Home Blog Page 76

లాంచ్‌కు ముందే దుమ్మురేపుతున్న హైలక్స్: ఈ కారు గురించి తెలుసా?

0

పరిమాణంలో కొంత పెద్దదిగా ఉన్న వాహనాల జాబితాలో.. టయోటా కంపెనీకి చెందిన హైలక్స్ ఒకటి. సాధారణ వినియోగానికి మాత్రమే కాకుండా కమర్షియల్ ఉపయోగానికి పనికొచ్చే ఈ వెహికల్.. ఆఫ్ రోడింగ్ చేయడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పటికీ మోడల్ ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ.. అప్డేటెడ్ వెర్షన్ లాంచ్ కావడానికి సిద్ధమైంది. దీనిని కంపెనీ నవంబర్ 10న ఆవిష్కరించనున్నట్లు వెల్లడించింది.

2018 తరువాత పెద్ద అప్డేట్!

టయోటా కొత్త హైలెక్స్ కారుకు సంబంధించిన టీజర్ ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జపాన్ బ్రాండ్ అయిన ఈ కారు డిజైన్ పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇది ఇప్పుడున్న కారుకంటే కూడా కొంత ఎక్కువ అప్డేట్స్ పొందనుంది. 2018 తరువాత ఈ మోడల్ మొదటిసారి పెద్ద నవీనీకరణ పొందుతున్నట్లు సమాచారం.

2018లో ఎనిమిదవ తరం టయోటా హైలక్స్ గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయింది. ఆ తరువాత కాలక్రమంలో చిన్న చిన్న అప్డేట్స్ పొందింది. ఫేస్‌లిఫ్ట్ రూపంలో కూడా లాంచ్ అయింది. ఇప్పుడు లాంచ్ కావడానికి సిద్దమవుతున్న హైలెక్స్.. పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్ మీద ఆధారపడుతుందని సమాచారం.

లేటెస్ట్ డిజైన్ & కొత్త ఫీచర్!

ఇప్పుడు విడుదలైన టీజర్ వీడియోలో.. హైలెక్స్ కొత్త డిజైన్ కలిగిన గ్రిల్ పొందుతుందని తెలుస్తోంది. అల్లాయ్ వీల్స్, దానిపై బ్రాండ్ లోగో, లైటింగ్ సెటప్ అన్నీ కూడా టీజర్ వీడియోలో కనిపిస్తున్నాయి. బంపర్ అవుట్‌గోయింజి మోడల్ కంటే కూడా కొంత పెద్దదిగా ఉన్నట్లు తెలుస్తోంది. బూమరాంగ్ షేప్ హెడ్‌ల్యాంప్ ప్రత్యేకమైన ఆకర్షణ అని తెలుస్తోంది. అయితే కంపెనీ ఇంటీరియర్ డిజైన్, ఫీచర్స్ గురించి అధికారికంగా వెల్లడించలేదు. ఈ విషయాలను సంస్థ త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.

కొత్త టయోటా హైలక్స్ కారు.. అప్డేటెడ్ డ్యాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్, పెద్ద ఫ్రీస్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం వంటివి పొందుతుందని అంచనా. బహుశా ఈ కారులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం అనేది 12 ఇంచెస్ ఉండే అవకాశం ఉంది. డిటైటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా అప్డేట్ అయి ఉండొచ్చని భావిస్తున్నాము.

కొత్త ఇంజిన్?

టయోటా కంపెనీ తన సరికొత్త హైలక్స్ కారులో.. కొత్త ఇంజిన్ పరిచయం చేయనున్నట్లు సమాచారం. కాబట్టి ఇందులో 2.8 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బోఛార్జ్డ్ డీజిల్ ఉండే అవకాశం ఉంది. ఇది 48 వీ మైల్డ్ హైబ్రిడ్ సిస్టం కూడా పొందే అవకాశం ఉంది. ఇది 201 బీహెచ్పీ పవర్, 500 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుందని తెలుస్తోంది. అయితే.. టాప్ వేరియంట్ పవర్, టార్క్ అనేవి కొంత ఎక్కువగా ఉంటాయి. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

హైలక్స్ డిమాండ్ ఎలా ఉందంటే?

ఇండియన్ మార్కెట్లో.. టయోటా హైలక్స్ కార్లకు చెప్పుకోదగ్గ డిమాండ్ లేదనే తెలుస్తోంది. ఎందుకంటే ఈ వాహనాల అమ్మకాల డేట్ చూస్తే.. సేల్స్ అంతంత మాత్రంగానే ఉన్నట్లు అర్థమవుతోంది. అయితే ఈ కార్లను కొనుగోలు చేసే రాష్ట్రాల జాబితాలో కేరళ ముందు వరుసలో ఉంది. కాగా కంపెనీ త్వరలో లాంచ్ చేసే అప్డేటెడ్ హైలక్స్ మోడల్ ఎలాంటి అమ్మకాలు పొందుతుందో తెలుసుకోవడానికి కొంతకాలం వేచి చూడాల్సిందే.

500 మందికే ఈ స్టైలిష్ బైక్: దీని ధర ఎంతో తెలుసా?

0

లగ్జరీ మోటార్‌సైకిల్స్ తయారీ సంస్థ డుకాటీ.. గ్లోబల్ మార్కెట్లో సరికొత్త స్క్రాంబ్లర్ 10వ యానివర్సరీ ఎడిషన్ లాంచ్ చేసింది. ఈ కొత్త బైక్ ధర రూ. 17.10 లక్షలు (ఎక్స్ షోరూమ్). స్క్రాంబ్లర్ బైక్ విఫణిలో అడుగుపెట్టి.. పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. కంపెనీ ఈ యానివర్సరీ ఎడిషన్ లాంచ్ చేసింది. ఇది సాధారణ స్క్రాంబ్లర్ కంటే కూడా కొంత ఎక్కువ కాస్మొటిక్ అప్డేట్స్ పొందినట్లు తెలుస్తోంది. ఈ లేటెస్ట్ బైక్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఈ కథనంలో చూసేద్దాం..

500 యూనిట్లు మాత్రమే!

డుకాటీ కంపెనీ.. తన 10వ యానివర్సరీ ఎడిషన్ స్క్రాంబ్లర్ బైకును తన దీర్ఘకాలిక భాగస్వామి రిజోమాతో కలిసి నిర్మించింది. చాన్నాళ్ల తరువాత రిజోమా కంపెనీ బైక్ రూపొందించడంలో ప్రత్యక్షంగా సహకరించింది. కాబట్టి దీనిని స్క్రాంబ్లర్ డుకాటీ 10వ యానివర్సరీ రిజోమా ఎడిషన్ అని పిలుస్తారు. దీనిని ప్రపంచ వ్యాప్తంగా కేవలం 500 మందికి మాత్రమే విక్రయించనున్నారు. అంటే ఇది భారతదేశంలో లిమిటెడ్ ఎడిషన్ రూపంలో మాత్రమే అందుబాటులో ఉంటుందని స్పష్టమవుతోంది. కానీ మనదేశానికి ఎన్ని యూనిట్లు కేటాయించారనే విషయాన్ని సంస్థ వెల్లడించలేదు.

స్టైలిష్ డిజైన్ కలిగిన డుకాటీ స్క్రాంబ్లర్ యానివర్సరీ ఎడిషన్.. చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇందులో మెషిన్డ్ బిల్లేట్ అల్యూమినియం అడ్జస్టబుల్ లివర్స్, బ్రేక్ అండ్ క్లచ్ రిజర్వాయర్ క్యాప్స్, ఫ్యూయల్ ఫిల్లర్, ప్యాసింజర్ ఫుట్ పెగ్‌లు ఉన్నాయి. డిజైన్ పరంగా అప్డేట్ పొందిన ఈ లేటెస్ట్ బైక్.. యాంత్రికంగా ఎటువంటి అప్డేట్స్ పొందలేదని తెలుస్తోంది.

చూడచక్కని కలర్స్

స్క్రాంబ్లర్ రిజోమా ఎడిషన్.. స్టోన్ వైట్ / మెటల్ రోజ్ అనే డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్ పొందుతుంది. విండ్‌స్క్రీన్, టైమింగ్ బెల్ట్ కవర్స్, ఫ్రేమ్ కవర్స్, ఇంజిన్ కేస్ కవర్స్, రైడర్ ఫుట్ పెగ్స్ అన్నీ కూడా మెటల్ రోజ్ రంగులో ఉంటడం చూడవచ్చు. కాగా ఫ్యూయెల్ ట్యాంక్, ఇంజిన్, ఛాసిస్ బార్ ఎండ్ మిర్రర్స్, ఎగ్జాస్ట్ సిస్టం వంటివి నలుపు రంగులో ఉండటం చూడవచ్చు.

ఇంజిన్ వివరాలు

డుకాటీ స్క్రాంబ్లర్ 10వ యానివర్సరీ ఎడిషన్ 803 సీసీ ఫోర్ స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ ఎల్ ట్విన్ ఇంజిన్ పొందుతుంది. ఇది 73 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ 63.2గా ఉంటుంది. దీన్నిబట్టి చూస్తే పర్ఫామెన్స్ ఉత్తమంగానే ఉంటుందని తెలుస్తోంది. బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ ఇందులో ఉంటుంది.రైడర్ ఎయిడ్ సూట్ కూడా లభిస్తుంది.స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్ కలిగిన ఈ బైక్ బైక్ రైడర్లను ఆకట్టుకునే విధంగా తయారైందని స్పష్టంగా తెలుస్తోంది.

ఇండియన్ మార్కెట్లో డుకాటీకున్న డిమాండ్?

డుకాటీ కంపెనీ బైకులకు ఇండియన్ మార్కెట్లో పెద్దగా డిమాండ్ లేదనే తెలుస్తోంది. దీనికి కారణం అధికంగా ఉన్న ధరలే. సాధారణంగా ఖరీదైన బైకులను.. సెలబ్రిటీలు లేదా డబ్బున్నవారు మాత్రమే కొనుగోలు చేస్తారు. కాగా డుకాటీ బైకుల ధరలు ఎక్కువగా ఉండటం వల్ల.. సామాన్య ప్రజలు ఈ బ్రాండ్ బైకులను కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేస్తారు. అయితే కంపెనీ బైక్ ప్రేమికులను దృష్టిలో ఉంచుకుని.. ఎప్పటికప్పుడు ఆధునిక ఉత్పత్తులను లాంచ్ చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే డుకాటీ స్క్రాంబ్లర్ 10వ యానివర్సరీ ఎడిషన్ లాంచ్ చేసింది. దీనికి ఎలాంటి ఆదరణ లభిస్తుందో తెలుసుకోవడానికి ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంటుంది.

ఎలివేట్ స్పెషల్ ఎడిషన్.. ఫిదా చేస్తున్న డిజైన్: ధర ఎంతంటే?

0

ఇండియన్ మార్కెట్లో స్పెషల్ ఎడిషన్ కార్లకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. దీనిని దృష్టిలో ఉందుకుని హోండా కంపెనీ.. ఎలివేట్ ఏడీవీ ఎడిషన్ లాంచ్ చేసింది. ఇది సాధారణ ఎలివేట్ కంటే కూడా కొంత భిన్నంగా ఉండటం చూడవచ్చు.

హోండా ఏడీవీ ఎడిషన్.. టాప్ స్పెక్ ఎలివేట్ జెడ్ఎక్స్ ట్రిమ్‌లో మాత్రమే లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 15.29 లక్షలు కాగా.. టాప్ వేరియంట్ ధర రూ. 16.66 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఇది మాన్యువల్, సీవీటీ అనే రెండు ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో లభిస్తుంది. ధరలు సాధారణ వేరియంట్ ధర కంటే కొంత ఎక్కువే అని స్పష్టమవుతుంది. కానీ ఇది చాలావరకు కాస్మొటిక్ అప్డేట్స్ పొందటం వల్ల.. చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది.

డిజైన్ ఎలా ఉందంటే?

హోండా ఏడీవీ ఎడిషన్ చూడటానికి.. ఎలివేట్ సాధారణ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ, కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు. ఇందులో ప్రధానంగా నారింజ రంగు డెకాల్స్. ఈ కారు ముందు భాగంలోని హుడ్.. నారింజ రంగు హైలైట్‌లతో డెకాల్స్ పొందుతుంది. గ్రిల్ కోసం బ్లాక్ సరౌండ్స్ చూడవచ్చు. హెడ్‌ల్యాంప్‌లను కనెక్ట్ చేసే ట్రిమ్.. క్రోమ్‌కు బదులుగా నలుపు రంగులో పూర్తి చేయబడి ఉండటం కనిపిస్తుంది.

సైడ్ ప్రొఫైల్.. ఫెండర్ వంటి వాటిపై ఏడీవీ గుర్తులను చూడవచ్చు. ముందు డోర్ మీద ఏడీవీ డెకాల్, బ్లాక్ అవుట్ రూఫ్ రెయిల్స్, అవుట్‌సైడ్ రియర్‌వ్యూ మిర్రర్స్, డోస్ హోల్డింగ్, విండ్ లైన్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, డోర్ హ్యాండిల్స్ కనిపిస్తాయి. సీ పిల్లర్ డ్యూయెల్ టోన్ వెర్షన్లలో మాత్రం బ్లాక్ చేసి ఉన్నాయి. 16 ఇంచెస్ ఆల్ బ్లాక్ అల్లాయ్ వీల్స్ కూడా నారింజ రంగులో ఉండటం చూడవచ్చు.

రియర్ ప్రొఫైల్ విషయానికి వస్తే.. బంపర్ బాడీ కలర్ రియర్ స్కిడ్ ప్లేట్, ఆరంజ్ హైలెట్స్, టెయిల్ గేట్ మీద ఏడీవీ బ్యాడ్జ్ కనిపిస్తాయి. ఏడీవీ ఎడిషన్ మోనోటోన్, డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది మెటియోరాయిడ్ గ్రే మెటాలిక్ & లూనార్ సిల్వర్ మెటాలిక్ అనే రంగుల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఇంటీరియర్ డిజైన్ & ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే?

హోండా ఎలివేట్ ఏడీవీ ఎడిషన్.. పూర్తిగా బ్లాక్ కలర్ క్యాబిన్ పొందుతుంది. అయితే అక్కడక్కడా నారింజ రంగు యాక్సెంట్స్ కనిపిస్తాయి. సీట్లపై కూడా నారింజ రంగు కుట్లు ఉన్నాయి. ఏడీవీ లోగోలు కూడా కనిపిస్తాయి. ప్రత్యేకమైన యాంబియంట్ లైటింగ్ సెటప్ కూడా చూడవచ్చు.

ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 360 డిగ్రీ కెమెరా ఉంది. మిగిలిన ఫీచర్స్ చాలావరకు జెడ్ఎక్స్ ట్రిమ్‌లో ఉన్నవే ఉన్నట్లు సమాచారం. కాగా సన్‌రూఫ్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కూడిన 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 7 ఇంచెస్ సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 8 స్పీకర్ సౌండ్ సిస్టం, ఏడీఏఎస్ అండ్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటివెన్నో ఉన్నాయి.

పవర్‌ట్రెయిన్ వివరాలు

ఇంజిన్ విషయానికి వస్తే, ఎలివేట్ ఏడీవీ ఎడిషన్.. సాధారణ ఎలివేట్ మాదిరిగానే 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ ఐ-వీటెక్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా.. 121 హార్స్ పవర్, 145 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్, సీవీటీ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి పనితీరులో పెద్దగా వ్యత్యాసం కనిపించదు.

ఆడదే ఆధారం.. ఈ రోజు తనే స్పెషల్‌!

0

మనిషి జీవితంలో ఇల్లు అనేది ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. మనం అవునన్నా.. కాదన్నా.. బతుకులో భాగమవుతుంది. జీవనం సాగించడానికి తప్పనిసరి సాధనంగా, సారథిగా మారుతుంది. ప్రస్తుత ఆధునిక కాలంలో కేవలం ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచం మొత్తంలో ఎక్కడైనా సరే గృహస్థ జీవితమే మానవ మనుగడను నిర్దేశిస్తుంది. అయితే ఇంటిని చక్కదిద్దటం అనేది చాలా కష్టంతో కూడుకున్న అంశం. దానికి ఎక్కువ ఓర్పు, నేర్పు రెండు అవసరం. డబ్బు సంపాదన మాత్రమే ఇల్లుని నడిపించదు. ఇంటి పనులు స్త్రీ, పురుష బేధం లేకుండా ఎవరైనా చేయవచ్చు, కానీ ప్రపంచం అంతా ఎందుకో ఆడవాళ్లే ఈ బాధ్యత ఎక్కువగా నిర్వర్తిస్తుంటారు. కావాలని అందులోకి నెట్టివేయబడ్డారా? లేక అది స్త్రీ సహజ లక్షణమా? అనేది తెలియదు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఈరోజు నేషనల్ హౌస్ వైఫ్స్ డే.

ఎక్కడ, ఎలా మొదలైంది?

హౌస్ వైఫ్స్ డే అనేది సాధారణంగా అమెరికాలో మొదలైంది. ఇది ఎప్పుడు పుట్టింది. ఎవరు దీనిని ప్రారంభించారు అనే దానికి కచ్చితమైన ఆధారాలు లేవనే తెలుస్తోంది. అయితే 1956 లేదా 60వ దశకం నుంచి ఆరంభమైనట్టుగా చెబుతారు. అయితే ప్రతి ఏటా నవంబర్ 03వ తేదీన జాతీయ గృహిణుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ విధమైన సంస్కృతి ఎక్కువగా పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతి అవుతున్నప్పటికి.. ఇక్కడి వారు కూడా, వాటిని తమకు ఆపాదించుకుని సొంతం చేసుకున్న దాఖలాలు కోకొల్లలు. ఆ పరంపరలో భాగంగా ఈ హౌస్ వైఫ్స్ డేను కూడా జరుపుకుంటున్నారు.

హౌస్ వైఫ్స్ డే ఉద్దేశ్యం..

పొద్దున్నే నిద్ర లేవడం దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు.. ఒక మహిళ తన కుటుంబాన్ని సరైన పద్ధతిలో నడిపించడానికి సమయాన్ని, శ్రమని వేచ్చిస్తుంది. ఇప్పుడు ఉన్న గ్లోబలైజేషన్ కారణంగా చదువుకున్న ఆడవారు ఒక వైపు ఉద్యోగం.. మరొక వైపు ఇంటి బాధ్యతలు రెండు కూడా చూసుకోవడం అనేది అనివార్యం అయింది. ఇంకా గ్రామీణ మహిళలు, అటు పట్టణ కార్మికుల గురించి అయితే చెప్పనక్కరలేదు. వారు నిరంతరం కూలీ పనులు, వ్యవసాయ ఆధారిత, అనేక రకాలైన ఇతర శ్రమ చేసే పనులన్నీ చేస్తూ ఇంట్లో పిల్లల చదువులు, భర్త అవసరాలు చూసుకోవాల్సి ఉంటుంది.

ఇంటిని, పరిసర ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం, బట్టలు ఉతకడం, పిల్లల స్నానాలు చేయించడం, ఇంట్లో అందరికి మూడు పూటలా వంట చేసి పెట్టడం అందులో ఇంకా వారు కోరింది చేసి ఇవ్వడం, స్కూల్ సమయానికి అన్ని సిద్ధం చేసి భర్తని ఆఫీసుకు, పిల్లల్ని స్కూలుకు పంపడం, తరువాత తాను రెడీ అయ్యి వెళ్లడం అనేది నిరంతర ప్రయాసతో కూడుకున్న పని. నేడు పెరిగిన, పెరుగుతున్న వేగవంతమైన పాశ్చాత్యా సంస్కృతి వరవడిలో మగవాళ్లు కూడా ఇంటి పనులు చేస్తున్నారు. తిండి విషయంలో అడపాదడప బయట హోటళ్లపైన ఆధారపడుతున్నప్పటికి.. సమాజంలో ఉన్న పురుషాదీక్యత కారణంగా ఎక్కువ శాతం ఆడవాల్లే ఇంటి పనుల్లో నిమగ్నమవుతున్నారు.

కాబట్టి ఈ ఒక్కరోజు అయినా.. గృహినులకి విశ్రాంతి ఇవాళ్లన్నదే హౌస్ వైఫ్స్ డే ప్రధాన ఉద్దేశ్యం. అయితే కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే వారికి శుభాకాంక్షలు తెలపడం, పనుల్లో ఉపశమనం కలిగించడం అనేది సరైన పరిష్కారం కాదు. ప్రతి రోజు కూడా భార్య, భర్త ఇద్దరు ఒకరికొకరు సహకరించుకుని ఇంటిని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. పనులని పంచుకొని చేయడం వల్ల ఒకరిపైనే భారం పడదు. అప్పుడే గృహిణి కష్టం మగవాళ్లకు తెలుస్తుంది.

శుభాకాంక్షలు వారికి గౌరవాన్ని ఇవ్వదు!

ఒకరోజు శుభాకాంక్షలు చెప్పడం వారికి గౌరవాన్ని ఇవ్వదు. అది నిరంతర ప్రక్రియ. ప్రతిరోజు పనిలో భాగస్వామ్యం అవ్వడమే వారికి దక్కే గౌరవం. వారికీ మనం ఇచ్చే విశ్రాంతి అవుతుంది. ప్రత్యేకించి ఒకరోజు శుభాకాంక్షలు తెలపడం అనేది తప్పు అయితే కాదు, ఒక మంచి పరిణామం. ఇది గృహిణుల కళ్లలో ఆనందం నింపినవాళ్లు అవుతాము. కష్టపడి వాళ్ల జీవితాలని కుటుంబాల కోసమే త్యాగం చేసిన ఆడవాళ్ళకి అందరికి మా తరపున జాతీయ గృహిణి దినోత్సవ శుభాకాంక్షలు.

బైకర్ సినిమా ఈవెంట్: మనసులో మాటలు చెప్పిన శర్వానంద్

0

శర్వానంద్ తన కెరియర్‌లో గుర్తుండిపోయేలా బైకర్ అనే సినిమాను తీశారు. ఇది ఇండియాలో ఫస్ట్ మోటార్ క్రాస్ రేసింగ్ మూవీ. నవంబర్ 06వ తేదీన థియేటర్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శర్వానంద్ సినిమా గురించి కొన్ని విషయాలను పంచుకున్నాడు.

ఒరిజినల్ బైక్ స్టంట్స్

బైకర్ సినిమా తన జీవితంలో టర్నింగ్ పాయింట్ అవుతుందని, కెరియర్‌లో గర్వంగా చెప్పుకోదగ్గ ఒక గొప్ప సినిమా చేశానని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే కాలర్ ఎగరేసి ఇది శర్వానంద్ సినిమా అని చెప్పుకునేలాగా తీయడానికి సిద్దపడిన ప్రొడ్యూసర్ వంశీకి ధన్యవాదాలు తెలిపాడు. అందులోను ఇప్పటికే యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లోనే మహానుభావుడు, రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా లాంటి మంచి హిట్ సినిమాలు చేసిన అనుభవంతో ఏ మాత్రం వెనుకడకుండా మంచి ఎక్స్‌పరిమెంట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా చేయడం అనేది అంత సులువైన విషయం అయితే కాదు. ఎందుకంటే ఏవి కూడా డూప్ కాదు. ఒరిజినల్ బైకర్స్ చేసిన స్టంట్స్ లాగే ఉన్నాయి విజువల్స్.

బైక్‌లపై తిరుగుతూ ప్రచారం

సినిమా ప్రచారంలో భాగంగా.. ఈ నెల 15వ తేదీ నుంచి భారతదేశం మొత్తం బైక్స్ వేసుకొని హీరో శర్వానంద్ మరియు సినిమా టీమ్ తిరుగనున్నారు. సినీ అభిమానులని కలిసి వాళ్లతో సినిమా పట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకోవడానికి ఇదొక అవకాశంగా భావిస్తున్నారు. అలాగే ప్రజలకు దగ్గరవడానికి కూడా ఈ దారి సరైందని శర్వా ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఇది ఒక కొత్తరకం మూవీ ప్రమోషన్ అనే చెప్పాలి. దీంతో సినిమాకు మంచి బజ్ క్రియేట్ అవ్వనుంది. పెద్ద పెద్ద సినిమాలను తీసే యూవీ వాళ్లు ఇందుకు భారీగా ఖర్చు చేయనున్నారు. సినిమా రూ. 60 కోట్ల బడ్జెట్ అని ప్రచారం జరుగుతున్నది.

ఈ సినిమాలో హీరో రాజశేఖర్ కూడా కీలక పాత్ర పోషించారు. దీనిపై శర్వానంద్ మాట్లాడుతూ.. రాజశేఖర్ ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడం అనేది గొప్ప విషయం అని, ఆయనతో కలిసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నా అని కృతజ్ఞతలు తెలిపారు. సినిమా మొత్తం అనేక ఛాలెంజ్స్, ఇంట్రస్టింగ్ అవెంచర్స్ ఉంటాయి.. అవన్నీ థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తాయని చెప్పుకొచ్చాడు.

మనసులో మాటలు

డైరెక్టర్ అభిలాష్.. నాలో ఏమి చూసి నమ్మాడో తెలీదు గానీ ఒక పెద్ద కథ రాసుకొచ్చి నన్ను ఒప్పించాడు. మొత్తానికి సినిమా చేసాము. ఎప్పుడెప్పుడు ప్రేక్షకులకు ఈ మూవీ చూపించాలని ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నానని, ఏ మాత్రం తడబడకుండా కాన్ఫిడెంట్‌గా శర్వనంద్ తన మనసులోని మాటలు బయటపెట్టాడు. మరి బైకర్ శర్వానంద్ సినిమా సాహసాలని చూడాలంటే మాత్రం ఇంకా ఒక నెల రోజులు ఆగాలి అన్నమాట. ఈ సినిమాలో హీరో రాజశేఖర్ మాత్రమే కాకుండా.. బ్రహ్మాజీ లాంటి వాళ్ళు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు అభిలాష్ డైరెక్టర్ కాగా.. వంశీ, ప్రమోద్ నిర్మాతలు.. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.

గెలవడం కాదు, చివరి వరకు పోరాడటం గొప్ప: శర్వానంద్ బైకర్

0

శర్వానంద్, మాళవిక నాయర్ జంటగా నటించిన సినిమా బైకర్. ఈ సినిమా గ్లింప్స్ నవంబర్ ఒకటో తేదీ సాయంత్రం విడుదల చేశారు. ఇందులో రాజశేఖర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి, దయానంద్ రెడ్డి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తుండగా.. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ జే. యువరాజ్ చేస్తుండగా.. జీబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

గ్లింప్స్ వీడియో.. 

బైకర్ గ్లింప్స్ వీడియో నిడివి.. ఒక నిమిషము ఇరవై ఒక్క సెకన్స్ మాత్రమే ఉంది. ఆ కొన్ని సెకండ్లలోనే మొత్తం సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలిగిందని అనిపిస్తోంది. తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి కలుగుతుంది. “ఇక్కడ ప్రతి బైకర్‌కు ఒక కథ ఉంటుంది. సమయంతో పోరాడే కథ, చావుకు ఎదురెళ్లే కథ” ఇవి బ్యాక్‌గ్రౌండ్‌లో వీడియో ప్రారంభంలో వచ్చే మాటలు. ఈ డైలాగ్స్ బట్టే అర్థం చేసుకోవచ్చు సినిమా ఏ స్థాయిలో ఉండబోతున్నదనేది.

బైక్ రేసింగ్ అయితే మామూలుగా లేదు. శర్వానంద్ చెప్పినట్టు భారతదేశ చలన చిత్ర చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరు చేయని సినిమా ఇది అని కచ్చితంగా చెప్పొచ్చు. ఒక్కో బైక్ అలా పైకి గాల్లో ఎగురుతుంటే వొళ్ళంతా రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఇదివరకే మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్, శర్వా కలిసి పనిచేసిన కారణంగా తనకి ఎలాంటి సంగీతం ఇవ్వాలో బాగా తెలుసు కాబట్టి బిజీఎం బాగుంది.

రేసర్‌గా శర్వానంద్

ఒక బైక్ రేస్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. శర్వానంద్ రేసర్‌గా వంద శాతం న్యాయం చేశాడని గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమా కోసం నిజమైన బైక్ రేసర్లని వాడారు. కోయంబత్తూరు, ఇండోనేషియాలకు వెళ్లి మరీ అక్కడ ఒరిజినల్ బైక్ రేసర్లతో మాట్లాడి ఈ సినిమా చేశారు. శర్వానంద్ బైకర్ కోసం.. ఒక నిజమైన రేసర్ మాదిరిగా తయారయ్యాడు. వాళ్లు ఎంత కష్టం చేశారు అనేది చెప్పడానికి ఒక్క గ్లింప్స్ చాలు అనిపిస్తుంది. హీరో లుక్ అయితే పూర్తిగా మారిపోయింది. బైక్ రేసింగ్ ఇష్టపడే యువత అయితే మాత్రం తప్పకుండా లైక్ చేస్తారు. శర్వానంద్ ఈ సినిమా కోసం కోసం చాలా గ్యాప్ తీసుకొని అన్నీ పూర్తిగా నేర్చుకుని రంగంలోకి దిగినట్టే ఉంది.

గ్లింప్స్ లాంచ్ ఈవెంట్

బైకర్ సినిమా డిసెంబర్ 06వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానున్నది. అయితే నవంబర్ 01న బైకర్ ది ఫస్ట్ లాప్ – ది గ్లింప్స్ పేరుతో ఒక కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని పీవీఆర్ ఆర్కే సినీప్లెక్స్‌లో విలేకరుల మధ్యలో జరిగింది. ఈ ఈవెంట్‌కు హీరో రాజశేఖర్, జీవిత, మూవీ ప్రొడ్యూసర్ వంశీ, డైరెక్టర్ అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. సినిమాకు సంబంధించిన మిగిలిన విశేషాలు ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం మీద శర్వానంద్ ఇప్పటి వరకు చేసిన సినిమాలన్ని ఒకెత్తు, ఈ బైకర్ సినిమా ఒకెత్తు. కాబట్టే ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను మాత్రం భారీగానే ప్లాన్ చేశారు.

జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్: అంచనాలు పెంచేస్తున్న రామ్ చరణ్ పెద్ది

0

అతిలోక సుందరి కుమార్తె జాన్వీ కపూర్.. తెలుగు సినిమాల్లో కూడా తనదైన ముద్ర వేస్తోంది. దేవర సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన పెద్ది సినిమాలో నటిస్తోంది. ఇప్పటి వరకు రామ్ చరణ్ ఫోటోలను మాత్రమే రిలీజ్ చేసిన చిత్ర బృందం.. తాజాగా జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్

డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ చాలానే విడుదలయ్యాయి. ఇప్పుడు తాజాగా రిలీజ్ అయిన జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్.. అటు రామ్ చరణ్ అభిమానులను, ఇటు జాన్వీ కపూర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. జాన్వీ.. పెద్ది సినిమాలో ఒక పల్లెటూరి అమ్మాయిగా.. అచ్చియ్యమ్మ అనే పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోటో చూడగానే దేనికి భయపడని ఒక ఫైర్ బ్రాండ్ కనిపిస్తుంది. పోస్టర్‌లో జాన్వీ జీపులో నిలబడి.. రెండు చేతులు పైకెత్తి నమస్కారం పెట్టినట్లు అనిపిస్తోంది. మరో పోస్టర్‌లో మైకు ముందు నిలబడి ఉన్నట్లు కనిపిస్తోంది. దీన్నిబట్టి చూస్తే.. గ్రామీణ వాతావరణం పెద్ది సినిమాలో పుష్కలంగా కనిపిస్తుందని తెలుస్తోంది.

రిలీజ్ ఎప్పుడంటే?

బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న పెద్ది సినిమాకు.. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట్ సతీష్ కిలారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ & సుకుమార్ రైటింగ్స్ ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తున్నారు. కొరియోగ్రాఫర్ బాధ్యతలను జానీ మాస్టర్ తీసుకున్నారు. కాగా ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తయింది. అయితే 2026 మార్చి 27న థియేటర్లలో రిలీజ్ అవుతుందని సమాచారం. అంటే నటుడు రామ్ చరణ్ పుట్టినరోజు (మార్చి 27) సందర్భంగా ఈ సినిమాలు రిలీజ్ చేయడానికి చిత్రబృందం కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది.

వేగంగా సాగుతున్న షూటింగ్!

పెద్ది సినిమా షూటింగుకు సంబంధించిన కొన్ని విశేషాలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ్రీలంకలో జరుగుతోంది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో సినిమాపై అంచనాలు చాలా పెరిగిపోయాయి. కొన్ని రోజులకు ముందు ఏకంగా 1000 మందితో కూడిన ఒక సాంగ్ కూడా చిత్రీకరించడం జరిగింది. గత వినాయకచవితి సందర్భంగా దీనిని చిత్రీకరించినట్లు చిత్రబృందం వెల్లడించింది.

అత్యుత్తమ స్థాయి బృందాలతో..

రామ్ చరణ్ పెద్ది సినిమా కోసం పూర్తి గెటప్ మార్చేశారు. కాగా ఈ సినిమాలో జాన్వీ కపూర్ మాత్రమే కాకుండా.. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. జగపతి బాబు, దివ్యేందు శర్మ కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. అత్యున్నత స్థాయి సాంకేతిక బృందంతో.. పెద్దిని నిర్మిస్తున్నారు. ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. నేషనల్ అవార్డు గ్రహీత ఎడిటర్ నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పెద్ది సినిమా కోసం రూ. 300 కోట్లు వెచ్చిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాను కేవలం తెలుగులో మాత్రమే కాకుండా.. తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఎగసిపడే యువ కెరటాలు.. ఆటల్లో బంగారు పతకాలు

మనం ఏదైనా సాధించాలి అంటే ముందుగా మనసులో ఒక దృఢ సంకల్పం అవసరం. ఆ తరువాత.. అందుకు తగిన కష్టం (శ్రమ), అనుకున్నది సాధించి తీరాలనే కసి, పట్టుదల అతి ముఖ్యమైనవి. వీటితో పాటు మనకు మనమే తీసుకునే బలమైన నిర్ణయాలు, ఆలోచనలు మనల్ని ముందుకు నడిపిస్తాయి. అన్నింటికీ మించి చెప్పింది చెప్పినట్టు వినడం, అందుకు తగినట్టు ప్రణాళికబద్దంగా అమలుపరచడం, క్రమశిక్షణతో మెలగడం అనేది ప్రధాన భూమిక పోషిస్తుంది. ఇవన్నీ కలగలిసిన చిచ్చర పిడుగుల్లాంటి విద్యార్థులే ఎస్. సనా మరియు రిషిత్ కుమార్. విద్యార్థులే అయినా.. ఎంచుకున్న ఆట పట్ల వారికున్న అంకితభావమే.. ఈరోజు ఓ నలుగురికి ఆదర్శమైంది.

సనా, రిషిత్ మాటల్లో వారి గురించి..

”నా పేరు ఎస్. సనా. మాది చిత్తూరు జిల్లా. నాకు ఊహ తెలిసినప్పటినుండి కబడ్డీ అంటే ఇష్టం. కబడ్డీ అంటే అబ్బాయిలకే పరిమితమా అనుకుంటారు. ఈ కారణంగానే.. ఇప్పటికీ చాలా చోట్ల అమ్మాయి, అబ్బాయి అనే వ్యాత్యాసం చూపిస్తుంటారు. కానీ నాకు మాత్రం మా తల్లిదండ్రులు అటువంటి తారతమ్యాలు చూపించకుండా.. నేను కోరుకున్న దారిలో వెళ్ళడానికి అన్నీ విధాలుగా ప్రోత్సహిస్తున్నారు” అని చెప్పుకున్నారు.

”నా పేరు రిషిత్ కుమార్. మాది ప్రకాశం జిల్లా, ఒంగోలు ప్రాంతం. నాన్న కూడా పిఈటీ మాస్టారుగా పని చేస్తూ ఉండటం వలన.. నేను ఆరవ తరగతి నుంచి కబడ్డీ ఆడుతున్నాను. ఓటమి గెలుపు అనేవి సహజమని రెండింటిని ఒకేలాగా తీసుకోవాలని మా నాన్న నాకు ఎప్పుడు చెబుతుంటారు, అథ్లెటిక్స్‌లో కూడా మెడల్స్ సాధించాను” అని పేర్కొన్నారు.

ఇప్పటి వరకు వీరు ఆడిన, అందుకున్న బహుమతులు

సనా

  • రాష్ట్రస్థాయిలో.. సీబీఎస్ఈ క్లస్టర్స్ మొదటి స్థానంలో గెలిచి బంగారు పతకం సాధించింది (గద్వాల్-2025)
  • అసోసియేషన్ తరపున అండర్-17 జాతీయ స్థాయిలో రెండుసార్లు బ్రోంజ్ మెడల్ గెలిచింది (హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ -2024)
  • అండర్ -17  జాతీయ స్థాయిలో రెండుసార్లు పార్టిసిపేషన్ చేసింది
  • స్కూల్ గేమ్ ఫెడరేషన్ అండర్ -17 గోల్డ్ మెడల్, అండర్-14 లో సిల్వర్ మెడల్ గెలుపొందినది (చిట్వేల్, రాయచోటి- 2023, 2024).
  • కడప, విశాఖపట్నం, గుంటూరు, ఒంగోలు లాంటి అనేక ప్రాంతాల్లో అసోసియేషన్స్ తరపున పోటీ చేసిన అన్నీ చోట్ల అనేక బహుమతులు, ప్రశంసలు కైవసం చేసుకునింది.

రిషిత్
కబడ్డీ ఆటలో

  • రాష్ట్ర స్థాయిలో సీబీఎస్ఈ క్లస్టర్స్ లో బంగారు పతకం. (కరీంనగర్)
  • జాతీయ స్థాయిలో వెండి పతకం (బీహార్).
  • రాష్ట్ర స్థాయిలో రెండు సార్లు పార్టిసిపేట్ చేయడం జరిగింది. (కడప)

అథ్లెటిక్స్‌లో

  • రాష్ట్ర స్థాయిలో సీబీఎస్ఈ 600 మీటర్ల లాంగ్ జంప్ లో గోల్డ్ మెడల్ (నెల్లూరు)
  • జాతీయ స్థాయిలో లాంగ్ జంప్ 600 మీటర్ల పార్టిసిపేషన్ (వారణాసి)
  • జూనియర్ స్టేట్ మీట్‌లో ట్రయాతలిన్-సీ  బ్రోంజ్ మెడల్.
  • జిల్లా స్థాయిలో అనేక అసోసియేషన్స్ తరపున ఆడి బహుమతులు, ప్రశంసలు గెలుపొందారు.

కోచ్  & పాఠశాల యాజమాన్యం ప్రోత్సహం

ఆటల్లో రాణించడానికి తమ కబడ్డీ కోచ్ శంకర్ గురించి చెబుతూ.. ఎప్పుడైనా ఆటలో ఓడిపోయినా లేదా ఏదైనా నిరాశకు లోనైనా తమని వెన్ను తట్టి ప్రోత్సహిస్తారని, మేము ఆత్మవిశ్వాసంతో దృఢంగా ఉండటానికి ఆయన చెప్పే విలువైన మాటలే కారణం అని విద్యార్థులు చెప్పుకొచ్చారు. అతను కబడ్డీ కోచ్ అయినప్పటికీ కూడా మాకు అథ్లెటిక్స్‌లో ఒకింత పట్టు ఉండటంతో అందులో కూడా ఆడమని ప్రోత్సహించారని చెప్పుకొచ్చారు. ఆయన మాతో పాటు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే గ్రౌండ్‌లో ఉండటం అనేది మాకు ప్రేరణ ఇచ్చే విషయం అన్నారు.

కోచ్‌తో పాటు మేము చదువుతున్న వెరిటాస్ సైనిక్ స్కూల్ యాజమాన్యం కూడా సపోర్ట్ చేస్తోంది. పాఠశాలలో కబడ్డీ సాధన చేయడానికి మంచి మ్యాట్ అండ్ గ్రౌండ్ ఉండడము ఎంతో మేలు చేస్తోందని, బయట ప్రాంతాలకు వెళ్లి ఆడటానికి పర్మిషన్ ఇవ్వడం, వీటి కారణంగా చదువులో ఎక్కడ వెనకపడకుండా జాగ్రత్తలు తీసుకోవడం.. ఆటల్లో ముందుకు సాగటానికి వెసలుబాటు కల్పిస్తోందని విద్యార్థులు చెప్పారు.

ప్రతిభ ఏ ఒకరి సొంతం కాదు. ఇష్టమైన రంగంలో ముందుకు పోతే.. తప్పకుండా సక్సెస్ సాధ్యమవుతుంది. యుక్త వయసములోనే అసాధారణ ప్రతిభ కనపరుస్తున్న సనా మరియు రిషిత్ లాంటి క్రీడాకారులను ప్రోత్సహించడం మన బాధ్యత. భవిష్యత్ లక్ష్య సాధనే ధ్యేయంగా ముందుకు సాగాలని.. మరిన్ని గొప్ప అవార్డులను సైతం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇద్దరికీ ఆల్ ది బెస్ట్.

బస్సు ఛార్జీలకు డబ్బులు లేవు.. అది మా పరిస్థితి!: లుంగీ మామ టీమ్

0

ఈ మధ్యకాలంలో ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఎక్కడ చూసిన కే-ర్యాంప్ సినిమాలో కిరణ్ అబ్బవరంతో కలిసి డాన్స్ చేసిన లుంగీ మామ (వెంకటరమణ) & వాళ్ల టీమ్ (ముని, నరేంద్ర) వీడియోలే కనిపిస్తున్నాయి. అంటే.. ఆ సినిమాకు ముందు కూడా వీళ్ల గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. దీనికి కారణం లుంగీ మామ డ్యాన్స్ వీడియోలు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలలో వైరల్ కావడమే.

వీడియో అప్లోడ్ చేస్తే చాలు.. కేవలం కొద్ది నిమిషాల్లోనే దాదాపు కొన్ని లక్షల మంది చూస్తారు. అంతగా పాపులర్ అయిపోయాయి. ఒక్కసారి వీడియో చూసామంటే కళ్ళు తిప్పుకోలేమన్నంతగా వశమైపోతారు వాళ్లు చేసే డ్యాన్సుకు. ఈ విధమైన పాపులారిటీ చూసే కే-ర్యాంప్ డైరెక్టర్ పిలిచి అవకాశం ఇచ్చారు. గ్రామాల్లో డ్యాన్స్ వేసుకునే స్థాయి నుంచి.. దర్శకుడిని ఆకట్టుకునేలా ఎదిగిన ఈ లుంగీ టీమ్ ప్రస్థానం గురించి కొన్ని ఆసక్తికర అంశాల విషయానికి వస్తే..

నెల్లూరు జిల్లా..

లుంగీ మామ టీముకు చెందిన.. వీళ్లందరు నెల్లూరు జిల్లా మారుమూల ప్రాంతానికి చెందినవారు. అందరూ కష్టం చేసుకుని బతికే మత్స్యకారుల కుటుంబాల నుంచి వచ్చిన వారే. అయితే వీరి జట్టులో ఎవరు కూడా ఆ వృత్తిలో లేరు. ఎందుకంటే సముద్రంలో ఇతర రాష్ట్రాల వాళ్ల ఆధిపథ్యం పెరిగిపోవడం. పక్కనే కలుషితమైన పరిశ్రమలు వచ్చి చేరడం. చేపలు పట్టడం, దానినే వ్యాపారంగా మలుచుకుని బతకడం అనేది చాలా శ్రమతో కూడుకున్న పరిస్థితి.

ఈ పరిస్థితుల్లో టీమ్‌లో ఒకరు ఆటో నడపడం, ఇంకో ఇద్దరు స్కూల్లో డ్యాన్స్ నేర్పించడం ద్వారా జీవనం సాగిస్తున్నారు. ఇలా చేసే పనులు వల్ల వారి ఆదాయం ఏ మాత్రం బాగోలేదట. అందరికి పెళ్లిళ్లు అవ్వడం, పిల్లలు ఉండటం, ఖర్చులు కూడా అదే రీతిలో ఉంటాయి గనుక పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యాయి.

బస్ టికెట్ కొనడానికి డబ్బులు లేవు

ఇంటర్వ్యూకి గానీ, ఏదైనా ఛాన్స్ వస్తే హైదరాబాద్ లాంటి ప్రాంతాలకి రావడానికి బస్సు టికెట్ కొనడానికి కూడా చేతిలో డబ్బులు లేవు. అందుకోసం ఎక్కడో ఒకచోట అప్పు చేసిమరి రావాల్సిన దుస్థితి అని లుంగీ మామ బాధపడుతూ.. ఒకరకమైన నవ్వు నవ్వినప్పుడు అతన్ని చూస్తే ఎవరికైనా సరే నిజంగా కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అంతటి బాధను కూడా దిగమింగి అందరినీ అలరించడం కోసం నవ్వుతూ వీడియోలు చేయడం చాలా గొప్ప విషయం.

పేరు వచ్చింది కానీ.. ప్రతిఫలం రాలేదు

కే-ర్యాంప్ సినిమాలో అవకాశం అయితే వచ్చింది. కానీ.. దానికి తగిన ప్రతిఫలం మాత్రం వారికి దక్కలేదంట. అందులో వాళ్ళు చేసిన డ్యాన్సుకు కొరియోగ్రఫి సైతం వాళ్లే చేయడం అనేది.. అభినందించదగ్గ విషయం. వాళ్ళు డాన్స్ చేసిన ఆ పాట థియేటర్ మొత్తం ఒక ఊపు ఊపుతోంది. ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ చూసినా మామూలు క్రేజ్ కాదు. అంతలా పర్ఫామెన్స్ చేసిన వాళ్లకు కనీసం డబ్బులు కూడా ఇవ్వకపోవడం బాధాకరమైన అంశమనే చెప్పాలి. ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఉంటూ ఎన్నో కష్టాలు పడి వీడియోలు చేసి అందరు గుర్తించే విధంగా ఈ స్థాయికి ఎదగడం మామూలు విషయం కాదు. ఇటువంటి ప్రతిభ కలిగిన పేద కళాకారులకు ఎంత వీలైతే అంత ప్రోత్సహం అందించాలి.

డైరెక్టర్ కరుణ కుమార్ స్పీచ్: కన్నీళ్లు పెట్టుకున్న తిరువీర్

0

తిరువీర్ హీరోగా నటించిన ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మూవీకి సంబంధించిన పలు విశేషాలను డైరెక్టర్స్ వెల్లడించడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్య అతిధిగా విచ్చేసిన పలాస, శ్రేదేవి సోడా సెంటర్, మెట్రో కథలు, మట్కాలాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ కరుణ కుమార్ మాట్లాడారు. తిరువీర్, కరుణ కుమార్ మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్ల ఆయన (కరుణ కుమార్) ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసి.. చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

దావత్ నాటకం ద్వారా..

కరుణ కుమార్ మాట్లాడుతూ.. నేను సినిమాల్లోకి రాకముందు నుంచే నాకు తిరువీర్ దావత్ అనే నాటకం ద్వారా తెలుసునని, అందులో అతడు చేసింది చిన్న పాత్ర అయినా చాలా నచ్చింది అని చెప్పుకొచ్చాడు. అప్పుడే నేను తిరువీర్‌ను దృష్టిలో పెట్టుకుని పలాసలో  ప్రత్యేకంగా ఒక పాత్రని రాసుకున్నా అని అన్నాడు. తను (తిరువీర్) మొదట నమ్మలేదు ఇంత పెద్ద క్యారెక్టర్ ఇప్పటి వరకు నాకు ఎవరు ఇవ్వలేదు. అందరూ ఇస్తాము అని పన్నెండు సంవత్సరాల నుంచి చెబుతూనే ఉన్నారు అన్నాడు. తరువాత మేము పిలిచి అడ్వాన్స్ ఇచ్చాము. తిరు నాకు చాలా స్పెషల్ ఎందుకంటే.. పలాస ఎన్నో కష్టనస్టటాలతో తీసాము. ఇప్పుడు అవన్నీ కామెడీగా అనిపించొచ్చు.

తల్లి చనిపోయిన విషయం దాచి.. షూటింగ్ పూర్తి చేసాడు

మేము అందరూ తీవ్ర నిరాశలో కూరుకుపోయినప్పుడు ఆ పరిస్థితులు అన్నీ తిరు అర్థం చేసుకున్నాడు. పలాసలో చిన్న షావుకారు, రంగారావు ఎలక్షన్ టికెట్ అడిగే సీన్ అప్పుడు ఆ ఇల్లు దొరకడమే కష్టం. ఆ పరిస్థితుల్లో ఒక ముఖ్యమైన సీక్వెన్స్ తీసాము. అది షూట్ చేసిన తరువాత తిరు వాళ్ల అమ్మ చనిపోయిందని తెలిసింది. అయినా సరే ఎక్కడ కూడా ఆ బాధ కనిపించకుండా అద్భుతంగా చేసి పర్మిషన్ తీసుకొని హైదరాబాద్ వెళ్లి కార్యక్రమాలు చూసుకొని తిరిగి కేవలం మూడు రోజుల్లో షూటింగ్ వచ్చాడు. అందుకే తిరు పట్ల నాకు ఎప్పుడు కూడా చాలా కృతజ్ఞత ఉంటుంది, అని డైరెక్టర్ కరుణ కుమార్ తన సానుభూతిని, అభిమానాన్ని, కృతజ్ఞతని చాటుకున్నాడు. ఇందుకు తిరువీర్ తన కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని బాధపడ్డాడు.

మట్కా లాంటి సినిమా మళ్లీ చేయను

ఈ సందర్బంగా ప్రేక్షకులు పూర్తిగా మారిపోయారని.. మట్కా (వరుణ్ తేజ్ మూవీ) సినిమాతో.. నాకు తెలిసోచ్చిందని చెప్పుకొచ్చాడు. ఇలాంటి సినిమా ఇకపై ఎప్పుడూ చేయను. రాబోయే రోజుల్లో కూడా రూటెడ్, నేటివ్ సినిమాలే తీస్తానని పలాస డైరెక్టర్ తన ఆలోచనని పంచుకున్నాడు. నిజానికి ఈ ఈవెంట్ ఉందని తిరు.. డైరెక్టర్‌ను ఇన్వైట్ చేసినప్పుడు, వేరే షూటింగ్ ఉండటం కారణంగా రాలేకపోతున్న అని చెప్పి మళ్ళీ ఒకరోజు షూట్ క్యాన్సిల్ అయ్యేసరికి వచ్చేసాను అని చెప్పాడు. అలాగే అతిధుల ఫోటోలన్నీ ప్రింట్ అయిపోయాయి మీ ఫోటో వెయ్యలేదు అని చెప్పిన కూడా ఏమి పర్వాలేదు అని కార్యక్రమానికి వచ్చాడట కరుణకుమార్. దీని వల్ల తిరు పట్ల తనుకున్న ప్రేమని మరొక్కసారి తెలియజేసాడని అర్థమవుతుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని కరుణ కుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మరి సినిమా చూడాలంటే నవంబర్ 07 వరకు వేచి ఉండాల్సిందే అన్నమాట.