Home Blog Page 84

మహిళల మనసుదోచే టూవీలర్స్.. ధరలు & వివరాలు

0

ఆధునిక మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా దూసుకెళ్తున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు, కార్లు డ్రైవ్ చేస్తున్నారు, బైక్స్ రైడ్ చేస్తున్నారు. అయితే మోటార్‌సైకిల్ అనగానే పురుషలకే అన్నట్టు చాలామంది అనుకుంటారు. కానీ మహిళలు కూడా రైడ్ చేయడానికి అనువైన టూ వీలర్స్ ఉన్నాయన్న సంగతి బహుశా మరిచారేమో. ఈ కథనంలో మహిళలు రైడ్ చేయడానికి అనుకూలమైన ఐదు స్కూటీల గురించి తెలుసుకుందాం.

హీరో ప్లెజర్ ప్లస్ ఎక్స్‌టెక్

మహిళలు రైడింగ్ చేయడానికి అనుకూలమైన స్కూటర్ల జాబితాలో హీరో ప్లెజర్ ప్లస్ ఎక్స్‌టెక్ ఒకటి. రూ. 74,361 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభించే ఈ స్కూటర్ ఎల్ఎక్స్, వీఎక్స్, జెడ్ఎక్స్ ప్లస్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. సుమారు 106 కేజీల బరువున్న ఈ స్కూటర్ రోజువారీ వినియోగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని 110 సీసీ ఇంజిన్ 8 బీహెచ్‌పీ పవర్, 8.70 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 50 కిమీ/లీ కంటే ఎక్కువ మైలేజ్ అందిస్తుంది.

టీవీఎస్ జుపీటర్ 110

మహిళలకు అనువైన స్కూటర్ల జాబితాలో మరో టూ వీలర్ టీవీఎస్ కంపెనీకి చెందిన జుపీటర్ 110. దీని ధర రూ. 72400 (ఎక్స్ షోరూమ్). ఇందులోని 113.3 సీసీ ఇంజిన్ 7.9 బీహెచ్‌పీ పవర్, 9.8 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. 105 కేజీల బరువున్న ఈ స్కూటర్ నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. మంచి డిజైన్ కలిగి.. లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల దీనిని కొనుగోలు చేయడానికి ఎక్కువమంది ఇష్టపడతారు. రోజువారీ వినియోగానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

టీవీఎస్ స్కూటీ జెస్ట్ 110

స్కూటీ జెస్ట్ 100 కూడా టీవీఎస్ కంపెనీకి చెందిన టూ వీలర్. దీని ధర రూ. 73854 (ఎక్స్ షోరూమ్). మంచి రైడింగ్ అనుభూతిని అందించే ఈ స్కూటర్ 109.7 సీసీ ఇంజిన్ ద్వారా 7.7 బీహెచ్‌పీ, 8.8 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. సుమారు 103 కేజీల బరువున్న ఈ స్కూటర్.. రెండు వేరియంట్లలో, మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. డిజైన్, ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రైడర్ వినియోగానికి కావలసిన అన్ని ఫీచర్స్ ఇందులో ఉంటాయి.

హోండా డియో

ఇండియన్ మార్కెట్లో ఎక్కువ మందికి ఇష్టమైన బైకులలో.. హోండా డియో ఒకటి. రూ. 91000 ఎక్స్ షోరూమ్ ధర వద్ద లభించే స్కూటర్ స్టైలిష్ డిజైన్ పొందుతుంది. రెండు వేరియంట్లలో లభించే ఈ స్కూటర్.. 109.51 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 7.84 బీహెచ్‌పీ పవర్, 9.03 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ స్కూటర్ మహిళలకు మాత్రమే కాకూండా.. యువ రైడర్లకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. రైడింగ్ చేయడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

సుజుకి యాక్సెస్ 125

స్టైలిష్ డిజైన్.. అప్డేటెడ్ ఫీచర్స్ కలిగిం సుజుకి యాక్సెస్ 125 కూడా మహిళలు ఉపయోగించడానికి అనుకూలమైన స్కూటర్ల జాబితాలో ఒకటి. 124 సీసీ ఇంజిన్ ద్వారా 8.31 బీహెచ్‌పీ పవర్, 10.2 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 106 కేజీల బరువున్న ఈ స్కూటర్ మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 71557 (ఎక్స్ షోరూమ్). రోజువారీ వినియోగానికి, నగర ప్రయాణానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

పా. రంజిత్ కొత్త సినిమా.. డిఫరెంట్ లుక్‌లో అట్టకత్తి దినేష్..!

0

పా. రంజిత్.. ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఈ పేరుకి ఇండియాలో ఒక ప్రత్యకమైన గుర్తింపు ఉంది. ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అనే మాట ఈయనకు బాగా సరిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి అనుమానం అక్కరలేదు. ఇతని సినిమాలు కూడా ఈ దేశంలోని కొన్ని వర్గాల ప్రజల ఆస్థిత్వాన్ని, ఉనికిని చాటిచెప్పడానికే ప్రయత్నిస్తుంటాయి. సామాజికంగా, ఆర్థికంగా సమాజంలో వెనకబడిన, అనచివేయబడిన జనం జీవితాలను, వారి చరిత్రను తెరకెక్కించడంలో పా.రంజిత్ సిద్దహస్తుడు. ఈయన దర్శకత్వంలో వచ్చిన.. అట్టకత్తి, మద్రాస్, కబాలి, కాలా, సార్పట్ట పరంపర, తంగళాన్ సినిమాలు చూస్తే అతని ఆలోచన, తపన, ఆవేదన ఏంటి అనేది అర్థమవుతాయి. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు తాజాగా.. చేతుల్ని ముడుచుకుని మిగతా వాటితో పోరాడు అనే బలమైన క్యాప్షన్‌తో ఒక కొత్త మూవీ అప్డేట్ వీడియో రిలీజ్ చేశారు.

అట్టకత్తి దినేష్ బర్త్‌డే స్పెషల్

థియేటర్లలో ప్రస్తుతం విజయవంతంగా నడుస్తున్న తమిళ చిత్రం తండకారణ్యం. ఈ సినిమా హీరో అట్టకత్తి దినేష్ (వీఆర్ దినేష్)  పుట్టిన రోజు సందర్భంగా.. పా. రంజిత్ శుభాకాంక్షలు చెబుతూ నీలం ప్రొడక్షన్స్ సోషల్ మీడియా ఖాతాలో అతని కొత్త సినిమా వీడియోను అప్లోడ్ చేశారు. ఈ వీడియోలో గమనిస్తే.. అట్టకత్తి దినేష్ మునుపెన్నడూ కనిపించని కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. నల్లని దుస్తులు ధరించి కర్రసాము చేస్తున్న యాక్షన్ సన్నివేశాలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ రాబోయే సినిమా పట్ల ఆసక్తిని మరింత పెంచేస్తున్నాయి.

రాబోయే ఈ సినిమాను లెర్న్ అండ్ టీచ్ ప్రొడక్షన్స్ & నీలం ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పా. రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పా. రంజిత్8 అనే హ్యాష్‌ట్యాగ్‌తో రిలీజ్ అయిన ఈ వీడియో.. ఇప్పటివరకు విడుదలైన అన్ని సినిమాలకంటే అద్భుతంగా ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. అయితే ఈ సినిమాకు ఇంకా ఖరారు చేయలేదు.

ప్రస్తుతం సినిమా.. షూటింగ్ దశలో ఉంది. పా. రంజిత్, అట్టకత్తి దినేష్ (వీఆర్ దినేష్)  సినీ జీవితంలో ఈ మూవీ ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అర్థమవుతోంది. అయితే సినిమా టైటిల్ ఏమిటి?, దీనికోసం ఎంత బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు?, రిలీజ్ డేట్ వంటి చాలా విషయాలు రానున్న రోజుల్లో తెలుస్తాయి. బహుశా ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.

నిర్మాతగా పా. రంజిత్ సినిమాలు

ప్రముఖ దర్శకుడుగా పేరుపొందిన పా.రంజిత్ కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు, నిర్మాత కూడా. తన సొంత నిర్మాణ సంస్థ అయిన నీలం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎన్నో చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం తమిళంలో.. తాను నిర్మించిన తండకారణ్యం సినిమా రెండో వారంలో కూడా థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతోంది. కాగా చియాన్ విక్రమ్ కుమారుడు దృవ్ విక్రమ్ హీరోగా.. డైరెక్టర్ మారి సెల్వరాజ్ దర్శకత్వంలో బైసన్ అనే సినిమాలో నటిస్తున్నారు. దీనికి నిర్మాత పా. రంజిత్. రాబోయే దీపావళికి ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, సాంగ్స్ అన్ని కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

కాంతారా కోసం జూనియర్ ఎన్టీఆర్: అట్టహాసంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్

0

కాంతారా సీక్వెల్.. కాంతారా చాప్టర్-1 విడుదలకు సిద్ధమైంది. అంతకంటే ముందు సెప్టెంబర్ 28న .. అంటే రేపు (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ఈ కార్యక్రమాన్ని జూనియర్ ఎన్టీఆర్, రిషబ్ శెట్టి అభిమానుల అంచనాలకు తగినట్టుగా హైద‌రాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకపై ఇప్పటికే అభిమానుల్లో కొత్త సందడి నెలకొని ఉంది.

కాంతారా మొదటి భాగం కర్ణాటక రాష్ట్రంలో.. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ఎవరు ఊహించని విధంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ చిత్రానికి హీరోగా మాత్రమే కాకూండా.. డైరెక్టర్‌గా కూడా పనిచేసిన రిషబ్ శెట్టి అదే ఉత్సాహంతో మళ్ళీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు. కాంతారా మొదటి వెర్షన్ ఇచ్చిన విజయం వల్ల ఇప్పుడు ఈ కాంతారా చాప్టర్ -1 పైన అంచనాలు పెరిగిపోయాయి.

చీఫ్ గెస్ట్‌గా జూనియర్ ఎన్టీఆర్

ఇక ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ విషయానికి వస్తే.. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్లలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. రిషబ్ శెట్టి.. జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు కావడంతో ఈ ఈవెంట్‌కి ఎన్టీఆర్ విచ్చేస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు, ఏ కార్యక్రమానికి హాజరైనా కూడా అభిమానులు పెద్ద ఎత్తున హాజరవుతారు. దీన్నిబట్టి చూస్తే.. కాంతారా చాప్టర్-1 ప్రీ రిలీజ్ కార్యక్రమానికి కూడా అభిమానుల హాజరు ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుందని సమాచారం. కాగా రేపు సాయంత్రం ఇద్దరినీ (రిషబ్ & ఎన్టీఆర్) ఒకే వేదికపై చూడటానికి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

కాంతారా చాప్టర్-1 సినిమా గురించి

ఇక కాంతారా చాప్టర్-1 విషయానికి వస్తే.. ఈ సినిమా 2025 అక్టోబర్ 02న విజయ దశమి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ మూవీ హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాంతారా ఘనవిజయం సాధించిన తరువాత.. దాని సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అనుకున్న విధంగానే ఈ కాంతారా చాప్టర్-1.. కాంతారా విజయ పరంపరని కొనసాగిస్తుందా?, లేదా? అనేది రిలీజ్ తరువాత తెలుస్తుంది.

నిజానికి కన్నడ ప్రాంత సంస్కృతికి సంబంధించిన నేపథ్యంలో విడుదలైన ఈ సినిమా ఎంతోమందిని ఆకట్టుకుంది. రిషబ్ శెట్టికి కూడా ఈ సినిమా ద్వారా ప్రత్యేక గుర్తింపు కూడా లభించింది. కాగా ఇప్పటికే రిలీజ్ అయిన కాంతారా చాప్టర్-1 టీజర్ అద్భుతంగా ఉందని అభిమానులే కాకుండా.. ఇతరులు కూడా చెబుతున్నారు. రాజులు, రాచరికాలు వంటి సన్నివేశాలు ఈ చాప్టర్-1 లో చూపించనున్నారు. మొత్తం మీద ఈ సినిమా సినిమా ప్రపంచంలో ఓ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తుందనే ఊహాగానాలు చాలామందిలో లేకపోలేదు. కాంతారా చాప్టర్-1 సినిమాలో రిషబ్ శెట్టి మాత్రమే కాకుండా.. రుక్మిణి వసంత్, జయరాం, గుల్సన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి మొదలైన వారు ఉన్నారు. ఈ సినిమా కోసం సుమారు రూ. 125 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం.

పూరీ – సేతుపతి కాంబినేషన్: సినిమా టైటిల్ రిలీజ్ డేట్ ఫిక్స్!

0

డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరో విజయ్ సేతుపతిల కాంబినేషన్‌లో ఒక సరికొత్త సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ కార్యక్రమాలు కూడా హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతున్నాయి. పూరీ కనెక్ట్స్ – జేబీ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పైన పూరీ జగన్నాథ్ & ఛార్మీ కౌర్ ఇద్దరు కలిసి నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. విజయ్ సేతుపతి రాబోయే సినిమా గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో..

హిట్ కోసం పూరీ జగన్నాథ్!

పూరీ జగన్నాథ్.. రాబోయే సినిమా మంచి హిట్ సాధిస్తుందని గట్టి నమ్మకం పెట్టుకున్నారు. ఎందుకంటే ఇదివరకు వచ్చిన లైగర్, డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలు అంతంత మంత్రంగానే ఉన్నాయి. కాబట్టి ఈసారి వచ్చే సినిమా ఎలాగైనా బ్లాక్ బస్టర్ సాధించాలన్న కసితో పనిచేస్తున్నారు. దీనికోసం నటుడు విజయ్ సేతుపతిని ఒప్పించారు. ఈ సినిమా అయినా పూరీ జగన్నాథ్ ఆశలను నెరవేర్చాలని కోరుకుందాం.

వరుస విజయాలతో విజయ్ సేతుపతి

ప్రస్తుతం విజయ్ సేతుపతి వరుస విజయాలతో దూసుకుపోతున్న పాన్ ఇండియా సక్సెస్ ఫుల్ వెర్సటైల్ యాక్టర్. ఇటు తెలుగు.. అటు తమిళం, మలయాళం, హిందీ చిత్రాల్లో పాత్రతో సంబంధం లేకుండా కథ నచ్చితే ఏ క్యారెక్టర్‌కైనా ఇట్టే ఇమిడిపోయి న్యాయం చేస్తున్నారు. నిత్యామీనన్ కాంబినేషన్‌లో తమిళంలో తలైవా తలైవి.. తెలుగులో సార్ అండ్ మేడమ్ సినిమా ఇటీవలే మంచి విజయం సాధించింది.

టైటిల్ & టీజర్ ఎప్పుడంటే?

వరుస విజయాలతో దూసుకెళ్తున్న విజయ్ సేతుపతి.. పూరీ జగన్నాథ్ సినిమా కోసం సిద్దపడటం అనేది ఆసక్తి కలిగించే అంశం. అయితే వీరి కాంబినేషన్ ఎలా వుంటుందో చూడాలంటే మనం ఇంకా కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఈ సినిమాకు బెగ్గర్ అని పేరు పెట్టనున్నట్లు సమాచారం. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఇంకో రెండు రోజుల్లో.. సినిమా టైటిల్ మరియు టీజర్ రెండింటిని కూడా ఒకేసారి విడుదలచేయనున్నారు. అంటే సెప్టెంబర్ 28న (పూరి జగన్నాథ్ బర్త్‌డే సందర్భంగా) పూరీ – విజయ్ సేతుపతిల అభిమానులకు ఓ గుడ్ న్యూస్ వినిపించబోతున్నారు. ఈ విషయాన్ని విజయ్ సేతుపతి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.

సినిమాలో ఇతర ప్రముఖులు

పూరీ – విజయ్ సేతుపతిల సినిమా.. తెలుగులో మాత్రమే కాకుండా, తమిళం మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో సంయుక్తా మీనన్, టబు, నీవేదా థామస్, బ్రహ్మాజీ, వీటీవీ గణేష్, దునియా విజయ్ తదితరులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

ఇప్పటి వరకు పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి సినిమా తెరకెక్కలేదు. మొదటిసారి పూరీ సినిమా కోసం విజయ్ సేతుపతి సిద్ధమయ్యారు. దీంతో అభిమానుల అంచనాలు కూడా పెరిగిపోతున్నాయి. సినిమా ఎలా ఉండబోతుంది?, దీనికోసం ఎంత బడ్జెట్ కేటాయించనున్నారు, రిలీజ్ డేట్ వంటి వివరాలు రానున్న రోజుల్లో తెలుస్తాయి. ఈ సారి పూరీ జగన్నాథ్ ఖాతాలో ఒక బ్లాక్ బస్టర్ ఖాయమని చాలామంది అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజమవుతుందో తెలుసుకోవాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే!.

తండ్రి ప్రపంచ కుబేరుడు.. ఆర్థిక ఇబ్బందులతో అద్దింట్లో కూతురు

0

తండ్రి ధనవంతుడైతే.. పిల్లలు కూడా ధనవంతులుగానే విలాసవంతమైన జీవితం గడుపుతారు. అయితే ఎలాన్ మస్క్ కుమార్తె వివియన్ విల్సన్ మాత్రం అందుకు భిన్నం. ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటూ.. ఒక అపార్ట్‌మెంట్‌లో మరో ముగ్గురితో కలిసి నివసిస్తోంది. న్యూయార్క్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను ఆమె వెల్లడించారు.

నా దగ్గర లక్షల డాలర్లు లేవు!

ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ సంపద సుమారు రూ. 42,778 కోట్ల కంటే ఎక్కువ. అంతటి సంపన్నుడి కుమార్తె వివియన్ విల్సన్ మాత్రం ఎప్పుడూ.. ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుంటూ ఉండటం గమనార్హం. ఆర్ధిక సమస్యల కారణంగానే లాస్ ఏంజిల్స్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ముగ్గురు రూమ్‌మేట్‌తో కలిసి నివసిస్తోంది. నా దగ్గర చాలా డబ్బు ఉంటుందని అనుకుంటారు. కానీ అదంతా నిజం కాదు. నాకు ఇప్పుడు ఆర్ధిక స్వాతంత్య్రం ఉంది. నా దగ్గర లక్షల డాలర్లు లేవు అని ఇంటర్వ్యూలో 21ఏళ్ల వివియన్ విల్సన్ పేర్కొన్నారు.

తన తల్లిదండ్రుల ఆర్ధిక ప్రపంచాల మధ్య చాలా వ్యత్యాసం ఉందని కూడా ఇంటర్వ్యూలో వివియన్ విల్సన్ అన్నారు. తన తల్లి జస్టిస్ విల్సన్ కొంత సంపదను మాత్రమే కలిగి ఉండగా.. తండ్రి ఎలాన్ మస్క్ మాత్రం ప్రపంచ కుబేరుడు, ఈయన దగ్గర ఊహకందనంత డబ్బు ఉంది. అయితే వీరి ఇద్దరి డబ్బు మీద నేను ఆధారపడను. నేనే సొంతంగా జీవిస్తూ.. ఆహారం, రూమ్ రెంట్, నిత్యావసరాలు మొదలైనవాటికి సంపాదించుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చింది.

తండిపై కోపంతో ట్రాన్స్‌జెండర్‌గా!

టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ 2000వ సంవత్సరంలో జస్టిస్ విల్సన్ను పెళ్లి చేసుకున్నారు. ఈమె ఒక రచయిత్రి. అయితే వీరు 2008లో విడాకులు తీసుకుని విడిపోయారు. ఈ జంటకు పుట్టిన పిల్లల్లో ఒకరు జేవియర్ అలెగ్జాండర్ మస్క్. తల్లి దండ్రులు విడిపోయిన తరువాత .. తన తండ్రి వారసత్వాన్ని వద్దనుకుని 16ఏళ్ల వయసులో ట్రాన్స్‌జెండర్‌గా (వివియన్ విల్సన్) మారిపోయాడు. దీనికి కావలసిన హక్కులను ఇతడు కోర్టు నుంచి పొందాడు. తండ్రి వారసత్వాన్ని మాత్రమే కాదు, తండ్రి ఆస్తిలో కూడా ఏమీ ఆశించకపోవడం గమనించదగ్గ విషయం.

చిన్నప్పటి నుంచి మానసిక వేదనకు గురైన.. జేవియర్ అలెగ్జాండర్ మస్క్, తల్లిదండ్రులు విడిపోయిన తరువాత.. తాను కూడా తండ్రితో ఎటువంటి సంబంధాలు ఉండకూడదని నిర్ణయించుకున్నారు. తనకు స్వతంత్య్రమైన గుర్తింపు ఉండాలని భావించి.. ట్రాన్స్‌జెండర్‌గా మారి తల్లిపేరు వచ్చేలా వివియన్ విల్సన్‌గా మారిపోయారు. ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నారు.

వివియన్ విల్సన్ గురించి

ఎలాన్ మస్క్ 14 మంది సంతానంలో ఒకరైన వివియన్ విల్సన్.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, మోడల్‌గా గుర్తింపు పొందింది. ఈమె జపాన్‌లోని టోక్యోలో టెంపుల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో చదువుకుంది. ఆ తరువాత 2025లో మోడలింగ్ కోసం లాస్ ఏంజిల్స్‌కు తిరిగి వచ్చింది. ప్రస్తుతం ఈమె ఫ్రెంచ్, స్పానిష్, జపనీస్ భాషలను చదువుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈమెకు మొత్తం నలుగురు (గ్రిఫిన్, కై, సాక్సన్, డామియన్) సొంత తోబుట్టువులు ఉన్నారు. వీరు కాకుండా ఇంకా కొందరు తమ్ముళ్లు, చెల్లెల్లు ఉన్నారు.

అసెంబ్లీలో బాలకృష్ణ  కామెంట్స్.. నిజాలు బయట పెట్టిన చిరంజీవి

0

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు చాలా రసవత్తరంగా సాగాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని.. సినీ ప్రముఖులు కలిసిన అంశాన్ని గురించి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రస్తావించారు. చిరంజీవి గట్టిగా చెప్పడం వల్లనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగొచ్చిందని అన్నారు. దీనికి సమాధానంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎవరూ గట్టిగా అడగలేదు, అదంతా అబద్దం అని అన్నారు. ఈ మాటలకు మెగాస్టార్ చిరంజీవి రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

బాలకృష్ణ వ్యాఖ్యలకు చిరంజీవి రిప్లై

ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి స్పందిస్తూ.. బాలకృష్ణ నా పేరు తీసుకొచ్చారు, కాబట్టి నేను స్పందిస్తున్నాను. సినీ ఇండస్ట్రీలోని సమస్యలను గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని.. ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులు నా దగ్గరకు వచ్చారు. ఆ సమయంలో బాలకృష్ణతో మాట్లాడటానికి ఫోన్ చేశాను. అందుబాటులోకి రాలేదు. జెమిని కిరణ్‌ను స్వయంగా వెళ్లి కలిసి చెప్పమని చెప్పను. ఆయన ప్రయత్నం కూడా వృధా అయింది. చేసేదేమి లేక.. నేను చొరవ తీసుకుని కొంతమందితో వెళ్లి ముఖ్యమంత్రిని కలిశాను.

ఆ తరువాతనే వీరసింహా రెడ్డి సినిమాకైనా.. నా వాళ్తేరు వీరయ్య సినిమాకైనా ఆ రోజు టికెట్ రేట్లు పెరిగాయి. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభం చేకూరింది అని అన్నారు. నేను ముఖ్యమంత్రితో అయినా.. సామాన్యుడతో అయినా నా సహజమైన ధోరణిలోనే మాట్లాడుతానని, ప్రస్తుతం ఇండియాలో లేను కాబట్టి.. ఈ విషయాన్ని పత్రికా ప్రకటనద్వారా తెలియజేస్తున్నానని చిరంజీవి వివరణ ఇచ్చారు. అయితే బాలకృష్ణ, చిరంజీవి మధ్య ఈ మాటల యుద్ధం ఇటు రాజకీయంగా.. అటు సినీ ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్‌గా మారిపోయింది.

జగన్‌ను కలిసిన సినీ ప్రముఖులు ఎవరంటే?

గత ప్రభుత్వం హయాంలో.. అంటే 2022 సంవత్సరంలో వైస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, సినిమా ఇండస్ట్రీలోని కొంత మంది వ్యక్తులు సీఎంను, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని కలిశారు. ఆ సందర్భంలో ఫిలిం ఇండస్ట్రీలో వివిధ సమస్యల గురించి.. ముఖ్యంగా సినిమా టికెట్స్ రేట్లు విషయం గురించి చర్చించడం జరిగింది.

జగన్ ప్రభుత్వం సినిమా టికెట్లను ఎటువంటి పరిస్థితుల్లో పెంచే ఆలోచన లేదని, దీనికి సంబంధించిన ఒక జీవోను కూడా అప్పట్లో విడుదల చేసింది. దీనిపై మాట్లాడటానికి సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ కొరటాల శివ, పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి, డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి మొదలైనవారు ఉన్నారు.

సినీ పరిశ్రమపై.. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించకపోతే.. ఫిలిం ఇండస్ట్రీ నష్టాల్లోకి వెళ్తుందని.. చిరంజీవి, ఇతర సినీ ప్రముఖులు ముఖ్యమంత్రికి వెల్లడించారు. ఆ తరువాతనే ప్రభుత్వం సినిమా టికెట్స్ పెంచుకోవడానికి అవకాశం కల్పించింది. అయితే ఆ సమయంలో సినీ ప్రముఖుల కార్లను గేటు బయటనే ఆపి.. కొంతదూరం నడుచుకుంటూ వెళ్లారని, విమర్శలు కూడా వినిపించాయి.

సీబీఎస్ఈ 2026 ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్!: 45 లక్షల మంది హాజరయ్యే అవకాశం

0

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ).. 2026లో జరగనున్న 10వ తరగతి, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఏడాది పరీక్షల షెడ్యూల్ ఐదు నెలల ముందుగానే ప్రకటించింది. ఇది విద్యార్థులు పరీక్షలకు మరింత గట్టిగా సన్నద్ధం కావడానికి సహకరిస్తుంది.

పరీక్షల షెడ్యూల్

సీబీఎస్ఈ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. సెకండరీ స్కూల్ పరీక్ష (10వ తరగతి) 2026 ఫిబ్రవరి 17న ప్రారంభమై, 2026 మార్చి 18 వరకు జరుగుతుంది. కాగా సీనియర్ స్కూల్ సర్టిఫికేట్ పరీక్ష (12వ తరగతి) 2026 ఫిబ్రవరి 17న మొదలై.. 2026 ఏప్రిల్ 4తో ముగుస్తుంది.

10వ తరగతి, 12వ తరగతులలో సుమారు 45 లక్షల మంది విద్యార్థులు మొత్తం 204 సబ్జెక్టుల పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉందని సీబీఎస్ఈ వెల్లడించింది. ఇందులో భారతదేశం అంతటా మాత్రమే కాకుండా.. విదేశాలలో ఉన్న సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల్లో చదువుతున్న 26 దేశాలకు చెందిన విద్యార్థులు కూడా హాజరవుతారని సీబీఎస్ఈ వెల్లడించింది.

పదిరోజుల తరువాత పేపర్ కరెక్షన్!

ఇప్పటికి విడుదలైన సమాచారం ప్రకారం.. పరీక్ష పూర్తయిన 10 రోజుల తరువాత పేపర్ కరెక్షన్ మొదలవుతుంది. ఇది 12 రోజుల్లో పూర్తవుతుందని సమాచారం. అంటే 12వ తరగతి భౌతికశాస్త్రం పరీక్ష 2026 ఫిబ్రవరి 20న జరిగితే.. కరెక్షన్ మార్చి 3న ప్రారంభమై.. మార్చి 15 నాటికి ముగుస్తుంది.

సీబీఎస్ఈ బోర్డు.. 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలను ఉదయం 10:30 గంటలకు ప్రారంభించనుంది. పరీక్షలు ఒకే షిఫ్ట్‌లో నిర్వహించనున్నట్లు కూడా సమాచారం. అయితే ప్రస్తుతం విడుదలైన షెడ్యూల్ తాత్కాలికమైనది మాత్రమే అనే సీబీఎస్ఈ వెల్లడించింది. అంటే ఈ షెడ్యూల్ తేదీలు బహుశా మళ్ళీ మారే అవకాశం ఉందని తెలుస్తోంది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ గురించి

సీబీఎస్ఈ అనేది విద్యార్థులకు సెకండరీ, సీనియర్ సెకండరీ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా చేసుకుని ఏర్పాటైన ఒక నేషనల్ ఎడ్యుకేషన్ బోర్డ్. ఇది 1929లో స్థాపించబడింది. దీనిని మొదట్లో బోర్డ్ ఆఫ్ హైస్కూల్ అండ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పేరుతో పిలిచేవారు. ఆ తరువాత ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్’గా మారింది.

భారతదేశంలో అందరికీ సమానమైన విద్యను అందించడం, నాణ్యమైన విద్యను ప్రోత్సహించడం మాత్రమే కాకుండా.. నైతిక విలువలను పెంపొందించడం, జాతీయత, విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించడానికి సీబీఎస్ఈ పుట్టుకొచ్చింది. విద్యారులకు అభ్యాసపరంగా.. అన్వేషణాత్మకంగా నేర్చుకునే విధానం కూడా ఇక్కడ అలవాటు అవుతుంది.

మన దేశంలో మొత్తం 27,000 కంటే ఎక్కువ స్కూల్స్ సీబీఎస్ఈకి అనుబంధంగా ఉన్నాయి. భారతదేశంలో వెలుపల అంటే.. సౌదీ అరేబియా, సింగపూర్, యూఏఈ, నేపాల్ మొదలైన దేశాల్లో కూడా సీబీఎస్ఈ కింద ఉన్న స్కూల్స్ సంఖ్య చాలానే ఉంది. కాబట్టి మొత్తం 45 లక్షలమంది 2026లో సీబీఎస్ఈ పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తే లేదా మంచి ర్యాంక్ తెచ్చుకుంటే.. మంచి కాలేజీలలో లేదా యూనివర్సిటీలలో సీటు సులభంగా వస్తుంది. తద్వారా మీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి దీనిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఈ పరీక్షల కోసం గట్టిగా సిద్ధం కావాల్సి ఉంది.

తమిళనాడు అత్యున్నత పురస్కారానికి ఎంపికైన సాయి పల్లవి: జాబితా రిలీజ్!

0

అత్యున్నత పౌరపురస్కారాలలో ఒకటిగా పరిగణించే కలైమామణి అవార్డులను తమిళనాడు ప్రభుత్వం.. 2021, 2022, 2023 సంవత్సరాలకు గాను అధికారికంగా ప్రకటించింది. ఈ అవార్డును ఎవరెవరు పొందనున్నారు?, ఎంతమంది పొందనున్నారు అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.

కలైమామణి అవార్డుకు ఎంపికైన సాయి పల్లవి

సాయి పల్లవి, ఎస్‌జే సూర్య, విక్రమ్ విక్రమ్ ప్రభు, జయ వీసీ గగనాథన్, కే మణికందన్, ఎం జార్జ్ మొదలైనవారు.. కలైమామణి అవార్డులను పొందనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం (2025 సెప్టెంబర్ 24) వెల్లడించింది. దీనికి సంబంధించి వివిధ వర్గాలలో ఎవరెవరు ఈ అవార్డు తీసుకోకున్నారో కూడా జాబితా వెల్లడించింది.

జాబితాలో ఇతర ప్రముఖులు

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో ఉన్నవారు.. వివిధ కళలు, వివిధ నేపధ్యాల కిందకు వచ్చే అనేకమంది కళాకారులు ఉన్నారు. వీరంతా.. తమిళనాడు సాంస్కృతిక వారసత్వానికి చేసిన కృషికి ఈ అవార్డు లభించింది.

కలైమామణి అవార్డులకు ఎంపికైన జాబితాలో యాక్టర్స్ మాత్రమే కాకుండా.. వివిధ సాంకేతిక నిపుణులు, చిత్ర కార్మికులు సైతం ఉన్నారు. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందన్, చిత్ర నిర్మాత ఎస్ లింగుస్వామి, స్టంట్ మాస్టర్ సూపర్ సుబ్బరాయన్, నేపథ్య గాయని శ్వేతా మోహన్, కొరియోగ్రాఫర్ శాండీ మొదలైనవారు ఉన్నారు.

విజేతలుగా ప్రకటించిన 90మంది కళాకారులలో.. సాహిత్యంలో భారతియార్ అవార్డుకు రచయిత ఎన్. మురుగేశ పాండియన్, ఎంఎస్ సుబ్బలక్ష్మి అవార్డుకు ప్రముఖ గాయకుడు కేజే యేసుదాసు, బాలసరస్వతి అవార్డుకు పద్మశ్రీ ముత్తుకన్నమ్మల్ ఎంపికయ్యారు. ఈ అవార్డులను తమిళనాడు ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కల్చర్ డైరెక్టరేట్ విభాగం అయిన.. ఇయాల్ ఇసై నాటక మండ్రం అందజేస్తుంది. ఈ అవార్డులను అక్టోబర్‌లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన ప్రధానం చేయనున్నారు.

వివిధ విభాగాల్లో 2021 సంవత్సరం విజేతలు

➤నటి: సాయి పల్లవి
➤నటుడు: ఎస్‌జే సూర్య
➤డైరెక్టర్: లింగుసామి
➤యాక్షన్ కొరియోగ్రాఫర్: స్టంట్ సుబ్బరాయన్

2020 సంవత్సర విజేతలు

➤నటి: జయ గుహనాథన్
➤నటుడు: విక్రమ్ ప్రభు
➤గీత రచయిత: వివేక్
➤ప్రో కన్సల్టెంట్: డైమండ్ బాబు
➤ఫోటోగ్రాఫర్: టీ లక్ష్మీకాంతన్

2023 సంవత్సర విజేతలు

➤అనిరుధ్ రవిచందన్: సంగీత స్వరకర్త
➤శ్వేతా మోహన్: గాయకుడు
➤కే మణికందన్: నటుడు
➤జార్జ్ మరియన్: నటుడు

కలైమామణి అవార్డు గురించి

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం 1954లో కలైమామణి అవార్డులను ప్రారంభించింది. కళారంగాల్లో విశేష కృషి చేసినవారికి ఈ అవార్డులను ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకుంది. 2020 వరకు ఈ అవార్డులను అందించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు తాజాగా 2021, 2022, 2023 సంవత్సరాలకు గాను వచ్చే నెలలో అవార్డులను ప్రధానం చేయడానికి సంకల్పించింది. సినిమా రంగానికి మాత్రమే కాకుండా.. సంగీతం, సాహిత్యం, నాట్యం, నాటకాలు, ఇతర కళలకు ఈ అవార్డులను అందిస్తారు. ఈ అవార్డును ప్రధానం చేసే సమయంలో అవార్డు గ్రహీతలకు మెమోరాండం, మెడల్ మాత్రమే కాకుండా కొంత నగదు బహుమతి కూడా ఉండే అవకాశం ఉంటుంది. బహుశా ఇందులో ఏమైనా మార్పులు చేసారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. కాగా ఇప్పుడు తాజాగా ఈ అవార్డుకు ఎంపికైన వారికి అక్టోబర్ 2025లో అవార్డును ప్రధానం చేయనున్నారు.

ఓజీ సినిమాకు ఊహించని దెబ్బ: షోలు రద్దు.. టికెట్ డబ్బు రీఫండ్!

0

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం ఓజీ. ఈ మూవీ ట్రైలర్, సాంగ్స్, మ్యూజిక్ అన్నీ కూడా సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. అభిమానులకు కొత్తదనాన్ని ఇవ్వడంలో భాగంగా ఈ సినిమా కోసం పవర్ స్టార్ ప్రత్యేకంగా జపనీస్ బాష నేర్చుకొని మరీ డైలాగ్ చెప్పారు. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు గానీ మ్యూజిక్ గానీ ఒక రేంజ్‌లో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తమన్ మ్యూజిక్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తోంది. ట్రైలర్ కూడా ఇప్పటికే భారీ అంచనాలను కలిగిస్తోంది. ఈ సారి పెద్ద పెద్ద రికార్డుడులను కూడా బద్దలు కొట్టే అవకాశం ఉన్నట్టుగా అభిమానులు ఊహించుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తరువాత విడుదలైన మొదటి సినిమా హరి హర వీరమల్లు భారీ అంచనాలతో విడుదలై.. అభిమానులకు తీవ్ర నిరాశను కలిగించింది. డిప్యూటీ సీఎం అవ్వడానికి ముందు చేసిన బ్రో సినిమా కూడా అంచనాలను అందుకోలేకపోయింది. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు అత్యంత నమ్మకం పెట్టుకున్న సినిమా ఓజీ. ఈ సినిమా తరువాత పీఎస్పీకే 29, ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కావడానికి సిద్ధమవుతోంది.

ఫ్రీ-రిలీజ్ వేడుకల్లో పవన్ జోష్

ఓజీ సినిమా ఈ నెల సెప్టెంబర్ 25న ప్రపంచం వ్యాప్తంగా విడుదలకు సిద్ధమయింది. ఈ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సెప్టెంబర్ 21న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో మునుపెన్నడు కనిపించని విధంగా పవన్ కళ్యాణ్ అత్యంత జోష్‌తో కనిపించడమే కాకుండా.. సినిమాలోని ఒరిజినల్ గెటప్‌లోనే కనిపించారు. భారీ వర్షం పడుతున్నప్పటికి కూడా అభిమానుల్లో ఏ మాత్రం ఉత్సాహం తగ్గకుండా ఉండేదుకు.. ”ఈ వర్షం మనల్ని ఆపుతుందా, ఈ వర్షం మనల్ని ఆపుతుందా” అని గట్టి గట్టిగా డైలాగ్ చెబుతా అభిమానుల్లో మరింత ఉత్సహన్ని రేకెత్తించాడు.

ఓవర్సీస్‌లో ఓజీ షోలు రద్దు!

ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దమవుతున్న ఓజీకి అనుకోని చిక్కోచ్చి పడింది. ఓవర్సీస్‌లో.. అంటే నార్త్ అమెరికాలో ఓజీ చిత్రాన్ని నిలిపివేస్తున్నట్లు యార్క్ సినిమాస్ సంస్థ ప్రకటించింది. మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్న దేశాల్లో అమెరికా కూడా ఒకటి. అందుకే ఎప్పుడు కూడా తెలుగు సినిమాలు అక్కడ రిలీజ్ చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యే సమయంలో థియేటర్స్ దగ్గర అభిమానులు ఇబ్బందులు కలిగిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే.. ఓజీ సినిమా రిలీజ్ చేయలేమని యార్క్ సినిమాస్ అధికారికంగా ప్రకటించింది. అంతే కాకుండా.. ఫ్రీ బుకింగ్స్ చేసుకున్నవారికి అమౌంట్ రిఫండ్ చేస్తామని కూడా స్పష్టం చేసింది. ఈ ప్రకటన పవన్ కళ్యాణ్ అభిమానులకు కొంత నిరాశ కలిగించింది. అయితే ఓజీ నిర్మాతకు, హీరోకు ఓ పెద్ద షాక్ అనే చెప్పాలి.

ఓజీ చిత్రంలోని నటులు

పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై.. డీవీవీ దానయ్య నిర్మించారు. డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. ఇందులో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినిమా నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించారు. ప్రియాంక అరుల్ మోహనన్ హీరోయిన్‌గా చేశారు. ప్రకాష్ రాజ్, ఇమ్రాన్ హష్మీ, అజయ్ గోష్, శ్యామ్, అభిమన్యూ సింగ్, శుభలేక సుధాకర్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్ తదితరులు ప్రధాన పాత్రలు చేసారు.

సరికొత్త ఆల్ట్రావయొలెట్ బైక్: సూపర్ టెక్నాలజీ & అంతకు మించిన ఫీచర్స్

0

బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ కంపెనీ ఆల్ట్రావయొలెట్ ఆటోమోటివ్.. దేశీయ విఫణిలో సరికొత్త బైక్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ పేరు ‘ఎక్స్-47 క్రాస్ఓవర్‘. దీని ప్రారంభ ధర రూ. 2.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఇంటిగ్రేటెడ్ రాడార్. కెమెరా సేఫ్టీ సిస్టం వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది.

బుకింగ్స్ & డెలివరీ

ఆల్ట్రావయొలెట్ లాంచ్ చేసిన ఎక్స్-47 క్రాస్ఓవర్ బైక్ కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. రూ. 999 చెల్లించి అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. భారతదేశంలో డెలివరీలు అక్టోబర్ 2025లో ప్రారంభమవుతాయి. గ్లోబల్ మార్కెట్లో డెలివరీలు 2026లో జరిగే అవకాశం ఉంది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. ప్రారంభ ధర అనేది మొదటి 1000 మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఆ తరువాత ధర పెరిగే అవకాశం ఉంటుంది. ఎంత పెరుగుతుంది అనే విషయం అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

డిజైన్ అండ్ ఫీచర్స్

ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన సరికొత్త ఆల్ట్రావయొలెట్ ఎక్స్-47 క్రాస్ఓవర్ బైక్.. ఇప్పటి వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న బ్రాండ్ యొక్క అన్ని బైకులకంటే భిన్నంగా ఉంది. కాబట్టి చూడగానే ఇది కొత్తదిగా అనిపిస్తుంది.

ఫీచర్స్ విషయానికి వస్తే.. ఎక్స్-47 క్రాస్ఓవర్ బైక్ 5 ఇంచెస్ టీఎఫ్‌టీ కన్సోల్ పొందుతుంది. వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, టైప్ సీ పోర్ట్స్, గ్రాబ్ హ్యాండిల్స్, హిల్ హోల్డ్ అసిస్ట్, డైనమిక్ రీజెనరేటివ్ బ్రేకింగ్, క్రాష్ అలర్ట్స్, టోయింగ్ నోటిఫికేషన్స్, మూవ్‌మెంట్ డిటెక్షన్, రిమోట్ లాక్‌డౌన్ అందించే ఆల్ట్రావయొలెట్ యొక్క యాజమాన్య వైలెట్ ఏఐ కనెక్ట్ చేయబడిన సూట్ వంటివి ఉన్నాయి.

గ్లైడ్, కంబాట్, బాలిస్టిక్ వంటి మల్టిపుల్ రైడింగ్ మోడ్స్ ఇందులో ఉన్నాయి. ఈ బైక్ రేడియల్ ఆల్ టెర్రైన్ టైర్స్ పొందుతుంది. అంతే కాకుండా 200 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ మరియు కమాండింగ్ రైడింగ్ పొజిషన్ కోసం ఫైటర్ జెట్ ప్రేరేపిత ఎర్గోనామిక్స్ వంటివి కూడా బైకులో ఉన్నాయి.

బ్యాటరీ వివరాలు

ఆల్ట్రావయొలెట్ ఎక్స్-47 క్రాస్ఓవర్ బైక్.. 10.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది 40.2 బీహెచ్‌పీ పవర్, 610 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్ 2.7 సెకన్లలో 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 145 కిమీ కావడం గమనార్హం. ఈ బైక్ ఒక ఫుల్ ఛార్జితో 323 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం.

ఇతర వివరాలు

కొత్త ఎక్స్-47 క్రాస్ఓవర్ బైక్ 41 మిమీ యూఎస్డీ ఫోర్క్స్, మోనోషాక్ పొందుతుంది. ఈ రెండూ కూడా ఫ్రీలోడ్ అడ్జస్టబుల్. బ్రేకింగ్ సిస్టం విషయానికి వస్తే.. ముందు భాగంలో ఫోర్ పిస్టన్ కాలిపర్‌తో 320 మిమీ ఫ్రంట్ డిస్క్, 230 మిమీ రియర్ డిస్క్ ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, మూడు ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్ కూడా ఉన్నాయి.

టెక్నాలజీ

ఇప్పటివరకు కార్లలో మాత్రమే ఏడీఏఎస్ ఫీచర్ ఉండేవి. కానీ మొదటిసారి ఆల్ట్రావయొలెట్.. తన ఎక్స్-47 క్రాస్ఓవర్ బైకులో అందించింది. కాబట్టి ఈ బైకులో బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, లేన్ చేంజ్ అసిస్ట్, ఓవర్‌టేక్ అలర్ట్స్ మొదలైనవన్నీ ఉన్నాయి. ఈ బైకులో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. కాబట్టి ఇది అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది.