Tag: Chandrababu Naidu

  • ఏపీలో 20 లక్షల ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

    ఏపీలో 20 లక్షల ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

    Andhra Pradesh Job Creation: రాష్ట్ర సమగ్రాభివృద్ధికి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం అత్యంత కీలకమని భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆ దిశగా పటిష్టమైన అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా, రాబోయే కాలంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు వీలుగా యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందించడానికి తక్షణమే తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ బృహత్తర ప్రణాళికకు సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం: సాంకేతికత, నైపుణ్యం ప్రధానం

    రాష్ట్ర సచివాలయంలో నైపుణ్యాభివృద్ధి, ఉన్నత విద్యా శాఖలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక సూచనలు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో, దీనికి అనుగుణంగా ఉన్నత విద్యలో కూడా సమూల మార్పులు తీసుకురావాలని నైపుణ్యాభివృద్ధి శాఖకు స్పష్టం చేశారు.

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత జాబ్ పోర్టల్

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పరిజ్ఞానాన్ని ఉపయోగించి, రాష్ట్రం, దేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయో తెలుసుకుని, ఆ సమాచారంతో ఒక ప్రత్యేకమైన జాబ్ పోర్టల్‌ను రూపొందించాలని సీఎం సూచించారు. ఈ సమాచారం రాష్ట్రంలోని యువతకు సులభంగా అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. యువత తమ వివరాలను ఈ పోర్టల్‌లో నమోదు చేసుకోగానే, వారి నైపుణ్యాలకు తగిన రెజ్యూమే (Resume) ఆటోమేటిక్‌గా రూపొందేలా పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

    పెట్టుబడులు – ఉద్యోగావకాశాలు – నైపుణ్యాభివృద్ధి ఆవశ్యకత

    రాష్ట్రంలో ఇప్పటికే 9.5 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు వచ్చినట్లు, తద్వారా 8.5 లక్షల ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. అయితే, మారుతున్న కంపెనీల అవసరాలకు అనుగుణంగా యువత కూడా తమ నైపుణ్యాలను నిరంతరం అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని నొక్కిచెప్పారు. ఈ దిశగా సంబంధిత శాఖ యువతకు నాణ్యమైన శిక్షణను అందించాలని ఆదేశించారు.

    నైపుణ్యాభివృద్ధి శాఖ పాత్ర – ప్రపంచస్థాయి అవకాశాలపై దృష్టి

    రాష్ట్రంలోని యువతకు ప్రపంచ స్థాయిలో పోటీపడి, ఉత్తమ ఉద్యోగాలు సాధించేలా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన పూర్తి బాధ్యత నైపుణ్యాభివృద్ధి శాఖదే అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. జర్మనీ, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో వైద్య, ఐటీ, నిర్మాణ రంగాలతో పాటు ఇతర కీలక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ యువత తమ సత్తా చాటాలని ఆయన ఆకాంక్షించారు.

    విదేశీ భాషా నైపుణ్యం – తప్పనిసరి

    ప్రపంచవ్యాప్త అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే, కేవలం ఇంగ్లీష్ భాషా నైపుణ్యం మాత్రమే సరిపోదని, ఇతర ముఖ్యమైన విదేశీ భాషలను కూడా నేర్చుకోవాలని సీఎం సూచించారు. ఇందుకు అనుగుణంగా, వివిధ దేశాల భాషలను బోధించడానికి అవసరమైన శిక్షణా కార్యక్రమాలను రూపొందించి, అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

    నారా లోకేష్ నివేదిక: నైపుణ్యాభివృద్ధిలో ప్రగతి

    ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్, రాష్ట్రంలో క్లస్టర్ల వారీగా నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో మొత్తం ఐదు క్లస్టర్లలో సమగ్ర నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించడానికి పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. పాలిటెక్నిక్ మరియు ఐటీఐ విద్యార్థులకు ఆయా పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి ప్రముఖ పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు లోకేష్ తెలిపారు.

    ఇప్పటివరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 1,164 ఉద్యోగమేళాలు నిర్వహించినట్లు, వీటి ద్వారా 61,991 మంది యువతీయువకులు ఉద్యోగాలు పొందినట్లు మంత్రి వివరించారు. అంతే కాకుండా, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ పొందిన వారిలో 74,834 మందికి వివిధ సంస్థల్లో ఉద్యోగాలు లభించాయని తెలిపారు.

    ‘స్వర్ణాంధ్ర 2047’ విజన్ – భవిష్యత్ కార్యాచరణ

    రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘స్వర్ణాంధ్ర 2047’ విజన్ ప్రణాళికలో భాగంగా, రాష్ట్రంలోని యువతకు సమగ్ర శిక్షణ అందించాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. ఆరవ తరగతి నుంచి పీజీ స్థాయి వరకు విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను పాఠ్యాంశాలలో భాగంగా చేయాలని సూచించారు. విద్యాసంస్థలతో పరిశ్రమలను అనుసంధానం చేసి, ఆచరణాత్మక నైపుణ్య శిక్షణపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు.

    ఈ ఏడాది ప్రతి నియోజకవర్గంలో కనీసం 1,500 మందికి ఉద్యోగాలు లభించేలా అధికారులు కృషి చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ లక్ష్య సాధనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.

  • సాగరతీరంలో యోగా.. హాజరుకానున్న మోదీ: జూన్ 21 నుంచి..

    సాగరతీరంలో యోగా.. హాజరుకానున్న మోదీ: జూన్ 21 నుంచి..

    Yogandra 2025: ప్రపంచ దేశాలకు భారతదేశం గురువు అని ఎన్నో గ్రంధాలు పేర్కొన్నాయి. సంస్కృతి, సంప్రదాయాలను మాత్రమే కాకుండా, యోగ వంటి గొప్ప విధానాలతో భాసిల్లుతున్న భారత్, గొప్ప తాత్విక వేత్తలకు, గురువులకు నిలయంగా భాసిల్లుతోంది. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న యోగాను దేశం మొత్తం అవలంబించేలా ప్రధాని మోదీ చర్య తీసుకున్నారు. ఈ మార్గంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా నడవడానికి సిద్ధమయ్యారు. రాబోయే యోగ దినోత్సవాన్ని కనీవినీ ఎరుగని విధంగా నిర్వహించడానికి కంకణం కట్టుకున్నారు.

    యోగాంధ్ర 2025: నెల రోజుల యోగా మహోత్సవం

    జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నెల రోజులపాటు (జూన్ 21 నుంచి) నిరవహించే ఈ కార్యక్రమాన్ని ‘యోగాంధ్ర 2025’ (Yogandra 2025) పేరుతో చేపడతామని ఆయన అన్నారు. యోగా దినోత్సవం నాడు ప్రధానమంత్రి పాల్గొనే ఈ కార్యక్రమానికి ఐదు లక్షల మంది హాజరవుతారని ఆయన అన్నారు. ఈ ఏడాది జరిగే యోగా దినోత్సవాన్ని ‘యోగా ఫర్ వన్ ఎర్త్.. వన్ హెల్త్’ నినాదంతో, ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను చెరిపేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

    విశాఖలో భారీ యోగా ప్రదర్శన: లక్షలాది మంది భాగస్వామ్యం

    విశాఖ సాగరతీరంలోని ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు లక్షలాదిమంది యోగాసనాలు వేయనున్నారు. దీనికి ప్రముఖ యోగ గురువులు హాజరవుతారు. వీరందరిని సీఎం చంద్రబాబు స్వయంగా ఆహ్వానించనున్నట్లు పేర్కొన్నారు. విశాఖలో మాత్రమే కాకుండా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూడా యోగా నిర్వహించడానికి కావలసిన ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు తెలియజేసారు.

    పది లక్షల మందికి యోగా శిక్షణ, పోటీలు

    జూన్ 21 నుంచి నిర్వహించనున్న నెల రోజుల యోగా కార్యక్రమాల్లో భాగంగానే సుమారు 10 లక్షల మందికి యోగా నేర్పించడమే కాకుండా, వారికి సర్టిఫికెట్స్ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. వీరందరినీ యోగా దినోత్సవం రోజున రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలకు నాయకత్వం వహించేలా చేస్తామని సీఎం అన్నారు. నెలరోజుల పాటు యోగాకు సంబంధించిన పాటలు, వ్యాసరచన, చిత్రలేఖనం వంటి పోటీలు నిర్వహించి, విశాఖలో జరిగే కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు.

    విద్యా వ్యవస్థలో, దైనందిన జీవితంలో యోగా

    వేసవి సెలవులు ముగిసిన తరువాత జూన్ 21 వరకు ఉదయం ఒక గంటసేపు పిల్లలకు యోగా తరగతులు బోధించాలని సీఎం చంద్రబాబు చెప్పారు. రాబోయే రోజుల్లో యోగాను పాఠ్యపుస్తకాల్లో కూడా చేర్చనున్నట్లు ఆయన అన్నారు. అంతే కాకుండా రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలు, పార్యటక స్థలాల్లో కూడా యోగా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పెద్ద హోటళ్లలో కూడా యోగా కోసం స్థలాన్ని కేటాయించేలా ప్రోత్సహించాలని ఆయన అన్నారు.

    యోగా ప్రాముఖ్యత – ప్రధాని మోదీ చొరవ

    భారతదేశంలో యోగాకు ఎనలేని చరిత్ర ఉన్నప్పటికీ, దేశ ప్రధాని నరేంద్ర మోదీ వల్ల వెలుగులోకి వచ్చింది. యోగా అనేది ఒక కులానికి లేదా మతానికి మాత్రమే పరిమితం కాదు. యోగా అనేది సైన్స్, మనిషి జీవితంలో యోగా ఒక భాగమైనప్పుడే ఆరోగ్యం సాధ్యమవుతుంది. మోదీ ప్రతి ఏటా యోగా దినోత్సవం రోజు తానే స్వయంగా యోగా చేస్తూ, ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి 2014లో ప్రకటించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు యోగా దినోత్సవం జరుగుతూనే ఉంది.

  • మహిళలకు శుభవార్త: ఫ్రీ బస్ సర్వీస్ & తల్లికి వందనం ఎప్పుడంటే?

    మహిళలకు శుభవార్త: ఫ్రీ బస్ సర్వీస్ & తల్లికి వందనం ఎప్పుడంటే?

    Free Bus Service in Andhra Pradesh: ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలను అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం వంటి పథకాల అమలుకు సంబంధించిన విషయాలను కర్నూలులో జరిగిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

    ‘సూపర్ సిక్స్’ హామీలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు

    కర్నూలు వేదికగా జరిగిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు కీలక హామీల అమలుపై స్పష్టత ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని ఆయన పునరుద్ఘాటించారు.

    మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటినుంచి?

    మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి మాట్లాడుతూ.. 2025 ఆగష్టు 15 (స్వాతంత్య్ర దినోత్సవం) నుంచి రాష్ట్రంలోని అందరి మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇది మహిళా సాధికారతకు, వారి ఆర్థిక స్వేచ్ఛకు దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

    తల్లికి వందనం పథకం అమలు

    అంతే కాకుండా.. వేసివి సెలవులు పూర్తయిన తరువాత, అంటే వచ్చే అకడమిక్ ఇయర్ ప్రారంభమయ్యే సమయానికి తల్లికి వందనం పథకం కింద.. ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ డబ్బు వేస్తామని అన్నారు. తల్లుల ప్రోత్సాహంతో విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరాలన్నదే ఈ పథకం లక్ష్యమని తెలిపారు.

    చెత్త రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు

    అక్టోబర్ 2 నాటికి చెత్త రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించాలని చంద్రబాబు పేర్కొన్నారు. జపాన్ వంటి దేశాల్లో రోడ్డుపై చెత్తవేయడాన్ని అవమానంగా భావిస్తారని, ఎక్కడైనా చెత్త కనిపిస్తే.. దాన్ని చెత్తబుట్టలో వేస్తారని ఆయన అన్నారు. ప్రజలందరూ చెత్త రహిత రాష్ట్రం కోసం తమవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇంట్లోని తడి చెత్తను మిద్దె తోటలకు ఉపయోగించుకోవాలని సూచించారు.

    ఇతర ముఖ్య సంక్షేమ పథకాలు మరియు హామీలు

    దీపం 2 పథకం: నేరుగా ఖాతాల్లోకి నగదు

    దీపం 2 కింద ఉచిత సిలిండర్ల పథకంలో భాగంగా నాలుగు నెలలకు ఒకసారి నేరుగా ఖాతాల్లోనే డబ్బు జమ చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇది పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని ఆయన అన్నారు.

    రాయలసీమ అభివృద్ధి – ఉద్యానవన పంటల ప్రోత్సాహం

    రాయల సీమను రతనాల సీమగా మార్చే బాధ్యత మాదని అన్నారు. ఉద్యానవన పంటలను ప్రోత్సహించడానికి కావలసిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. దీని ద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందని, ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.

    పేదలకు ఉచిత విద్యుత్ మరియు సౌర విద్యుత్

    పేదలకు ఉచిత కరెంట్ అందించడంతో పాటు.. సౌర విద్యుత్ ప్లాంట్స్ ఏర్పాటుకు సహాయం చేస్తున్నామని పేర్కొన్నారు. ఇది పర్యావరణ హితమైన ఇంధన వాడకాన్ని ప్రోత్సహిస్తుందని తెలిపారు.

    ఉచిత బస్సు ప్రయాణం – వివరాలు

    ఆగష్టు 15 నుంచి ప్రారంభం కానున్న ఉచిత బస్సు సర్వీస్ ద్వారా.. ప్రభుత్వం రూ. 3182 కోట్ల భారాన్ని భరించాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీ 69 శాతం ఉండగా.. ఉచిత బస్సు సర్వీస్ ప్రారంభమైన తరువాత అది 94 శాతానికి చేరుతుందని భావిస్తున్నాము. ఆర్టీసీలో ప్రస్తుతం 11,216 బస్సులు ఉన్నాయి. ఇందులోని 8193 బస్సులలో మాత్రమే ఈ పథకం అమలు చేయనున్నట్లు సమాచారం. ఉచిత బస్సు ప్రయాణ సమయంలో మహిళా ప్రయాణికులకు జీరో టికెట్ జారీ చేయడం జరుగుతుంది.