Home Blog Page 81

మీకు తెలుసా.. సెప్టెంబర్‌లో ఎక్కువమంది కొన్న 5 కార్లు ఇవే!

0

ఒక నెల ముగిసిందంటే.. వాహన తయారీ సంస్థలు తమ సేల్స్ రిపోర్ట్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఇందులో భాగంగానే 2025 సెప్టెంబర్ ముగియగానే దిగ్గజ సంస్థలు గత నెలలో ఎన్ని కార్లను విక్రయించాయని వివరాలు వెల్లడించాయి. ఈ కథనంలో సెప్టెంబర్ 2025లో ఎక్కువ అమ్మకాలు పొందిన లేదా ఎక్కువమంది కొనుగోలు చేసిన టాప్ 5 కార్లను గురించి తెలుసుకుందాం.

సెప్టెంబర్ 2025లో ఎక్కువమంది కొన్న టాప్ 5 కార్లు

టాటా నెక్సాన్: దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ గత నెలలో తన నెక్సాన్ కారును ఏకంగా 22,573 యూనిట్లను విక్రయించింది. అంటే ఒక్క సెప్టెంబర్ నెలలోనే 22,573 మంది నెక్సాన్ కార్లను కొనుగోలు చేశారన్నమాట. గత ఏడాది ఇదే నెలలో (2024 సెప్టెంబర్) నెక్సాన్ సేల్స్ 11,470 యూనిట్లు మాత్రమే. దీన్ని బట్టి చూస్తే.. 2025 సెప్టెంబర్ నెలలో నెక్సాన్ అమ్మకాలు 97 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో నెక్సాన్ పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్, సీఎన్‌జీ రూపంలో అందుబాటులో ఉంది.

మారుతి డిజైర్: సెప్టెంబర్ 2025లో అత్యధికంగా అమ్ముడైన రెండో కారుగా మారుతి డిజైన్ స్థానం సంపాదించుకుంది. ఈ కారు సేల్స్ 2024 సెప్టెంబర్‌లో 10853 యూనిట్లకు మాత్రమే పరిమితమైంది. కాగా ఈ ఏడాది (2025 సెప్టెంబర్) ఈ మోడల్ అమ్మకాలు 20,038 యూనిట్లుగా నమోదయ్యాయి. దీంతో అమ్మకాల వృద్ధి 85 శాతం పెరిగింది. కొంత సరసమైన ధర వద్ద లభించే ఈ డిజైర్ కారు.. మంచి డిజైన్, వాహన వినియోగదారులకు కావలసిన ఫీచర్స్ పొందుతుంది. దీంతో ఎక్కువమంది దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

హ్యుందాయ్ క్రెటా: ఎక్కువ అమ్మకాలు పొందిన కార్ల జాబితాలో హ్యుండయ్ క్రెటా ముచ్చటగా మూడో స్థానంలో నిలిచింది. ఇది సెప్టెంబర్ 2025లో 18,861 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. సెప్టెంబర్ 2024లో ఈ అమ్మకాలు 15,902 యూనిట్లు. అంటే క్రెటా అమ్మకాలు ఈ ఏడాది 19 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ కారు ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కువ అమ్మకాలు పొందిన కారుగా కూడా రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ కారు ఎలక్ట్రిక్ రూపంలో కూడా అందుబాటులో ఉంది.

మహీంద్రా స్కార్పియో: ఇండియన్ మార్కెట్లో ఎక్కువమందికి చాలాకాలం నుంచి ఇష్టమైన కార్లలో ఒకటిగా ఉన్న మహీంద్రా కంపెనీకి చెందిన స్కార్పియో గత నెలలో (2025 సెప్టెంబర్) మంచి అమ్మకాలు పొందగలిగింది. ఈ కారు 18372 యూనిట్ల అమ్మకాలతో జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. 2025 సెప్టెంబర్ నెలలో ఈ మోడల్ సేల్స్ 14438 యూనిట్లు మాత్రమే. అంటే సంస్థ వార్షిక వృద్ధి 27 శాతం పెరిగింది. ప్రస్తుతం ఈ కారు స్కార్పియో, స్కార్పియో నియో పేర్లతో అమ్మకానికి అందుబాటులో ఉంది.

టాటా పంచ్: లాస్ట్ పంచ్ మనదైతే.. ఆ కిక్కే వేరప్పా అన్నట్లు, మన జాబితాలో ఎక్కువ అమ్మకాలు పొందిన కారుగా ఐదవ స్థానంలో టాటా పంచ్ స్థానం ఆక్రమించుకుంది. ఈ కారు మొత్తం సేల్స్ సెప్టెంబర్ 2025లో 15891 యూనిట్లు. గత ఏడాది ఇదే నెలలో.. అంటే సెప్టెంబర్ 2024లో ఈ కారు అమ్మకాలు 13711 యూనిట్లు. వార్షిక వృద్ధి పరంగా ఇది 16 శాతం ముందుకు సాగింది. సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ కలిగిన ఈ కారు.. అత్యధిక భద్రతా ఫీచర్స్ పొందింది. ధర కూడా కొంత తక్కువే కావడంతో ఈ కారును ఎక్కువమంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

కార్ల అమ్మకాలు పెరగడానికి కారణాలు

సెప్టెంబర్ 2025లో జరిగిన వాహన అమ్మకాలు ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదని పలు నివేదికలు పేర్కొన్నాయి. ఇంత భారీ అమ్మకాలు జరగడానికి ప్రధాన కారణం.. పండుగ సీజన్, తగ్గిన జీఎస్టీ (కొత్త జీఎస్టీ సంస్కరణలు) అని తెలుస్తోంది. ఇండియన్ ఆటోమొబైల్ సెక్టార్ సెప్టెంబర్ 2025లో 3,78,457 యూనిట్ల వాహనాలను డీలర్లను పంపించింది. 2024 సెప్టెంబర్ నెలలో ఈ సంఖ్య 3,58,879 యూనిట్లు. దీన్నిబట్టి చూస్తే.. అమ్మకాలలో వార్షిక వృద్ధి 5.5 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది.

తెలుగులోనూ బైసన్ సినిమా: ధృవ్ విక్రమ్ & అనుపమ లవ్ సాంగ్ వచ్చేసింది!

0

మారీ సెల్వరాజ్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం బైసన్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 17వ తేది రోజున దీపావళి సందర్బంగా విడుదల కానుంది. దీనికి సంబంధించిన నాలుగు పాటలను తమిళంలో రిలీజ్ చేశారు. అవి ఒక రేంజ్‌లో హిట్ అయ్యాయి. ఇప్పటికి మిలయన్స్ వ్యూస్‌తో ఇంకా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు తెలుగులో ఎటువంటి పాటలు, టీజర్, ప్రకటనలుగానీ.. ప్రచారంగానీ జరగలేదు.

బైసన్ తెలుగు సాంగ్

సాధారణంగా సినిమా డైరెక్ట్ మారీ సెల్వరాజ్‌కు తెలుగులో కూడా ఒక ప్రత్యేకమైన అభిమానుల సమూహం ఉంది. ఆయన తీసే విభిన్నమైన చిత్రాలు తెలుగులో కూడా రిలీజ్ అయితే బాగుంటుంది అని ఎంతో ఆత్రుతతో సినిమా కోసం ఎదురుచూసే వారి సంఖ్య రోజురోజుకి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతోంది. బైసన్ సినిమా తెలుగులో రాదేమో అని నిరాశ చెందిన మారీ అభిమానులకు ఎట్టకేలకు ఒక సంతోషాన్ని కలిగించే అప్డేట్ ఇచ్చారు. నిన్న (గురువారం) సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మూవీకి సంబంధించిన తీరేనా తీరేనా గుండెల్లోనా మండుతుండే మూగ వేదనా.. అనే అత్యంత పెయిన్ ఫుల్ లవ్ సాంగ్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు.

ఇంకో ఏడురోజులే

బైసన్ రిలీజ్‌కు.. ఇంకా ఏడురోజులే సమయం ఉండటంతో అన్ని రాష్ట్రాల్లో ప్రచారం ముమ్మరం చేసినట్టుగా కనిపిస్తోంది. అందుకే మూవీ పట్ల ఆసక్తిని పెంచడానికి తెలుగులో వీడియో సాంగ్ విడుదల చేసినట్టున్నారు. తమిళంలో రిలీజ్ అయిన పాటలన్నీటికీ అక్కడి ప్రజల్లో, సోషల్ మీడియాలో భారీ స్పందన లభిస్తోంది. అంతే కాకుండా సినిమా రిలీజ్ చేసే ప్రతి థియేటర్ ముందర బైసన్ తలకాయ ఉన్న నమూనాను పెడుతున్నారు. ఇది ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటోంది.

మ్యూజిక్ డైరెక్టర్ నివాస్ కే ప్రసన్న, సింగర్ సత్యన్, హీరో ధృవ్ విక్రమ్, హీరోయిన్స్ అనుపమ పరమేశ్వరన్, రజిషా విజయన్ లు షాపింగ్ కాంప్లెక్స్ లాంటివాటిలో ప్రొమోషన్లలో పాల్గొని ఫ్యాన్స్ అండ్ పబ్లిక్‌తో ఇంట్రాక్ట్ అవుతున్నారు. ఇది సినిమాపట్ల సానుకూలమైన వాతావరణాన్ని తీసుకొస్తున్నది.

ప్రేమ విరహ గీతం

తెలుగులో విడుదలైన బైసన్ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ & సింగర్ నివాస్ కె ప్రసన్న. అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చడంతో పాటు వినసొంపైన గాత్రంతో పాడి దానికి జీవం పోశారని చెప్పొచ్చు. ఇంకా ఆ గేయంలో ఉన్న ప్రేమ మరియు ప్రియురాలుకు మధ్య ఉన్న అనుబంధాన్ని తెలిపే పదాలు రాసిన విధానం హృదయాన్ని ధ్రవింప చేస్తుంది.

ఇందులో పాటలన్నింటికి సాహిత్యాన్ని డైరెక్టర్ మారీ సెల్వరాజ్ అందించడం విశేషం. “నువ్వు మనువాడి పోతే నే తల్లాడి పోనా, నీ కథ మారిపోతే నే కడితేరిపోతాను, లాంటి పాటలో పదాలు హీరో, హీరోయిన్ క్యారెక్టర్స్ మధ్య ఎంత గాఢమైన ప్రేమ, సాన్నిహిత్యం, బాధ ఉందో అర్థవుతోంది. “తీరేనా తీరేనా గుండెల్లోనా మండుతున్న మూగవేదన, మారేనా మారేనా కళ్ళల్లోనా కానవచ్చే నేటి వేదనా” లాంటి లోతైన అర్థాన్ని ఇచ్చే పదాలు వింటుంటే ఇది కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని.. డైరెక్టర్ మారీ సెల్వరాజ్, హీరో ధ్రువ్ విక్రమ్‌లకు ఒక మంచి తీపి గుర్తులు, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కుమ్మరిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. హ్యాష్‌ట్యాగ్ బైసన్ పేరుతో ఫ్యాన్స్ అంతా మూవీని ట్రెండ్ చేస్తున్నారు.

అమెరికన్ బ్రాండ్ కారు కొన్న రోహిత్ శర్మ: నెంబర్ ప్లేట్ చాలా స్పెషల్!

0

సినీతారలు, రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు ఎప్పటిపైకప్పుడు తమకు ఇష్టమైన వాహనాలను (కార్లు & బైకులు) కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే టీమీడియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ.. తాజాగా అమెరికన్ బ్రాండ్ అయిన టెస్లా కంపెనీకి చెందిన మోడల్ వై కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రోహిత్ శర్మ కొత్త కారు

స్వయంగా ఆటోమొబైల్ ఔత్సాహికుడు అయిన రోహిత్ శర్మ ఇప్పటికే.. ఖరీదైన లంబోర్ఘిని ఉరుస్ ఎస్ఈ కారును ఉపయోగిస్తున్నారు. కాగా ఇప్పుడు తాజాగా టెస్లా మోడల్ వై ఎలక్ట్రిక్ కారును తన గ్యారేజిలో చేర్చారు. ఇటీవలే టెస్లా ఇండియా.. మోడల్ వై డెలివరీలను ప్రారంభించింది. దీన్నిబట్టి చూస్తే టెస్లా మోడల్ వై కొనుగోలు చేసిన ప్రముఖుల జాబితాలో రోహిత్ శర్మ ఒకరుగా నిలిచారని తెలుస్తోంది.

ప్రత్యేకమైన నెంబర్ ప్లేట్

రోహిత్ శర్మ కొనుగోలు చేసిన టెస్లా మోడల్ వై ఎలక్ట్రిక్ కారు.. క్విక్ సిల్వర్ రంగులో ఉంది. అయితే ఈ కారు డైమండ్ బ్లాక్, పెర్ల్ వైట్, అల్ట్రా రెడ్, డీప్ బ్లూ మెటాలిక్, స్టీల్త్ గ్రే వంటి రంగుల్లో కూడా లభిస్తుంది. ఇక్కడ రోహిత్ శర్మ కొనుగోలు చేసిన కారు గురించి తెలుసుకోవలసిన మరో అంశం ఏమిటంటే.. 3015 అనే రిజిస్ట్రేషన్ ప్లేట్ లేట్ నెంబర్ ప్లేట్. ఇది తన పిల్లల పుట్టిన తేదీలను సూచిస్తుంది. ”డిసెంబర్ 30వ తేదీ తన కుమార్తె పుట్టిన రోజు, నవంబర్ 15 కుమారుడి పుట్టిన రోజు”. ఈ రెండు రోజుల గుర్తుగా 3015 నెంబర్ సెలెక్ట్ చేసుకున్నారు.

టెస్లా మోడల్ వై గురించి

అమెరికా కంపెనీ అయిన టెస్లా.. ఇండియన్ మార్కెట్లో మోడల్ వై కారును లాంచ్ చేసింది. కంపెనీ దీనిని చైనా నుంచి దిగుమతి చేసి, భారతీయ విఫణిలో విక్రయిస్తుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 59.89 లక్షలు. కాగా లాంగ్ రేంజ్ వేరియంట్ ధర రూ. 67.89 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్).

టెస్లా మోడల్ వై ఎలక్ట్రిక్ కారు.. రియర్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్ పొందుతుంది. ఇందులో సింగిల్ ఎలక్ట్రిక్ మోటారు 299 హార్స్ పవర్, 420 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. స్టాండర్డ్ వేరియంట్ లేదా బేస్ వేరియంట్ మోడల్ వై 60.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక ఫుల్ ఛార్జితో 500 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ కావు కేవలం 5.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం (యాక్సలరేషన్) అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 201 కిమీ కావడం గమనార్హం.

ఇక టాప్ వేరియంట్ లేదా లాంగ్ రేంజ్ రియర్ వీల్ డ్రైవ్ మోడల్ వై కారు 75 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక సింగిల్ ఛార్జితో 622 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ వేరియంట్లోని ఎలక్ట్రిక్ మోటారు 340 హార్స్ పవర్, 450 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాగా ఇది 5.6 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం 201 కిమీ/గం. దీని బట్టి చూస్తే.. వేగంలో రెండు వేరియంట్లు సమానంగా ఉన్నాయని అర్థమవుతోంది.

చెల్లికి నచ్చిన గిఫ్ట్ ఇచ్చిన రింకూ సింగ్: ధర ఎంతో తెలుసా?

0

అయినవాళ్లకు గిఫ్ట్స్ ఇవ్వడం ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. ఇందులో భాగంగానే 2025 ఆసియా కప్ విజేత భారత్ జట్టులో భాగమైన ఇండియన్ బ్యాటర్ రింకూ సింగ్ తన చెల్లెలికి ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ గిఫ్ట్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

చెల్లికి నచ్చిన గిఫ్ట్

2025 ఆసియా కప్ గెలిచినా తరువాత.. మార్క్యూ టోర్నమెంట్ తరువాత.. ఆస్ట్రేలియా పర్యటన కోసం తిరిగి జట్టులోకి చేరడానికి ముందు క్రికెటర్ రింకూ సింగ్ తన కుటుంబంతో గడిపారు. ఈ సమయంలో తన చెల్లి నేహా సింగ్‌కు.. హీరో విడా వీఎక్స్2 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ గిఫ్ట్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివన్నీ నేహా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.

రింకూ సింగ్ తన చెల్లికి కొనిచ్చిన హీరో విడా వీఎక్స్2 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర సుమారు రూ. 1లక్ష. ఇది ఎరుపు రంగులో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇది లేటెస్ట్ డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా.. మంచి పర్ఫామెన్స్ కూడా అందిస్తుంది. అన్న గిఫ్ట్ ఇచ్చిన సందర్భంగా నేహా.. ఇన్‌స్టాలో కృతజ్ఞతలు చెబుతూ పోస్ట్ చేసింది.

హీరో విడా వీఎక్స్2 ప్లస్

విభిన్న రంగులలో లభించే హీరో విడా వీఎక్స్2 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్.. 3.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. ఇది ఒక ఫుల్ ఛార్జితో 142 కిమీ రేంజ్ అందిస్తుంది (రియల్ వరల్డ్ రేంజ్ కొంత తగ్గే అవకాశం ఉంటుంది). దీని టాప్ స్పీడ్ 80 కిమీ/గం కాగా.. ఇది ఎకో, రైడ్, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. డిస్క్ బ్రేక్ ఆప్షన్ కలిగిన ఈ స్కూటర్ అండర్ సీట్ స్టోరేజ్ 27.2 లీటర్స్ కావడం గమనార్హం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుల్ ఛార్జ్ కావడానికి 5 గంటల 36 నిమిషాల సమయం పడుతుంది. మొత్తం మీద ఇది సిటీ రైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది.

రింకూ సింగ్ విషయానికి వస్తే..

క్రికెటర్ రింకూ సింగ్ విషయానికి వస్తే.. ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన ఆసియాకు ఫైనల్‌లో విన్నింగ్ షాట్ కొట్టి వార్తల్లో నిలిచారు. అలీఘర్‌లో జన్మించిన రింకూ.. అంచెలంచెలుగా ఎదిగారు. ఇటీవల ఆసియాకు కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఒక బంతి మాత్రమే బ్యాటింగ్ చేయడానికి అవకాశం లభించింది. ఆ అవకాశం కీలకంగా మారడంతో.. నాలుగు పరుగులు చేసి ఆటను గెలిపించాడు. నిజానికి ఫైనల్ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యకు గాయం కావడంతో.. రింకు జట్టులోకి వచ్చాడు. ఆలా ఫైనల్ మ్యాచ్ గెలవడానికి కారణమయ్యాడు.

ఇదిలా ఉండగా.. రింకూ సింగ్ గత ఏడాది తన స్వస్థలమైన అలీఘర్‌లో రూ. 3.5 కోట్ల విలువైన మూడు అంతస్థుల బంగ్లా కొనుగోలు చేశారు. ఈ బంగ్లాకు తన తల్లి గౌరవార్థం ‘వీణ ప్యాలెస్’ అని పేరు పెట్టారు. కాగా ఇతడు ఇప్పటి వరకు 34 టీ20 మ్యాచ్‌లు ఆడారు. 161.75 స్ట్రైక్ రేటుతో 550 పరుగులు చేసాడు. అంతే కాకుండా జాతీయ జట్టు తరపున రెండు వన్ డే మ్యాచ్‌లు ఆడారు.

ఘీంకరించిన ఏనుగు: దేశంలోనే అతిపెద్ద బీఎస్పీ ర్యాలీ!

0

రేపు అక్టోబర్ తొమ్మిదో తేదీన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) వ్యవస్థాపకులు మాన్యవర్ కాన్షిరామ్ వర్ధంతిని పురష్కరించుకుని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు మాయవతి అతిపెద్ద ర్యాలీకి పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో కాన్షిరామ్ స్మారక వనంలో ఈ కార్యక్రమం జరగనుంది.

ఇప్పటికే ఈ వార్తను బీఎస్పీ పార్టీ శ్రేణులు భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు దావానలంలా వ్యాపింపచేశారు. ఇందుకు యూపీలోని డెబ్భై ఐదు జిల్లాల్లో.. ఒక్కో జిల్లా నుంచి దాదాపు నలభైకి పైగా బస్సులు, వంద పైన కార్లు రానున్నట్టుగా సమాచారం. దేశం నలుమూలల నుంచి పది లక్షల జనాభాకి పైనే ఈ ర్యాలీలో పాల్గొంటారని అంచనా. ఇప్పటికే అనేక మంది నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున లక్నోకి తరలివెళ్తున్నారు. బీఎస్పీ ర్యాలీతో ఎటువంటి రాజకీయ పరిణామాలు ఏర్పడుతాయో.. అని దేశం అంతా ఇప్పుడు ఎంతో ఆసక్తిగా లక్నో వైపు చూస్తోంది.

ర్యాలీ ఉద్దేశ్యం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా నాలుగు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత బహుజన్ సమాజ్ పార్టీకి ఉంది. మూడు సార్లు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడగా, 2007లో ఎవరు ఊహించని విధంగా 206 సీట్లు సాధించి అత్యధిక మెజారిటీతో ఎవరి మద్దతులేకుండానే ప్రభుత్వాన్ని నడిపారు. అటువంటి పార్టీకి ఇప్పుడు ఆశించినంత ఫలితాలు ఎక్కడా కనిపించడంలేదు. దేశంలో కోట్లమంది కార్యకర్తలు, అభిమానులు ఉన్న అతిపెద్ద జాతీయ పార్టీకి ఇప్పుడు సరైన దిశానిర్దేశం అవసరం. ఈ ర్యాలీ.. చెల్లచెదురుగా, నిరాశలో ఉన్న బహుజనులకు ఒక నూతన ఉత్తేజాన్ని రగిలించునుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చి బీఎస్పీకి పూర్వవైభవాన్ని కల్పించాలనే మాయావతి ఒక సంకల్పాన్ని తలపెట్టారు. ఇది కేవలం పార్టీ మీటింగో.. లేకుంటే కాన్షిరామ్ వర్ధంతి సభో కాదు, అణగారిన.. అణచివేయబడిన 85% బహుజన వర్గాల రాజకీయ జీవితాలను మార్చివేసే ప్రక్రియగా చెబుతున్నారు.

ర్యాలీకి ఆటంకాలు

బీఎస్పీ మీటింగ్ వల్ల.. మిగిలిన రాజకీయ పార్టీలను కంగారు పెడుతున్నట్టు సమాచారం. ఎందుకంటే ఉత్తరప్రదేశ్‌లోని అనేక రైళ్లను రద్దు చేయడం, మిగిలిన ట్రైన్స్ రాకపోకల సమయాల్లో మార్పలు చేయడంలాంటివి అందుకు నిదర్శనమని.. పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీఎస్పీ తిరిగి పుంజుకుంటే యూపీలోనే కాదు ఇండియాలో.. అనేక చోట్ల బీజేపీ, కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ లాంటి పార్టీలకు పెద్ద సవాల్‌గా మారుతుంది. ఆ పార్టీల కోటలు బీటలుపారే అవకాశం లేకపోలేదు. ఈ పరిస్థితుల్లో ర్యాలీకి అన్ని రకాల ఆటంకాలు, ఇబ్బందులు కలిగిస్తున్నట్టు బీఎస్పీ శ్రేణులు చెబుతున్నాయి. అక్టోబర్ తొమ్మిదిన జరిగే మీటింగ్‌పైన మిగిలిన పార్టీల భవితవ్యం ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు, నిపుణులు చెబుతున్నారు.

కాన్షిరాంకు ఘన నివాళి

2027 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్‌లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇది ఆరంభం అని కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా మొత్తం బీఎస్పీ పోస్టర్లు, వీడియోలు, పాటలతో ఒక ఊపు ఊపేస్తున్నారు. హ్యాష్‌ట్యాగ్ 09 ఛలో లక్నో పేరిట ట్రెండింగ్ చేస్తున్నారు. ”జై భీమ్, జై పూలే, ఓట్లు మావి.. సీట్లు మీవా ఇకపై చెల్లదు ఇకపై చెల్లదు, మేమెంతో మాకంత, జాతీ చోడో సమాజ్ జోడో” లాంటి శక్తివంతమైన స్లోగన్లతో కార్యకర్తలు ప్రచార కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ.. ప్రజల్లో ర్యాలీ ఆతృతను, ఆసక్తిని పెంచుతున్నారు. ఈ భారీ ర్యాలీని విజయవంతం చేసి కాన్షిరాంకు ఘనంగా బహుజన నివాళులు అర్పించదలుచుకున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ ర్యాలీ ప్రభావం ఏ విధంగా ఉందో తెలియాలంటే 2027 ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే. ఈ మీటింగ్ గురించి మీరు ఏమనుకుంటున్నారో అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

తిరుపతిలో డ్యూడ్ టీమ్.. లవ్‌టుడే తరువాత సరికొత్త ప్లాన్!

0

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో.. ఈ రోజు (అక్టోబర్ 8) డ్యూడ్ సినిమా టీమ్ తిరుపతికి చేరుకున్నారు. ఈ సినిమా ఈ నెల 17వ తేదీన దీపావళి సందర్బంగా థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే చిత్ర యూనిట్ ప్రొమోషన్స్ ప్లాన్ చేసింది.

లవ్‌టుడే, డ్రాగన్ వంటి సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో అత్యంత విజయం సాధించడంతో.. ప్రదీప్ రంగనాథ్ ఇక్కడ యువతలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఇప్పుడు తాజాగా డ్యూడ్ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథ్ మంచి యంగ్ లుక్ మరియు డిఫరెంట్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి కాబట్టి.. అతన్ని యూత్ ఎక్కువగా ఇష్టపడుతారు. అందుకోసమే మూవీ ప్రమోషన్ ప్రోగ్రామ్‌ను తిరుపతి నగరంలో నిర్వహించడం జరుగుతోంది.

డ్యూడ్ మూవీ టీమ్ తిరుపతి షెడ్యూల్

మొదటగా తిరుపతిలో ఉన్న ప్రెస్ అండ్ మీడియాతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో డ్యూడ్ టీమ్ పాల్గొని సినిమాకి సంబంధించిన షూటింగ్, రిలీజింగ్, పాటలు, నటీనటుల వ్యక్తిగత అంశాలతో పాటు మరిన్ని మూవీ విషయాలను మీడియాతో పంచుకుంటారు. ఆ విశేషాలు సమావేశం తరువాత మనం సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో చూడచ్చు.

విద్యార్థులతో చిట్‌చాట్‌

ఈ మీడియా సమావేశం అనంతరం తిరుపతిలోని కరకంబాడి రోడ్డులో ఉన్న శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో గ్రీట్ అండ్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాలేజీలో ఉన్నటువంటి ఇంజినీరింగ్ విద్యార్థులతో చిట్‌చాట్‌ చేస్తారు. యూత్ ఎక్కువ ఫ్యాన్స్ కాబట్టి వారిని మరింత ఉత్సహాపరచి సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేయనున్నారు. హీరో ప్రదీప్ కోసం ఎంతో విద్యార్థులు ఎదురుచూసే అవకాశం ఉంటుంది. అయితే మూవీ టీమ్ అంతా ఏ విధంగా సందడి చేస్తుందో చూడాలి అంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే.

శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రోగ్రాం అయిపోయిన తరువాత.. అక్కడ నుంచి మరో కాలేజీలో కూడా విద్యార్థులతో మూవీ టీమ్ ముచ్చటించనుంది. అది తిరుపతి – తిరుచానూరు హైవే పక్కన ఉన్న రాయలచెరువు రోడ్డులో కేసీ పేటని ఆనుకోని ఉన్న మెడ్ జీ (అన్ అకాడమీ) కాలేజీలో ఈ ఈవెంట్ నిర్వహిస్తారని సమాచారం. సాయంత్రం ఐదు గంటలకు ఈ సమావేశం జరుగుతుందని తెలుస్తోంది. మెడ్ జీ కాలేజీలో కూడా అక్కడి స్టూడెంట్స్‌తో ఫన్ క్రియేట్ చేసి సినిమా పట్ల ఆసక్తిని కలిగించే కార్యక్రమం చేయనున్నారు.

రెండు రాష్ట్రాల ఆదరణ కోసం

ఈ ఈవెంట్స్‌తో డ్యూడ్ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రల్లో అధిక ఆదరణ లభించే అవకాశం ఉంది. లవ్‌టుడే, డ్రాగన్ సినిమాలు ప్రేక్షకులను ఎంతోగానో అలరించాయి. ఆ రెండు కూడా మంచి కథా వస్తువు మరియు నటన ఉన్న సినిమాలు. కాబట్టి ప్రదీప్ రంగనాథ్ మీద హై ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఈ డ్యూడ్ కూడా అంతే కథా బలంతో నటతో ఉంటుందని ఆశిద్దాం. ఈ సినిమాలో హీరోయిన్‌గా మమిత బైజు నటించారు.

భారీగా పెరిగిన బంగారం ధరలు: ఇక కొనడం సాధ్యమేనా?

0

భారతదేశంలో బంగారం ధరలు కనీవినీ ఎరుగని రీతిలో పెరుగుతూ.. పసిడి ప్రియులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. 24 క్యారెట్ల గోల్డ్ రేటు ఈ రోజు (అక్టోబర్ 8) రూ. 1,20,000 దాటేసింది. దీంతో ఒక్కసారిగా బంగారం కొనడం సాధ్యమేనా అనే ప్రశ్న చాలామందిలో పుట్టింది. ఇదిలాగే కొనసాగితే.. బంగారం రెండు లక్షల రూపాయలకు చేరుకోవడానికి మరెంతో సమయం పట్టదని అర్థమవుతోంది. ఈ కథనంలో గోల్డ్ రేట్లు.. దేశంలోని ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.

రూ. 12వేలు దాటేసింది గోల్డ్ రేటు

బుధవారం (అక్టోబర్ 8) హైదరాబాద్, విజయవాడలలో.. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు 1150 రూపాయలు పెరిగి, రూ. 1,23,170 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1050 రూపాయలు పెరిగి.. రూ. 1,12,900 వద్ద నిలిచింది. బంగారం అంటే తెలుగు ప్రజలకు వెంటనే గుర్తచ్చే ప్రొద్దుటూరులో కూడా ఇదే ధరలు కొనసాగుతాయి. అంతే కాకుండా బెంగళూరులో కూడా బంగారం ధరలు దాదాపు ఇలాగే ఉంటాయి.

ఇక సమీపంలోని చెన్నై నగరంలో.. బంగారం ధరల విషయానికి వస్తే, ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు 1100 రూపాయలు పెరిగి.. 1,23,280 వద్దకు చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1000 పెరిగి.. 1,13,000 రూపాయలకు చేరింది. గతంలో కొన్ని రోజులు తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే ఇక్కడ (చెన్నై) పసిడి ధరలు కొనసాగాయి. ఇప్పుడు రేట్లలో చిన్న తేడా కనిపిస్తోంది.

దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా బంగారం ధరలు అమాంతం పెరిగాయి. ఇక్కడ 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1250 పెరిగి.. రూ. 1,23,320 వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి విషయానికి వస్తే.. దీని ధర రూ. 1050 పెరిగి, రూ. 1,13,050 వద్ద నిలిచింది. మొత్తం మీద భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగా ఉందని స్పష్టమవుతోంది.

సెప్టెంబర్ 2025లో భారీగా పెరిగిన గోల్డ్ రేటు.. అక్టోబర్ ప్రారంభంలో కొంత తగ్గుముఖం పట్టింది. అయితే ఈ నెల ప్రారంభమైన నేటికీ (ఎనిమిది రోజులకు) పసిడి ధర సుమారు రూ. 5900 పెరిగింది. దీన్ని బట్టి చూస్తే గోల్డ్ రేటు ఎంత వేగంగా పెరుగుతోందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. పరిస్థితితులు ఇలాగే కొనసాగితే.. దీపావళికి గోల్డ్ రేటు రూ. 13,000 (10 గ్రామ్స్) దాటేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇదే జరిగితే బంగారం కొనుగోలు తగ్గుతాయా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

వెండి ధరలు ఇలా..

దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగినప్పటికీ.. వెండి మాత్రం కొంత శాంతించిందనే చెప్పాలి. ఎందుకంటే కేజీ రేటు ఇప్పుడు.. నిన్నటి (మంగళవారం కంటే) రూ. 100 మాత్రమే తక్కువ. ఈ రోజు (బుధవారం) కేజీ వెండి రేటు హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు వంటి నగరాల్లో రూ. 1,67,000 వద్ద ఉంది. అయితే ఢిల్లీలో మాత్రం కేజీ వెండి ధర రూ. 1,57,000 వద్ద ఉంది. దీన్నిబట్టి చూస్తే ఢిల్లీలో సిల్వర్ రేటు.. దేశంలోని ఇతర నగరాల్లో కంటే రూ. 10000 తక్కువని స్పష్టమవుతోంది. అయితే త్వరలోనే వెండి రూ. 2 లక్షలకు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు కూడా నిపుణుల మాటలను నిజం చేస్తాయా? అన్నట్టు ఉన్నాయి.

ప్రియదర్శి మిత్రమండలి.. దీపావళికి నవ్వుల సందడి: ట్రైలర్ చూశారా?

0

ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్ లీడ్ రోల్‌లో నటించిన సినిమా మిత్రమండలి. ఈ చిత్రానికి సంబంధించిన పాటలు, టీజర్, పోస్టర్స్ సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో ట్రెండ్ అవుతున్నది. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి బిగ్ సక్సెస్ ఫుల్ టాక్‌‌తో నడుస్తున్న లిటిల్ హార్ట్స్ సినిమా యూనిట్ మౌళి, శివాని, సాయి మార్తాండ్ చేతుల మీదుగా చిత్రమండలి సినిమా ట్రైలర్‌ను మంగళవారం (అక్టోబర్ 7) ఉదయం పదకొండు గంటలకు ఏఏఏ సినిమాస్‌లో లాంచ్ చేయడం జరిగింది.

అక్టోబర్ 16న రిలీజ్

మిత్రమండలి సినిమాని అక్టోబర్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. నిర్మాత బన్నీ వాసు ప్రెజెంటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. కథ బాగుంటే.. ఏ సినిమా అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అనిపించిందంటే.. బన్నీ వాసు ఆ చిన్న చిన్న చిత్రాలను తీసుకొని థియేటర్లలో రిలీజ్ చేస్తుంటారు. ఈమధ్య హిట్ అయిన లిటిల్ హార్ట్స్ సినిమాను కూడా ఆయనే రిలీజ్ చేశారు. అందుకనే రెండు టీమ్‌లను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి.. ప్రేక్షకుల కళ్ళల్లో ఆనందాన్ని నింపారు. ఏఏఏ సినిమాస్ అంతా నవ్వులతో, ఫుల్ జోక్స్‌తో నిండిపోయింది.

మొత్తం నవ్వులే..

సినిమా ఎలా ఉండబోతుంది అనేది ట్రైలర్‌లోనే చూపించేశారు. ఫుల్ ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ అని చెప్పకనే చెప్పేశారు. సినిమా మొత్తం కామెడీ స్టార్స్‌తో నింపేశారు. ప్రతి సన్నివేశం మనకు ఎంతో నవ్వు తెప్పిస్తుంది. ఇందులో కామెడీ సూపర్ స్టార్ బ్రహ్మానందం, ప్రియదర్శి, వెన్నెల కిషోర్, సత్య, ప్రసాద్ బెహరా, రఘు, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, విటివి గణేష్, డైరెక్టర్ అనుదీప్, యాష్ టాగ్ నైంటీస్ అనిల్, వంశీధర్ గౌడ్ లాంటి ఎంతో మంది కామెడీ యాక్టర్స్ ఉన్నారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు సినిమాలో ఎంత కామెడీ జెనరేట్ అవుతుంది అనేది.

జంబరు గింబరు లాలా.. అంటే?

రవితేజ వెంకీ సినిమాలో కామెడీ కింగ్ బ్రహ్మానందం చెప్పిన వెరీ పాపులర్ డైలాగ్ మీమర్స్ అందరూ ఫుల్ ఎంజాయ్ చేసే డైలాగ్ “జంబరు గింబరు లాలా”. డైరెక్టర్ విజయేంద్ర అదే డైలాగ్ ని తీసుకుని మిత్రమండలి సినిమాలో ఒకపాటని క్రియేట్ చేశారు. అలా రాసి కంపోజ్ చేయడమే కాకుండా ఆ పాటకు బ్రహ్మానందంతోనే డాన్స్ చేయించడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్ ఇప్పటికే ప్రేక్షకులలో ట్రెండ్ అయిపోయాయి. ఈ డైలాగ్‌కు అర్థం ఏంటని బ్రహ్మానందంను అడిగితే.. ప్రత్యేకించి మీనింగ్ అంటూ ఏమి లేదు, కేవలం నవ్వుకోవడం కోసమే అని చెప్పారు. హీరో, హీరోయిన్ కూడా ఈ పాటకి డాన్స్ చేశారు.

మిత్రమండలి చిత్ర బృందం

కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, సోమరాజు, విజయందర్ రెడ్డి తీగల నిర్మాతలుగా వ్యవహరించారు. బన్నీ వాసు సినిమాను ప్రెజెంట్ చేస్తున్నారు. సంగీతం ఆర్ఆర్ ధ్రువన్ సమకూర్చారు. సిద్దార్థ్ ఎస్‌జే సినిమాటోగ్రాఫర్ కాగా, ఎడిటర్ కోదాటి పవన్ కల్యాణ్ బాధ్యత వహించారు. గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. కాగా ఈ సినిమా దీపావళికి అందరి ముఖాల్లో నవ్వులు పూయించడానికి థియేటర్లలో రిలీజ్ కానుంది.

డాక్టర్ అయ్యుండి.. సినిమాల్లోకి: శశివదనే హీరోయిన్ గురించి ఆసక్తికర విషయాలు

0

నెపోలియన్, అనుకున్నది ఒక్కటి ఐయినది ఒక్కటి, ఏడ తానున్నాడ, నేను సీతాదేవి.. లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు హీరోయిన్ కోమలి ప్రసాద్. ఇప్పుడు శశివదనే అనే మంచి రొమాంటిక్ సినిమాతో మన ముందుకు వస్తోంది. ఈ మూవీ అక్టోబర్ 10న థియేటర్లలో విడుదలవుతుంది. ఈ సందర్బంగా నిర్వహించిన సినిమా పాత్రికేయులతో సమావేశంలో కొన్ని సినిమా మరియు వ్యక్తిగత విషయాలను కోమలి మీడియాతో ముచ్చటించింది.

డాక్టర్ అయ్యుండి.. సినిమాల్లోకి ఎందుకొచ్చానంటే?

మీరు డాక్టర్ అయ్యుండి సినిమాల్లోకి ఎందుకు వచ్చారు? అని శశివదనే ప్రెస్‌మీట్‌లో రిపోర్ట్ అడిగిన ప్రశ్నకు.. కోమలి ప్రసాద్ సమాధానం ఇస్తూ.. మాములుగా నేను క్లాసికల్ డ్యాన్స్‌తో ఆరంగేట్రం చేశాను, డ్యాన్స్ అండ్ థియేటర్ ఆర్ట్స్ కూడా చేశాను. నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం. కాకపొతే అప్పుడు మా ఫాదర్ నీకు ఫ్యాషన్ ఏమున్నా కూడా.. ఎడ్యుకేషన్ పూర్తి అయినా తరువాతే అని చెప్పారు. ఎందుకంటే ఎడ్యుకేషన్‌కు ఆయన చాలా విలువ ఇస్తారు కాబట్టి అని చెప్పుకొచ్చారు. అందుకే నేను డాక్టర్ కోర్స్ పూర్తి చేశాకే యాక్టింగ్‌లోకి రావడం జరిగిందని హీరోయిన్ కోమలి ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు.

మతం ఏదైనా ఉంటే అది ప్రేమే

ఇక సినిమా గురించి మాట్లాడుతూ.. నేను పర్సనల్‌గా ప్రేమను చాలా నమ్ముతాను. నాకు మతం ఏదైనా ఉంటే అది ప్రేమే. అబ్బాయిని అమ్మాయి మోసం చేయడం, అమ్మాయిని అబ్బాయి మోసం చేయడం అనేది జెండర్‌ను బట్టి ఏమి ఉండదు. మనుషులు చెడ్డవాళ్ల మంచివాళ్ల అనేదాన్ని బట్టే ఏ ప్రేమైన ఉంటుందని.. సినిమాలో తన పాత్ర కూడా ఒక స్వచ్ఛమైన ప్రేమగల గోదావరి జిల్లాల అందమైన అమ్మాయి చుట్టూ తిరుగుతుందని ఆమె చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్యూర్ లవ్ స్టోరీలు తక్కువ అయిన తరుణంలో మేము గనుక హిట్ అయితే అదే ట్రెండ్ ఆవుతుంది అని కోమలి మాట్లాడారు.

నటి కోమలి ప్రసాద్ గురించి

కోమలి ప్రసాద్ 1995 ఆగస్టు 24న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జన్మించినప్పటికీ.. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో పెరిగారు. ఈమె అహ్మద్‌నగర్‌లోని.. ప్రవర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో బీడీఎస్ (డెంటిస్ట్) పూర్తిచేసిన తరువాత.. సినిమా రంగం మీద ఉన్న ఆసక్తితో తెలుగు సినిమాల్లోకి నటిగా ప్రవేశం చేశారు.

సినిమా ప్రస్థానం ఇలా..

మొదట నేను సీతాదేవి అనే చిత్రంతో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది. తరువాత ఒక్కొక్కటిగా నెపోలియన్, హిట్ (ది ఫస్ట్ కేస్), అనుకున్నది ఒకటి అయినది ఒకటి, రౌడీ బాయ్స్, సెబాస్టియన్ పీ.సీ 524, హిట్ ది సెకండ్ కేస్, హిట్ థర్డ్ కేస్ సీక్వెల్ వంటి సినిమాల్లో నటించింది. అలాగే లూజర్, మోడర్న్ లవ్ హైదరాబాద్, టచ్ మీ నాట్ లాంటి వెబ్ సిరీస్‌లలో కూడా నటించింది. తనకు ఒకేలాగా ఉండే పాత్రలు చేస్తూ వెళ్లడం ఇష్టం లేదని, విభిన్నమైన, విలక్షణమైన కథలు, క్యారెక్టర్స్ చేయడం అంటే.. నాకు చాలా ఉత్సహంగా ఉంటుందని శశివదనే ప్రమోషన్‌లో భాగంగా చెప్పుకొచ్చారు. అదే సందర్బంగా ఈ సినిమాలో అనేక ట్విస్ట్‌లు ఉన్నాయని, ఇంటిల్లపాది కూర్చుని చూసే మూవీ ఇదని.. అక్టోబర్ 10న కుటుంబం అంతా కలిసి థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రేక్షకులను కోరారు.

2025 టీవీఎస్ రైడర్: అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ.. సరికొత్త ఫీచర్స్!

0

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టీవీఎస్ మోటార్ కంపెనీకి చెందిన ‘రైడర్ 125‘ కొత్త వేరియంట్ అధికారికంగా మార్కెట్లో అడుగుపెట్టింది. సంస్థ లాంచ్ చేసిన ఈ కొత్త వేరియంట్.. ఎలాంటి అప్డేట్స్ పొందింది. ధర ఎంత?, ఇతర వివరాలు ఏమిటనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.

ధర

టీవీఎస్ రైడర్ 125 కొత్త వేరియంట్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి టీఎఫ్‌టీ డ్యూయెల్ డిస్క్ (రూ. 95600), ఎస్ఎక్స్‌సీ డ్యూయల్ డిస్క్ (రూ. 93800) ఇక్కడ అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ. ఈ బైక్ ఇప్పుడు దేశంలోని అన్ని టీవీఎస్ మోటార్ డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది. కంపెనీ ఇప్పుడు ఈ కొత్త బైకుని ‘ది వికెడ్ ట్రోయికా‘ అని పిలుస్తుంది. ఇది సాధారణ మోడల్ కంటే కూడా ఎక్కువ అప్డేట్స్ పొందుతుంది.

డిజైన్ & ఫీచర్స్

సరికొత్త టీవీఎస్ రైడర్ 125 బైక్ చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉన్నప్పటికీ.. చిన్న అప్డేట్స్ పొందుతుంది. అవి ఫాలో మీ హెడ్‌ల్యాంప్, ఇంజిన్ ఆపివేసిన తరువాత కూడా లైట్ కొంతసేపు ఆన్‌లో ఉండే ఓ సేఫ్టీ ఫీచర్. ఇవి కాకుండా రైడర్ రెండు డిస్‌ప్లే ఎంపికలతో స్మార్ట్ కనెక్టివిటీ కూడా ఇందులో ఉంది. 99 కంటే ఎక్కువ ఫీచర్స్ అందించే టీఎఫ్‌టీ స్క్రీన్.. 85 కంటే ఎక్కువ ఫీచర్లతో.. రివర్స్ ఎల్‌సీడీ క్లస్టర్ ఇందులో లభిస్తుంది.

టీవీఎస్ స్మార్ట్‌కనెక్ట్ ప్లాట్‌ఫామ్.. బ్లూటూత్ కనెక్టివిటీ, వాయిస్ అసిస్ట్, టర్న్ బై టర్న్ న్యావిగేషన్, కాల్ హ్యాండ్లింగ్, నోటిఫికేషన్ వంటి వాటికి అనుసంధానంగా ఉంటుంది. ఇది రోజువారీ ప్రయాణాన్ని మరింత అనుకూలంగా మారుస్తుంది. ఇవి కాకుండా కొన్ని గ్రాఫిక్స్ అప్డేట్స్ కూడా పొందుతాయి.

ఇంజిన్ వివరాలు

కొత్త టీవీఎస్ రైడర్ 125 బైక్ ఇప్పుడు బూస్ట్ మోడ్ పొందుతుంది. ఇది ఐజీఓ అసిస్ట్ టెక్నాలజీతో కూడైన కేటగిరీ ఫస్ట్ ఫీచర్. ఇందులోని ఇంజిన్ 6000 ఆర్‌పీఎమ్ వద్ద 11.75 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది, హార్స్ పవర్ మారదు 11.2 హెచ్‌పీ వద్దనే ఉంటుంది. ఏబీఎస్‌తో కూడిన డ్యూయెల్ డిస్క్ బ్రేక్‌లు ఇప్పుడు ఇందులో ఉన్నాయి. ఇవన్నీ రైడర్లకు ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.

రైడర్ 125 బైక్ ఉప్పుడు 90/90-17 ఫ్రంట్, 110/80-17 రియర్ టైర్లను పొందుతుంది. కాబట్టి రోడ్డుపై మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. క్లాస్ లీడింగ్ టెక్నాలజీ, సెగ్మెంట్ ఫస్ట్ సేఫ్టీ ఫీచర్స్ కలిగిన ఈ లేటెస్ట్ బైక్.. ఎరుపు రంగులో అక్కడక్కడా మెటాలిక్ సిల్వర్ ఫినిషింగ్ పొందుతుంది.

కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే?

2025 టీవీఎస్ రైడర్ 125 లాంచ్ సందర్భంగా.. కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అనిరుద్ధ హల్దార్ మాట్లాడుతూ.. యువ రైడర్లు టీవీఎస్ మోటార్ నుంచి ఏమి కోరుకుంటున్నారో.. దానిని ఇవ్వడంలో భాగంగానే ఈ కొత్త బైక్ లాంచ్ చేసాము. ఇది తప్పకుండా రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. మరిన్ని కొత్త మోడల్స్ లేదా అప్డేటెడ్ మోడల్స్ తీసుకువడానికి కృషి చేస్తూనే ఉంటామని ఆయన అన్నారు. మొత్తం మీద కొత్త అదనపు ఫీచర్స్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని తెలుస్తోంది.