా? అనేదానికి సంబంధించిన వివరాలు అందుబాటులో లేదు. కానీ ఈ కారు అంటే పవన్ కళ్యాణ్కు చాలా ఇష్టమని సమాచారం. ప్రస్తుతం కంపెనీ కూడా ఈ మోడల్ కార్లను చాలా వరకు అప్డేట్ చేసింది.

బిగ్‏బాస్ 9: హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్.. వీరి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

0

సెప్టెంబర్ 2025లో ప్రారంభమైన బిగ్‏బాస్ 9 ఎదో ఆలా నడుస్తూ ఉంది. ఈ రియాలిటీ షోకు గతంలో ఉన్నంత క్రేజ్ లేకపోవడంతో ప్రజాదరణకూడా తగ్గిందనే చెప్పాలి. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్‌కు తప్పా.. చూసేవారికి మాత్రం పెద్దగా ఆసక్తిలేదనే తెలుస్తోంది. దీనికి నిదర్శనమే బాగా తగ్గిపోయిన టీఆర్పీ. కాగా ఇప్పుడు ఈ షోకు కొత్త ఉత్సాహాన్ని తీసుకురావడానికి మరో ఆరుమంది కంటెస్టెంట్స్‌లను హౌస్‌లోకి ప్రవేశపెట్టారు.

వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్

బిగ్‏బాస్ 9లో ఇప్పటివరకు ఆరుమంది (శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, హరిత హరీష్, ఫ్లోరా షైనీ, శ్రీజ దమ్ము) ఎలిమినేట్ అయ్యారు. ఈ స్థానాలను భర్తీ చేయడానికి.. మరో ఆరుగురు వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇచ్చారు. వీరిలో రమ్య మోక్ష, శ్రీనివాస సాయి, దివ్వెల మాధురీ, నిఖిల్ నాయర్, ఆయేషా జీనత్, గౌరవ్ గుప్తా ఉన్నారు. ఇకమీదటైనా ఈ సీజన్ మరింత ఆసక్తికరంగా ఉంటుందా?, లేదా అనేది తెలియాల్సి ఉంది.

రెమ్యునరేషన్ వివరాలు

బిగ్‏బాస్ సీజన్ 9లో పాల్గొనేవారి రెమ్యునరేషన్ వివరాలు అధికారికంగా వెల్లడికాలేదు. కానీ ఒక అంచనా ప్రకారం.. సాధారణ కంటెస్టెంట్స్‌లకు రోజులు రూ. 15,000 నుంచి రూ. 20,000 వరకు ఉంటుంది. సెలబ్రిటీలకు రోజుకు రూ. 30000 నుంచి రూ. 40000 ఉంటుంది. దీన్నిబట్టి చూస్తే మొదటివారమే ఎలిమినేట్ అయిన శ్రష్టి వర్మ రూ. 2 లక్షలు గెలుచుకుందని, మర్యాద మనీష్ రెండువారాలు రూ. 1.40 లక్షలు సొంతం చేసుకున్నారని, ప్రియా శెట్టి మూడువారాలకు గానూ రూ. 2.10 లక్షలు గెలుచుకున్నారని సమాచారం.

వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్‏బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ కూడా రోజుకు రూ. 1,5000 నుంచి రూ. 20,000 రెమ్యునరేషన్ పొందే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు. కచ్చితమైన రెమ్యునరేషన్ వివరాలు తెలుసుకోవాలంటే.. బహుశా సీజన్ పూర్తయిన తరువాత కంటెస్టెంట్స్ లేదా బిగ్‏బాస్ యాజమాన్యం వెల్లడించాల్సిందే.

రమ్య మోక్ష

ఇకపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మొదటగా అడుగుపెట్టిన రమ్య మోక్ష చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు, తాము చేసిన చిన్న తప్పువల్ల పచ్చళ్ల వ్యాపారం మూసేయాల్సిన పరిస్థితి వచ్చిందని, ఎప్పుడూ తాను ఫిట్‌నెస్ మీదనే ఫోకస్ పెడుతుందనీ.. ఇప్పుడు కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నట్లు తెలిసింది. తాము చేసిన చిన్న తప్పిదం వల్ల.. భారీ ట్రోలింగుకు గురైనట్లు కూడా తెలిసింది. కాగా ఇప్పుడు బిగ్‏బాస్ హౌస్‌లో తనను తాను నిరూపించుకుంటానకి స్పష్టం చేసింది.

మాధురీ దివ్వెల

బిగ్‏బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అడుగుపెట్టిన వారిలో దివ్వెల మాధురీ ఒకరు. తనకు ఇంటర్ చదివేటప్పుడే పెళ్లిచేశారని, తనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారని, అనుకోని కారణాల వల్ల భర్త నుంచి విడిపోవాల్సి వచ్చిందని తెలిసింది. అంతే కాకుండా తాను దువ్వాడ శ్రీనివాస్‌తో నాలుగేళ్లుగా ఉన్నానని, ఈ సమయంలో లెక్కలేనన్ని విమర్శలు ఎదుర్కొన్నట్లు తెలిసింది. అంతే కాకుండా.. కుమార్తెలను వదిలేసిందని చాలామంది అన్నారు.. అది ఏ మాత్రం నిజం కాదని, వారే నా భవిష్యత్ అని కూడా ఆమె హౌస్‌లోకి రాకముందే ఒక వీడియోలో పేర్కొన్నారు. కాగా శ్రీనివాస్ అనుమతితోనే బిగ్‏బాస్ సీజన్ 9లోకి అడుగుపెట్టినట్లు కూడా ఆమె స్పష్టం చేసింది.

జీఎస్టీ ప్రభావం.. పండుగ ఆఫర్స్: భారీగా తగ్గిన మారుతి ఎస్-ప్రెస్సో ధర!

2025 సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ సంస్కరణలు అమలులోకి వచ్చాయి. ఆ రోజు నుంచే మారుతి సుజుకి.. తన ఉత్పత్తుల (కార్లు) ధరలను తగ్గింపు ధరతో విక్రయించడం ప్రారంభించింది. ఇప్పుడు జీఎస్టీ తగ్గింపులకు.. ఫెస్టివల్ డిస్కౌంట్స్, ఆఫర్స్ తోడయ్యాయి. దీంతో బ్రాండ్ యొక్క వాహనాల ధరలు మరింత తగ్గాయి. ఈ కథనంలో మారుతి ఎస్-ప్రెస్సో ధర గురించి తెలుసుకుందాం.

భారతదేశంలో ప్రముఖ హ్యాచ్‌బ్యాక్‌లలో మారుతి సుజుకి-ఎస్ ప్రెస్సో ఒకటి. ఇప్పటికే లక్షలాది మంది ప్రజలు దీనిని కొనుగోలు చేశారు. ప్రస్తుతం కొత్త జీఎస్టీ, దీపావళి పండుగ ఆఫర్ కింద వేరియంట్‌ను బట్టి.. రూ. 70000 నుంచి రూ. 1.30 లక్షలు తగ్గుతుంది. ఇందులో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మరియు ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ వెర్షన్స్ ఉన్నాయి.

వేరియంట్ వారీగా ఏసీ షోరూమ్ ధరలు

  • ఎస్టీడీ (ఓ): రూ. 3.50 లక్షలు (రూ.77000 తగ్గింది)
  • ఎల్ఎక్స్ఐ: రూ. 3.80 లక్షలు (రూ. 1.2 లక్షలు తగ్గింది)
  • వీఎక్స్ఐ (ఓ): రూ. 4.30 లక్షలు (రూ. 91000 తగ్గింది)
  • ఎల్ఎక్స్ఐ (ఓ) సీఎన్‌జీ: రూ. 4.62 లక్షలు (రూ. 1.3 లక్షలు తగ్గింది)
  • వీఎక్స్ఐ (ఓ) ఆటోమాటిక్: రూ. 4.75 లక్షలు (రూ. 97000 తగ్గింది)
  • వీఎక్స్ఐ ప్లస్ (ఓ): రూ. 4.80 లక్షలు (రూ. 71000 తగ్గింది)
  • వీఎక్స్ఐ (ఓ) సీఎన్‌జీ: రూ. 5.12 లక్షలు (రూ. 1 లక్ష తగ్గింది)
  • వీఎక్స్ఐ ప్లస్ (ఓ) ఆటోమాటిక్: రూ. 5.25 లక్షలు (రూ. 76000 తగ్గింది)

మారుతి ఎస్-ప్రెస్సో

ధరల తగ్గుదల తరువాత దేశీయ విఫణిలో మారుతి ఎస్-ప్రెస్సో ప్రారంభ ధర రూ.3.50 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీని ధర సెప్టెంబర్ 22కు మించి రూ. 4.27 లక్షలు (ఎక్స్-షోరూమ్). సింపుల్ డిజైన్ కలిగిన ఈ కారు.. అత్యాధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇది పెట్రోల్, సీఎన్‌జీ రూపాల్లో మార్కెట్లో అమ్మకానికి ఉంది.

మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో అందుబటులో ఉండే.. మారుతి ఎస్-ప్రెస్సో అమ్మకాల పరంగా ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తోంది. దేశీయ విఫణిలో క్రాస్ఓవర్లు, పెద్ద కార్ల సంఖ్య పెరుగుతున్న సమయంలో హ్యాచ్‌బ్యాక్‌ల మార్కెట్ వాటా క్రమంగా తగ్గుతోంది. అయినప్పటికీ.. ఎస్-ప్రెస్సో మాత్రం ఈ విభాగంలో ఇప్పటికీ అధిక ప్రజాదరణ పొందుతూనే ఉంది.

ప్రస్తుతం కంపెనీ ఈ ఎస్-ప్రెస్సో ధరను బాగా తగ్గించింది. దీంతో ఈ కారు మంచి అమ్మకాలు పొందుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. తక్కువ ధరలో ఓ మంచి కారు కోసం చూస్తున్న ప్రజలకు లేదా పండుగ సమయంలో తక్కువ ధరలో కారు కొనాలనుకునే వారికి మారుతి ఎస్-ప్రెస్సో సరైన ఎంపిక అనే చెప్పాలి.

సెప్టెంబర్ నెలలో పెరిగిన మారుతి సుజుకి సేల్స్

మారుతి సుజుకి ప్రస్తుతం ఎస్-ప్రెస్సో ధరలను మాత్రమే కాకుండా.. ఇతర వేరియంట్ల ధరలను కూడా బాగా తగ్గించింది. ఈ కారణంగానే గత నెలలో (2025 సెప్టెంబర్) కంపెనీ 1.32 లక్షల యూనిట్ల కంటే ఎక్కువ కార్లను విక్రయించగలిగి.. మార్కెట్లో అగ్రగామిగా నిలిచింది. ఇందులో ఎస్-ప్రెస్సో సేల్స్ 1774 యూనిట్లు అని సమాచారం. ప్రస్తుతం ఈ కారు (ఎస్-ప్రెస్సో) ధరలు తగ్గడం చేత.. అక్టోబర్ 2025లో మరింత ఎక్కువ సంఖ్యలో అమ్ముడయ్యే అవకాశం ఉందని సమాచారం.

రెనాల్ట్ క్విడ్ ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది: లుక్ మాత్రం వేరే లెవెల్!

మార్కెట్లో ఎంతోమందికి ఇష్టమైన, తక్కువ ధరలో లభించే.. రెనాల్డ్ క్విడ్ ఎలక్ట్రిక్ రూపంలో కనిపించింది. కంపెనీ ఈ కారును బ్రెజిల్‌లో ఆవిష్కరించింది. దఈ ఎలక్ట్రిక్ వెర్షన్ క్విడ్ ఈ-టెక్ పేరుతో అమ్మకానికి రానున్నట్లు సమాచారం. ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన వివరాలతో పాటు.. ఇది ఇండియన్ మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయాలు కూడా తెలుసుకుందాం.

డాసియా స్ప్రింగ్ ఈవీ మాదిరిగా నిర్మించబడిన ఈ మోడల్.. చూడటానికి సాధారణ క్విడ్ కంటే కూడా భిన్నంగా ఉంటుంది. కాగా ఈ ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన టెస్ట్ మ్యూల్స్ భారతదేశంలో చాలాసార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది. కాబట్టి ఇది త్వరలోనే.. ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇండియన్ మార్కెట్లో.. రెనాల్ట్ క్విడ్ ఈవీ లాంచ్ అయిన తరువాత, ఇప్పటికే అమ్ముడవుతున్న సిట్రోయెన్ ఈ-సీ3, టాటా టియాగో ఈవీ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంది. కాగా ఈ ఎలక్ట్రిక్ కారు ఎప్పుడు లాంచ్ అవుతుందనే.. విషయాలు తెలియాల్సి ఉంది.

సరికొత్త డిజైన్

కొత్త రానాల్ట్ క్విడ్ ఈవీ.. డాసియా సంతతి నుంచి ప్రేరణ పొందినట్లు తెలుస్తోంది. ఈ కారు ముందు భాగంలో క్లోజ్డ్ ఆప్ గ్రిల్ పొందుతుంది. వర్టికల్ స్లాట్ చంకీ లుక్ ఇస్తాయి. ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్ ముందుభాగంలో.. బంపర్‌కు ఇరువైపులా అమర్చబడి ఉన్నాయి. బ్లాక్ వీల్ ఆర్చ్ క్లాడింగ్, ఓఆర్వీఎమ్ మౌంటెడ్ ఇండికేటర్ లైట్స్, బ్లాక్ సైడ్ క్లాడింగ్, 14 ఇంచెస్ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్ వంటివన్నీ ఇందులో కనిపిస్తాయి. వెనుక భాగంలో హాలోజన్ బేస్డ్ రివర్స్ లైట్‌లతో వై షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్ ఉంటుంది. మొత్తం మీద ఇది ఫ్యూయెల్ క్విడ్ కంటే కూడా భిన్నంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.

ఇంటీరియర్ డిజైన్ & ఫీచర్స్

రెనాల్ట్ క్విడ్ ఈవీ.. మంచి క్యాబిన్ కలిగి, సరికొత్త టెక్నాలజీలతో నిండి ఉంది. ఇందులో 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే ఉంటుంది. అంతే కాకుండా 7 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రెండు యూఎస్బీ పోర్టులు ఉన్నాయి. హైట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ కూడా ఇందులో లభిస్తుంది.

సేఫ్టీ విషయానికి వస్తే.. కొత్త క్విడ్ ఎలక్ట్రిక్ కారు 6 ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, రియర్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, సీట్‌బెల్ట్ రిమైండర్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్స్ మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు రక్షణ కల్పించడంలో సహాయపడతాయి.

బ్యాటరీ అండ్ రేంజ్ వివరాలు

ఎలక్ట్రిక్ కారు అనగానే.. బ్యాటరీ గురించి తెలుసుకోవాలి. కాబట్టి రెనాల్ట్ క్విడ్ ఎలక్ట్రిక్ కారు 26.8 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒకసారి ఫుల్ ఛార్జ్ అయితే.. 250 కిమీ వరకు ప్రయాణించగలదని సమాచారం. అయితే కచ్చితమైన రేంజ్ గణాంకాలు.. లాంచ్ తరువాత, టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది. కాగా ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 65 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుందని సమాచారం. కాగా.. కంపెనీ ఈ కారు ధరలను అధికారికంగా వెల్లడించలేదు. ధరలు లాంచ్ సమయంలో కంపెనీ వెల్లడిస్తుంది.

బీఎస్పీ మెగా ర్యాలీ హైలెట్స్.. గళం విప్పిన మాయావతి

బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షిరామ్ వర్ధంతి సందర్బంగా బీఎస్పీ లక్నోలోని కాన్షిరామ్ స్మారక స్థలంలో భారీ ర్యాలీని నిర్వహించింది. భారతదేశ నలుమూలల నుంచి ఈ మీటింగ్‌కు కొన్ని లక్షల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ప్రజలు హాజరయ్యారు. నీలి కండువాలు, జెండాలు, బ్యానర్‌లు, కటౌట్స్, నీలి దుస్తులతో సభా ప్రాంగణంతో పాటు లక్నో మొత్తాన్ని నీలి సంద్రంలా మార్చివేశారు.

మాయావతి కీలక వ్యాఖ్యలు

ఈ ర్యాలీలో ‘బెహెంజి మాయావతి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి.. మాకు అధికారం కావాలి’, ఉచితాలు కాదు (రేషన్ కాదు) లాంటి కొత్త నినాదాలతో పాటు బహుజన హితయా బహుజన సుకాయా అనే కాన్షిరామ్ గారి వ్యాఖ్యలను కూడా పెద్ద ఎత్తున నినదించారు. జై భీమ్ జై భారత్.. అంటూ మారుమోగించారు. ఈ ఉత్సహం చూస్తుంటే వచ్చిన జనసందోహానికి కచ్చితంగా ఈసారి అధికారం చెపడతామనే నమ్మకం కలిగినట్టుగా కొంతమంది కార్యకర్తలు భావిస్తున్నారు. ఈ సమావేశానికి వచ్చిన బహుజన సమూహన్ని ఉద్దేశించి.. బిఎస్పీ రాజకీయ భవిష్యత్తు గురించి పార్టీ జాతీయ అధ్యక్షులు మాయావతి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఉత్తరప్రదేశ్‌లో జరగబోయే 2027 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మాయావతి మాట్లాడుతూ.. ఎటువంటి పొత్తులు లేకుండా ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగనున్నట్టు చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికి.. అవి ఆయా పార్టీలకు మేలుజరిగింది గానీ.. బీఎస్పీకి ఏ ప్రయోజనం కూడా చేకూరలేదు అని అన్నారు. ప్రతిసారి మా ఓట్లు పొత్తులో ఉన్న వాళ్లకి బదిలీ అవుతున్నాయి తప్పా మిగిలిన వారి ఓట్లు ఒక్కటి కూడా ఇటు రావడం లేదని వాపోయారు. అందుకే ఈసారి ఒంటరిగా పోటీచేస్తామని స్పష్టంచేశారు.

ప్రత్యర్థులపై విమర్శల వర్షం

తమ ప్రత్యర్థి పార్టీలపైన ఆమె విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, సమాజ్ వాదీ రెండు పార్టీలు దళిత సమాజాన్ని మోసానికి, అన్యాయానికి గురిచేస్తున్నాయని.. అంబేద్కర్‌కు భారతరత్న ఇవ్వలేదని, కాన్షిరామ్ మృతిపట్ల సంతాపం తెలుపకపోవడం కాంగ్రెస్ ఆలోచనలకు నిదర్శనం అన్నారు. ఇప్పుడు రాజ్యాంగం చేతిలో పట్టుకుని తిరుగుతున్నారని, అదొక డ్రామా పార్టీ అని అన్నారు.

పవర్‌లో ఉన్నప్పుడు దళితులు, మిగిలిన ఇతర అణచివేయబడిన కులాలను పట్టించుకోరు. తరువాత మాత్రమే వాళ్లు గుర్తుకు వస్తారని, అదొక అవకాశవాద, రెండు దోరణులు కలిగిన పార్టీగా మాయావతి అభివర్ణించారు. కాన్షిరామ్ పట్ల గౌరవం లేదని, జిల్లాలకు కాన్షిరామ్ పేర్లు మార్చడం, స్మారక స్థలానికి నిధులు ఆపివేయడం వంటివాటిని మాయావతి గుర్తు చేశారు.

బీజేపీ ప్రభుత్వం సిబీఐ, ఈడీ లాంటి సంస్థలతో నన్ను, మన నాయకులను, కుటుంబాన్ని అనవసరమైన కేసుల్లో ఇరికించి దళితుల అభివృద్ధిని, పార్టీని ఇబ్బంది పెట్టిందని – కాంగ్రెస్, సమాజ్ వాది, బీజేపీ మనల్ని ఆపడానికి ఉన్నాయని కానీ బీఎస్పీ మాత్రం ఎక్కడ విశ్రమించకుండా వాటిని ఎదురక్కొని పనిచేస్తుంది అని అన్నారు. బీఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు ఉచితాలపై ఆధారపడకుండా ప్రజలు సొంతంగా ఏదిగేలా అభివృద్ధి చేశామని ఆమె అన్నారు. 2027లో మళ్ళీ అధికారం చేపడుతామని కార్యకర్తల్లో విశ్వాశాన్ని నింపారు.

రాజకీయ వారసుని గురించి

తన మేనల్లుడు బీఎస్పీ జాతీయ కన్వీనర్ ఆకాష్ ఆనంద్ గురించి చెబుతూ.. కాన్షిరాం కాలంలో ఆయనకు తరువాత నాకు ఇంతకాలం అన్ని కష్ట సమయాల్లో ఏ విధంగా అయితే అండగా నిలబడ్డారో ఇప్పుడు ఆకాష్ ఆనంద్ కూడా అదే విధంగా మద్దతుగా ఉండాలని, నా మార్గదర్శకత్వంలో తను నడుస్తాడని ఆమె తన రాజకీయ వారసుని గురించి చెప్పుకొచ్చారు.

చూడగానే ఆకట్టుకునే కారు.. అమ్మకాల్లో బలే జోరు!

ఎంజీ మోటార్ కంపెనీ భారతీయ మార్కెట్లో తన సైబర్‌స్టర్ కారును 2025 జులైలో లాంచ్ చేసిన విషయం అందరికి తెలిసిందే. కంపెనీ లాంచ్ చేసిన ఈ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు ధర.. ఇతర కార్ల కంటే కూడా కొంత ఎక్కువే!. అయినప్పటికీ ఇది మంచి అమ్మకాలు పొందిందని సంస్థ వెల్లడించింది.

అమ్మకాలు ఇలా..

జులై 2025లో లాంచ్ అయిన ఎంజీ సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ కారు.. 250 యూనిట్ల అమ్మకాలు పొందింది. దీని ప్రారంభ ధర రూ. 74.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). అయితే కంపెనీ ఈ కారును లాంచ్ చేసిన సమయంలో రూ. 72.49 లక్షల (ఎక్స్ షోరూమ్) వద్ద లాంచ్ చేసిన. అయితే ఇప్పుడు రూ. 2.5 లక్షలు ధర పెరిగిందని స్పష్టమైంది. ఇది ఎంజీ మోటార్ కంపెనీ యొక్క మొదటి ఎలక్ట్రిక్ కూపే. చూడటానికి అద్భుతంగా.. లంబోర్ఘిని లాంటి బటర్ ఫ్లై డోర్స్ కలిగి ఉంది. అంతే కాకుండా.. ఇది మల్టిపుల్ కలర్ ఎంపికలలో అందుబాటులో ఉండటం వల్ల కూడా.. ఇది కొనుగోలుదారులను ఆకట్టుకోవడంలో విజయం సాధించింది.

ధర ఎక్కువైనా.. తగ్గని డిమాండ్

2025 సెప్టెంబర్ చివరి నాటికి ఎంజీ మోటార్ కంపెనీ తన సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును 256 యూనిట్లను విక్రయించినట్లు వెల్లడించింది. కాగా.. ఈ మోడల్ కోడం 4 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉన్నట్లు కూడా వెల్లడించింది. దీన్నిబట్టి చూస్తే.. ధర ఎక్కువైనా, డిమాండ్ ఓ మోస్తరులో ఉందని స్పష్టమవుతోంది.

మొదట గ్లోబల్ మార్కెట్లో..

నిజానికి ఎంజీ సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ కారును.. ఎంజీ మోటార్ కంపెనీ ఏప్రిల్ 2023లో షాంఘైలో జరిగిన ఆటోషోలో అరంగేట్రం చేసింది. ఆ తరువాత గ్లోబల్ మార్కెట్లో విక్రయించడం మొదలుపెట్టింది. ప్రపంచ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎంజీ సైబర్‌స్టర్ రియర్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ అనే రెండు కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది. అయితే భారతదేశంలో అమ్మకానికి ఉన్న కారు ఒకే వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

బ్యాటరీ & రేంజ్ వివరాలు

ఎంజీ సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ కారు యొక్క ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్.. రెండు ఎలక్ట్రిక్ మోటార్ల ద్వారా 528 బీహెచ్‌పీ పవర్, 725 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇందులోని 77 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ సింగిల్ ఛార్జితో గరిష్టంగా 580 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది 0 నుంచి 100 కిమీ యాక్సలరేట్ అవ్వడానికి పట్టే సమయం 3.2 సెకన్లు మాత్రమే. దీని టాప్ స్పీడ్ గంటకు 200 కిమీ.

ఫీచర్స్.. డిజైన్ వివరాలు

ఎంజీ సైబర్‌స్టర్.. డిజైన్ పరంగా చాలా అద్భుతంగా ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ఒక్క చూపుతోనే ఆకట్టుకునే డిజైన్ దీని సొంతం అని ఎవరైనా చెప్పాల్సిందే. ఇందులో మొత్తం మూడు స్క్రీన్‌లు ఉంటాయి. రెండు 7.0 ఇంచెస్ డిస్‌ప్లేలు, మరొకటి 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్. ఇందులోని ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్.. కంట్రోల్స్ కూడా పొందుతుంది. బోస్ ఆడియో సిస్టం, ఆపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటో వంటివి ఉన్నాయి. 360 డిగ్రీ కెమెరా, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లెవల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. మొత్తం మీదే ఇది ఫ్రీమియం లుక్.. అప్డేటెడ్ ఫీచర్స్ అన్నీ కలిగి ఉంటుంది.

ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎంజీ సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ కారు.. కొన్ని ప్రత్యేకమైన డీలర్‌షిప్‌ల ద్వారా మాత్రమే అమ్ముడవుతోంది. ప్రస్తుతం భారతదేశంలోని ప్రధాన నగరాల్లో 14 సెలక్టివ్ డీలర్‌షిప్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో డిమాండును బట్టి డీలర్‌షిప్‌ల సంఖ్యను పెంచే అవకాశం ఉంటుందని సమాచారం.

మొన్న రష్మికతో నిశ్చితార్థం!.. ఇప్పుడు కీర్తి సురేష్‌తో సినిమా!

0

విజయ్ దేవరకొండ.. రష్మిక మందన్న నిశ్చితార్థం విషయం కొంత సద్దుమణుగుతోంది. ఈ తరుణంలో నటుడు విజయ్ దేవరకొండ కొత్త సినిమా రౌడీ జనార్దన్కు సంబంధించిన పూజా కార్యక్రమం ఈ రోజు (అక్టోబర్ 11) హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు?.. సినిమా రిలీజ్ వంటి ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ, ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

రౌడీ జనార్దన్.. విజయ్ దేవరకొండ

నటుడు విజయ్ దేవరకొండ తదుపరి సినిమా రౌడీ జనార్దన్’కు రాజావారు రాణిగారు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రవికిరణ్ కోల దర్శకత్వం వహించనున్నారు. దీనికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తూ.. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. ఈ నెల 16 (అక్టోబర్ 16) నుంచే ముంబైలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ రోజు జరిగిన ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమానికి.. అల్లు అరవింద్ ప్రత్యేక అతిథిగా హాజరై.. తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టి ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మొదటిసారి కీర్తి సురేష్‌తో జంటగా

రౌడీ జనార్దన్ సినిమాలో హీరోయిన్‌గా మహానటి కీర్తి సురేష్ నటించనున్నారు. విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ జంటగా కనిపించనున్న మొదటి సినిమా ఇదే కావడం గమనార్హం. దీంతో అటు దేవరకొండ ఫ్యాన్స్, ఇటు కీర్తి సురేష్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా? అని చాలా అతృతతో ఎదురు చూస్తున్నారు. పేరుకు తగ్గట్టుగానే ఇది మంచి యాక్షన్ కథా చిత్రమని తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమా కోసం దిల్ రాజు భారీ బడ్జెట్ కేటాయించనున్నట్లు సమాచారం. ఈ సినిమా 2026 చివరి నాటికి థియేటర్లలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. కాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ రాబోయే రోజుల్లో ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటాయి.

హిట్ కొట్టేనా?

ఇటీవల రిలీజ్ అయిన విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ సినిమా ఊహించిన అంచనాలను అందుకోలేకపోయింది. గీత గోవిందం సినిమా తరువాత.. అంత పెద్ద హిట్ సాధించిన సినిమాలు విజయ్ దేవరకొండ ఖాతాలో పడలేదు. ఈ సారైనా రౌడీ జనార్దన్ సినిమాతో హిట్ కైవసం చేసుకుంటాడేమో వేచిచూడాలి. సినిమా టైటిల్, దర్శక & నిర్మాతలను బట్టి చూస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ సాధిస్తుందని చాలామంది అంచనా వేస్తున్నారు.

విజయ్ దేవరకొండ గురించి

2011లో నువ్విలా సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన గీత గోవిందం మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తరువాత వచ్చిన సినిమాలు దాదాపు అంతంతమాత్రమే అనిపించాయి. సినిమా విషయం పక్కన పెడితే.. నటి రష్మిక మందన్నతో.. విజయ్ దేవరకొండ నిశ్చితార్థం చేసుకున్నట్లు వార్తలు తెరమీదకు వచ్చాయి. ఈ విషయాన్ని వారిరువురు అధికారికంగా ప్రకటించినప్పటికీ.. అసలు స్పందించనే లేదు. దీన్నిబట్టి చూస్తే వీరు నిశ్చితార్థం చేసుకున్నారనే విషయం నిజమే అని తెలుస్తోంది. కాగా వీరి పెళ్లి 2026 ఫిబ్రవరిలో ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు.

‘లవ్ చేస్తే లైఫ్ ఇస్తా అని వరమిచ్చా’: కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ ట్రైలర్ చూశారా

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన కే ర్యాంప్ ట్రైలర్ ఎట్టకేలకు వచ్చేసింది. దిల్‌రూబా సినిమా తరువాత తెరకెక్కనున్న ఈ సినిమా కామెడీ, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. తాజాగా రిలీజ్ అయిన ఈ లేటెస్ట్ మూవీ ట్రైలర్ గురించి, సినిమా రిలీజ్ గురించి మరిన్ని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

కే ర్యాంప్ ట్రైలర్

తాజాగా రిలీజ్ అయిన కే ర్యాంప్ ట్రైలర్ విషయానికి వస్తే.. ప్రారంభంలోనే ఒక బామ్మ పక్కన కూర్చుకు భయపడుతూ కాళ్లు ఊపుతూ ఉంటాడు. అప్పుడు ఆ బామ్మ.. కాళ్లు ఊపకూడదు అని చెబితే, నా గర్ల్‌ఫ్రెండ్‌ను తలచుకుంటుంటే అవే ఊగిపోతున్నాయని చెబుతాడు. ఆ తరువాత ఎంసెట్ ఎగ్జామ్ రాయలేదంటగా.. అంటే, తాగేసి పడిపోవాల్సి వచ్చిందని చెబుతాడు. లవ్ చేస్తే లైఫ్ ఇస్తా అని వరమిచ్చాను సర్.. అనటం ఇలా డైలాగ్స్ వేరే లెవెల్ అనే చెప్పాలి. హీరోయిన్ యుక్తి తరేజతో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు యువతను బాగా ఆకట్టుకునేలా ఉన్నాయి. బీజీఎం మ్యూజిక్ అద్భుతంగా ఉంది.

ఐ లవ్ యు కుమార్.. నువ్వు కూడా చెప్పు కుమార్, అన్నప్పుడు హీరో కళ్లలో కన్ఫ్యూజన్ తెగ నవ్వు తెప్పిస్తుంది. నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్ మొదలైనవారు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 18న (2025 అక్టోబర్ 18) థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ట్రైలర్ మాత్రం రిలీజ్ అని కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో పాజిటీవ్ రెస్పాన్స్ పొందుతోంది.

కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో హిట్!

కే ర్యాంప్ సినిమా హాస్య మూవీ పతాకంపై నిర్మించారు. దీనికి జైన్స్ నాని దర్శకత్వం వహించారు. రాజేష్ దండా, శివ బొమ్మక్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా కోసం ఎంత ఖర్చు చేశారనే విషయం అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఈ సినిమా దీపావళి కానుకగా థియేటర్లలో రిలీజ్ అవుతుంది.. కాబట్టి భారీ వసూళ్ళు చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమా మంచి హిట్ సాదిస్తుందని, కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో హిట్ యాడ్ అవుతుందని ఇప్పటికే కొందరు చెబుతున్నారు. ట్రైలర్ చూస్తుంటే నిజమే అని కూడా అనిపిస్తోంది. దీపావళికి చాలా సినిమాలో థియేటర్లలో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి కిరణ్ అబ్బవరం సినిమా కొంత గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.

కిరణ్ అబ్బవరం గురించి

తెలుసు సినిమా ఇండస్ట్రీలో కిరణ్ అబ్బవరంకు మంచి క్రేజ్ ఉంది. ఎన్నో కష్టాలు ఎదుర్కొని సినిమా రంగంలో నిలబడిన ఇతడంతే.. ఎంతోమందికి అభిమానం కూడా. రాజావారు రాణిగారు సినిమాతో సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన కిరణ్ అబ్బవరం.. ఎస్ఆర్ కళ్యాణమండపం, నేను మీకు బాగా కావలసినవాడిని, వినరో భాగ్యము విష్ణుకథ, క వంటి సినిమాలతో బాగా పాపులర్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా కే ర్యాంప్ సినిమాథి తెరమీదకు రానున్నారు. ఈ సినిమా ఎలాంటి టాక్ పొందుతుంది? ఎలాంటి వసూళ్లను రాబడుతుంది.. అనే విషయాలు సినిమా రిలీజ్ తరువత తెలుస్తాయి.