Home Blog Page 126

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 vs టీవీఎస్ రోనిన్: ఏది సెలక్ట్ చేసుకోవాలంటే..

భారతదేశంలో లెక్కకు మించిన బైకులు అందుబాటులో ఉన్నాయి. అయితే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు మాత్రం ఓ ప్రత్యేక డిమాండ్ ఉంది. ఇందులో సరసమైన బైకుగా ప్రసిద్ధి చెందిన ‘హంటర్ 350‘ క్లాసిక్ డిజైన్ కలిగి, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. కాగా హంటర్ 350 ధర వద్ద లభించే టీవీఎస్ కంపెనీకి చెందిన రోనిన్.. రాయల్ బండికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఈ కథనంలో ఈ రెండు బైకుల మధ్య వ్యత్యాసం గురించి తెలుసుకుందాం.

ధరలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మోడల్ బేస్ రెట్రో వేరియంట్ ధర రూ. 1.37 లక్షలు, టాప్ స్పెక్ మెట్రో రెబెల్ ట్రిమ్ దధర రూ. 1.67 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్). బైక్ ప్రేమికులకు రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ.. ఒక సరసమైన బైక్ పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో దీనిని మార్కెట్లో లాంచ్ చేసింది.

ఇక్కడ టీవీఎస్ రోనిన్ విషయానికి వస్తే.. దీని ప్రారంభ ధర రూ. 1.24 లక్షలు (ఎక్స్ షోరూమ్), టాప్ వేరియంట్ ధర రూ. 1.59 లక్షలు (ఎక్స్ షోరూమ్). టీవీఎస్ రోనిన్ ధర.. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 కంటే కూడా కొంత తక్కువే.

ఇంజిన్ వివరాలు

హంటర్ 350 బైకులో రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ 349 సీసీ జే సిరీస్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ అందించింది. ఇది 20.2 బీహెచ్‌పీ పవర్, 27 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. 181 కేజీల బరువున్న ఈ బైక్.. నగర ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

టీవీఎస్ రోనిన్ బైక్ 225.9 సీసీ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ద్వారా.. 20 బీహెచ్‌పీ పవర్, 19.93 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ బరువు కేవలం 159 కేజీలు మాత్రమే. బరువు కొంత తక్కువగా ఉండటం వల్ల త్రాటెల్ రెస్పాన్స్ అద్భుతంగా ఉంటుంది. కొత్త రైడర్లకు కూకా చాలా అనుకూలంగా ఉంటుంది. రెండు బైకుల టాప్ స్పీడ్ గంటకు 120 కిమీ మాత్రమే.

ఫీచర్స్

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350, టీవీఎస్ రోనిన్ రెండూ కూడా ఫీచర్స్ పరంగా చాలా భిన్నంగా ఉంటాయి. హంటర్ 350 బైక్ అనలాగ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, ఎల్ఈడీ టెయిల్ లాంప్ వంటివాటిని పొందుతుంది. టాప్ వేరియంట్ మాత్రం.. ట్రిప్పర్ న్యావిగేషన్ కూడా పొందుతుంది.

టీవీఎస్ రోనిన్.. కొన్ని ఎక్కువ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ న్యావిగేషన్, ఏబీఎస్ ప్రతిస్పందనను అడ్జస్ట్ చేసే రైడింగ్ మోడ్స్.. అర్బన్, రెయిన్‌తో కూడిన ఫుల్లీ డిజిటల్ డిస్‌ప్లేను పొందుతుంది. ఈ బైకులో సస్పెన్షన్ అప్‌సైడ్‌డౌన్ ఫ్రంట్ ఫోర్కులు, వెనుక భాగంలో మోనోషాక్ ఉంటుంది. హంటర్ బైకులో స్టాండర్డ్ టెలిస్కోపిక్, ట్విన్ షాక్ సెటప్ వంటివి ఉన్నాయి. ఇది హంటర్ 350.. టీవీఎస్ రోనిన్ బైకుల్లో ప్రధాన వ్యత్యాసం అని తెలుస్తుంది.

నా అభిప్రాయం

ఇండియన్ మార్కెట్లో హంటర్ 350 బైకుకు, రోనిన్ బైకుకు మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ రెండింటిలో కొంత తక్కువ ధర వద్ద కావాలనుకునేవారికి రోనిన్ ఆప్షన్. ఇంజిన్ పనితీరు కొంత ఎక్కువగా ఉండాలనుకుంటే.. హంటర్ 350 ఎందుకోవచ్చు. రోజువారీ ప్రయాణానికి రెండూ అనుకూలంగా ఉంటాయి. కాబట్టి మీ బడ్జెట్, రోజువారీ అవసరం వంటి విషయాలను బేరీజు వేసుకుని.. మీకు నచ్చిన బైక్ ఎంచుకోవడం ఉత్తమం.

విద్యార్థులకు గొప్ప అవకాశం: రూ.కోటి గెలుచుకునే ఛాన్స్!

భారతదేశంలో చదువుతున్న 6వ తరగతి నుంచి 12వ తరగతి మధ్య విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ఓ మంచి కార్యక్రమం ప్రవేశపెట్టింది. వికసిత్ భారత్ బిల్డథాన్ 2025 పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఎలా పాల్గొనాలి?, కాన్సెప్ట్ ఏమిటి? ప్రైజ్ ఎంత అనే మరిన్ని వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

వికసిత్ భారత్ బిల్డథాన్ థీమ్స్

ఆవిష్కరణ స్ఫూర్తిని విద్యార్థులలో పెంపొందించడానికి, సమస్యలకు పరిష్కారం వెతికే దిశగా ప్రోత్సహించడానికి కేంద్రం ఈ వికసిత్ భారత్ బిల్డథాన్ 2025 స్టార్ట్ చేసింది. ”స్వదేశీ, ఆత్మనిర్భర భారత్, సమృద్ధి భారత్, లోకల్ ఫర్ లోకల్” వంటి థీమ్‌లతో ఆవిష్కరణలు, సమస్యలకు పరిష్కారాలను చూపాలని కేంద్రం ఈ కార్యక్రమం స్టార్ట్ చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొననటానికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ రోజు ఆఖరి తేదీ (2025 అక్టోబర్ 11). విద్యార్థులు 3 లేదా 5 మంది కలిసి ఒక బృందంగా మారి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అధికారిక పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే.. మీకు ఒక ప్రత్యేకమైన ఐడీ జనరేట్ అవుతుంది.

రూ.కోటి విలువైన బహుమతులు

రిజిస్ట్రేషన్ చేసుకున్న బృందాలు ఒక థీమ్ ఎంచుకుని.. సమస్యకు తమదైన శైలిలో విభిన్న పరిష్కారాలను వెల్లడించాలి. దీనికి సంబంధించి 2-3 నిమిషాల వీడియో రికార్ట్ చేసి.. దానిని అక్టోబర్ 13 నుంచి 31వ తేదీ మధ్యలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 2026 జనవరిలో అంటే వచ్చే ఏడాది విజేతలను ప్రకటిస్తారు. విజేతలకు రూ. కోటి విలువైన బహుమతులను అందిస్తారు.

ప్రధాన ఉద్దేశ్యం

కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ వికసిత్ భారత్ బిల్డథాన్ 2025 కార్యక్రమంలో దేశంలోని సుమారు 2.5 లక్షల పాఠశాలల నుంచి కోటి కంటే ఎక్కువమంది విద్యార్థులను పాల్గొనేలా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది వికసిత్ భారత్ 2047 దిశగా కేంద్రం వేస్తున్న మరో పెద్ద అడుగు. ఈ కార్యక్రమాన్ని అటల్ ఇన్నోవేషన్ మిషన్, నీతి ఆయోగ్ సహకారంతో విద్యామంత్రిత్వ శాఖ ప్రారంభించింది. భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న ప్రతిభకు ప్రపంచ కేంద్రంగా మలచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం.

రిజిస్ట్రేషన్ విధానం

  • వికసిత్ భారత్ బిల్డథాన్ 2025 కార్యక్రమంలో పాల్గొనాలనుకునే విద్యార్థులు అధికారికి వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • మీ బృందం వివరాలతో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేయాలి.
  • ఇప్పటికే ప్రస్తావించిన నాలుగు థీమ్‌లలో ఏదో ఒకదానికి ఎంచుకుని.. మీ ఆవిష్కరణ భావన, ప్రాజెక్ట్ ఆలోచనలను సమర్పించాలి.

వికసిత్ భారత్ బిల్డథాన్ 2025 ముఖ్యమైన తేదీలు

  • నోటిఫికేషన్ తేదీ: 2025 సెప్టెంబర్ 23
  • రిజిస్ట్రేషన్ గడువు: 2025 సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 11 వరకు
  • లైవ్ బిల్డథాన్: 2025 అక్టోబర్ 13
  • విజేతల ప్రకటన: 2025 డిసెంబర్ లేదా 2026 జనవరి

విద్యార్థులకు గొప్ప అవకాశం

మీలోని సృజనాత్మకతను, సమస్యలకు పరిష్కారం కనుగొనే తెలివిని ప్రపంచానికి చాటి చెప్పుకోవడానికి వికసిత్ భారత్ బిల్డథాన్ 2025 ఒక గొప్ప అవకాశం. దీనిని సద్వినియోగం చేసుకోవడం వల్ల మిమ్మల్ని మీరు ప్రపంచానికి పరిచయం చేసుకోవడం మాత్రమే కాదు.. విలువైన బహుమతులు కూడా గెలుచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో లేదా ఇలాంటి కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనడానికి ఆసక్తి చూపించాలి. వికసిత్ భారత్ 2047లో మీరు కూడా భాగస్వాములవ్వాలి.

చండీగఢ్‌ వ్యాపారవేత్తతో పెళ్లి?: స్పందించిన త్రిష

0

సినీ పరిశ్రమలో పరిచయమే అవసరం లేని ప్రముఖులలో నటి త్రిష ఒకరు. ఎందుకంటే 2004లో వర్షం సినిమాతో తెలుగు సినిమాల్లో కనిపించిన ఈ అమ్మడు 2025లో రిలీజ్ అవుతున్న సినిమాల్లో కనిపిస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నాలుగు పదుల వయసుదాటినా.. ఏ మాత్రం తగ్గకుండా కుర్ర హీరోయిన్లలకు కూడా గట్టి పోటీ ఇస్తోంది. అయితే ఎప్పుడూ.. త్రిష పెళ్లికి సంబంధించిన రూమర్స్ తెరమీదకు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా అదే టాపిక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనిపై త్రిష కూడా స్పందించింది.

పెళ్లి వార్తలపై స్పందించిన త్రిష

ఇప్పుడు తెరమీదకు వచ్చిన సమాచారం.. చండీగఢ్‌కు చెందిన ఒక వ్యాపారవేత్తతో త్రిష పెళ్లి జరగనున్నట్లు, దీనికి త్రిష తల్లిదండ్రులు కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్త పూర్తిగా అబద్దం అని చెప్పడమే కాకుండా.. ”నా కోసం నా జీవితాన్ని ప్లాన్ చేస్తున్నవారంటే నాకు ఎంతో ఇష్టం, పెళ్లి గురించి మాత్రమే కాకుండా.. హనీమూన్ షెడ్యూల్ కూడా చెప్పేయండి” అని త్రిష కొంచెం ఘాటుగానే సమాధానం ఇచ్చింది. దీంతో త్రిష ఇప్పుడు పెళ్లి చేసుకోవడం లేదని స్పష్టంగా చెప్పేసింది.

త్రిష పెళ్ళికి సంబంధించిన పుకార్లు.. తెరమీదకు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చాలా సార్లు త్రిష పెళ్ళికి సంబంధించిన వార్తలు చాలానే వచ్చాయి. అవన్నీ అబద్దాలని నటి వెల్లడించింది. ఇప్పుడు కూడా అలాంటి రూమర్ ఒకటి వెలుగులోకి రావడంతో.. త్రిష స్పందించింది.

పెళ్లి గురించి చెప్పిన త్రిష

సాధారణంగా.. నటి త్రిష తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను చాలా గోప్యంగా ఉంచుతుంది. అయితే ఈ మధ్య కాలంలో తన వివాహం గురించి చెబుతూ.. సరైన వ్యక్తిని కలిస్తే.. తాను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చింది. అయితే ఆ సరైన వ్యక్తి ఎప్పుడు, ఎలా కలుస్తాడో.. త్రిష పెళ్లి ఎప్పుడు చూస్తామో అని పలువురు అభిమానులు ఎదురు చూస్తున్నారు.

గతంలో నిశ్చితార్థం

2015లో త్రిషకు.. వరుణ్ మణియన్ అనే ఒక వ్యాపారవేత్తతో నిశ్చితార్థం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ బంధం పెళ్లివరకు వెళ్లలేదు. ఆ తరువాత త్రిష ఎప్పుడూ పెళ్లి గురించి బహిరంగంగా చెప్పలేదు. ఈమె తల్లిదండ్రులు కూడా పెళ్ళికి సంబంధించిన విషయాలను పెంచుకోవడం లేదు. మొత్తానికి 42 ఏళ్ల వయసులో కూడా త్రిష.. సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

నటి త్రిష గురించి

1983 మే 4న తమిళనాడులోని మద్రాసు(ఇప్పుడు చెన్నై)లో కృష్ణన్ అయ్యర్ & ఉమా అయ్యర్ దంపతులకు జన్మించారు. చెన్నైలోనే తన ఎడ్యుకేషన్ పూర్తి చేసింది. ఆ తరువాత మోడలింగ్‌లోకి అడుగుపెట్టి.. ప్రింట్ అండ్ టెలివిజన్ వాణిజ్య ప్రకటనల్లో కనిపించారు. 1999లో మిస్ చెన్నై విజేతగా నిలిచింది. ఆ తరువాత 2001లో బ్యూటిఫుల్ స్మైల్ అవార్డును సైతం దక్కించుకుంది. నిజానికి ఈమె మొదట్లో సినిమాల్లోకి రావాలనుకులేదు.. తాను సైకాలజిస్ట్ కావాలని అనుకున్నట్లు గతంలో ఓ సందర్భంలో త్రిష పేర్కొన్నారు. అయితే పాపులర్ నటిగా గొప్ప గుర్తింపు పొందింది. ఈమె కేవలం తెలుగులో మాత్రమే కాకుండా.. తమిళంలో కూడా చాలా సినిమాల్లో నటించింది. ఈమెకు తమిళ అభిమానుల సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంది.

ఇది కదా సక్సెస్ అంటే: సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసిన కంపెనీలోని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయ్యాడు!

ప్రతి ఒక్కరి జీవితంలో.. ఏదో ఒక సందర్భంలో కష్టాలు తప్పవు. అయితే నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి.. ఏదో ఒకరోజు ఓ అవకాశం లభిస్తుంది. ఆ అవకాశంతో ఎదిగితే.. ఎంతోమందికి ఆదర్శమవుతారు. అలాంటి సంఘటనే సెక్యూరిటీ గార్డ్ నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వరకు ఎదిగిన ‘అబ్దుల్ అలీమ్‘ స్టోరీ. దీనికి సంబంధించిన పోస్ట్ లింక్డ్ఇన్‌లో వైరల్ అవుతోంది.

రూ. 1000లతో ప్రయాణమై..

2013లో కేవలం 1,000 రూపాయలతో ఇంటి నుంచి బయలుదేరాను, అందులో 800 రూపాయలు ట్రైన్ టికెట్ కోసం ఖర్చు చేసాను. ఉద్యోగం కోసం రెండు నెలలు తిరిగాను.. చివరికి జోహో సంస్థలో సెక్యూరిటీ డెస్క్‌లో ఉద్యోగం దొరికింది. ఒకరోజు.. ఆ కంపెనీలో పనిచేసే.. ఓ సీనియర్ ఉద్యోగి నా పేరు అడిగి.. అలీమ్, మీ కళ్ళలో నాకు ఎదో కనిపిస్తోంది అని అన్నారు. అంతే కాకుండా ఆయన నా చదువు గురించి, కంప్యూటర్ పరిజ్ఞానం గురించి అడిగి అడిగారు. నాకు కొంచెం హెచ్‌టీఎంఎల్ గురించి తెలుసని చెప్పాను. అయితే మీరు ఇందులో.. ఇంకా ఏమైనా నేర్చుకోవాలనుకుంటున్నారా? అని అడిగారు.

రోజుకు 12 గంటలు పనిచేసి, తరువాత..

నేను నాకున్న ఆసక్తితో.. ప్రతి రోజు నా సెక్యూరిటీ డ్యూటీ (12 గంటలు) పూర్తి చేసుకుని, ఆ సీనియర్ ఉద్యోగి దగ్గరకు వెళ్లి కంప్యూటర్ గురించి నేర్చుకున్నాను. అలా ఎనిమిది నెలలు నేర్చుకున్న తరువాత.. నేను ఒక చిన్న యాప్‌ను సృష్టించాను. దానిని ఆ సీనియర్ ఉద్యోగి తన మేనేజర్‌కు చూపించారు. దానిని అందరూ ఇష్టపడ్డారు. అయితే నేను చదివింది కేవలం 10వ తరగతి వరకు మాత్రమే.

జోహోలో ఉద్యోగం కావాలంటే.. డిగ్రీ అవసరం లేదు, నీకున్న నైపుణ్యాలే ప్రధానం అని నన్ను ప్రోత్సహించారు. ఇంటర్వ్యూ కూడా పాస్ అయ్యాను. ఈ రోజు జోహో కంపెనీలో నన్ను నేను నిరూపించుకున్నాను. నేను ఇంతలా ఎదగడానికి కారణమైన శిబు అలెక్సిస్ (సీనియర్ ఉద్యోగి)కి, నన్ను నేను నిరూపించుకోవడానికి అవకాశం కల్పించినందుకు జోహో సంస్థకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను అని అబ్దుల్ అలీమ్ పేర్కొన్నారు.

నెటిజన్ల అభినందనలు

  • సోషల్ మీడియా వేదికగా అబ్దుల్ సాధించిన విజయాన్ని గొప్పగా ప్రశంసిస్తున్నారు. నువ్వు నిజంగా మంచి కంపెనీలో ఉన్నావు సోదరా.. జోహో నీకు జీవితాన్ని ఇచ్చింది, నీ అభిరుచి.. అంకితభావం అన్నీ కూడా నిన్ను గొప్ప స్థానాన్ని పొందేలా చేస్తాయని ఒకరు అన్నారు.
  • ఇది ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని ఇంకొకరు అన్నారు.
  • ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన విద్యార్థిగా.. మీ కథ నాకు స్ఫూర్తిని ఇవ్వడమే కాకుండా, నాలో ఆశను కూడా కలిగించిందని మరొకరు అన్నారు. ఎక్కడ ప్రారంభించాలో కాదు, ఎంత ఎదగడం ముఖ్యమని నిరూపించారు. 12 గంటలు పనిచేసిన తరువాత, ఎవరైనా నిద్రపోతారు, నువ్వు నేర్చుకున్నావు. నేడు ఎంతోమందికి ఆదర్శమయ్యావని పేర్కొన్నారు.

నిజానికి ఎదగాలనే లక్ష్యంతో ముందుకెళ్లే వ్యక్తిని ఎవ్వరూ ఆపలేరు, ఎందుకంటే అతడు.. తనకు ఎదురయ్యే కష్టాలను కూడా లెక్కచేయకుండా ముందుకు సాగిపోతూ ఉంటాడు. ఇలా అకుంఠిత దీక్ష. పట్టుదలతో ప్రయత్నించినప్పుడే.. ఏదైనా సాధ్యమవుతుందని చెప్పడానికి పైన చెప్పిన అంశమే నిలువెత్తు నిదర్శనం.

మీకు తెలుసా.. సెప్టెంబర్‌లో ఎక్కువమంది కొన్న 5 కార్లు ఇవే!

ఒక నెల ముగిసిందంటే.. వాహన తయారీ సంస్థలు తమ సేల్స్ రిపోర్ట్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఇందులో భాగంగానే 2025 సెప్టెంబర్ ముగియగానే దిగ్గజ సంస్థలు గత నెలలో ఎన్ని కార్లను విక్రయించాయని వివరాలు వెల్లడించాయి. ఈ కథనంలో సెప్టెంబర్ 2025లో ఎక్కువ అమ్మకాలు పొందిన లేదా ఎక్కువమంది కొనుగోలు చేసిన టాప్ 5 కార్లను గురించి తెలుసుకుందాం.

సెప్టెంబర్ 2025లో ఎక్కువమంది కొన్న టాప్ 5 కార్లు

టాటా నెక్సాన్: దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ గత నెలలో తన నెక్సాన్ కారును ఏకంగా 22,573 యూనిట్లను విక్రయించింది. అంటే ఒక్క సెప్టెంబర్ నెలలోనే 22,573 మంది నెక్సాన్ కార్లను కొనుగోలు చేశారన్నమాట. గత ఏడాది ఇదే నెలలో (2024 సెప్టెంబర్) నెక్సాన్ సేల్స్ 11,470 యూనిట్లు మాత్రమే. దీన్ని బట్టి చూస్తే.. 2025 సెప్టెంబర్ నెలలో నెక్సాన్ అమ్మకాలు 97 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో నెక్సాన్ పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్, సీఎన్‌జీ రూపంలో అందుబాటులో ఉంది.

మారుతి డిజైర్: సెప్టెంబర్ 2025లో అత్యధికంగా అమ్ముడైన రెండో కారుగా మారుతి డిజైన్ స్థానం సంపాదించుకుంది. ఈ కారు సేల్స్ 2024 సెప్టెంబర్‌లో 10853 యూనిట్లకు మాత్రమే పరిమితమైంది. కాగా ఈ ఏడాది (2025 సెప్టెంబర్) ఈ మోడల్ అమ్మకాలు 20,038 యూనిట్లుగా నమోదయ్యాయి. దీంతో అమ్మకాల వృద్ధి 85 శాతం పెరిగింది. కొంత సరసమైన ధర వద్ద లభించే ఈ డిజైర్ కారు.. మంచి డిజైన్, వాహన వినియోగదారులకు కావలసిన ఫీచర్స్ పొందుతుంది. దీంతో ఎక్కువమంది దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

హ్యుందాయ్ క్రెటా: ఎక్కువ అమ్మకాలు పొందిన కార్ల జాబితాలో హ్యుండయ్ క్రెటా ముచ్చటగా మూడో స్థానంలో నిలిచింది. ఇది సెప్టెంబర్ 2025లో 18,861 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. సెప్టెంబర్ 2024లో ఈ అమ్మకాలు 15,902 యూనిట్లు. అంటే క్రెటా అమ్మకాలు ఈ ఏడాది 19 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ కారు ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కువ అమ్మకాలు పొందిన కారుగా కూడా రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ కారు ఎలక్ట్రిక్ రూపంలో కూడా అందుబాటులో ఉంది.

మహీంద్రా స్కార్పియో: ఇండియన్ మార్కెట్లో ఎక్కువమందికి చాలాకాలం నుంచి ఇష్టమైన కార్లలో ఒకటిగా ఉన్న మహీంద్రా కంపెనీకి చెందిన స్కార్పియో గత నెలలో (2025 సెప్టెంబర్) మంచి అమ్మకాలు పొందగలిగింది. ఈ కారు 18372 యూనిట్ల అమ్మకాలతో జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. 2025 సెప్టెంబర్ నెలలో ఈ మోడల్ సేల్స్ 14438 యూనిట్లు మాత్రమే. అంటే సంస్థ వార్షిక వృద్ధి 27 శాతం పెరిగింది. ప్రస్తుతం ఈ కారు స్కార్పియో, స్కార్పియో నియో పేర్లతో అమ్మకానికి అందుబాటులో ఉంది.

టాటా పంచ్: లాస్ట్ పంచ్ మనదైతే.. ఆ కిక్కే వేరప్పా అన్నట్లు, మన జాబితాలో ఎక్కువ అమ్మకాలు పొందిన కారుగా ఐదవ స్థానంలో టాటా పంచ్ స్థానం ఆక్రమించుకుంది. ఈ కారు మొత్తం సేల్స్ సెప్టెంబర్ 2025లో 15891 యూనిట్లు. గత ఏడాది ఇదే నెలలో.. అంటే సెప్టెంబర్ 2024లో ఈ కారు అమ్మకాలు 13711 యూనిట్లు. వార్షిక వృద్ధి పరంగా ఇది 16 శాతం ముందుకు సాగింది. సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ కలిగిన ఈ కారు.. అత్యధిక భద్రతా ఫీచర్స్ పొందింది. ధర కూడా కొంత తక్కువే కావడంతో ఈ కారును ఎక్కువమంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

కార్ల అమ్మకాలు పెరగడానికి కారణాలు

సెప్టెంబర్ 2025లో జరిగిన వాహన అమ్మకాలు ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదని పలు నివేదికలు పేర్కొన్నాయి. ఇంత భారీ అమ్మకాలు జరగడానికి ప్రధాన కారణం.. పండుగ సీజన్, తగ్గిన జీఎస్టీ (కొత్త జీఎస్టీ సంస్కరణలు) అని తెలుస్తోంది. ఇండియన్ ఆటోమొబైల్ సెక్టార్ సెప్టెంబర్ 2025లో 3,78,457 యూనిట్ల వాహనాలను డీలర్లను పంపించింది. 2024 సెప్టెంబర్ నెలలో ఈ సంఖ్య 3,58,879 యూనిట్లు. దీన్నిబట్టి చూస్తే.. అమ్మకాలలో వార్షిక వృద్ధి 5.5 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది.

తెలుగులోనూ బైసన్ సినిమా: ధృవ్ విక్రమ్ & అనుపమ లవ్ సాంగ్ వచ్చేసింది!

0

మారీ సెల్వరాజ్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం బైసన్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 17వ తేది రోజున దీపావళి సందర్బంగా విడుదల కానుంది. దీనికి సంబంధించిన నాలుగు పాటలను తమిళంలో రిలీజ్ చేశారు. అవి ఒక రేంజ్‌లో హిట్ అయ్యాయి. ఇప్పటికి మిలయన్స్ వ్యూస్‌తో ఇంకా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు తెలుగులో ఎటువంటి పాటలు, టీజర్, ప్రకటనలుగానీ.. ప్రచారంగానీ జరగలేదు.

బైసన్ తెలుగు సాంగ్

సాధారణంగా సినిమా డైరెక్ట్ మారీ సెల్వరాజ్‌కు తెలుగులో కూడా ఒక ప్రత్యేకమైన అభిమానుల సమూహం ఉంది. ఆయన తీసే విభిన్నమైన చిత్రాలు తెలుగులో కూడా రిలీజ్ అయితే బాగుంటుంది అని ఎంతో ఆత్రుతతో సినిమా కోసం ఎదురుచూసే వారి సంఖ్య రోజురోజుకి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతోంది. బైసన్ సినిమా తెలుగులో రాదేమో అని నిరాశ చెందిన మారీ అభిమానులకు ఎట్టకేలకు ఒక సంతోషాన్ని కలిగించే అప్డేట్ ఇచ్చారు. నిన్న (గురువారం) సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మూవీకి సంబంధించిన తీరేనా తీరేనా గుండెల్లోనా మండుతుండే మూగ వేదనా.. అనే అత్యంత పెయిన్ ఫుల్ లవ్ సాంగ్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు.

ఇంకో ఏడురోజులే

బైసన్ రిలీజ్‌కు.. ఇంకా ఏడురోజులే సమయం ఉండటంతో అన్ని రాష్ట్రాల్లో ప్రచారం ముమ్మరం చేసినట్టుగా కనిపిస్తోంది. అందుకే మూవీ పట్ల ఆసక్తిని పెంచడానికి తెలుగులో వీడియో సాంగ్ విడుదల చేసినట్టున్నారు. తమిళంలో రిలీజ్ అయిన పాటలన్నీటికీ అక్కడి ప్రజల్లో, సోషల్ మీడియాలో భారీ స్పందన లభిస్తోంది. అంతే కాకుండా సినిమా రిలీజ్ చేసే ప్రతి థియేటర్ ముందర బైసన్ తలకాయ ఉన్న నమూనాను పెడుతున్నారు. ఇది ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటోంది.

మ్యూజిక్ డైరెక్టర్ నివాస్ కే ప్రసన్న, సింగర్ సత్యన్, హీరో ధృవ్ విక్రమ్, హీరోయిన్స్ అనుపమ పరమేశ్వరన్, రజిషా విజయన్ లు షాపింగ్ కాంప్లెక్స్ లాంటివాటిలో ప్రొమోషన్లలో పాల్గొని ఫ్యాన్స్ అండ్ పబ్లిక్‌తో ఇంట్రాక్ట్ అవుతున్నారు. ఇది సినిమాపట్ల సానుకూలమైన వాతావరణాన్ని తీసుకొస్తున్నది.

ప్రేమ విరహ గీతం

తెలుగులో విడుదలైన బైసన్ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ & సింగర్ నివాస్ కె ప్రసన్న. అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చడంతో పాటు వినసొంపైన గాత్రంతో పాడి దానికి జీవం పోశారని చెప్పొచ్చు. ఇంకా ఆ గేయంలో ఉన్న ప్రేమ మరియు ప్రియురాలుకు మధ్య ఉన్న అనుబంధాన్ని తెలిపే పదాలు రాసిన విధానం హృదయాన్ని ధ్రవింప చేస్తుంది.

ఇందులో పాటలన్నింటికి సాహిత్యాన్ని డైరెక్టర్ మారీ సెల్వరాజ్ అందించడం విశేషం. “నువ్వు మనువాడి పోతే నే తల్లాడి పోనా, నీ కథ మారిపోతే నే కడితేరిపోతాను, లాంటి పాటలో పదాలు హీరో, హీరోయిన్ క్యారెక్టర్స్ మధ్య ఎంత గాఢమైన ప్రేమ, సాన్నిహిత్యం, బాధ ఉందో అర్థవుతోంది. “తీరేనా తీరేనా గుండెల్లోనా మండుతున్న మూగవేదన, మారేనా మారేనా కళ్ళల్లోనా కానవచ్చే నేటి వేదనా” లాంటి లోతైన అర్థాన్ని ఇచ్చే పదాలు వింటుంటే ఇది కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని.. డైరెక్టర్ మారీ సెల్వరాజ్, హీరో ధ్రువ్ విక్రమ్‌లకు ఒక మంచి తీపి గుర్తులు, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కుమ్మరిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. హ్యాష్‌ట్యాగ్ బైసన్ పేరుతో ఫ్యాన్స్ అంతా మూవీని ట్రెండ్ చేస్తున్నారు.

నోబెల్ ప్రైజ్ 2025: ట్రంప్ కోరిక తీరేనా.. జాబితాలో నిలిచేనా?

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠతక అవార్డైన నోబెల్ ప్రైజ్ 2025ను.. ఇప్పటికే మెడిసిన్, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం మరియు సాహిత్య రంగాలకు ప్రకటించారు. ఈ రోజు (శుక్రవారం) శాంతికి గానూ ఈ అవార్డును ప్రకటించనున్నారు. ఆర్ధిక శాస్త్రానికి కూడా త్వరలోనే ప్రకటించనున్నారు. అయితే శాంతికిగానూ ప్రకటించే నోబెల్ ప్రైజ్ నాదే అని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టిగా నమ్ముతున్నారు.

ఏడు శాంతి ఒప్పందాలు

భారత్ – పాకిస్తాన్ మధ్య జరిపిన ఒప్పందం సహా.. మొత్తం ఏడు శాంతి ఒప్పందాలు తాను చేసినట్లు డొనాల్డ్ ట్రంప్ చెబుతోనే ఉన్నారు. అయితే ఈ వాదనను కొన్ని దేశాలు ఖండిస్తున్నప్పటికీ.. ఇజ్రాయెల్, కంబోడియా, పాకిస్తాన్ వంటి దేశాలు సమర్దిస్తున్నాయి. అంతే కాకుండా అమెరికా వైట్ హౌస్ దేశ అధ్యక్షునికి ది పీస్ ప్రెసిడెంట్ అనే బిరుదుకు కూడా ఇచ్చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. నెట్టింట్లో కొందరు నెటిజన్లు ట్రోల్స్ కూడా చేస్తున్నారు.

నిజానికి ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో రెండు సార్లు నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యారు. అయితే ఈ సారిమాత్రం ట్రంప్‌నకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, కంబోడియా మంత్రి హున్ మానెట్, పాకిస్తాన్ ప్రభుత్వంతో పాటు.. అమెరికా చట్టసభలోని సభ్యులు కూడా మద్దతు ప్రకటిస్తూ.. నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. అయితే ఈ రోజు ప్రకటించే నోబెల్ ప్రైజ్ జాబితాలో ట్రంప్ పేరు ఉంటుందా? లేదా అనేది తెలియాల్సిన విషయం.

2025 నోబెల్ ప్రైజ్ విజేతలు

మెడిసిన్: మేరీ ఈ. బ్రంకో, ఫ్రెడ్ రామ్స్‌డెల్, షిమోన్ సకాగుచి
భౌతిక శాస్త్రం: జాన్ క్లార్క్, మిచెల్ హెచ్, డెవోరేట్, జాన్ ఎమ్. మార్టినిస్
రసాయన శాస్త్రం: సుసుము కిటగావా, రిచర్డ్ రాబ్సన్, ఒమర్ ఎమ్. యాగీ
సాహిత్యం: హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్జ్నాహోర్కై

నోబెల్ ప్రైజ్ పొందిన అమెరికా అధ్యక్షులు

ఇప్పటివరకు నలుగురు అమెరికా అధ్యక్షులు, ఒక అమెరికా ఉపాధ్యక్షుడు మాత్రమే అత్యంత ప్రతిష్టాత్మక శాంతి బహుమతి నోబెల్ ప్రైజ్ అందుకున్నారు. ఇందులో థియోడర్ రూజ్‌వెల్ట్, వుడ్రో విల్సన్, జిమ్మీ కార్టర్, బరాక్ ఒబామా, అల్ గోర్ ఉన్నారు.

థియోడర్ రూజ్‌వెల్ట్

నోబెల్ ప్రైజ్ అందుకున్న మొదటి అమెరికా అధ్యక్షుడిగా థియోడర్ రూజ్‌వెల్ట్ చరిత్ర సృష్టించారు. పోర్ట్స్‌మౌత్ ఒప్పందం ద్వారా.. రష్యా – జపనీస్ యుద్దానికి మధ్యవర్తిత్వం వహించినందుకు ఈ నోబెల్ శాంతి బహుమతి పొందారు. ఇప్పటికే ఈ అవార్డు వైట్ హౌస్ వెస్ట్ వింగ్‌లోని రూజ్‌వెల్ట్ గదిలో ఉందని సమాచారం. 1906లో ఈ బహుమతి పొందారు.

వుడ్రో విల్సన్

అమెరికా 28వ అధ్యక్షుడు విల్సన్.. మొదటి ప్రపంచ యుద్ధం ముగించడంలో కీలక పాత్రను పోషించారు. శాంతిని కాపాడే లక్ష్యంతో ప్రపంచంలోని మొట్టమొదటి అంటారు ప్రభుత్వ సంస్థ అయిన లీగ్ ఆఫ్ నేషన్స్‌ను ఏర్పాటు చేయడంలో భాగమయ్యారు. దీనికిగానూ 1919లో నోబెల్ శాంతి బహుమతి లభించింది.

జిమ్మీ కార్టర్

అమెరికా 39వ అధ్యక్షుడైన జిమ్మీ కార్టర్.. పదవీ విరమణ చేసిన 21 సంవత్సరాల తరువాత 2002లో నోబెల్ బహుమతి అందుకున్నారు. అంతర్జాతీయ శాంతి, ప్రజాస్వామ్యం & మానవహక్కులను ముందుకు తీసుకెళ్లడంలో ఈయన చేసిన సుదీర్ఘ కృషికి.. ఆర్ధిక మరియు సామజిక అభివృద్ధిని ప్రోత్సహించడంలో దశబ్దాలుగా చేసిన అవిశ్రాంత కృషికి.. జిమ్మీ కార్టర్ నోబెల్ ప్రైజ్ అందుకున్నారు.

బరాక్ ఒబామా

44వ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బరాక్ ఒబామా 2009లో నోబెల్ శాంతి బహుమతి పొందారు. దేశాలమధ్య సత్సంబంధాలను మెరుగుపరిచినందుకుగానూ.. ఈ బహుమతి లభించింది. అంతర్జాతీయ దేశాల మధ్య దౌత్యం, ప్రజల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడంలో ఈయన సుదీర్ఘ కృషి చేశారు.

అమెరికన్ బ్రాండ్ కారు కొన్న రోహిత్ శర్మ: నెంబర్ ప్లేట్ చాలా స్పెషల్!

సినీతారలు, రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు ఎప్పటిపైకప్పుడు తమకు ఇష్టమైన వాహనాలను (కార్లు & బైకులు) కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే టీమీడియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ.. తాజాగా అమెరికన్ బ్రాండ్ అయిన టెస్లా కంపెనీకి చెందిన మోడల్ వై కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రోహిత్ శర్మ కొత్త కారు

స్వయంగా ఆటోమొబైల్ ఔత్సాహికుడు అయిన రోహిత్ శర్మ ఇప్పటికే.. ఖరీదైన లంబోర్ఘిని ఉరుస్ ఎస్ఈ కారును ఉపయోగిస్తున్నారు. కాగా ఇప్పుడు తాజాగా టెస్లా మోడల్ వై ఎలక్ట్రిక్ కారును తన గ్యారేజిలో చేర్చారు. ఇటీవలే టెస్లా ఇండియా.. మోడల్ వై డెలివరీలను ప్రారంభించింది. దీన్నిబట్టి చూస్తే టెస్లా మోడల్ వై కొనుగోలు చేసిన ప్రముఖుల జాబితాలో రోహిత్ శర్మ ఒకరుగా నిలిచారని తెలుస్తోంది.

ప్రత్యేకమైన నెంబర్ ప్లేట్

రోహిత్ శర్మ కొనుగోలు చేసిన టెస్లా మోడల్ వై ఎలక్ట్రిక్ కారు.. క్విక్ సిల్వర్ రంగులో ఉంది. అయితే ఈ కారు డైమండ్ బ్లాక్, పెర్ల్ వైట్, అల్ట్రా రెడ్, డీప్ బ్లూ మెటాలిక్, స్టీల్త్ గ్రే వంటి రంగుల్లో కూడా లభిస్తుంది. ఇక్కడ రోహిత్ శర్మ కొనుగోలు చేసిన కారు గురించి తెలుసుకోవలసిన మరో అంశం ఏమిటంటే.. 3015 అనే రిజిస్ట్రేషన్ ప్లేట్ లేట్ నెంబర్ ప్లేట్. ఇది తన పిల్లల పుట్టిన తేదీలను సూచిస్తుంది. ”డిసెంబర్ 30వ తేదీ తన కుమార్తె పుట్టిన రోజు, నవంబర్ 15 కుమారుడి పుట్టిన రోజు”. ఈ రెండు రోజుల గుర్తుగా 3015 నెంబర్ సెలెక్ట్ చేసుకున్నారు.

టెస్లా మోడల్ వై గురించి

అమెరికా కంపెనీ అయిన టెస్లా.. ఇండియన్ మార్కెట్లో మోడల్ వై కారును లాంచ్ చేసింది. కంపెనీ దీనిని చైనా నుంచి దిగుమతి చేసి, భారతీయ విఫణిలో విక్రయిస్తుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 59.89 లక్షలు. కాగా లాంగ్ రేంజ్ వేరియంట్ ధర రూ. 67.89 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్).

టెస్లా మోడల్ వై ఎలక్ట్రిక్ కారు.. రియర్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్ పొందుతుంది. ఇందులో సింగిల్ ఎలక్ట్రిక్ మోటారు 299 హార్స్ పవర్, 420 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. స్టాండర్డ్ వేరియంట్ లేదా బేస్ వేరియంట్ మోడల్ వై 60.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక ఫుల్ ఛార్జితో 500 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ కావు కేవలం 5.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం (యాక్సలరేషన్) అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 201 కిమీ కావడం గమనార్హం.

ఇక టాప్ వేరియంట్ లేదా లాంగ్ రేంజ్ రియర్ వీల్ డ్రైవ్ మోడల్ వై కారు 75 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక సింగిల్ ఛార్జితో 622 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ వేరియంట్లోని ఎలక్ట్రిక్ మోటారు 340 హార్స్ పవర్, 450 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాగా ఇది 5.6 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం 201 కిమీ/గం. దీని బట్టి చూస్తే.. వేగంలో రెండు వేరియంట్లు సమానంగా ఉన్నాయని అర్థమవుతోంది.

భారతదేశంలోని 5 బెస్ట్ 7-సీటర్ కార్లు: ధర & వివరాలు

ఇండియన్ మార్కెట్లో చిన్నకార్లకు (5 సీటర్స్) మాత్రమే కాకుండా.. పెద్ద కార్లకు (7 సీటర్స్) కూడా మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు దేశీయ విఫణిలో 7 సీటర్ కార్లను లాంచ్ చేశాయి. అయితే కొన్ని సంస్థలు లాంచ్ చేసిన ఈ కార్ల ధరలు కొంత ఎక్కువగానే ఉన్నాయి. ధర ఎక్కువైతే కొనుగోలుదారుల సంఖ్య కొంత తగ్గే అవకాశం ఉంది. అయితే ఈ కథనంలో దేశంలోని సరసమైన 7 సీటర్ కార్లు ఏవి?, వాటి వివరాలు ఏమిటనేది చూసేద్దాం.

రెనాల్ట్ ట్రైబర్

సరసమైన 7 సీటర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది.. రెనాల్ట్ ట్రైబర్. దీని ధర రూ. 5.76 లక్షల నుంచి రూ. 8.60 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది. మూడు వరుసల సీటింగ్ ఆప్షన్ పొందిన ఈ కారు.. ప్రయాణికులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇందులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 72 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్, ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. ఈ కారులోని మద్యవరుస బెంచ్ సీట్లను 60:40 నిష్పత్తిలో మడచవచ్చు, ముందుకు & వెనుకకు జరుపవచ్చు. ప్రయాణికుల సౌకర్యార్థం.. కంపెనీ ఈ కారులోని మద్యవరుస, చివరి వరుస సీట్లకు ఏవెంట్స్ ఏర్పాటు చేసింది.

మహీంద్రా బొలెరో

దేశీయ విఫణిలో రూ. 7.99 లక్షల నుంచి రూ. 9.69 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ధర వద్ద లభించే మహీంద్రా కంపెనీకి చెందిన బొలెరో కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ మోడల్. ఇది 7 సీటర్ కారు అయినప్పటికీ.. వెనుక సీట్లు కొంత భిన్నంగా.. మోకాలికి తగినంత స్పేస్ ఉండదు. దీనివల్ల లాంగ్ జర్నీ చేసేటప్పుడు, ప్రయాణికులు ఇబ్బందిపడాల్సి ఉంటుంది. అయితే ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, లెథరెట్ అపోల్స్ట్రే, రియర్ ఏసీ వెంట్స్ వంటి ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 76 హార్స్ పవర్ అందిస్తుంది. మూడవ వరుసలో సైడ్ ఫేసింగ్ సీట్లు ఉన్నాయి.

మహీంద్రా బొలెరో నియో

దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన బొలెరో నియో కూడా సరసమైన 7 సీటర్ కార్ల జాబితాలో ఒకటి. దీని ధర రూ. 8. 49 లక్షల నుంచి రూ. 10.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). సాధారణ బొలెరో కంటే కూడా బొలెరో నియో లేటెస్ట్ డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ప్రయాణికుల సౌలబ్యార్థం సీటింగ్ పొజిషన్ ఉంటుంది. కుర్చీలాంటి ఫ్రంట్ సీట్లు, మధ్యవరుసలో ముగ్గురు కూర్చోవడానికి అనువైన సీటింగ్ ఉంటుంది. కొంత ఇరుకుగా ఉంటుందని సమాచారం. ఈ కారులోని 1.5 లీటర్ 3 సిలిండర్ డీజిల్ ఇంజిన్ 100 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మారుతి ఎర్టిగా

భారతదేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన 7 సీటర్ మోడల్ ఈ మారుతి ఎర్టిగా. దీని ధర రూ. 8.80 లక్షల నుంచి రూ. 12.94 లక్షలు (ఎక్స్ షోరూమ్). బెస్ట్ సెల్లింగ్ కారుగా రికార్డ్ క్రియేట్ చేసిన ఈ కారు.. ప్రయాణికులకు చాలా అనుకూలమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. విశాలమైన క్యాబిన్, మూడు వరుసల సౌకర్యవంతమైన సీటింగ్ పొజిషన్ ఉండటం వల్ల దీనిని ఎక్కువమంది ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. ఇందులో 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ 103 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ మాన్యువల్, ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. ఇది సీఎన్‌జీ రూపంలో కూడా అమ్మకానికి ఉంది. ఇది సాధారణ పెట్రోల్ కారు కంటే కూడా ఎక్కువ మైలేజ్ ఇస్తుంది.

కియా కారెన్స్

సౌత్ కొరియా బ్రాండ్ అయినప్పటికీ.. ఇండియన్ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన మోడల్ ఈ కియా కారెన్స్. రూ. 10.99 లక్షల నుంచి రూ. 12.77 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ధర వద్ద లభిస్తున్న ఈ మోడల్ 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ (115 హార్స్ పవర్), 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ (116 హార్స్ పవర్) ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. ఈ రెండూ కూడా మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మూడు వరుసలలో ఉన్న సీట్లు ప్రయాణికులకు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. డిజైన మరియు ఫీచర్స్ పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది.

చెల్లికి నచ్చిన గిఫ్ట్ ఇచ్చిన రింకూ సింగ్: ధర ఎంతో తెలుసా?

అయినవాళ్లకు గిఫ్ట్స్ ఇవ్వడం ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. ఇందులో భాగంగానే 2025 ఆసియా కప్ విజేత భారత్ జట్టులో భాగమైన ఇండియన్ బ్యాటర్ రింకూ సింగ్ తన చెల్లెలికి ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ గిఫ్ట్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

చెల్లికి నచ్చిన గిఫ్ట్

2025 ఆసియా కప్ గెలిచినా తరువాత.. మార్క్యూ టోర్నమెంట్ తరువాత.. ఆస్ట్రేలియా పర్యటన కోసం తిరిగి జట్టులోకి చేరడానికి ముందు క్రికెటర్ రింకూ సింగ్ తన కుటుంబంతో గడిపారు. ఈ సమయంలో తన చెల్లి నేహా సింగ్‌కు.. హీరో విడా వీఎక్స్2 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ గిఫ్ట్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివన్నీ నేహా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.

రింకూ సింగ్ తన చెల్లికి కొనిచ్చిన హీరో విడా వీఎక్స్2 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర సుమారు రూ. 1లక్ష. ఇది ఎరుపు రంగులో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇది లేటెస్ట్ డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా.. మంచి పర్ఫామెన్స్ కూడా అందిస్తుంది. అన్న గిఫ్ట్ ఇచ్చిన సందర్భంగా నేహా.. ఇన్‌స్టాలో కృతజ్ఞతలు చెబుతూ పోస్ట్ చేసింది.

హీరో విడా వీఎక్స్2 ప్లస్

విభిన్న రంగులలో లభించే హీరో విడా వీఎక్స్2 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్.. 3.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. ఇది ఒక ఫుల్ ఛార్జితో 142 కిమీ రేంజ్ అందిస్తుంది (రియల్ వరల్డ్ రేంజ్ కొంత తగ్గే అవకాశం ఉంటుంది). దీని టాప్ స్పీడ్ 80 కిమీ/గం కాగా.. ఇది ఎకో, రైడ్, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. డిస్క్ బ్రేక్ ఆప్షన్ కలిగిన ఈ స్కూటర్ అండర్ సీట్ స్టోరేజ్ 27.2 లీటర్స్ కావడం గమనార్హం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుల్ ఛార్జ్ కావడానికి 5 గంటల 36 నిమిషాల సమయం పడుతుంది. మొత్తం మీద ఇది సిటీ రైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది.

రింకూ సింగ్ విషయానికి వస్తే..

క్రికెటర్ రింకూ సింగ్ విషయానికి వస్తే.. ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన ఆసియాకు ఫైనల్‌లో విన్నింగ్ షాట్ కొట్టి వార్తల్లో నిలిచారు. అలీఘర్‌లో జన్మించిన రింకూ.. అంచెలంచెలుగా ఎదిగారు. ఇటీవల ఆసియాకు కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఒక బంతి మాత్రమే బ్యాటింగ్ చేయడానికి అవకాశం లభించింది. ఆ అవకాశం కీలకంగా మారడంతో.. నాలుగు పరుగులు చేసి ఆటను గెలిపించాడు. నిజానికి ఫైనల్ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యకు గాయం కావడంతో.. రింకు జట్టులోకి వచ్చాడు. ఆలా ఫైనల్ మ్యాచ్ గెలవడానికి కారణమయ్యాడు.

ఇదిలా ఉండగా.. రింకూ సింగ్ గత ఏడాది తన స్వస్థలమైన అలీఘర్‌లో రూ. 3.5 కోట్ల విలువైన మూడు అంతస్థుల బంగ్లా కొనుగోలు చేశారు. ఈ బంగ్లాకు తన తల్లి గౌరవార్థం ‘వీణ ప్యాలెస్’ అని పేరు పెట్టారు. కాగా ఇతడు ఇప్పటి వరకు 34 టీ20 మ్యాచ్‌లు ఆడారు. 161.75 స్ట్రైక్ రేటుతో 550 పరుగులు చేసాడు. అంతే కాకుండా జాతీయ జట్టు తరపున రెండు వన్ డే మ్యాచ్‌లు ఆడారు.