Home Blog Page 78

రోల్స్ రాయిస్ ధరలు ఎందుకు ఎక్కువ?: ఆశ్చర్యపరిచే విషయాలు!

0

గ్లోబల్ మార్కెట్లో ఎన్నెన్ని కార్ల తయారీ సంస్థలు ఉన్నా.. రోల్స్ రాయికి కంపెనీకి ఉన్న ప్రత్యేకత వేరు. దీనికి ప్రధాన కారణం కేవలం ఘనమైన చరిత్ర మాత్రమే కాదు. బ్రాండ్ ఖ్యాతి, అద్భుతమైన లగ్జరీ, పర్ఫామెన్స్, డిజైన్, ఫీచర్స్ వంటివన్నీ పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ధర ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఏ మాత్రం కాంప్రమైజ్ ఉండదు. ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ బ్రాండ్స్.. అమ్మకాల కోసం తమ ప్రత్యేకతను కోల్పోతున్నప్పటికీ.. రోల్స్ రాయిస్ మాత్రం తన ప్రత్యేకతను కొనసాగిస్తూనే ఉంది.

మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యు, ఆడి, పోర్స్చే, వోల్వో వంటి కంపెనీలు.. ఎప్పటికప్పుడు మార్కెట్లకు అనుగుణంగా, కస్టమర్లను ఆకట్టుకోవడానికి మారుతూనే ఉన్నాయి. కానీ 1906లో ప్రారంభమైన రోల్స్ రాయిస్ మాత్రం తన ఉనికిని.. ప్రత్యేకతను అలాగే నిలుపుకుంది. ఈ కంపెనీ కార్ల ధరలు కొంత ఎక్కువగా ఉండటానికి కొన్ని ప్రధాన కారణాలు కూడా ఉన్నాయి.

నిర్మాణం లేదా డిజైన్

రోల్స్ రాయిస్ అంటేనే.. ఎవరికైనా గుర్తొచ్చేది, దాని ప్రత్యేకమైన డిజైన్. ఇది ప్రత్యేకించి కస్టమర్లను ఆకట్టుకునేలా ఉంటుంది. కాగా ధరలు ఎక్కువగా ఉండడానికి మరో కారణం.. ఉత్పత్తి కూడా పరిమిత సంఖ్యలో ఉండటమే. ఒక రోల్స్ రాయిస్ కారు.. పూర్తిగా తయారవ్వడానికి కనీసం ఆరు నెలల సమయం.. వందలాది పనిగంటలు అవసరం అవుతుంది. వీటిని కొనుగోలు చేసేవారు కూడా తప్పకుండా సంపన్నులై ఉంటారు. ఎందుకంటే.. రోల్స్ రాయిస్ కారు కొనాలంటే కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది.

ఇతర లగ్జరీ కార్ల తయారీ సంస్థలు.. ఒక కారును తయారు చేయడానికి మిషన్స్ ఉపయోగిస్తుంటారు. కానీ రోల్స్ రాయిస్ విషయంలో ఇది పూర్తిగా వేరుగా ఉంటుంది. ఇందులో లెదర్ అపోల్స్ట్రేపై కనిపించే కుట్టు దగ్గర నుంచి.. పాలిష్ చేసిన వుడ్ ట్రిమ్ వరకు కూడా అత్యంత నైపుణ్యం కలిగిన కళాకారులే చేతితో డిజైన్ చేస్తారు. ఇది రోల్స్ కంపెనీ మాత్రమే దక్కించుకున్న ప్రత్యేకత. ఈ కార్లలో కనిపించే 1600 ఫైబర్ ఆప్టిక్ లైట్లను కూడా చేతితోనే నేయడం జరుగుతుంది.

పెయింట్ స్కీమ్స్

ఇక రోల్స్ రాయిస్ అంటేనే గుర్తొచ్చేది.. దాని పెయింట్ స్కీమ్. కంపెనీ సుమారు 44000 కంటే ఎక్కువ పెయింట్ ఎంపికలతో తమ కస్టమర్లను కార్లను డిజైన్ చేస్తుంది. అంటే అన్ని రంగులలో రోల్స్ రాయిస్ కార్లు అందుబాటులో ఉంటాయన్నమాట. అయితే ఎంచుకునే రంగును బట్టి కూడా ధర ఉంటుందనే విషయాన్ని కూడా కస్టమర్లు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఒక కారుకు పెయింట్ వేయడానికి 10 వారాల సమయం అవసరం అవుతుంది. సుమారు 22 దశల్లో పెయింటింగ్ ప్రక్రియ జరుగుతుందని సమాచారం. దీని కోసం ప్రత్యేకమైన పరికరాలను ఉపయోగిస్తారు.

వేగం కాదు.. లగ్జరీపై దృష్టి

రోల్స్ రాయిస్ కంపెనీ తన కార్లను అద్భుతమైన సౌందర్యంతో మాత్రమే కాకుండా.. టెక్నాలజీతో కూడా అందిస్తుంది. అయితే సంస్థ ఇతర లగ్జరీ కార్ల మాదిరిగా వేగంపై దృష్టి సారించదు. విలాసవంతంగా ఉండేలా కారును తీర్చిదిద్దుతారు. అంటే దీనిని ఉపయోగించే వ్యక్తి విలాసవంతమైన రైడింగ్ అనుభూతిని పొందుతాడు. ఈ బ్రాండ్ కార్లలో.. సౌండ్ ఫ్రూఫింగ్, డబుల్ గ్లేజ్డ్ విండోలు ఉంటాయి. కాబట్టి క్యాబిన్ చాలా నిశ్శబ్దంగా ఉంటుంది.

ప్రతిష్ఠత ముఖ్యం!

రోల్స్ రాయిస్ ఒక స్టేటస్. అంటే వినియోగించే వ్యక్తి హోదా, ప్రతిష్టతను తెలియజేస్తుంది. ఈ బ్రాండ్ కార్లను ఉపయోగించే వ్యక్తి మెయినెంట్స్ గురించి ఆలోచించే ప్రసక్తి ఉండదు. ఇక్కడ ధర కూడా బ్రాండ్ గుర్తింపును చూచిస్తుంది. మొత్తం మీద కంపెనీ.. తన కస్టమర్లకు లగ్జరీ అందించడమే ప్రధాన ఉద్దేశ్యంగా నడుచుకుంటుంది. దీనికి తగిన విధంగానే కార్లను ఉత్పత్తి చేస్తుంది.

కొత్త జీఎస్టీ: రూ. లక్ష కంటే తక్కువ ధరలో లభించే 5 బైకులు ఇవే..

0

ఇండియన్ మార్కెట్లో ఎన్నెన్ని కొత్త బైకులోచ్చినా.. కొన్ని బైకులకు మాత్రమే మంచి క్రేజ్ ఉందనే మాట అక్షర సత్యం. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. అయితే జీఎస్టీ 2.0 అమలులోకి వచ్చిన తరువాత 350 సీసీ కంటే తక్కువ ఇంజిన్ కెపాసిటీ ఉన్న బైకుల ధరలు కొంత తగ్గాయి. ఈ కథనంలో మనం రూ.1 లక్ష కంటే తక్కువ ధరలో లభించే ఐదు బెస్ట్ బైకుల గురించి చూసేద్దాం.

టీవీఎస్ స్పోర్ట్

భారతదేశంలో టీవీఎస్ మోటార్ కంపెనీ బైకులకు ఓ ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. కాగా టీవీఎస్ స్పోర్ట్ బండి రూ. 1 లక్ష కంటే తక్కువ ధరలో లభించే ఓ బెస్ట్ మోడల్. దీని ధర రూ. 61294 (ఎక్స్ షోరూమ్). 110 సీసీ ఇంజిన్ కలిగిన ఈ బైక్ 8.29 పీఎస్ పవర్, 8.7 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 75 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. సింపుల్ డిజైన్ కలిగిన ఈ బైక్.. ఆధునిక ఫీచర్స్ కలిగి రోజువారీ వినియోగానికి.. నగర ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటుంది. దేశంలో ఈ బైకును వినియోగిస్తున్న వారు కోకొల్లలుగా ఉన్నారు.

హీరో స్ప్లెండర్ ప్లస్

అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు అయిన హీరోమోటోకార్ప్ కంపెనీకి చెందిన స్ప్లెండర్ ప్లస్ కూడా మన జాబితాలో రూ. 1 లక్ష కంటే తక్కువ ధరలో లభించే మరో బైక్. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 73527. సుమారు 80 కిమీ/లీ మైలేజ్ అందించే ఈ బైక్.. 97.2 సీసీ ఇంజిన్ ద్వారా 8 పీఎస్ పవర్ అందిస్తుంది. క్లాసిక్ డిజైన్ కలిగిన ఈ బైక్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. ఈ కారణంగానే దీనిని ఎక్కువమంది ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు.

బజాజ్ ప్లాటినా 100

రూ. 66053 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభించే బజాజ్ ప్లాటినా 100 కూడా.. మనం చెప్పుకుంటున్న రూ. 1 కంటే తక్కువ ధరలో లభించే ఓ ఉత్తమ బైక్. ఇందులో 102 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇంజిన్ 7.9 పీఎస్ పవర్, 8.34 న్యూటన్ మీటర్ టార్క్ విడుదల చేస్తుంది. దీని మైలేజ్ లీటరుకు 70 కిమీ నుంచి 75 కిమీ మధ్యలో ఉంటుంది. ఈ బైక్ మంచి పనితీరును అందిస్తుంది. సీటింగ్ పొజిషన్ కూడా ఉత్తమంగా ఉండటం వల్ల.. ఉత్తమ రైడింగ్ అనుభూతిని కూడా అందిస్తుంది.

హీరో హెచ్ఎఫ్ డీలక్స్

రూ. 1 లక్ష కంటే తక్కువ ధరలో లభించే మరో బైక్ హీరో హెచ్ఎఫ్ డీలక్స్. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 57988. ఇందులో 97.2 సీసీ ఇంజిన్ ఉంటుంది. మైలేజ్ 83 కిమీ/లీ. తక్కువ బరువును కలిగి ఉండటం వల్ల, ఇది మంచి రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. మధ్యతరగతి ప్రజలకు ఇష్టమైన బైకులలో ఇది ప్రధానంగా చెప్పుకోదగ్గ మోడల్. రోజువారీ వినియోగానికి బెస్ట్ బైక్ కూడా. మంచి డిజైన్, మల్టిపుల్ కలర్ ఎంపికలలో ఈ బైక్ లభిస్తుంది.

టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్

స్టార్ సిటీ ప్లస్ అనేది.. టీవీఎస్ కంపెనీకి చెందిన పాపులర్ బైక్. దీని ధర రూ. 69126 (ఎక్స్ షోరూమ్). ఇందులోని 109.7 సీసీ ఇంజిన్ 8.08 పీఎస్ పవర్, 8.7 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్ మైలేజ్ లీటరుకు 70 కిమీ అని తెలుస్తోంది. ఈ బైకులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, డిజిటల్ అనలాగ్ క్లస్టర్ వంటి వాటితో ఒక ప్రీమియం లుక్ ఇస్తుంది. తక్కువ ధరలో.. కొంత స్టైలిష్ డిజైన్ కలిగి.. మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక అవుతుంది.

గమనించండి: పైన కథనంలో వెల్లడించిన అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఆధారంగా నిర్ణయించినవే. ఆన్-రోడ్ ధరలు వేరుగా ఉన్నాయి. అంతే కాకుండా ధరలు అనేవి మీరు ఎంచుకునే వేరియంట్.. కలర్ వంటి వాటిమీద కూడా ఆధారపడి ఉంటుంది. మొత్తం మీద తక్కువ ధరలో.. కొంత ఎక్కువ మైలేజ్ కావాలనుకునే వారికి పైన చెప్పిన ఐదు బైకులు మంచి ఎంపిక అని స్పష్టంగా తెలుస్తోంది.

సైకిల్‌పై అసెంబ్లీకి వెళ్లిన ఎమ్మెల్యేగా శివరాజ్ కుమార్: ఎవరీ గుమ్మడి నర్సయ్య?

0

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ప్రధాన కథనాయకుడుగా నటిస్తున్న.. గుమ్మడి నర్సయ్య అనే సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు. ఈ మూవీ ప్రవల్లిక ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై సురేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. పరమేశ్వర్ హిర్వాలే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ఎడిటింగ్ పనులు సత్య గిడుటూరి చూస్తున్నారు.

ఎవరీ గుమ్మడి నర్సయ్య?

గుమ్మడి నర్సయ్య.. తెలంగాణలోని ఖమ్మం జిల్లా, ఇల్లందు నియోజకవర్గ వాసి. ఇల్లందు నియోజకవర్గం నుంచి ఏకంగా ఐదు సార్లు శాసనసభకు ఎన్నికైన రాజకీయ నేత. కమ్యూనిస్ట్ (సీపీఐ ఎంల్)పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన నేటి వరకు అదే జెండా, అదే సిద్దాంతం, అదే ఆలోచన విధానం, అదే జీవన శైలితో జీవిస్తున్న నిబద్ధుడు. ఇప్పటికి తనకంటూ ఒక సొంత ఇల్లు, భూమి సంపాదించుకోకుండా, ఎక్కడికైనా వెళ్ళిరావాలంటే ఎంత దూరమైనా సరే కేవలం సైకిల్ తొక్కుకుంటూనే వెళ్ళివస్తారు.

తన ఇల్లును కూడా పార్టీ ఆఫీసుగా మార్చి, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చిన జీతాన్ని, ఇప్పుడు తనకి వస్తున్న పెన్షన్‌ను సైతం పార్టీకి ఇచ్చేసే నిస్వార్థపరుడు గుమ్మడి నర్సయ్య. ఏ మాత్రం అవినీతి, అక్రమ మచ్చలేని మహామనిషి. ఎప్పుడు ప్రజా సమస్యల కోసం పోరాడి, వాటిని పరిష్కరించి, జనమందరితో మమేకమై.. వారి మధ్యనే అతి సాధాసీదాగా జీవించే నిజమైన ప్రజల నాయకుడు, నిరాడంబరుడు. జీతాన్ని, జీవితాన్ని రెండింటిని కూడా పార్టీకి, ప్రజలకి అంకితం చేసిన త్యాగధనుడు, ప్రజానాయకుడు గుమ్మడి నర్సయ్య .ప్రస్తుతం ఈయన జీవితాన్నే ఇప్పుడు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు.

టీజర్ విషయానికి వస్తే..

వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు.. చాలా గమ్మత్తుగా, ఆలోచనత్మాకంగా ఉన్నాయి. ముందుగా శాసనసభను కనిపించి తరువాత డాక్టర్ బీ ఆర్. అంబేద్కర్ విగ్రహం మీదుగా వెళ్లి.. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా పుస్తకాలను చూపిస్తారు. ఆ తరువాత గాంధీ విగ్రహం చూపించి శివరాజ్ కుమార్ అద్దాలు పెట్టుకోవడాన్ని మనం చూడచ్చు. ఇంకా ఒక పాత సైకిల్, అరిగిన తోలు చెప్పులు, కళ్ళజోడు, భుజానికి ఒక తెల్ల సంచి తగిలించుకుని ఉన్నవన్నీ ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. అందరూ ఎమ్మెల్యేలు, సీఎం (సంకేతంగా ఎన్టీ రామారావు చూపించినట్టున్నారు) ఇలా అంతా అంబాసిడర్ కార్లల్లో అసెంబ్లీకి బయలుదేరుతుంటే.. శివరాజ్ కుమార్ మాత్రం సైకిల్ మీద వెళ్లడాన్ని వీడియోలో చూపించారు.

ప్రజల నాయకుడి సినిమా.. కన్నడ హీరో

గుమ్మడి నర్సయ్య నీతి, నిజాయితీ, నిబద్దత, ఆయన ఆలోచన, సిద్ధాంతం, అయన పాటించిన విలువలకు నిదర్శనంగా వీడియో ఉండటం చూడవచ్చు. వీడియోకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. శివరాజ్ కుమార్ గుమ్మడి నర్సయ్య పాత్రకి సరిగ్గా సరిపోయాడు. తెలుగువాడు అయిన ప్రజల నాయకుణ్ణి కన్నడ హీరో గుర్తించి సినిమా చేయడం అనేది నిజంగా అభినందించవలసిన అంశం. షూటింగ్ ఇప్పుడే ప్రారంభించినట్టుగా వీడియోలో చూపించారు. ట్రైలర్, సినిమా విడుదల తేదీ విషయాలను ఇంకా వెల్లడించలేదు.

ఆంధ్రప్రదేశ్‌కు తుఫాన్ సూచన: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు గట్టిగా కురుస్తున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ హెచ్చరికను జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం పశ్చిమ – వాయువ్య దిశగా కొనసాగుతున్న ఈ అల్పపీడనం.. ఆదివారం నాటికి వాయుగుండంగా మారి.. సోమవారం నాటికి తీరందాటే సమయంలో తీవ్ర తుఫానుగా మారుతుందని వెల్లడించింది.

ఈ జిల్లాల్లో భారీ వర్షం!

ఈ రోజు (శనివారం) కూడా వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉందని, వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా.. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కోనసీమ, కృష్ణ, బాపట్ల జిల్లాల్లో వర్షాలు తీవ్రంగా ఉంటాయని వెల్లడించింది. అయితే మిగిలిన జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఏపీఎస్‌డీఎంఏ) ప్రకారం.. రాబోయే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా, భారీ వర్షాలు కురుస్తాయి. అంతే కాకుండా తీరప్రాంతాల్లో గంటకు 50 కిమీ నుంచి 70 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని వెల్లడించింది. వర్షం తీవ్రత బలంగా ఉండటం వల్ల.. మత్స్యకారులు సముద్రం మీదకు వెళ్ళొద్దని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను.. సురక్షితమైన ప్రాంతాలకు తరలించడానికి ప్రభుత్వం కూడా అత్యవసర ప్రోటోకాల్ అమలు చేసింది. అంతే కాకుండా.. వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద లేదా విద్యుత్ మౌలిక సదుపాయాల దగ్గర ఉండకూడదు. ఇవి అనుకోని ప్రమాదాలను తెచ్చిపెడతాయని సూచించింది.

తుఫాను పేరు ఏంటంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుఫాను సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందని ప్రారంభంలోనే తెలుసుకున్నాం. ఈ తుఫానుకు మోంథా అని నామకరణం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ పేరు థాయ్‌లాండ్‌ను సూచిస్తుంది.

ఈ తుఫాను ప్రభావం.. రాష్ట్రవ్యాప్తంగా ఐదురోజుల పాటు ప్రభావాన్ని చూపిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. శని, ఆదివారాలు బాపట్ల, కడప, కాకినాడ మొదలైన ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. సోమ, మంగళవారాలు రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో భారీ వర్ష సూచన ఉంది. నిన్న (శుక్రవారం) ఏలూరు, అనకాపల్లి, కృష్ణ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లా పాకాల ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం (152.25 మిమీ) నమోదైంది.

అధిక వర్షాల వల్ల లాభ, నష్టాలు

గత ఏడాదితో పోలిస్తే.. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి. వర్షాలు అధికంగా కురవడం వల్ల.. ఎక్కువ లాభాలు ఉన్నప్పటికీ, నష్టాలు కూడా సంభవిస్తాయనేది నిజం. వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. పంటలు బాగా పెరుగుతాయి, వాతావరణం కూడా సుబ్రమవుతుంది. అదే సమయంలో పంట చేతికి వచ్చే సమయంలో.. వర్షాలు కురిస్తే, రైతు నష్టపోవాల్సి వస్తుంది. మౌలిక వసతులు కోల్పోవడం, రవాణా సమస్యలు, వ్యాధుల వ్యాప్తి పెరగడం, వరదలు సంభవించడం వంటివి జరుగుతాయి. ఏది ఏమైనా ప్రకృతి విపత్తులను ఎవరూ ఆపడం సాధ్యం కాదు. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

బైసన్ రివ్యూ: కిట్టయ్య ఎదుగుదలకు అడ్డొచ్చిన కులం.. మరి అధిగమించాడా..!?

0

తమిళ ఇండస్ట్రీలో ఈనెల అక్టోబర్ 17న థియేటర్లలో విడుదలై.. బాక్సాఫీస్ బద్దలు కొట్టి, ఇప్పటికీ ఏమాత్రం కలెక్షన్స్ తగ్గకుండా అదే ఊపుతో విజయవంతంగా దూసుకుపోతున్న బైసన్ సినిమా ఇవ్వాళ (అక్టోబర్ 24న) రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో రిలీజ్ అయింది. అందులోని నటినటులు మరియు సినిమాకు సంబంధించిన విశేషాలు ఎలా ఉన్నాయంటే..

నటినటులు: ధృవ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్, పశుపతి, రజిష విజయన్, లాల్, అమీర్ సుల్తాన్ తదితరులు
దర్శకుడు: మారి సెల్వరాజ్
రచయిత: మారి సెల్వరాజ్
నిర్మాతలు: పా. రంజిత్, అధితి ఆనంద్, దీపక్ సెగల్, సమీర్ నాయిర్
సంగీతం: నివాస్ కే. ప్రసన్న
సినిమాటోగ్రాఫర్ : ఎయిల్ అరసు కే
ఎడిటర్: శక్తి తిరు
ఆర్ట్ డైరెక్టర్: కుమార్ గంగప్పన్
లిరిక్స్: మారి సెల్వరాజ్

కథ ఏంటంటే?

ఒక సాధారణ గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక స్కూల్ స్టూడెంట్ కిట్టయ్య (ధృవ్) అతనికి కబడ్డీ ఆట ఆడటం అంటే అమితమైన ప్రేమ, ఇష్టం. కానీ అక్కడ కోచ్ (అనురాగ్ అరోరా) అతన్ని కేవలం బెంచికి మాత్రమే పరిమితం చేస్తాడు. ఎన్నో ఒడిదుడుకులను, అడ్డంకులను దాటి ఇండియా తరపున జపాన్‌లో.. పాకిస్తాన్‌తో ఆడటానికి ఎంపిక అవుతాడు. అంతకు ముందు సెలక్షన్ కమిటీ రిజెక్ట్ చేసి కిట్టయ్యని ఇంటికి పంపుతుంది. తన తండ్రి(పశుపతి)కి కూడా.. తన కొడుకు కబడ్డీ ఆడటం ఏ మాత్రం ఇష్టం ఉండదు. కబడ్డీ ఆడకూడదు అని ఒట్టుకూడా వేయించుకుంటాడు. వాళ్ళ ఊరిలోనే ఉన్న ఒక అమ్మాయి (అనుపమ పరమేశ్వరన్) హీరోని ఇష్టపడుతుంది. తను కూడా ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు కానీ వాళ్ళ నాన్నకు అస్సలు ఇష్టం ఉండదు. ఆ అమ్మాయికి ఇష్టం లేని పెళ్ళికి ఏర్పాట్లు చేస్తారు. హీరో అక్క (రజిష విజయన్) తమ్ముడికి ఎంతో సపోర్ట్‌గా ఉంటుంది. తనకి ఒక లవ్ స్టోరీ ఉంటుంది.

వీటన్నిటి మధ్యలో వీళ్ళ ఊరి వాళ్ళకి చెందిన పాండిరాజ్(అమీర్ సుల్తాన్)కి & వేరే ఊరికి చెందిన కందస్వామి(లాల్)కి ఎప్పుడు ఆధిపథ్య పోరు, దీనికోసం వారి మధ్య జరిగే గొడవలు కొట్లాటలు. ఎప్పుడు చూసినా కులం పేరుతో.. ఎక్కడ చూసిన హీరోకు అవమానం ఎదురవుతూనే ఉంటాయి. బెంచికి పరిమితమైన హీరో చివరికి పాకిస్తాన్‌తో ఫైనల్ మ్యాచ్ ఆడుతాడా? లేదా?.. ఆ మ్యాచ్‌లో గెలుస్తారా గెలవరా..? కొడుకు కబడ్డీ ఆడకూడదని ఒట్టు వేయించుకున్న తండ్రి చివరి వరకు అలాగే ఉంటాడా తన కొడుక్కి సపోర్ట్ చేస్తాడా..? చేయడా..? తను ప్రేమించిన అమ్మాయి తనకి దక్కుతుందా..? దక్కదా..? తన అక్క ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది..? లవ్ స్టోరీ లో ట్విస్ట్ ఏంటి..? కిట్టయ్యను సెలక్షన్ కమిటీ ఎందుకు రిజెక్ట్ చేసింది..? పాండిరాజ్, కందస్వామిల మధ్య గొడవలు కిట్టయ్య(హీరో)ను ఏ విధంగా ప్రభావితం చేశాయి..? వారి గొడవలు చివరికి ఆ ఊరిని ఏ స్థాయికి తీసుకెళ్తాయి..? కులపరమైనా అవమానాలను ఏ విధంగా భరించాడు..? బెంచ్ కి పరిమితం చేసిన కోచ్, కబడ్డీ వద్దన్నా తండ్రి, విఫలమైన ప్రేమ, ఊరిలో గొడవలు, కులపరంగా అవమానం వీటన్నిటి అధిగమించి కిట్టయ్య.. ఏ విధంగా కబడ్డీ ఆడగలిగాడు, తన ఊరికి, కుటుంబానికి ఎటువంటి పేరు తీసుకొచ్చాడు. తనకి “బైసన్”అని ఎవరు పేరు పెట్టారు. తన చుట్టూ జరిగే అన్ని పరిస్థితులను ఎదిరించి ఏ రకంగా పోరాడాడు అనేదే “బైసన్” కథ.

ఎవరెవరు ఎలా నటించారంటే?

ధృవ్ పూర్తిగా కబడ్డీ ప్లేయర్‌గా మారిపోయాడు. ఇందులో మనం మన స్నేహితున్నో.. పక్కింటి కుర్రాడినో చూసినట్టు పాత్రలో అట్టే ఒదిగిపోయాడు. తనకు ఇచ్చిన క్యారెక్టర్‌కు వందశాతం న్యాయం చేశాడు. కబడ్డీ ఆటగాడిగా, కొడుకుగా, ప్రేమికుడిగా, తమ్ముడిగా, ఒక పల్లెటూరు కుర్రాడిగా అన్ని రకాలుగా మనల్ని అందరినీ కూడా బాగా ఆకట్టుకుంటాడు.

అనుపమ పరమేశ్వరన్ గత సినిమాలన్నిటికంటే ఈ సినిమాలో చాలా సహజంగా నటించింది. ఆమె నటన ప్రేక్షకుల కళ్ళు తిప్పుకొనీకుండా చేసింది. ఒక ప్రేయసిగా అద్భుతంగా చేసింది. తండ్రిగా పశుపతి అల్టిమేట్ యాక్టింగ్ చేశాడు. ప్రతి సీనుకు అదరగోట్టేసాడనే చెప్పొచ్చు. అతన్ని చూస్తే అతని స్థానంలో.. మన నాన్న మనల్ని ప్రోత్సహించినట్టే ఉంటుంది. తండ్రి అంటే ఇలానే ఉండాలి రా అని అనిపిస్తుంది. పశుపతి ఒక్కరే ఆ పాత్ర చేయగలరు. ఇంక లాల్, అమీర్ ఇద్దరు ఇద్దరే.. యాక్టింగ్ విషయంలో ఎవరికి ఎవరు కూడా తీసిపోరు. అక్కగా రజిష విజయన్ బాగా సరిపోయింది. ఆమె తప్పా ఇంకెవరు ఆ పాత్ర చేసిన అంత బాగుండేది కాదేమో అనిపిస్తుంది. ఈ విధంగా ప్రతి పాత్ర కూడా వారి వారి స్థాయికి తగినట్టు వారు జీవించారు అని చెప్పొచ్చు.

అక్కడక్కడా కొంచం స్లో అయినట్టు అనిపించినా.. ఎక్కడా కూడా సినిమా మనల్ని బోర్ కొట్టించదు. ఇది ఓటీటీలోకి వచ్చినాక చూద్దాం అనుకునే సినిమా కాదు, పక్కా థియేటర్లకు వెళ్లి చూడాల్సిన సినిమా.

మరో మెట్టు ఎక్కిన డైరెక్టర్

దర్శకుడు మారి సెల్వరాజ్ ప్రతి పాత్రను చాలా వాస్తవంగా తీర్చిదిద్దారు. తను చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా సుత్తిలేకుండా చెప్పగలిగారు. డైరెక్టర్ రాసుకున్న ప్రతి పాత్రని ఎంతమేరకు వాడుకోవాలో అంత బాగా వాడుకున్నారు. గత సినిమాలకు.. దీనికి చాలా వ్యాత్యాసం కనిపిస్తుంది. ఈ సినిమాతో డైరెక్టర్ మరో మెట్టు పైకి ఎక్కాడు అని చెప్పొచ్చు. దర్శకుడిగా తన విజయ పరంపరని కొనసాగించారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు అతి పెద్ద ప్లస్ పాయింట్. సినిమా చూస్తున్నంతసేపు మనల్ని మ్యూజిక్ అలాగే కట్టిపడేస్తుంది. ఏ సీనుకు ఎంత సంగీతం అందివ్వాలో ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలో అలాగే ఇచ్చాడు. ప్రేక్షకులను నివాస్ కే ప్రసన్న తన సంగీతంతో మంత్రముగ్దల్ని చేసేశాడు.

పల్లెటూరి మనుషుల్లా..

పాటలు కూడా అద్భుతంగా ఉన్నాయి. తెలుగు నేటివిటీ అలాగే ఉట్టిపడిందని చెప్పొచ్చు. ప్రతి పాట ఒక ఆణిముత్యం. సినిమాని ముందుకు తీసుకెళ్లడంలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. పాటలు ఎంతగానో తోడ్పాటుని అందించాయి. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే చాలా బాగా తీశారు. ప్రతి ఒక్క ప్రేమ్ మనల్ని మన వాస్తవ జీవితంలోనికి తీసుకెలుతుంది అంత అద్భుతమైన కెమెరా వర్కింగ్ జరిగింది. చూడటానికి చాలా కొత్తగా ఉంది. ఆర్ట్ డైరెక్షన్, కాస్ట్యూమ్ డిజైనింగ్ మన పల్లెటూరు ఇదే అన్నట్టుగా వారంతా మన ఊరి మనుషులే అన్నంత గొప్పగా తీర్చిదిద్దారు.

ఇది 1990లకు సంబంధించిన కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా తీసిన చిత్రం. ముఖ్యంగా తమిళనాడుకు చెందిన అర్జున అవార్డు గ్రహీత మనతి గణేశన్ అనే కబడ్డీ ఆటగాడి ఆట మరియు ఆయన నిజ జీవితంలో చుట్టూ జరిగిన పరిస్థితులను సినిమాగా తీశారు.

ఐదు రెట్లు పెరిగిన టమోటా ధరలు: పాకిస్తాన్‌లో ఎందుకిలా జరుగుతోంది!

0

పాకిస్తాన్ ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ తరుణంలోనే పాక్ & ఆప్ఘనిస్తాన్ దేశాల మధ్య సరిహద్దు మూతపడింది. ఈ చర్య అక్కడి నిత్యావసరాల ధరలను భారీగా పెంచేసింది. టమోటా రేటు ఐదు రెట్లు పెరిగింది. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.

మూతపడిన సరిహద్దులు

ఈ నెలలో (2025 అక్టోబర్) రెండు దేశాల మధ్య (పాక్ & ఆప్ఘనిస్తాన్) పోరాటం మొదలైంది. ఈ కారణంతోనే ఈ దేశాల సరిహద్దులు మూతపడ్డాయి. రెండు ఇరుగుపొరుగు దేశాలు. కాబట్టి నిత్యావసరాలు ఎగుమతి, దిగుమతులు జరిగేవి. అయితే సరిహద్దులు మూత పడటంతో ఇవన్నీ ఆగిపోయాయి. అంతే కాకుండా ఈ సరిహద్దుల వద్ద సుమారు 5000 కంటైనర్లు ఉన్నట్లు, సరైన సమయానికి సరఫరా ఆగిపోవడంతో అందులోని కూరగాయలన్నీ చెడిపోయినట్లు కొందరు చెబుతున్నారు.

స్తంభించిన వాణిజ్యం

2021లో తాలిబన్లు.. కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి పోరాటం జరుగుతూనే ఉంది. ఈ కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 2600 కిమీ (1600 మైల్స్) సరిహద్దులో.. భూపోరాటం, పాకిస్తాన్ వైమానిక దాడుల తరువాత.. 2025 అక్టోబర్ 11 నుంచి సరిహద్దులు మూసేసారు. దీంతో వాణిజ్యం, రవాణా వంటివన్నీ స్తంభించిపోయాయి. దీంతో నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా పెరిగినట్లు పాక్ – ఆఫ్ఘన్ వాణిజ్య మండలి అధిపతి ఖాన్ జాన్ ఆలోకోజాయ్ పేర్కొన్నారు.

ఒక రోజు గడిస్తే.. రెండువైపులా (పాకిస్తాన్ & ఆప్ఘనిస్తాన్) సుమారు 1 మిలియన్ డాలర్ల నష్టాన్ని చూడాల్సి వస్తోంది. పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, ఔషధాలు, గోధుమలు, బియ్యం, చక్కెర, మాంసం, పాల ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతులు స్తంభించిపోయాయి. వాణిజ్య పరంగా ఇవే అధికంగా ఉన్నాయని ఖాన్ జాన్ ఆలోకోజాయ్ స్పష్టం చేశారు.

400 శాతం పెరిగిన టమోటా ధరలు

ప్రత్యేకమైన టమోటాల ధరలు సుమారు 400 శాతం పెరిగాయి. దీంతో కేజీ టమోటా ధరలు పాకిస్తాన్ దేశంలో 600 పాకిస్తానీ రూపాయలకు చేరింది. అంతే కాకుండా ఆప్ఘనిస్తాన్ నుంచి వచ్చే ఆపిల్స్ ధరలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయని ఆలోకోజాయ్ స్పష్టం చేశాయి. సరిహద్దులు మూతపడటం వల్ల అక్కడ చాలా కంటైనర్లు నిలిచిపోయాయి. అందులోని కూరగాయలు, ఆహార పదార్థాలు చెడిపోయాయని ఆయన అన్నారు. ఇప్పటికే మార్కెట్లో టమోటాలకు మాత్రమే కాకుండా.. ఆపిల్, ద్రాక్ష వంటి వాటికి కూడా కొరత చాలానే ఉంది. కాబట్టి దీనిపై అక్కడి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయనేది తెలియాల్సి ఉంది.

అక్టోబర్ 25న తదుపరి చర్చలు

పాకిస్తాన్‌పై.. తమ ఉమ్మడి సరిహద్దు దాటుకుని వచ్చి దాడిచేస్తున్న ఉగ్రవాదులను కాబూల్ నియంత్రించాలని ఇస్లామాబాద్ డిమాండ్ చేయడంతో ఈ ఘర్షణలు తలెత్తాయి. దీనిని తాలిబన్లు ఖండిస్తూ.. తాము ఆప్ఘనిస్తాన్ స్వర్గధామాల నుంచి పనిచేస్తున్నామని చెప్పుకుంటున్నారు. అంతే కాకుండా ఖతార్, టర్కీ మధ్య నిర్వహించిన చర్చల కారణంగా.. గొడవలు కొంత సద్దుమణిగాయి. అయితే వాణిజ్యం మూసివేయబడింది. ఇది సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. అయితే అక్టోబర్ 25న ఇస్తాంబుల్‌లో.. ఈ విషయంపైనే తదుపరి చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల్లో సానుకూల నిర్ణయాలు తీసుకుని.. ప్రజల ఇబ్బందులను తొలగిస్తారా? లేదా?, ధరల నియంత్రణకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది.

యువత కోసం.. కొత్త ప్రయోగం: మనసును హత్తుకునే సాంగ్

0

పాటకంటే ముందు.. వీడియో ప్రారంభంలో డైరెక్టర్ మారి సెల్వరాజ్ కొన్ని పవర్‌ఫుల్ పదాలు కనిపిస్తాయి. సినిమాలోని ప్రతి పాటకు ముందు అలాగే వేశారు ఆయన. అంటే ఆయన మాటల ద్వారా చెప్పాలి అనుకున్నదాన్ని ముందుగానే చెబుతున్నారు అన్నమాట. ఈ పాటకి ముందు ఇలా రాశారు.

నేనెక్కడికి నుండి వస్తున్నానో నీకు తెలుసు, ఎందుకు వస్తున్నానో కూడా నీకు తెలుసు, నేనక్కడికి వస్తే ఏమవుతుందో నీకు తెలుసు అందుకే.. నువ్వు ఆ తలుపులు మూసేశావు.. కానీ, నా తలపుల శక్తిలో వాటిని తెరిపిస్తా చూడు…” అంటూ వీడియో మొదట్లో రాశారు.

సరికొత్త ర్యాప్ సాంగ్

ఇంక సాంగ్ విషయానికి వస్తే ఒకప్పుడు యువత స్లో మెలోడీ పాటల్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్లు. కానీ ఇప్పుడు అలా లేదు.. ర్యాప్ సాంగ్ అంటే చాలు యువత ఈ రోజుల్లో బాగా కనెక్ట్ అయిపోతున్నారు. చాలామంది అటువంటి పాటలకు మాత్రమే కాకుండా.. ఆ పాటలు పాడే గాయకులకు కూడా అభిమానులుగా మారిపోతున్నారు. దాంతో ఎంతోమంది ర్యాప్ సింగర్స్ బయటకి వచ్చారు. వచ్చి వాళ్ళవాళ్ళ ప్రతిభకు తగినట్టుగా ప్రదర్శనలు ఇస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పా. రంజిత్ ఏకంగా ఒక గ్రూప్‌తో ర్యాప్ సాంగ్స్ మ్యూజిక్ బ్యాండ్ పెట్టించారు. అది తమిళనాడులోనే కాకుండా దేశం నలుమూలల బాగా పాపులర్ అయింది. అదంతా ఒకెత్తు అయితే ఈ ర్యాప్ పాడే వాళ్లలో అత్యంత ఆదరణ పొంది.. భారీ విజయాలను కైవసం చేసుకున్న ఒక ఇద్దరు సింగర్స్ ఉన్నారు. వారే తమిళనాడుకు చెందిన అరివు మరియు కేరళకు చెందిన వేదన్.

ఆ ఇద్దరు..

వేదన్, అరివు ఇద్దరు కూడా మొదట వ్యక్తిగతంగా ఆల్బమ్ చేసుకునే వాళ్లు. ఆ తరువాత అనేక చోట్ల షోస్ చేయడం ప్రారంభించారు. వీరు ఎక్కడ షో ఏర్పాటు చేసిన కూడా దాదాపు కొన్ని లక్షల మంది అభిమానులు స్వచ్చందంగా గుమిగూడతారు. చాలామంది ఆయా ప్రాంతాల్లో స్థానికంగా ఉన్న వాళ్ళే షో ఆర్గనైజ్ చేసి వీరిని ఆహ్వానిస్తారు. ఆ స్థాయికి ర్యాపర్స్ ఎదిగారు. ర్యాప్ సాంగ్స్ చాలా మంది పాడుతారు.. కానీ వీరికి వచ్చినంత సక్సెస్ ఎవరికీ రాలేదు. దీనికి కారణం కేవలం పాడటం మాత్రమే కాదు ఏదో తెలియని ప్రత్యేక ట్యాలెంట్ అనే చెప్పాలి.

వారిరువురు ఒక గొప్ప ప్రత్యేకమైన ఐడియాలాజి సొంతం చేసుకున్నారు. వీరి పాటల్లో సామాజిక, రాజకీయ, ఆర్థిక, న్యాయ వ్యవస్థ ఇలా అనేక అంశాలతో పాటు.. సమాజంలో ఉండే అణిచివేతలు, వెలివేతలు, అవమానాలు వీటిని అన్నిటిని ఎదిరించే ఒక కసితో కూడిన తెగింపును వారు యువతకు, సమాజానికి అందిస్తారు. అందుకే వేదన్ & అరివు ఇద్దరికీ వారి సొంత రాష్ట్రాల్లోనే కాకుండా దేశం దాటిన అభిమానం వారి వశం అయిందని చెప్పొచ్చు. అటువంటి ర్యాప్ సింగర్స్ ఇద్దరితో కలిపి బైసన్ సినిమా కోసం డైరెక్టర్ మారి సెల్వరాజ్ రచించిన రెక్క రెక్క అనే ఒక ప్రత్యేకమైన ర్యాప్ సాంగులు తమిళంలో వీరితోనే పాడించారు. అది అతి తక్కువ కాలంలోనే.. అత్యంత ప్రేక్షకాదరణ పొంది “బైసన్” సినిమాను ఒకరేంజ్​కు తీసుకుని వెళ్ళింది. అటువంటి పాటని ఇప్పుడు మన తెలుగు వెర్షన్ హద్దే లేని వేగం పెట్టి అనే టైటిల్ పెట్టి విడుదల చేశారు.

యువతను ఆకట్టుకుంటోంది

పాటలోని పదాల అర్థం, సారాంశం వేరే లెవెల్‌లో ఉన్నాయి. యువతను అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఎగిరి గంతేసి పరిగెత్తి ఏదో ఒకటి సాధించి తీరాలి అనే కసిని ఈపాట క్రియేట్ చేస్తున్నది. “హద్దెలేని వేగం పట్టి, ఒంటరిగా పోరాడగా అడ్డేలేదు నీకు ఇంక సాగరా, కదలరా ఇది కల కాదు, భయానికి నువ్వు బలి కావు, మార్చరా నీ తలరాత చెలరేగరా ఓ కసితోని” అని బైసన్ పాట గూస్బమ్స్ తెప్పిస్తున్నది . తెలుగులో అక్టోబర్ 24న సినిమా రిలీజ్ అవుతున్నది.

ఆ ఆఫర్ మిస్సయ్యా.. అందుకే ఇది చేశా!: అనుపమ మరమేశ్వరన్

0

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తెలుగు, తమిళ్, మలయాళం ఇలా.. భాషతో సంబంధం లేకుండా సినిమాల్లో నటిస్తోంది. ఈమె నటించిన మూవీస్ వరుసగా రిలీజ్ అవుతున్నాయి. విడుదలైన అన్ని చిత్రాలు ఆమె విజయాన్ని అందించాయి. ఈ సంవత్సరంలోనే దాడ్పు నాలుగు సినిమాలు విడుదల అయ్యాయి. అందులో డ్రాగన్ (తమిళం), జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ (జేఎస్‌కే – మలయాళం), కిస్కింధపురి (తెలుగు), పరదా (పాన్ ఇండియా మూవీ), మళ్ళీ ఇప్పుడు బైసన్. పరదా అనేది లేడి ఒరియేంటెడ్ సినిమా. అనుపమను ఈ సినిమా చాలా నిరాశపరిచింది. మిగిలిన సినిమాలు అన్నిగొప్ప విజయాన్ని అందుకున్నాయి. బైసన్ కూడా ఈజాబిలో ఒకటి.

అందుకే మొదటి సినిమా మిస్!

బైసన్ సినిమా ఆల్రెడీ తమిళ భాషలో మాత్రమే దాదాపు ముప్పై ఐదు కోట్లు రాబట్టిందని ప్రొడ్యూసర్స్ చెబుతున్నారు. తెలుగులో మాత్రం అక్టోబర్ 24న విడుదల అవుతోంది. ఆ సినిమా ప్రమోషన్ కోసం ఆమె హైదరాబాద్‌కు వచ్చారు. మీడియాతో బైసన్ సినిమా విశేషాలను పంచుకున్నారు.

అనుపమ బైసన్ సినిమా విశేషాలను చెప్పాలంటే.. మొదట ఆ మూవీ దర్శకుడు మారి సెల్వరాజ్ పని తీరు & ఆయన గురించి మరిన్ని అంశాలు చెప్పాల్సి ఉంటుంది అని చెప్పుకొచ్చింది. అందరూ ఆయన ఫిలిమ్స్ చూసే ఉంటారు అని, మారి మొదటి చిత్రం పరియేరుమ్ పెరుమాళ్ అనే సినిమా సమయంలో ఆమెకి ఒక పాత్రని ఆఫర్ చేశారని, కానీ అది ఆమె చేయకపోవడంతో కొంచెం బాధపద్దారట. ఎందుకంటే ఆ సమయంలో వెంటవెంటనే ఆమె వేరే సినిమాలు చేయాల్సి రావడం వల్ల పరియేరుమ్ పెరుమాళ్ చేయలేదట.

మారి సెల్వరాజ్ అభిమానిని

పరియేరుమ్ పెరుమాళ్ సినిమాతో ఆయన మూవీస్ అన్నింటికీ కూడా ఒక పెద్ద ఫ్యాన్ అయ్యిందట. వాస్తవికంగా మూలాల్లోకి వెళ్లి సినిమా తియ్యడం అనేది నిజంగా అనుపమకి బాగా నచ్చుతుంది అని చెప్పుకొచ్చింది. ఆ రోజు నుంచి మారి సెల్వరాజ్ అనే దర్శకునికి పెద్ద ఫ్యాన్ ఐపోయాను అని చెప్పుకొచ్చింది. ఆమెకి మొదటి సినిమా మిస్ అయినా కూడా మళ్ళీ పిలిచి మారి సెల్వరాజ్ బైసన్ సినిమాలో నటించడానికి అవకాశం కల్పించారని మారిపైన ఉన్న గౌరవాన్ని ఆ విధంగా తెలియపరిచారు.

ఇక షూటింగ్ అనుభవాలు గురించి చెబుతూ ప్రేమమ్ సినిమాలో నటించినప్పుడు ఒక వర్కుషాప్ చేసినట్టు ఎలా అయితే ఫీల్ అయ్యారో అలాగే ఈ బైసన్ సినిమా చేసినప్పుడు కూడా సేమ్ అదే అనుభవాన్ని కలిగించిందని ఆమె చాలా సంతోషంగా అభిప్రాయాన్ని వెళ్లబుచ్చారు. హీరోయిన్‌గా తనకు మాత్రమే కాకుండా.. బైసన్ సినిమాతో పాలుపంచుకున్న అందరికీ సరికొత్తగా ఒక అనుభూతిని కలిగించిందని ఆమె పేరక్కొన్నారు.

ప్రేమాభిమానాలు అందిస్తున్న ప్రేక్షకులు

ఇప్పుడు ఒక వారం నుంచి తమిళనాడులో సినిమా రిలీజ్ అయిన అన్ని థియేటర్లకు వెళ్ళి అక్కడ రెస్పాన్స్ ఎలా ఉందో చూస్తున్నారట. తమిళనాడులో ప్రేక్షకులు తమ ప్రేమ & అభినందనలు అందిస్తున్నారని చెప్పారు. రోజురోజుకి తమిళనాడులో మా బైసన్ సినిమా కలెక్షన్స్ పెరుగుతున్నాయని ఆనందం వ్యక్తపరిచారు. బైసన్ మూవీ తెలుగులో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చాలామంది అనుపమను అడుగుతున్నారట. మొత్తం మీద ఈ సినిమా 2025 అక్టోబర్ 24న రిలీజ్ కాబోతోందని.. ఆమె తన స్పందనని తెలియజేశారు.

తెలుగులో మాట్లాడిన తమిళ్ హీరో: పేపర్ మీద రాసుకొచ్చి మరీ..

0

బైసన్ మూవీ తమిళంలో రిలీజ్ అయ్యి అతి పెద్ద విజయాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు అక్టోబర్ 24న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడానికి జగదాంబా ఫిలిం బ్యానర్ వాళ్ళు సిద్దమయ్యారు. అందుకు సంబంధించిన ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బైసన్ సినిమా హీరో ధృవ్ విక్రమ్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, మ్యూజిక్ డైరెక్టర్ నివాస్ కె ప్రసన్న, ఫిలిం డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్ బాలాజి హాజరయ్యారు.

పేపర్‌లో రాసుకొని ప్రిపేర్ అయ్యి..

ఈ కార్యక్రమంలో.. ధృవ్ తెలుగుని పేపర్‌లో రాసుకొని వచ్చి బాగా ప్రిపేర్ అయ్యి మాట్లాడటం జరిగింది. అతను ఏం మాట్లాడాడనే విషయానికి వస్తే, అందరికి నమస్కారం అని చెబుతూ అలాగే మీడియా మిత్రులకి, సినీ ప్రముఖులకి, ఈవెంట్ ఆర్గనైజర్లకు చాలా థాంక్స్ అని చెప్పడం జరిగింది. దీంతో అక్కడ చప్పట్లు మొగాయి. తాను కూడా చిన్నగా నవ్వాడు. హైదరాబాద్‌లో ప్రమోట్ చేస్తున్న నా మొదటి సినిమా అని, అందుకే ఇది స్పెషల్ అని చెప్పుకొచ్చాడు. నా పేరు ధృవ్ అంటూ సరదాగా తనను తాను సభకు పరిచయం చేసుకున్నారు.

నిజంగా జరిగిన ఒక ఘటన

ఈమధ్యనే సూట్‌కేస్ కొనడం కోసం ఒక మాల్‌కు వెళ్ళానని చెబుతూ అక్కడ ఆ షాప్ ఓనరుకు హీరో ధృవ్‌కు మధ్యలో జరిగిన సంభాషణ గురించి పేర్కొన్నాడు. ఆ షాప్ ఎదురుగా కొంతమంది ధృవ్‌కు అలాగే చూస్తూ నిలబడ్డారంట దాన్ని చూసిన షాప్ ఓనర్ “వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఆ” అని అడిగితే కాదన్నాను. పోనీ మీరు ఏమైనా సినిమా యాక్టరా అని ఆ ఓనర్ అడిగారు. అప్పుడు నేను అవును అని అతనికి చెప్పాను. అతను అప్పుడు మీరు అచ్చం హీరో చియాన్ విక్రమ్ మాదిరిగా ఉన్నావని అన్నాడంట. నేను ఆయన కొడుకునే అనేసరికి వెంటనే అతను మీ నాన్న నటన అంటే చాలా ఇష్టం అని, చాలా కష్టపడి పైకి వచ్చాడని చాలా గర్వంగా, సంతోషంగా విక్రమ్ పట్ల ఎంతో ప్రేమని చూపించాడంట ఆ ఓనర్.

ఇంకా ధృవ్ మాట్లాడుతూ.. మా నాన్న ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అన్ని రాష్ట్రాల్లో, దేశం మొత్తం మీద ఇంత పాపులరీటినీ, ప్రేమని, ఇంత అభిమానాన్ని సంపాదించడం అనేది నిజంగా చాలా అద్భుతం. నేను అందుకు చాలా గర్వపడుతున్నాను.. అని తన తండ్రి విక్రమ్ గురించి చెప్పుకొచ్చారు. ఒక కొడుకుగా నాకు అన్ని కూడా చాలా సులభంగా వచ్చేసాయి అనిపిస్తోంది. నాకు తెలుసు నేను ఏమి ఇంకా సాధించలేదని, కానీ మీ ఆదరణ, అభిమానం పొందడానికి నేను చాలా కష్టపడటానికి సిద్ధంగా ఉన్నాను.. అని హీరో ధృవ్ తన తెలుగు మాటలను చాలా ముద్దు ముద్దు చెప్పాడు. ఇది అక్కడ ఉన్న అందరినీ ఆనందలో ముంచేసింది చెప్పట్ల మోత మోగింది.

ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి

తెలుగు వాళ్ళు ఫుడ్ను, సినిమాని ఎంత బాగా ఎంకరేజ్ చేస్తారో నాకు బాగా తెలుసు. నాకు తెలుగులో పని చేయాలని కోరిక మరియు అందులో ఈ సినిమా.. నా మొదటి అడుగు అని నేను నమ్ముతున్నాను. బైసన్ నా జీవితంలో చాలా ముఖ్యమైన సినిమా, మీతో ఇదంతా మాట్లాడటానికి మూడు సంవత్సరాలు ఎదురు చూశాను. ఈ సమయంలో ఈ సినిమా కోసం ప్రొఫెషనల్ కబడ్డీ ఆట నేర్చుకున్నాను. నాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి, మూవీ నచ్చితే సపోర్ట్ చేయండి. అది నాకు చాలా బలం ఇస్తుంది. నేను నాన్నగారి లాగే కష్టపడతాను. నా నుండి వందశాతం ఎఫెర్ట్ పెడతాను.

మాటలకందని వైభవం.. ఊహకందని గండికోట చరిత్ర: తెలుసా?

0

గండికోట గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. ఎందుకంటే అటు గొప్ప చరిత్ర.. ఇటు సినిమాలలో కూడా దీని గురించి చాలానే విని ఉంటారు. దీనికి సంబందించిన పూర్వాపరాల విషయానికి వస్తే..

చార్రిత్రాత్మక ప్రశస్తి ఉన్న గండికోట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, కడప జిల్లాలో ఉంది. ఒకప్పుడు ఈ గండికోట ప్రాంతాన్ని కాకతీయులు, విజయనగర రాజులు, బుక్కరాయలు, కుతుబ్ షాహిలు పరిపాలించిన చరిత్ర ఉన్నది. కానీ ఇప్పుడు ఇది ఒక పర్యాటక ప్రాంతంగా మారిపోయింది. బోటింగ్, రోప్ క్లింబింగ్, జిప్ లైన్ లాంటి అడ్వెంచర్ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అంతే కాకుండా అనేకరకాలుగా ప్రభుత్వ.. ప్రభుత్వేతర సంస్థలు ఆదాయ మార్గాలను అవలంబిస్తున్నాయి. ఎంతోమంది వీక్షకులకు ఇది చాలా ఆహ్లాదమైన వాతావారణాన్ని కల్పిస్తుంది. కాలయాపన చేయడం కోసం, సెలవు రోజుల్లో విద్యార్థులకు, పెద్దవాళ్లకు అందరికి  కూడా ఆనందంగా గడపడానికి గండికోట అనుకూలమైన ప్రాంతం. ఇక దీనికి సంబంధించిన చారిత్రక విషయాలలోనికి మనం వెళ్లినట్లయితే..

గండికోటకు ఆ పేరెలా వచ్చిందంటే..

మొదట ఈ ప్రాంతానికి గండికోట అనే పేరు ఎలా వచ్చింది అంటే గండి అనగా వాగు అని అర్థమట.. కోట అనగా మాములుగా పెద్ద భవనాన్ని కోట అంటాము. ఈ గండి, కోట అనే రెండు స్వచ్ఛమైన తెలుగు పదాల నుంచి ఉద్భవించాయి. ఈ గొప్ప కోటని పెన్నా నది వాగుపైన నిర్మించారు. దీనినే గండికోట అని పిలుస్తారు.

కోటకు సంబంధించిన చుట్టూ ఉన్న ప్రాంతం చూస్తే చాలా పెద్దగా దాదాపు ఒక ఎనిమిది.. తొమ్మిది కిలోమీటర్లు దాకా ఉంటుంది. ఇక్కడ మాధవరాయ, రంగనాథస్వామికి చెందిన రెండు గుడులు కూడా ఉండాయి. అవి విజయనగర రాజుల పరిపాలన కాలంలో వారి యొక్క అభిరుచి తగినట్టు కట్టించుకున్నవిగా మనకు అనిపిస్తుంది. తరువాత జామీ మసీదు, దాన్యపు భవనము, చార్మినార్, ఇంకా కొన్ని కట్టాలన్నీ కూడా కుతుబ్ షాహీలు కట్టించినట్టు పురావాస్తు ఆధారాలు చెబుతున్నాయి. ఇవి చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడూ కూడా నీళ్లు చాలా బాగా అందుబాటులో ఉంటాయంటే.. అప్పటి రాజులు ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నారన్నమాట.

ఏయే రాజులు ఈ కోటను పరిపాలించారంటే?

చరిత్ర ప్రకారం.. చూసుకున్నట్టయితే కాప మహారాజు అనే వ్యక్తి 12వ శాతబ్దంలో గండికోటను కట్టించినట్టు చెబుతారు. ఆ తర్వాత పదమూడో శతాబ్దంలో కాకతీయుల ప్రవేశించినప్పుడు దీని చరిత్ర స్టార్ట్ అవుతుంది. వీరి తర్వాత విజయనగర రాజులు వశపరుచుకుంటారు. ఒకటవ బుక్కరాయలు సమయంలో.. కోట మొత్తం మంచిగా తయారు చేసి అభివృద్ధి చేశారట. రంగనాథ స్వామి, మాధవరాయ రెండు ఆలయాలు వీరి టైమ్‌లోనే నిర్మించారు. తరువాత విజయనగర రాజులు ఓడిపోవడం, వారి సామ్రాజ్యం మొత్తం పతనమవడంతో అదే అదునుగా హైదరాబాద్ కుతుబ్ షాహిలు కోటను కైవసం చేసుకున్నారు (మీర్ జుమ్లా ఆధ్వర్యంలో) ఇది జరిగింది.

వీరి అనంతరం కడప నవాబులు కోటపై యుద్ధం చేసి కుతుబ్ షాహిల దగ్గర నుంచి రాజ్యాన్ని చేజిక్కించుకున్నారట. ఆ తరువాత టిప్పు సుల్తాను, హైదర్ వీరు1.. ఇద్దరు కొంతకొంత కాలం పరిపాలించిన తరువాత నిజాం ఒప్పందంలో భాగంగా గండికోట ప్రాంతాన్ని క్రీస్తుశకం 1800ల సంవత్సరములో బ్రిటిష్ వాళ్లకి అప్పగించాల్సి వచ్చిందట. వారి తరువాత కోటని ఇండియా సంరక్షిస్తున్నది. ఈ విధంగా గండికోట విశేషాలు, దాని చరిత్ర గురించి తెలుసుకున్నాము కదా.. మీలో ఎంతమంది గండికోటకు చూసారు.. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి.